కాంగ్రేసుకి అఖిలంతోనే సఖలం

  దేశానికి సమర్ధమయిన పరిపాలన అందించని కాంగ్రేసు పార్టీని ఎంతయినా తప్పుపట్టవచ్చును కాని, మిగిలిన విషయాలలో దానికున్న నైపుణ్యాలని ఎవరు వేలెత్తి చూపలేరు. ఎంత పెద్ద కుంభకోణాలలో దొరికిపోయినా టీవిగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, ప్రజలని మభ్యపెట్టి మరిపించేయగలదు. అందుకు తగ్గట్టుగానే, ప్రజలూ కూడా ఎంత పెద్ద కుంభకోణమయినా ఇదివరకులాగ అంతగా పట్టించుకోవడం మానేసిన సంగతి గుర్తించిన కాంగ్రెస్ నిర్భయంగా తనపని తానూచేసుకుపోతోంది.   ఇక, విషయాని కొస్తే హటాత్తుగా తన అమ్ముల పొదిలోంచి ‘అఖిల పక్షం’ అనే సమ్మోహనాస్త్రాన్ని తీసి సమయోచితంగా సందించి తెలంగాణా యమ్పీలను తన దారికి తెచ్చుకోవడమే గాకుండా, తెలంగాణాలో తనకున్నకాస్త పరువునీ కొల్లగొడుతున్న చంద్రబాబు, వైయ్యసార్ పార్టీలను ఒకేసారి కంగు తినిపించగలిగింది. ఒక దెబ్బకి రెండు...కాదు...కాదు...మూడు పిట్టల్ని కూల్చేసింది. ఒకేఒక దెబ్బకి తన తెలంగాణా యమ్పీలను దారికి తెచ్చు కోవడమే గాక తే.దే.పా., వైయ్యసార్ పార్టీలకూ అగ్ని పరీక్ష పెట్టి ఆలోచించుకోవడానికి సమయం లేకుండా ఈ నెల 28నే అఖిల పక్షం అని ముహూర్తం కూడా పెట్టేసింది. తన చాణక్యనీతి ఎంత గొప్పదో ఈ దెబ్బతో అందరికీ తెలియజేసింది.   ఆదెబ్బకి మొదట విలవిలలాడుతున్నది తే.దే.పా. అని వేరే చెప్పనవసరం లేదు. ఇంత వరకు తన ‘రెండు కళ్ళ సిద్దాంతము’తో ఎలాగో మెల్లగా నెట్టుకొచ్చేస్తున్న తే.దే.పా.ఇప్పుడు తప్పని సరిగా తన మనసులో మాట చెప్పవలసిన పరిస్తితి ఏర్పడింది. గత కొన్ని రోజులుగా తెలంగాణాలో పర్యటిస్తున్న చంద్రబాబు ఇంతవరకు రోజు అక్కడి ప్రజలతో తానూ తెలంగాణా వ్యతిరేఖిని కానని నొక్కి జెప్పుతూ, ఒక వేళ కాంగ్రేసు గాని తెలంగాణా ఇచ్చేమాటయితే తానూ అడ్డు చెప్పబోనని కూడా పదే పదే ప్రజలకి వాగ్దానం చేస్తూ వచ్చేడు. అంతే గాక, తానూ ఈ విషయమై కాంగ్రేసుకి లేఖ వ్రాసినప్పటికీ తన దగ్గిరనుండి ఇంత వరకు ఎటువంటి సమాధానం రాలేదని, తెలంగాణా పట్ల తనకున్న చిత్తశుద్ధి కాంగ్రెస్కు లేక పోవడం వల్లే అలాగ సాగాదీస్తోందనీ తెలంగాణా ప్రజలకి సవివరంగా చెపుతూ తనదయిన పద్దతిలో ముందుకు సాగిపోతున్నప్పుడు, కాంగ్రెస్, తన హట్టాత్ ప్రకటనతో చంద్రబాబుని తెలంగాణాలో ఉండగానే అతని మాటలతోనే అతనిని బంధించింది.   తెలంగాణా విషయంలో కాంగ్రెస్ ఏమి చేస్తుందనేది అప్రస్తుతం. గాని ఆ విషయంలో చంద్రబాబు ఏమి చెప్పబోతున్నడనేదదే ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారింది. ఒకవేళ తెలంగాణాకి వ్యతిరేఖంగా మాట్లాడితే, ఇప్పటికే తే.రా.సా., తల్లీ పిల్ల కాంగ్రేసులు ప్రచారం చేస్తున్న ‘చంద్రబాబు నమ్మ దాగిన వ్యక్తీ కాడు” అనే మాటలు నిజం చేసిన వాడవుతాడు. తద్వారా కేవలం తెలంగాణాలోనే గాకుండా, రాష్ట్రం మొత్తం ఆ సంగతి ప్రచారం చేసుకొనేందుకు తే.