English | Telugu

క‌త్రినాతో ట‌వ‌ల్ ఫైట్.. మామూలుగా ఉండదు!

ప‌లు హాలీవుడ్ చిత్రాల్లో అద్భుత‌మైన యాక్ష‌న్ స‌న్నివేశాల్లో న‌టించి మెప్పించిన హాలీవుడ్ న‌టి మిచెల్ లీ తాజాగా ‘టైగర్ 3’ చిత్రంలో మరోసారి వావ్ అనిపించే యాక్ష‌న్ సీక్వెన్స్‌లో మెప్పించ‌నుంది. బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్‌, క‌త్రినా కైఫ్ జంట‌గా న‌టించిన యాక్ష‌న్ థ్రిల్లర్ ‘టైగర్ 3’. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇందులో క‌త్రినా, మిచెల్ లీ మ‌ధ్య ఉన్న ట‌వ‌ల్ ఫైట్ క్లిప్ ఓ స‌న్నివేశంలో చూపించారు. ఆ సీన్ ఇంట‌ర్నెట్‌లో ఎంత వైర‌ల్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ ట‌వ‌ల్ ఫైట్ సీన్‌ని ట‌ర్కిష్‌లోని హామామ్‌లో చిత్రీక‌రించారు. 

‘వార్ 2’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి..అదే అసలు విషయం

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆతృత‌తో ఆయ‌న బాలీవుడ్ ఎంట్రీ మూవీ వార్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్ఆర్ఆర్ వంటి ఫిక్ష‌న‌ల్ పీరియాడిక్ డ్రామాతో గ్లోబ‌ల్ రేంజ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న తార‌క్ ఇప్పుడు తొలిసారిగా వార్ 2 మూవీ ద్వారా బాలీవుడ్ మేక‌ర్స్‌తో క‌లిసి ప‌నిచేయ‌బోతున్నారు. బ్ర‌హ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖ‌ర్జీ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ య‌ష్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విష‌య‌మొక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అయోధ్య కోసం కథ సిద్ధం చేసిన కంగన!

కంగన రనౌత్‌ ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడినా సెన్సేషన్‌ అవుతుంది. అందుకే ఫైర్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ ఉంది ఆమెకి. నార్త్ వాళ్లు సౌత్‌ని కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేయడానికి ముందే, సౌత్‌ మీద తన ప్యార్‌ని ఓపెన్‌గా ప్రకటించేసిన బ్యూటీ కంగనా రనౌత్‌. ప్రస్తుతం తేజాస్‌ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల్లోనూ, రిలీజ్‌ హడావిడిలోనూ ఉన్నారు కంగనా రనౌత్‌. తేజాస్‌ని ఆమె ఫస్ట్ ఏరియల్‌ యాక్షన్‌ సినిమాగా ప్రమోట్‌ చేస్తున్నారు. అక్టోబర్‌ 27న స్క్రీన్స్ మీదకు రానుంది తేజాస్‌. ఈ సినిమా విడుదలకు  ముందు ఆమె అయోధ్య రామ మందిరాన్ని సందర్శించారు. రాముడి ఆశీస్సులు తీసుకున్న కంగన చాలా విషయాలను మీడియాతో పంచుకున్నారు.

‘టైగర్ 3’ రిలీజ్ డేట్ ఫిక్స్

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ చిత్రం ‘టైగర్ 3. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా.. ట్రైల‌ర్‌ను చూసేద్దామా? అని అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అక్టోబ‌ర్ 16న మూవీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేస్తామ‌ని ఇప్ప‌టికే మేక‌ర్స్ అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. చెప్పిన విధంగానే టైగ‌ర్ 3 ట్రైల‌ర్‌ను య‌ష్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా విడుద‌ల చేయ‌గా.. నెట్టింట తుపానులా ఈ ట్రైల‌ర్ ఓ సెన్సేష‌న్‌ను క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. ఇదే నేప‌థ్యంలో చిత్ర యూనిట్ ‘టైగ‌ర్ 3’ చిత్రాన్ని దీపావ‌ళి సంద‌ర్బంగా న‌వంబ‌ర్ 12న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పక్కా యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా మూవీ అల‌రించ‌నుంది. ట్రైల‌ర్‌లో టైగ‌ర్ 3 క‌థ ఎలా సాగుతుంద‌నే విష‌యాన్ని కూడా క్లియ‌ర్‌గా చెప్పేశారు మేక‌ర్స్‌.