English | Telugu
ఎట్టకేలకు ఓటీటీలోకి 'ఆదిపురుష్'
Updated : Aug 11, 2023
రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన చిత్రం 'ఆదిపురుష్'. ఓంరౌత్ దర్శకత్వంలో టి. సిరీస్ నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాలతో జూన్ 16న పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైంది. అయితే ఈ సినిమా అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా మిగిలింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇటీవల కాలంలో దాదాపు సినిమాలన్నీ నాలుగు వారాలకే ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. కానీ 'ఆదిపురుష్' మాత్రం ఎనిమిది వారాల తర్వాత సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చింది. ఈరోజు(జూలై 11) నుంచి ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుండగా.. హిందీ వెర్షన్ మాత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది.
నెగటివ్ టాక్ తో కూడా వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.400 కోట్ల గ్రాస్ తో సత్తా చాటిన 'ఆదిపురుష్'.. ఓటీటీలో ఏస్థాయి ఆదరణ పొందుతుందో చూడాలి.