రా.సా., తల్లీ పిల్ల కాంగ్రేసులకు చేతులారా అవకాశం ఇచ్చినట్లవుతుంది. అంతేగాక, ఆదెబ్బతో తెలంగాణాలో తే.దే.పా. తుడుచుపెట్టుకు పోయినా ఆశ్చర్య పోనక్కరలేదు. ఎందుకంటే, పార్టీలో ఇంతకాలం ఇబ్బందిగా కొనసాగుతున్న తెలంగాణా నేతలు, తమ రాజకీయ భవిష్యత్తు కోసమయినా పార్టీని విడువక మానరు. అప్పుడు, తే.దే.పా.కు తెలంగాణాలో పార్టీని మళ్ళీ పునర్ నిర్మించుకోవడం సాధ్యం కాని పని. గనుక, ‘అఖిలంలో’ చంద్రబాబు ‘జై తెలంగాణా’ అనక తప్పదు.   అప్పుడు, పార్టీలో రెండోవర్గాన్ని ఎలాగ సముదాయిన్చగలడు? అనే ప్రశ్నవస్తుంది. కానీ, తెలంగాణా సమస్యతో రాజకీయ అస్తిరత ఎలాగ ఉంటుందో, అది తమ రాజకీయ జీవితాలని ఎంతగా ఇబ్బంది పెడుతోందో అనుభవపూర్వకం గ్రహించిన సీమంద్ర నేతలను ఇప్పుడు మాత్రమె ఒప్పించడము సులువు అని చంద్రబాబుకి తెలిసే ఉంటుంది. చంద్రబాబు ‘జై తెలంగాణా’ అన్నపుడు మిగిలిన పార్టీలకి అంతకన్నా మరో దారి, అవకాశం, అవసరము లేదు, ఉండదు. అందువల్ల ‘అఖిలంలో’ తే.దే.పా. సై అన్నప్పుడు, తరువాత సహజంగా కాంగ్రేసు వంతువస్తుంది. ప్రస్తుత పరిస్తితుల్లో వెంటనే తెలంగాణా గాని ఇచ్చేసే అవకాశం ఎటూ లేదు గనుక, కోడి గుడ్లు పొదిగినట్లు కాంగ్రెస్ తెలంగాణా అంశాన్ని కూడా 2014 ఎన్నికలవరకూ వరకు పొదుగుతూ కూర్చొని, అప్పుడు ఎన్నికలముందు ఏదో ఒకసానుకూల ప్రకటన చేసేసి తెలంగాణా ఓట్లు తన ఖాతాలో జమ చేసుకొనే ప్రయత్నం చేయవచ్చు.   పనిలో పనిగా, ఇప్పటికీ సిద్దంగా ఉన్న తే.రా.సా.ను, తన పిల్ల కంగ్రేసునీ కూడా తనలో కలిపెసుకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అప్పుడు, మళ్లీ ఒక దెబ్బకి ఎన్ని పిట్టలో లెక్కబెట్టడం ఎవరితరమూ కాదు. కాకి లెక్కలు కట్టుకొన్నా, రాష్ట్రంలో తిరిగి అధికారం చేజిక్కించుకోవడం, తలనొప్పిగా మారిన తే.రా.సా. పిల్ల కాంగ్రేసులను లొంగదీసుని తన స్వంత ఆయుధాలుగా మార్చుకొని తే.దే.పా.ను తుడిచి పెట్టేసి రాష్ట్రాన్ని ఏక చత్రదిపత్యంగా పరిపాలిన్చేసుకోవడం, ‘తెలంగాణా ఇచ్చేది తెచ్చేది మేమే’ అన్న మాట నిలబెట్టుకొన్నఘనకీర్తీ, రాష్ట్రంలో మళ్లీ ప్రశాంతత తెచ్చమనే గొప్పలు చెప్పుకొనే అవకాశం పొందడం, ఆనక తాపిగా కావలిసినన్ని కుంభకోణాలు చేసుకొనే అవకాశం...ఇలాగ చెప్పుకుపోతే వాటికి అంతే ఉండదు.   ఇక, విభజనలో పీటముడి పడిన ఒకేఒక అంశం ‘హైదరాబాద్ ఎవరి సొంతం?” అనేది. ఒక పదేళ్ళో పదిహేనేళ్లో ‘కామన్ క్యాపిటల్’ చేసిపడేస్తే అప్పటి సంగతి అప్పుడు చూసు కోవచ్చుననే ఒక ‘ఆప్షన్’ ఎలాగు ఉంటుంది గనుక, ఆ సమస్యా ఇక తీరిపోయినట్లే! అయినా, అటు తెలంగాణాలోనూ ఇటు ఆంధ్రా ప్రాంతంలోనూ కాంగ్రేసే వడ్డిస్తున్నపుడు ఎవరికి మాత్రం సమస్యలుంటాయి? ‘వడ్డించేవాడు ‘మనోడయితే’ ఎక్కడ కూర్చున్నా అందవలసినవి అందుతూనే ఉంటాయని పెద్దలు ఊరికే చెప్పలేదు కదా!

ఆడక ముందే ఓడిన భారత ఒలింపిక్స్ సంఘం

    అవినీతి, రాజకీయాలలో ఒలింపిక్ పోటీలు పెడితే అవలీలగా బోలెడు స్వర్ణ పతకాలు కైవసం చేసుకోగల సత్తా ఉన్న మనదేశం, అసలయిన ఒలింపిక్స్ పోటీలలో పెద్దగా రాణించింది మాత్రం ఎప్పుడూలేదు. అందుకు మన రాజకీయ వ్యస్తని, ఆ రాజకీయ వ్యవస్తని భారత ఒలింపిక్స్ సంఘంలో సమర్ధంగా చ్చోపించిన మన ప్రభుత్వాన్నే తప్పు పట్టక తప్పదు అని మనకు తెలుసు. ఇప్పుడు అదే పని అంతర్ జాతీయ ఒలింపిక్స్ సంఘం చేసి చూపింది.   నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో భారత ఒలింపిక్స్ సంఘాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు అంతర్ జాతీయ ఒలింపిక్స్ సంఘం ప్రతినిధులు తెలియజేసారు. అంటే, త్వరలో జరుగనున్న ఒలింపిక్స్ పోటీలలో మన దేశం నిషేదించబడినట్లు లెక్క. అంతే గాక, సస్పెన్షన్ ఎత్తివేసే వరకూ ఇక మన భారత ఒలింపిక్స్ సంఘానికి అంతర్ జాతీయ ఒలింపిక్స్ సంఘం నుండి నిధులు కూడా రాబోవు. అసలే నిదులలేమితో కటకటలాడుతున్న మన భారత క్రీడాకారులకు ఇదో పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చును. మన క్రీడాకారులు ఒలింపిక్స్ పోటీలలో వ్యక్తిగత హోదాలో పాల్గొనవచ్చు గాని మన దేశానికి ప్రతినిధులుగా పాల్గొనలేరు. అంతే గాక, ఒలింపిక్స్ పోటీలలో మన జాతీయ జెండాని కూడా చేత బట్టుకోవడానికి కూడా వారికీ అనుమతి ఉండదు. ఇంత కంటే ఘోర అవమానం మరేముంటుంది మనకి? భారత ఒలింపిక్స్ సంఘంలో ప్రభుత్వ మరియు రాజకీయ ప్రమేయం ఉండకూడదని ఎన్నాళగానో హెచ్చరిస్తున్నాఆ హెచ్చరికలని పెడచెవిన బెట్టి, ‘స్కామ్ముల లలిత భానో’ని భారత ఒలింపిక్స్ సంఘానికి కార్యదర్శికగా ఏకగ్రీవంగా ఎంపిక చేయిన్చేసి చేతులు దులుపుకోంది మన ప్రభుత్వం.  అంతే గాకుండా, రాజకీయ పార్టీలతో నిత్యం భుజాలు రాసుకు తిరిగే అభయ్ సింగ్ చౌతాలా వారిని కూడా అదే చేత్తో బోర్డ్ సభుడిగా ఏకగ్రీవంగా ఎంపిక చేయిన్చేసి తన ఘనత చాటుకోంది మన భారత ప్రభుత్వం. అసలయిన గమ్మతేమిటంటే, మన భారత ఒలింపిక్స్ సంఘం బోర్డ్ ఎన్నికలు ఇంకా జరుగలేదు కూడా. ఈ రోజో రేపో అవి జరగవచ్చు. ప్రస్తుత భారత ఒలింపిక్స్ సంఘం తాత్కాలిక అధ్యక్షుడు వి.కె.మల్హోత్రా కూడా మన ఒలింపిక్ బోర్డులో రాజకీయాలు చొప్పించవద్దని గత రెండు సంవత్సరాలుగా యెంత మొత్తుకొన్న వినకుండా మన భారత ప్రభుత్వం చేసిన ఘన కార్యానికి ఫలితం ఇప్పుడు ఇలాగ అందరూ అనుభవించాల్సి వస్తోంది. మరో విషాదకరమయిన విషయమేమిటంటే ఈ సంగతి తెలిసి మీడియా వాళ్ళు సదరు మంత్రి వర్యులని మీ ప్రతిస్పందన ఏమిటని అడిగితె ‘దురదృష్టకరం’ అని ఒక్కమాటతో తేల్చి పారేసాడు. సంఘం సభ్యులని కూడా అడిగినప్పుడు వాళ్ళు కూడా అదే నిర్లక్ష్యంతో ‘ఆ సంగతి మాదాక ఇంకా రాలేదు, వచ్చినప్పుడు చూద్దాము,” అని నిర్లజ్జగా జవాబుఇచ్చి ఈవిషయంలో తీవ్రకలత చెందుతున్న కోట్లాది భారతీయులని మరనేకమంది క్రీకారులని కూడా ఆశ్చర్యపరిచేరు.

మహా ప్రస్తానానికి రాళ్ళేసిన కుర్రాళ్ళేవ్వరు ?

    ముందే అనుకోనట్లుగానే తెలంగాణాలో షర్మిల పాదయాత్ర ఇబ్బందుల్లో పడింది. అసలే తన ‘గద్వాల్ సవాల్’ తో కాకమీదున్న తే.రా.స.కి మరింత పొగబెడుతున్నట్లు రోజా చేసిన కామెంట్స్ కొత్త తల నొప్పులు తెచ్చి పెట్టాయి. పిల్లిని చంకన పెట్టుకు పెళ్లికి వెళ్ళినట్లు, కాస్త నోటితీట ఉన్న రోజాని వెంటబెట్టుకువెళ్ళిన జగన్ సోదరి షర్మిలకి, మొన్న ఆమె మెహబూబ్ నగర్ లో చేసిన ఉపన్యాసంతో ముందు  నుయ్యి వెనక గొయ్యి అన్నట్లు తయారయింది షర్మిలాకి ఇప్పుడు. మొన్న షర్మిలమ్మ పాదయాత్రలో కాలుకలిపిన యాంకరమ్మ రోజా తమకు నిరసనలు తెలియ జేస్తున్న ప్రజలని ఉద్దేశించి మాట్లాడుతూ “ప్రజలకి నచ్చినవాడు, మెచ్చినవాడే అసలయిన నాయకుడు అవుతాడు తప్ప ఏవో మాయమాటలు చెప్పినవాడు కాలేడు. నిజం చెప్పాలంటే, మన షర్మిల పాదయాత్రలకి తెలంగాణా ప్రజలు నీరాజనంపట్టడం చూస్తున్న తే.రా.స. నాయకులకి అప్పుడే బెంగ పట్టుకొంది. అందుకే ఇలాగ అమాయకులయిన ప్రజలని రెచ్చగొట్టి మమల్ని అడ్డుకోవాలని చూస్తునారు. గాని, తెలంగాణా ప్రజలు వై.యస్.ఆర్. కాంగ్రేసుకి బ్రహ్మరధం పడుతున్నారు,” అని చెప్పుకొచ్చింది అందాల యాంకరమ్మ మన రోజమ్మ. శల్య సారద్యం చేస్తున్న ఆమెని వారించలేక సమర్దించను లేక షర్మిలమ్మ పాపం ఎంత బాధ పడిందో ఎవరికీ తెలీదు. ఈ రోజు పాలమూరు వద్ద కొందరు తెలంగాణా విద్యార్దులు ఆమెపైకి రాళ్ళు విసిరి ఆమె మహాప్రస్తానానికి గండికొట్టాలని చూసారు. గాని, సమయానికి పోలీసులు అడ్డు పడటంతో  అప్పటికి గడ్డం గట్టెకింది. ‘ఇన్ ఫ్రంట్ దేరీస్ క్రోకడైల్ ఫెస్టివల్ సుమీ!’ అని షర్మిల మనసులో  గొణుకొంటూ మళ్లీ జర్మనీ బూట్లతో నడక మొదలు పెట్టింది.  

చంద్రబాబు 63 ఏళ్లు 63 రోజులు 1000 కిలోమీటర్లు

    చంద్రబాబు నాయుడు "వస్తున్నా మీ కోసం" యాత్రలో రికార్డ్ సృష్టించారు. 63 ఏళ్లలో 63 రోజుల్లో1000 కిలోమీటర్లు పూర్తి చేయడం విశేషం. అక్టోబర్ 2న ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాదయాత్ర నేటికి 63వ రోజుకు చేరుతుంది. ఆరు, మూడు కలిపితే 9 సంఖ్య వస్తుంది. అదే విధంగా సోమవారంనాటి తేదీ 3.12.12. ఈ మూడింటిని కూడితే కూడా 9 వస్తోంది. పైగా, చంద్రబాబు వయస్సు 63 ఏళ్లు. ఇదీ 9 సంఖ్యను తెచ్చిపెడుతోంది. చంద్రబాబు పాదయాత్ర చేపట్టిన వేయి కిలోమీటర్లు పూర్తన్న సమయంలో 9 అదృష్ట సంఖ్య కలిసి వచ్చిందని, ఇది శుభసూచకమని అంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర 1000 కిలోమీటర్లు దాటనున్నారు. 62 రోజుల్లో ఐదు జిల్లాల్లో యాత్రను పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈ . బోధన్ మండలం పెంటాఖుర్దులో చంద్రబాబు 1000 కిలోమీటర్ల మైలురాయి దాటనున్నారు.  ఈ విశిష్ట సందర్భాన్ని పురస్కరించుకొని టీడీపీ శ్రేణులు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. 1982 డిసెంబర్ 2న జాడి జమాల్‌పూర్‌లో ఎన్టీఆర్ బస చేసిన సందర్భాన్నీ గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు బాబు కూడా డిసెంబర్ 3న అదే గ్రామంలో బస చేయనున్నారు. ఈ సందర్భంగా ఆ గ్రామంలో స్తూపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జాడి, పెంటాఖర్దుల్లో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహాలను బాబు ఆవిష్కరిస్తారు. అలాగే వెయ్యి మంది మహిళలతో పాదయాత్ర నిర్వహించనున్నారు. మరోవైపు బాబు పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తిచేసుకుంటున్న సందర్భాన్ని రాష్ట్రమంతటా కార్యకర్తలు ఘనంగా జరుపుకుంటున్నారు. చంద్రబాబు పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్బంగా విశాఖపట్నం జగదాంబ కూడలి వద్ద విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇంచార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ మోకాళ్ల యాత్ర చేశారు. ఈ యాత్రకు నియోజకవర్గం కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.

చుక్కలనంటిన చుక్కధర

    మందు బాబులకు దిమ్మ తిరిగేలా ప్రభుత్వం మద్యం ధరలను పెంచేసింది. ప్రీమియం, మీడియం బ్రాండ్ల మద్యం ధరలను పెంచుతూ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి అసుతోష్ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్సైజ్ డ్యూటీ, ట్రేడ్ మార్జిన్ పెంచడంతో, సర్కారుకు దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి. ఈ మార్పులు శనివారం నుండి అమల్లోకి వస్తాయి. ఎక్సైజ్ డ్యూటీ లో పెద్దగా మార్పులు లేవు. అయితే, బేసిక్ ధర రూ.400 నుండి రూ. 450 వరకూ రేంజ్ ను సృష్టించి ప్రూఫ్ లీటర్ కు రూ. 75 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ ని విధించింది. ఈ నిర్ణయం వల్ల క్వార్టర్ బాటిల్ ధర రూ.4 నుండి రూ.  5 వరకూ పెరగనుంది. మధ్య తరగతి ప్రజలే ఎక్కువగా ఇలాంటి మద్యాన్ని తాగుతుంటారు. అయితే, ఇప్పటికే వ్యాపారుస్తుల వద్ద ఉన్న మద్యాన్ని పాత ధరలకే విక్రయించాల్సి ఉంటుంది. రేపటి నుండి ఏపిబిసిఎల్ డిపోల నుండి తీసుకువెళ్ళే మద్యానికి మాత్రం కొత్త ధరలు వర్తిస్తాయి. పాత సరుకును మారిన ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దేవేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో వినియోగదారులు 040-24612756, 9966222271 నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని అయన అన్నారు. హైదరాబాద్ సిటిలో సుమారు 130 మద్యం దుకాణాలు ఉంటే, నగరం నుండి దాదాపు 700 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. కొత్త సంవత్సర వేడుకలకు సిద్దమవుతన్న మందు బాబులు ధరలు పెరగడంతో ఒక్కసారిగా ఖంగు తిన్నారు. మద్యం వ్యాపారుల వత్తిడులకు తలొగ్గే ఈ ధరలను పెంచారని తెలుగు దేశం నేత దాడి వీర భద్ర రావు విమర్శించారు. ధరలు పెరగడం వల్ల వీటికి అలవాటు అయిన పేదలు నాటు సారాను తాగి ప్రాణాలు పోగొట్టుకొనే అవకాశం ఉందని ఆయన అన్నారు.

