English | Telugu

గుడ్‌ బై చెప్పనున్న నయనతార... ఈ నిర్ణయం వెనుక రీజన్‌ అదేనా?

నయనతారకు హీరోయిన్‌గా సౌత్‌లో వున్న ఫాలోయింగ్‌ అందరికీ తెలిసిందే. లేడీ సూపర్‌స్టార్‌గా దూసుకుపోతున్న నయన్‌కు బాలీవుడ్‌లో చుక్కెదురైనట్టుంది. ఇకపై బాలీవుడ్‌ సినిమాల జోలికి వెళ్ళనంటోంది. షారూక్‌ ఖాన్‌, నయనతార జంటగా అట్లీ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘జవాన్‌’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ జోరు తగ్గకుండా దూసుకెళ్తున్న ఈ సినిమా తనకు ఓ పీడకలలా మిగిలిపోతుందని నయనతార భావిస్తోందని తెలుస్తోంది.

విషయం ఏమిటంటే.. అట్లీ ఈ కథ చెప్పినపుడు బాలీవుడ్‌లో తన ఎంట్రీకి మంచి సినిమా దొరికిందని ఎంతో సంతోషపడిరది నయన్‌. సినిమా చేస్తున్నప్పుడు కూడా తనకు ఎంతో ప్రాధాన్యం ఉందనే భావించిందట. తీరా సినిమా రిలీజ్‌ అయిన తర్వాత చూస్తే తను మెయిన్‌ హీరోయిన్‌ అయినా, ఎక్కువ ఇంపార్టెన్స్‌ దీపికా పదుకొనేకే ఇచ్చినట్టు అర్థమైందని అంటోంది నయన్‌. ఇప్పుడది షారూక్‌`దీపిక సినిమాగా మారిపోయిందని, తనను పక్కన పెట్టేసారని, అది తనకెంతో అవమానంగా ఉందని బాహాటంగానే విమర్శిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక బాలీవుడ్‌ సినిమాలకు గుడ్‌బై చెప్పాలని నయన్‌ నిర్ణయించుకుందని తెలుస్తోంది. సౌత్‌లో తన కెరీర్‌ను కొనసాగించాలని ఫిక్సయిందట. ఒకవేళ తప్పనిసరై బాలీవుడ్‌ సినిమా చెయ్యాల్సి వస్తే ‘జవాన్‌’ సినిమాకి జరిగిన అవమానం మళ్ళీ మళ్ళీ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే సినిమా ఓకే చెయ్యాలని నిర్ణయించుకుందని సమాచారం. అలాంటి కథలతో వచ్చేవారు తను పెట్టే కండీషన్స్‌కి ఒప్పుకుంటే ఆలోచిస్తానని చెప్పినట్టు సమాచారం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.