English | Telugu

'భోళా శంకర్' పబ్లిక్ టాక్.. మెగా ఫ్యాన్స్ ని ముంచేసిన మెహర్ రమేష్!

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'భోళా శంకర్'. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమా ఈరోజు(ఆగస్టు 11) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2015 లో వచ్చిన తమిళ చిత్రం 'వేదాళం'కి రీమేక్ కావడం, మెహర్ రమేష్ ట్రాక్ రికార్డ్ బాలేకపోవడంతో.. ఈ సినిమాపై మెగా అభిమానుల్లో కూడా పెద్దగా అంచనాల్లేవు. అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ మెగాస్టార్ రేంజ్ కి తగ్గట్లుగా లేవు. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసే అవకాశం లేదనే అభిప్రాయాలున్నాయి. అభిమానులు కూడా ఆ ఆశతోనే ఎదురుచూస్తున్నారు. అయితే వారికి నిరాశ తప్పలేదనే టాక్ వినిపిస్తోంది.

తొలి తెలుగు హీరో మ‌హేష్ మాత్ర‌మే.. ఫ్యాన్స్ అరుదైన గిఫ్ట్‌

స్టార్ హీరోల‌కు అభిమానులే బ‌లం. అభిమాన క‌థానాయ‌కుడి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా ఉండ‌దనే సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. సాధార‌ణంగా అగ్ర హీరోల పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ర‌క్త‌దాన చేయ‌టం, అన్న‌దానం, ప‌ళ్లు పంచ‌టం వంటి ప‌నులు చేసే అభిమానుల‌ను మ‌నం చూసే ఉంటాం. అయితే తాము అందుకు పూర్తిగా భిన్నం అని అంటున్నారు సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఫ్యాన్స్‌. ఎందుకంటే ఈసారి మ‌హేష్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా వారు త‌మ ఫేవ‌రేట్ హీరోకి అరుదైన గిఫ్ట్‌ను అందించారు. ఇంత‌కీ ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా!.. న‌క్ష‌త్ర మండ‌లంలోని ఓ స్టార్‌కి మ‌హేష్ బాబు అని పేరు పెట్ట‌ట‌మే కాదు..దాన్ని రిజిష్ట‌ర్ కూడా చేయించారు.

పెళ్లిపై విజ‌య్ దేవ‌ర‌కొండ క్లారిటీ

టాలీవుడ్‌కి చెందిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ హీరోస్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ ఒక‌రు. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన లేటెస్ట్ మూవీ ‘ఖుషి’. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కింది. సెప్టెంబర్ 1న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతోన్న ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌లైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అబ్బాయి, అమ్మాయి మ‌ధ్య వ‌చ్చే మ‌న‌స్ప‌ర్ధ‌లు ఎలా ఉంటాయి.. వాటిని వారెలా అధిగ‌మించార‌నే కథాంశంతో ‘ఖుషి’ సినిమా రూపొందింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జ‌త‌గా స‌మంత న‌టించింది. ట్రైల‌ర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తోంది. దీంతో సినిమాపై ఉన్న అంచ‌నాలు మ‌రింతగా పెరిగాయి. ఈ నేప‌థ్యంలో విజ‌య్ దేవ‌ర‌కొండ మీడియా ప్ర‌తినిధుల‌తో మాట్లాడుతూ ప‌లు ప్ర‌శ్న‌ల‌పై రియాక్ట్ అయ్యారు. వాటిలో పెళ్లికి సంబంధించిన ప్ర‌శ్న కూడా ఉంది. దానిపై కూడా రౌడీ స్టార్ స్పందించారు.

రామ్ చరణ్ కోసం శంకర్ సూపర్బ్ స్కెచ్!

RRR వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం ‘గేమ్ చేంజర్’. భారీ చిత్రాల ద‌ర్శ‌కుడు శంక‌ర్ డైరెక్ష‌న్‌లో దిల్ రాజు, శిరీష్ మూవీని నిర్మిస్తున్నారు. శంక‌ర్ మేకింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్ర‌తీ స‌న్నివేశాన్ని ఓ వండ‌ర్‌లా తెర‌కెక్కించాల‌ని ఆయ‌న తాప‌త్ర‌య ప‌డుతుంటారు మ‌రి. ‘గేమ్ చేంజర్’ మూవీ ప్రారంభ‌మై రెండేళ్లు కావ‌స్తుంది. ఇంకా పూర్తి కాలేదు. మ‌రో వైపు ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులు సినిమా అప్డేట్స్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే ‘గేమ్ చేంజర్’లో రామ్ చ‌ర‌ణ్‌ను శంక‌ర్ ఒక‌టి, రెండు కాదు.. ఏకంగా ఏడు లుక్స్‌లో చూపించ‌బోతున్నార‌ట‌.