పాటింగ్ నిష్క్రమణం

    ఆస్ట్రేలియా కు రెండు సార్లు ప్రపంచ కప్ అందించిన రికీ పాంటింగ్ అంతర్జాతీయ క్రికెట్ నుండి నిష్క్రమించాడు. ఆ దేశానికి అత్యంత విజయవంత మైన కెప్టెన్ గా గుర్తింపు పొందిన పాంటింగ్ తన 17 సంవత్సరాల కెరీర్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించాడు. త్వరలో పెర్త్ లో జరిగే టెస్ట్ మ్యాచ్ పాంటింగ్ కు చివరి మ్యాచ్ కానుంది. ప్రస్తుతం తన అట తీరు సరిగా లేదని, ఇక జట్టుకు భారం కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాంటింగ్ వెల్లడించారు. దీనితో, ఆస్ట్రేలియా క్రికెట్ లో ఓ శకం ముగిసినట్లయింది. 167 టెస్టులు ఆడిన పాంటింగ్  13366 పరుగులు చేసాడు. ఇందులో 41 సెంచరీలు ఉన్నాయి.  257 అతని అత్త్యుత్తమ స్కోరు. అలాగే, 375 వన్డే లు ఆడి 13704 పరుగులు చేసాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. 17 టి 20మ్యాచ్ లు కూడా ఆడి,  401 పరుగులు చేసాడు. పాంటింగ్ 77 టెస్ట్ మ్యాచ్ ల్లో తన దేశానికీ నాయకత్వం అందించాడు.అందులో 48 మ్యాచ్ ల్లో ఆసీస్ విజయం సాధించింది. 228 వన్డే ల్లో ఆసీస్ కు నాయకత్వం అందించిన పాంటింగ్ 164 మ్యాచ్ ల్లో జట్టుకు విజయాన్ని అందించాడు. మూడు ప్రపంచ కప్ లు గెలిచిన జట్టులో పాంటింగ్ సభ్యుడు. 38 సంవత్సరాల పాంటింగ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో, ఇక అందరి కళ్ళు సచిన్ టెండూల్కర్ ఫై ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సచిన్ రిటైర్మెంట్ కు సంబంధించి ఇక ఒత్తిడి అధికం అయ్యే అవకాశాలు ఉన్నాయి.  

ప్రాణం తీసిన అమీర్ ఖాన్ షో

    సత్యమేవ జయతే.. ప్రస్తుతానికి మీడియాలో బాగా నలుగుతున్న మీడియా గేమ్ షో.. దీంట్లో పాల్గొన్నవాళ్లు తమ అనుభవాల్ని అభిప్రాయాల్ని చెబుతుంటే జనం చెవులు రిక్కించుకుని వింటున్నారు. రేటింగ్స్ కూడా బాగా వస్తున్నాయ్.   కానీ.. ఈ షో.. కారణంగా ఓ మర్డర్ కూడా జరిగింది. ఇంట్లో వాళ్లకు ఇష్టంలేకుండా ప్రేమించిన పిల్లని పెళ్లిచేసుకున్న ఓ అబ్దుల్ అనే కుర్రాడి జీవితం ముగిసిపోయింది. షో లో అమీర్ వివరాలు అడుగుతుంటే భార్యాభర్తలిద్దరూ ఉద్వేగంగా సమాధానాలు చెప్పారు. శభాష్ అంటూ చప్పట్లు కొట్టిన అమీర్.. అన్ని రకాలుగానూ అండగా నిలుస్తామంటూ ప్రోత్సహమిచ్చాడు.   షో పూర్తయ్యాక.. ఒకవేళ తమ వాళ్లకి తమమీద కోపం తగ్గిపోయుంటుందేమో అన్న ఆశతో వాళ్లని చూసేందుకు ఇద్దరూ వరుడి పుట్టింటికెళ్లారు. ఏళ్ల తర్వాత కూడా పగని చల్లార్చుకోని వరుడి కుటుంబసభ్యులు పెద్దగా పోట్లాటకొచ్చారు. నేరుగా తుపాకీ తీసుకొచ్చి మొహబిన్ కళ్లముందే అబ్దుల్ ని కాల్చిపారేశారు. బాధితుడు స్పాట్ లో కుప్పకూలాడు.  

సా.....గుతున్న అక్రమాస్తుల కేసు

       జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జీడిపాకంలా సాగుతోంది. జగన్ మీద కొత్త కొత్త చార్జ్ ల్ని పెట్టేందుకు సిబిఐ తెగ శోధిస్తోంది. ఒకదాని తర్వాత ఒకటిగా మీదపడుతున్న కేసుల భారం జగన్ ని బాగా కుంగదీస్తున్నా.. ఇప్పటివరకూ గట్టిగానే ఉన్నట్టు లెక్క.    చంచల్ గూడ జైలునుంచే జగన్ తన కార్యకలాపాల్ని నడుపుతున్నారని టిడిపి నేతలు బాహాటంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికీ అన్నీ జగన్ కనుసన్నల్లోనే నడుస్తున్నాయంటున్నారు. జనంలో అన్నకి మద్దతుని కూడగట్టేందుకు తల్లీ, చెల్లీ కఠోరమైన శ్రమని ఎదుర్కోవాల్సొస్తోంది.   అక్రమాస్తుల కేసు విచారణ నత్తనడకన సాగుతోంది. అధికారులు విదేశాలనుంచి సమాచారాన్ని సేకరించే పనిలోపడ్డారు. జగన్ కేసు సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో నలుగుతోంది. తమపై ఎలాంటి ఒత్తిళ్లూ పనిచేయడం లేదని, పూర్తిగా పారదర్శకంగా విచారణ జరుపుతున్నామనీ సిబిఐ డైరెక్టర్ ఎ.పి.సింగ్ తెలిపారు.    టిడిపినేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చంచల్ గూడ జైలుకెళ్లి జగన్ ని కలిసి మాట్లాడారు. ఉమ్మారెడ్డి టిడిపిని విడిచిపెట్టి జగన్ పార్టీలోకి జంప్ చేస్తారన్న ప్రచారం ఎప్పట్నుంచో జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ నేత వడ్డెపల్లి నర్సింగరావ్ కూడా జగన్ ని కలిశారు. ఎమర్జెన్సీ అలారం మోగడంతో అధికారులు సోమవారం ములాఖత్ లను నిలిపేశారు. 

తెలంగాణలో జగన్ బలమెంత?

