Read more!

English | Telugu

స్వప్న పేరు వినగానే కనకంకి పూనిన అమ్మవారు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-59లో.. నవదంపతులు గుడికి వెళ్ళాలని దుగ్గిరాల సీతారామయ్య చెప్తాడు. దాంతో కావ్యని రాజ్ పక్కకి తీసుకెళ్ళి.. నీకు నాతో రావడం ఇష్టంలేదని చెప్పమని చెప్తాడు. దానికి కావ్య నిరాకరిస్తుంది. ఇష్టం లేదు.. ఇష్టం లేదని మీరు అన్నప్పుడల్లా నా గుండెల్లో ముల్లుతో గుచ్చినట్టుగా ఉంటుంది. మీరే అర్థం చేస్కోండని కావ్య రాజ్ తో అనగా.. ఆ ఇష్టం లేదు అనే పదాన్ని నీకే రాసిస్తున్నాను.. ఇకనుండి తాతయ్య చెప్పినప్పుడల్లా నీకే ఇష్టం లేదని చెప్పేసేయ్ అని రాజ్ అంటాడు. వాహ్ వాహ్ ఏం చెప్పారండి.. మీరేం చెప్పినా నేను మీతో పాటు గుడికి వస్తాను.. నన్నెవరూ ఆపలేరు.

మరోవైపు కనకం, వాళ్ళ అక్క కలిసి అదే గుడికి వస్తారు. ఎందుకు తీసుకొచ్చావ్ నిజం చెప్పమని కనకం వాళ్ళ అక్క అడుగగా.. అదేం లేదక్కా.. నిజంగా మొక్కు అని అంటుంది. ఆ తర్వాత స్వప్న మారువేషంలో వస్తుంది. చెట్టు దగ్గర పూనకాలు వచ్చిన అమ్మోరు లాగా నిజం చెప్తాను రండని అంటుంది.  స్వప్న మంచిదని మారువేషంలో ఉన్న స్వప్న చెప్పేసరికి.. కనకంకి స్వప్న పేరు వినగానే.. ఒక్కసారిగా అమ్మవారు పూనినట్టుగా పూనకం వస్తుంది. స్వప్న మంచిది కాదని, తనని అనవసరంగా నాకిచ్చావని కనకం కోపంతో స్వప్న మీదికి రెచ్చిపోతుంది‌. దీంతో అమ్మవారి వేషంలో ఉన్న స్వప్న పారిపోతుంది. ఆ తర్వాత మామూలు మనిషి అయిన కనకం.. నాకేం జరిగిందని అంటుంది. నీకు పిచ్చి పట్టిందని వాళ్ళ అక్క కనకంకి చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళు కాసేపు అలా మాట్లాడుతుండగా.. దుగ్గిరాల ఫ్యామిలీతో పాటుగా కావ్య, రాజ్ లు కలిసి వస్తారు. అది చూసి కనకం, వాళ్ళ అక్కకి మైండ్ బ్లాక్ అవుతుంది.

కనకం, వాళ్ళ అక్క వెంటనే కాళ్ళు వంకరబెట్టి నడుచుకుంటూ పారిపోతారు. ఆ తర్వాత రాజ్, కావ్యల పేరు మీద అర్చన చేపిస్తారు సీతారామయ్య. అక్కడ ఉన్న పూజారి నవదంపతులకి 'బ్రహ్మముడి' వేసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయమంటాడు. వాళ్ళు అలా ప్రదక్షిణలు చేస్తుండగా రాజ్ కావ్యని తక్కువ చేసి మాట్లాడేసరికి తనకి కోపం వచ్చి.. కాలు బెణికినట్టుగా యాక్ట్ చేస్తుంది. దీంతో అది చూసిన పంతులు గారు మీ భార్యని చేతులతో ఎత్తుకొని ప్రదక్షిణలు చేయండని పంతులు చెప్పగా.. రాజ్ నేను చేయనని అనడంతో, సీతారామయ్య నువ్వే చేయాలని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.