కాలేజీలో ప్ర‌కాష్ రాజ్‌.. గోమూత్రంతో క్లీన్ చేసిన విద్యార్థులు

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్‌కి అనుకోని షాక్ త‌గిలింది. శివమొగ్గ జిల్లా భద్రావతిలో సర్ ఎంవీ ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీలో డైలాగ్ ఆన్ థియేట‌ర్‌, సినిమా అండ్ సోసైటీ అనే అంశాల‌పై ఒక చర్చా వేదిక జ‌రిగింది. ఇందులో మ‌న వెర్స‌టైల్ ఆర్టిస్ట్‌ ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు. ఈవెంట్‌ను ఫెడరేషన్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్స్ సంస్థ నిర్వ‌హించింది. అయితే ఇదొక ప్రైవేటు కార్య‌క్ర‌మం అని, దాన్ని స్కూల్‌లో ఎలా నిర్వ‌హిస్తార‌ని కొంద‌రు విద్యార్థులు వ్య‌తిరేకించారు. ప్ర‌కాష్ రాజ్‌కి వ్య‌తిరేకంగా వారు నినాదాలు చేశారు. ఈ విద్యార్థుల‌కు బీజేపీ నేత‌లు మ‌ద్దతుని తెలియ‌జేశారు. అయితే పోలీసులు ప‌రిస్థితుల‌ను అదుపులోకి తీసుకొచ్చారు.

‘భోళా శంకర్’కి జ‌గ‌న్ స‌ర్కార్ వేటు!

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఆగ‌స్ట్ 11న రిలీజ్‌కి సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ ఏపీ స‌ర్కార్‌కి టికెట్ రేట్స్‌ను పెంచుకునే విష‌యంలో రిక్వెస్ట్‌ను పంపారు. రూ.25 పెంచుకునే వెసులుబాటుని క‌ల్పించాలనేది చిత్ర నిర్మాత‌ల నుంచి ఏపీ స‌ర్కార్‌కి వెళ్లిన విన‌తి. అయితే ‘భోళా శంకర్’కు ఏపీ ప్ర‌భుత్వం షాకిచ్చింది. అయితే దీన్ని ముందుగానే ఊహించామ‌ని కొంద‌రు అంటున్నారు. అందుకు కార‌ణం.. రెండు రోజుల ముందు జ‌రిగిన వాల్తేరు వీర‌య్య 200 డేస్ ఫంక్ష‌న్‌లో ఏపీ ప్ర‌భుత్వంపై చిరంజీవి చేసిన కామెంట్స్ అంటున్నారు.

రాజ‌మౌళికి ర‌మ్య‌కృష్ణ కండీష‌న్స్‌

ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ స‌క్సెస్‌ఫుల్ అండ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్స్‌లో ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి నెంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో ఉన్నారు. ఆయ‌న‌తో సినిమాలు చేయ‌టానికి పాన్ ఇండియా రేంజ్‌లో స్టార్స్ అంద‌రూ ఆస‌క్తిని క‌న‌ప‌రుస్తున్నారు. అయితే రాజ‌మౌళితో సినిమా చేయ‌ట‌మంటే అంత సులువు కాదు. ఎందుకంటే.. కండీష‌న్స్ చాలానే ఉంటాయి. ఆయ‌న సినిమా పూర్త‌య్యే వ‌ర‌కు మెయిన్ రోల్స్‌లో చూసే వారు స‌ద‌రు పాత్ర‌ల గురించి మాట్లాడ‌కూడ‌దు. లుక్స్‌ని బ‌య‌ట‌కు రివీల్ చేయ‌కూడ‌దు. ఇన్నీ నియ‌మాలున్నా జ‌క్క‌న్న‌తో సినిమా చేయ‌టానికి స్టార్స్ రెడీగానే ఉంటారు. అయితే అలాంటి డైరెక్ట‌ర్‌కే ఒక‌రు కండీష‌న్స్ పెట్టారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఆ కండీష‌న్స్‌కి ఆయ‌న కూడా ఓకే చెప్పారు మ‌రి. ఇంత‌కీ రాజ‌మౌళికే కండీష‌న్స్ పెట్టిన వ్య‌క్తి ఎవ‌రో కాదు.. ర‌మ్య‌కృష్ణ‌.

రూ.100 కోట్ల డైరెక్ట‌ర్‌తో మోక్షజ్ఞ ఎంట్రీ..!

నంద‌మూరి అభిమానులు బాల‌కృష్ణ, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సినిమాల కోసం ఎంతో ఎగ్జ‌యిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తుంటారు. అయితే వారు ఈ మ‌ధ్య కాలంలో మ‌రో వార్త కోసం అంత‌కు మించిన ఆతృత‌తో వెయిట్ చేస్తున్నారు. ఆ వార్త ఏంట‌నేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.. నంద‌మూరి ఫ్యామిలీ నుంచి సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్ట‌బోతున్న నంద‌మూరి మోక్ష‌జ్ఞ ఎంట్రీ కోసం. రెండు, మూడేళ్ల నుంచి ఇదిగో మోక్ష‌జ్ఞ ఎంట్రీ.. అదుగో అప్పుడే అంటూ వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. బాల‌కృష్ణ సైతం మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంద‌ని అంటున్నారు కానీ.. ఎప్పుడ‌నేది క‌చ్చితంగా చెప్ప‌లేక‌పోతున్నారు. ఆ మ‌ధ్య బొద్దుగా ఉన్న మోక్షజ్ఞ సైతం స‌న్న‌గా మారిన లుక్ నెట్టింట వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే.