English | Telugu

Brahmamudi : రాజ్ బ్రతికే ఉన్నాడని చెప్పిన అపర్ణ.. రాజ్ కొత్త గెటప్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -702 లో.....రుద్రాణి కావాలనే కొంతమందిని ఆఫీస్ నుండి రప్పిస్తుంది. వీళ్ళందరు రాజ్ కి సంతాపం సభ ఏర్పాటు చెయ్యాలి అనుకుంటున్నారని అనగానే అపర్ణ ఏదో అనాలని వెళ్తుంటే.. కావ్య ఆపుతుంది. కావ్య ఆపడం రుద్రాణి చూస్తుంది. అలా పిలిపించడంతో ఇంట్లో అందరు రుద్రాణిపై కోప్పడతారు. వాళ్ళను కావ్య పంపిస్తుంది.

నా కొడుకు బ్రతికే ఉన్నాడు త్వరలోనే వస్తాడని అపర్ణ చెప్పగానే రుద్రాణి, రాహుల్ షాక్ అవుతారు. ఆ తర్వాత ఇలా తిట్లుపడితే గాని మనకి బుద్ధి రాదని రుద్రాణితో రాహుల్ అంటాడు. తిడితే తిట్టింది గాని ఏదో జరుగుతుందని అర్ధం అవుతుందని రాహుల్ తో రుద్రాణి అంటుంది. మరొకవైపు రాజ్ ని కావ్య కలుస్తుంది. రాజ్ గెటప్ మార్చి వస్తుంటే.. ఏంటి ఇలా తయారు అయ్యారని అంటుంది. మనం సీక్రెట్ ఏజెంట్ లో వర్క్ చేస్తున్నాం అండర్ కవర్ ఆపరేషన్ లో ఉన్నామంటూ రాజ్ అర్ధం లేకుండా మాట్లాడతాడు. మరొకవైపు రాహుల్ ఆఫీస్ కి ఫోన్ చేసి ఆఫీస్ లో జరిగే విషయాలు తెలుసుకుంటాడు. మరొకవైపు ఒక దగ్గర దొంగతనం జరుగుతుంటే రాజ్ వెళ్లి ఆపుతాడు. మేం ఆఫీసర్ అంటూ మాట్లాడతాడు అప్పుడే పోలీసులు వస్తారు. వాళ్లతో కూడా రాజ్ అలాగే మాట్లాడతాడు.

దాంతో కావ్య రాజ్ ని పక్కకి తీసుకొని వెళ్తుంది. మీరు కొరియర్ స్టేషన్ నుండి పంపారు కదా.. అందుకే నేను ఇలా ఉహించుకున్న అని రాజ్ అంటాడు. అదంతా ఏం లేదు.. మా చెల్లి పోలీస్ డిపార్ట్ మెంట్.. తను పంపింది కొరియర్ అని కావ్య చెప్తుంది. ఆ తర్వాత రాహుల్ ఆఫీస్ లో జరుగుతున్న విషయాలు రుద్రాణికి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.