English | Telugu

సైలెంట్‌ గా ఓటీటీలోకి వ‌చ్చేసిన‌ 'బెదురులంక'

కార్తికేయ, నేహా శెట్టి జంటగా క్లాక్స్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'బెదురులంక 2012'. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 25న థియేటర్లలో విడుదలై కమర్షియల్ గా మంచి విజయాన్ని సాధించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి ప్రకటన లేకుండా సైలెంట్ గా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.

'బెదురులంక 2012' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఇటీవల మెజారిటీ సినిమాలు థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్నాయి. బెదురులంక కూడా నాలుగు వారాలకే ఓటీటీలోకి అడుగు పెట్టింది. ఎటువంటి ప్రకటన లేకుండానే ఈరోజు(సెప్టెంబర్ 22) నుంచి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. మరి ఈ సినిమాకి ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

ఈ సినిమాలో అజయ్ ఘోష్, వెన్నెల కిశోర్, సత్య, రాజ్‌ కుమార్‌ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగర్, గోపరాజు రమణ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం అందించారు.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.