English | Telugu

'బిజినెస్ మేన్' కలెక్షన్ల సునామీ.. రీ-రిలీజ్ లో సరికొత్త రికార్డులు!

ఊహించినట్లుగానే రీ-రిలీజ్ లో 'బిజినెస్ మేన్' సినిమా సంచలన ఓపెనింగ్స్ రాబట్టింది. ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో రీరిలీజ్ కలెక్షన్స్ పరంగా రూ.3.62 కోట్లతో 'ఖుషి', రూ.2.90 కోట్లతో 'సింహాద్రి' టాప్ లో ఉండగా.. ఇప్పుడు 'బిజినెస్ మేన్' ఏకంగా రూ.4.37 కోట్లతో సత్తా చాటింది.

మహేష్ పుట్టినరోజు(ఆగస్టు 9) సందర్భంగా 'బిజినెస్ మేన్' చిత్రాన్ని రీరిలీజ్ చేశారు. అడ్వాన్స్ బుకింగ్స్ చూసే ఈ సినిమా సంచలన వసూళ్లు రాబట్టడం ఖాయమనే అంచనాలు వ్యక్తమయ్యాయి. అందుకు తగ్గట్లుగానే ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ వచ్చాయి. రీరిలీజ్ లో నైజాంలో ఇప్పటిదాకా ఖుషి, జల్సా, సింహాద్రి మాత్రమే కోటికి పైగా గ్రాస్ రాబట్టాయి. ఒక్క సినిమా కూడా రెండు కోట్ల మార్క్ ని అందుకోలేదు. అలాంటిది 'బిజినెస్ మేన్' ఏకంగా రూ.2.46 కోట్లు రాబట్టింది. ఇక ఆంధ్రాలో రూ.1.56 కోట్లు, సీడెడ్ లో రూ.35 లక్షలు రాబట్టగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి మొదటిరోజు రూ.4.37 కోట్ల గ్రాస్ సాధించింది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.