    ఇప్పటికిప్పుడు ఎన్నికలొచ్చినా, ఎప్పటికొచ్చినా అన్ని విధాలా లాభం మా పార్టీకే తప్ప మరోపార్టీకి ఏమీ కలిసిరాదంటూ జగన్ పార్టీ వర్గాలు తెగ డబ్బా కొట్టుకుంటున్నాయ్. ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఆఖరికి తెలంగాణలోకూడా అరవై సీట్లు రావడం ఖాయమని కొండా సురేఖ అనడం దీనికి సరైన ఉదాహరణ.   షర్మిల పాదయాత్రలో పాల్గొన్న సురేఖ చేసిన వ్యాఖ్యలు కాస్తంత గట్టిగానే జనం గుండెల్లోకి నాటుకుపోవచ్చన్న భయం ప్రత్యర్దుల్లో కనపడుతూనే ఉందికూడా.. పనిలోపనిగా చంద్రబాబు పాదయాత్రమీద విరుచుకుపడ్డ సురేఖ,, వీలైనంతగా బాబు యాత్రని ఏకే ప్రయత్నం కూడా చేశారు. నిజానికి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు తెలంగాణ లో అరవై సీట్లు వస్తే రాష్ట్రంలో ఆ పార్టీకి అదికారం వచ్చినట్లే లెక్క. రెండువేల తొమ్మిదిలో కాంగ్రెస్ కు తెలంగాణలో ఏబై సీట్లు వస్తే తెలుగుదేశం పార్టీకి ముప్పై తొమ్మిది స్థానాలు దక్కాయి. టీఆర్ ఎస్ ఖాతాలో పడ్డవి మాత్రం కేవలం పది స్థానాలే.. రెండువేల నాలుగులో కాంగ్రెస్ టిఆర్ఎస్ లకు కలిపి సుమారు ఎనబై వరకు వచ్చాయి. అందులో టిఆర్ఎస్ కే ఇరవై ఆరొచ్చాయి. టిడిపికి అప్పట్లో కేవలం పదకొండు స్థానాలు మాత్రమే దక్కాయ్. 1999 లో కాంగ్రెస్,తెలుగుదేశం లు పోటాపోటీగా సీట్లు సంపాదించుకున్నట్టే లెక్క. అప్పట్లో.. కోస్తా, రాయలసీమలలో టిడిపి అత్యదికంగా సీట్లు సంపాదించుకుని అదికారంలోకొచ్చింది. 1994లో కాంగ్రెస్ కు తెలంగాణలో కేవలం ఆరు సీట్లు మాత్రమే వచ్చాయి. హైదరాబాద్ లో నాలుగు, నిజామాబాద్ జిల్లాలో ఒకటి, వరంగల్ జిల్లాలో మరొకటి. ఇండిపెండెంట్లు, మజ్లిస్ పార్టీకి చెందిన అరడజను మంది  అభ్యర్ధులు మినహా టిడిపి, వామపక్షాలు క్లీన్ స్వీప్ చేశాయి. తెలంగాణలో టిడిపికి 1983లో నలభైమూడు స్థానాలు మాత్రమే రాగా, 1985 లో మాత్రం ఏబై కి పైగా వచ్చాయి. 1989లో టిడిపికి కూడా గణనీయంగానే తెలంగాణ లో సీట్లు వచ్చినా, మెజార్టీ స్థానాలు మాత్రం కాంగ్రెస్ పరమయ్యాయి.  ఈ లెక్కల్నిబట్ట చూస్తే తెలంగాణలో యాభై సీట్లు తెచ్చుకుంటే మిగతా రెండు ప్రాంతాల్లో కచ్చితంగా వంద సీట్లొచ్చినట్టే లెక్క. కొండా సురేఖ చెప్పిన జోస్యం నిజమైతే.. వైకాపా పూర్తి మెజారిటీతో అధికార పీఠమెక్కినట్టే లెక్క.. సురేఖ చెబుతున్నవి కాకి లెక్కలో లేక, నిజమైన లెక్కలో తెలుసుకునే రోజు దగ్గర్లోనే ఉందని అటు అధికార పక్ష నేతలూ, ఇటు ప్రతిపక్షనేతలూ విమర్శిస్తున్నారు. జగన్ పార్టీ నేతలు పెద్దఎత్తున అంచనాలు పెంచుకుంటూ తమని తాము ఎక్కువగా ఊహించుకోవడం పరిపాటైపోయిందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జనం విలక్షణమైన తీర్పు చెబుతారన్న ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.  

కసబ్ ఉరిశిక్ష పై ఎవరేమన్నారు..?

    కసబ్ ఉరిశిక్ష అమలుపై హిందూ, ముస్లిం, సిక్ అని తేడా లేకుండా అన్ని వర్గాల వారు ఆనందోత్సాహాలు ప్రదర్శిస్తున్నారు. ముంబై నగరంలో ఉండే డబ్బా వాలాలు కసబ్ ఫోటోలను దహనం చేశారు. కసబ్ ఉరిని కాంగ్రెసు, బిజెపి సహా అన్ని పార్టీలు స్వాగతించాయి. బహిరంగ ఉరి తీస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడ్డారు. ఆలస్యమైనా సరైన శిక్ష విధించారని ఇంకొంతమంది అభిప్రాయపడ్డారు. కసబ్ ఉరిపై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది ఉగ్రవాది కసబ్ ఉరితీతపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమైందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ పేర్కొన్నారు. న్యాయస్థానం నిర్ణయం మేరకే కసబ్‌కు ఉరిశిక్ష అమలు చేశామని, చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే అని సల్మాన్ ఖుర్షీద్ తెలిపారు. కసబ్ ఉరితీతను స్వాగతిస్తున్నాం టెర్రరిస్టు అజ్మల్ కసబ్ ఉరితీత ఆలస్యమైనా స్వాగతిస్తున్నామని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. పార్లమెంటు పై దాడి చేసిన అఫ్జల్‌గురును కూడా ఉరితీయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటన ఉగ్రవాదులకు ఓ హెచ్చరిక కసబ్ ఉరిశిక్షను స్వాగిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. రక్తపాతం సృష్టించిన కసబ్ కు ఉరిశిక్ష అమలు అందరూ ఆహ్వానించాలన్నారు. విదేశీ ఉగ్రవాదం కారణంగా అనేక మంది ప్రాణాలు విడిచారని, ఉగ్రవాదం పై ప్రభుత్వం ఉక్కు పడికిలి బిగించాలని కిషన్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదులకు కసబ్ ఉరితీత ఓ హెచ్చరిక అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు పార్లమెంటుపై దాడి చేసి అఫ్జల్‌గురుకు కూడా ఉరిశిక్ష అమలు చేయాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కసబ్ ఉరి.. భారతదేశ చట్టం శక్తిని తెలుపుతుంది... చట్టం ప్రకారం అజ్మల్ కసబ్ ఉరిశిక్ష అమలయిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్ వ్యాఖ్యానించారు. ఎరవాడ జైలులో కసబ్ ను ఉరితీసి అతడి మృతదేహాన్ని పూడ్చిపెట్టడం జరిగిందన్నారు.   అప్జల్ గురు సంగతేంటి..? అతడిని ఎప్పుడు ఉరి తీస్తారు..?   గుజరాజ్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కసబ్ ఉరిశిక్ష అమలు విషయంపై ట్విట్టర్లో స్పందిస్తూ... కసబ్ ఉరి సరే... మరి అప్జల్‌గురు సంగతేంటని ప్రశ్నించారు. పార్లమెంటుపై దాడి చేయడమే కాకుండా పలువురు మరణానికి కారకుడయిన అప్జల్‌గురును వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేశారు.

సత్యభామగా బతికిన సత్యనారాయణ

      భామనే.. సత్యభామనే.. భామనే పది ఆరు వేల గోపికాలందరీలోన.. భామనే.. సత్య భామనే.. వయ్యారి ముద్దుల భామనే.. సత్య భామనే.. అంటూ వేదాంతం సత్య నారాయణ వేదికమీద వయ్యారాలు ఒలకబోస్తుంటే చూడ్డానికొచ్చిన మగాళ్లంతా మనసుపారేసుకునేవాళ్లంటే నమ్మితీరాల్సిందే.   ఆ హొయలు, ఆ నడక, ఆ దర్పం.. సత్యభామ అచ్చం ఇలాగే ఉండేదా.. అని కళ్లకు కట్టినట్టు చూపించే ఆంగికం, వాచికం, నాట్యాభినయనం తీరు వేదాంతం సత్యనారాయణ శర్మకి ప్రపంచవ్యాప్తంగా ఎనలేని ఖ్యాతిని ఆర్జించిపెట్టాయి. సిద్ధేంద్రయోగి విరచితమైన కూచిపూడి నాట్యశాస్త్రంపై ప్రాణప్రదమైన మక్కువని చూపించిన వేదాంతం.. తన జీవనపర్యంతం ఆసాంతం ఆ కళకే అంకితమయ్యారు..   తుది శ్వాసవరకూ ఆయన కూచిపూడి నాట్యంకోసమే బతికారు. ముదిమి మీదపడి ఇక న్యాయం చేయలేను అనుకున్నప్పుడు ప్రదర్సనల్ని నిలిపేసి ముందుతరాలకు మెళకువల్ని అందించే ఆచార్యపదవికే పరిమితమయ్యారు తప్ప కీర్తికోసం పాకులాడలేదు.   అసలు చీర కట్టడం ఎలాగో వేదాంత సత్యనారాయణ శర్మదగ్గర నేర్చుకోవాలన్నంత ముచ్చటగా ఆయన కట్టూ బొట్టూ తీరు ఉండేదని, చూడగానే ఆడవాళ్లుకూడా అభిమానులుగా మారిపోయేవాళ్లని అంతా చెప్పుకునేవాళ్లు. చీర కుచ్చిళ్లని కాస్త పైకి లాగి పట్టుకుని కాలి మువ్వల్ని ఘల్లుఘల్లున మోగిస్తూ వయ్యారంగా నడుస్తుంటే మగమహారాజులు పడిచచ్చేవాళ్లంటే నమ్మితీరాల్సిందే.   సత్యభామ వేషం వేదాంతానికి అంతటి పేరుని తీసుకొచ్చిపెట్టింది. మగాళ్లు ఆడాళ్లనుంచి ఏ కోరుకుంటారో తెలుసుకనకే తను ఆ హొయల్ని ఒలకించి నాట్యాన్ని రక్తికట్టించేవాడినని ఆయన అనేక సందర్భాల్లో చెప్పారుకూడా.   విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చిన సందర్భాల్లో ఉషాకన్య రూపంలో వేదికమీద కనిపించిన వేదాంతం నిజంగా అమ్మాయే అనుకుని చాలామంది విదేశీయులు మేకప్ రూమ్ ముందు ఆయన అనుగ్రహం కోసం పడిగాపులుపడ్డ రోజుల్ని ఆయన ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉండేవారు.   సత్యనారాయణ శర్మ చిన్ననాటనే జావళీలు, రామదాసు, త్యాగరాజు కీర్తనలు, క్షేత్రయ్య పదాలు, నారాయణ తీర్థుల తరంగాలు, ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలను ఔపోసన పట్టారు. యక్షగానాల్లో చెలికత్తెగా అభినయించారు. వేదాంతం తన పెద్దన్న ప్రహ్లాదశర్మ, పినతండ్రి వేదాంతం లక్ష్మీనారాయణ శాస్ర్తీ, భరత కళాప్రపూర్ణ చింతా కృష్ణమూర్తి వద్ద కూచిపూడి నాట్యంలో శిక్షణ పొందారు.   కూచిపూడి నాట్యాన్ని రక్తికట్టించేందుకు వేదాంతం.. మచిలీపట్నానికి చెందిన వారణాసి బ్రహ్మయ్య వద్ద వయోలిన్ విద్యను, సంగీత కళానిధి ఏలేశ్వరపు సీతారామాంజనేయులు వద్ద సంగీతంలో శిక్షణ పొందారు. చిన్ననాటనే ప్రహ్లాదునిగా, లోహితాస్యునిగా, శ్రీరాముడిగా, ధర్మాంగజుడిగా, బాల నర్తకుడిగా వేషాలు వేసి అందరినీ  అలరింపచేశారు.   పార్వతీదేవిగా నటనను ప్రారంభించిన వేదాంతం ఉషాపరిణయంలో పార్వతి, ఉషాకన్య, భామాకలాపంలో సత్యభామ, మోహిని రుక్మాంగదలో మోహినిగా, క్షీరసాగరమథనంలో విశ్వమోహినిగా, విప్రనారాయణలో దేవదేవిగా వేలాది ప్రదర్శనలిచ్చారు. లవకుశ సినిమాలో బి సరోజాదేవితో కలిసి నటించారు.   కూచిపూడి నాట్యాన్ని భావితరాల వారికి అందించేందుకు నర్తనశాలను రూపొందించి పలువురికి శిక్షణ ఇచ్చారు. కూచిపూడి నాట్యక్షేత్రం స్థాపనకు దివంగత చింతా కృష్ణమూర్తి, బందా కనకలింగేశ్వరరావు, పద్మభూషణ్ వెంపటి చినసత్యంతో కలిసి కృషిచేసి ప్రధానాచార్యులుగా కొనసాగారు.   సత్యనారాయణశర్మ చిన్న వయస్సులోనే కేంద్ర సంగీత నాటక అవార్డును, పద్మశ్రీ అవార్డును అందుకుని పలువురు నాట్యాచార్యులకు ఆదర్శంగా నిలిచారు. కూచిపూడి నాట్యంలోని యక్ష నృత్యాంశాలలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నారు. ఎప్పటికప్పుడు కొత్త రీతుల్ని పరిచయం చేస్తూ తనదైన శైలిలో కూచిపూడి నాట్యకళకి విస్తృత ప్రాచుర్యం కల్పించారు.   కూచిపూడి నాట్య ప్రదర్శనల ద్వారా వేదాంతం సత్యనారాయణ శర్మ మన తొలి రాష్టప్రతి బాబూరాజేంద్రప్రసాద్ నుండి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును, రాష్టప్రతులు వివి గిరి నుండి పద్మశ్రీ, నీలం సంజీవరెడ్డి, డా. శంకర్‌దయాళ్ శర్మ, డా. జకీర్ హెస్సేన్, డా. ఆర్‌కె నారాయణన్‌ల ద్వారా ప్రశంసలు, అభినందనలు పొందారు. తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ప్రధాన మంత్రులుగా ఇందిరాగాంధీ, పివి నరసింహారావు ఈయన నృత్య ప్రదర్శనను తిలకించి అభినందించారు.   ఉషాకన్యగా పేరుగాంచిన వేదాంతం సత్యనారాయణ శర్మ 1934 సెప్టెంబరు 9న కూచిపూడిలో వేదాంతం వెంకటరత్నం, సుబ్బమ్మలకు మూడో సంతానంగా జన్మించారు. వేదాంతం ప్రహ్లాదశర్మ, వీరరాఘవయ్య ఈయన సోదరులు.   సత్యనారాయణ శర్మకు 18వ ఏట 1952లో పసుమర్తి కొండలరాయుడు కనిష్ట పుత్రిక లక్ష్మీనరసమ్మతో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వేదాంతం సత్యనారాయణ శర్మ ఇక లేరన్న నిజాన్ని కూచిపూడి గ్రామం జీర్ణించుకోలేకపోతోంది.  

ఈ చట్టాలు మాకొద్దు..!

      ఐర్లాండ్ లో గర్భస్రావం చేయడం చట్టపరంగా నేరం. ఈ చట్టం మూలంగా ఓ భారతీయ మహిళ అన్యాయంగా ప్రాణాలు కోల్పోయింది. బెంగళూరుకు చెందిన 31 సంవత్సరాల సవితా హలప్పనావర్ కి 17వారాల గర్భం తర్వాత అనుకోకుండా ఇబ్బంది మొదలైంది. స్వతహాగా తనుకూడా ఓ డాక్టరే.. కాకపోతే ఆమె డెంటిస్ట్..   చనిపోవడానికి కొద్ది సేపటికి ముందు నేరుగా గాల్వే యూనివర్సిటీ ఆసుపత్రికెళ్లిన సవిత తన పరిస్థితిని వివరించి, కడుపులో నొప్పి భరించలేకపోతున్నాను వెంటనే అబార్షన్ చేయమని అడిగింది. సవిత ఎంత మొత్తుకున్నా అక్కడ డాక్టర్లు ఆమెకి అబార్షన్ చేయడానికి అంగీకరించలేదు.   ఐరిష్ చట్టాలప్రకారం అబార్షన్ చేయడం నేరమంటూ డాక్టర్లు కనికరం లేకుండా ప్రవర్తించారు. పరిస్థితి చేయిదాటిపోయింది. సవిత ప్రాణాలు పోగొట్టుకుంది. కళ్లముందే ఆమె చనిపోతున్నా భర్త, బంధువులు ఏమీ చేయలేని దయనీయమైన పరిస్థితి.   క్యాథలిక్ దేశంలో అబార్షన్లు చేయడం సరికాదన్న గుడ్డి నమ్మకంతో అక్కడి ప్రభుత్వం గర్భస్రావాల్ని నిషేధిస్తూ చట్టం చేసింది. ఇప్పుడు సవిత మరణంతో నైనా అక్కడి ప్రభుత్వం కళ్లు తెరవాలని, తల్లి ప్రాణాల్ని నిలబెట్టేందుకు అబార్షన్ చేయడం తప్పుకాదన్న విషయాన్ని తెలుసుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.   సవిత ప్రాణాల్ని బలిగొన్న చట్టాల్ని నిరసిస్తూ ఐర్లండ్ ప్రజలు పెద్ద ఎత్తున పార్లమెంట్ ముందు ర్యాలీ నిర్వహించారు.  సవిత మృతికి నిరసనగా లండన్‌లోని ఐర్లాండ్ రాయబార కార్యాలయం ముందు ప్రజలు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో సవిత మృతి పట్ల విచారణ జరిపాలని ఐర్లాండ్ ఆరోగ్య శాఖా మంత్రి జేమ్స్ అధికారులకు ఆదేశించారు. దీనిపై ఐర్లాండ్ ప్రధాని మాట్లాడుతూ.. సవిత మరణం పట్ల నివేదిక అందిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  

చిరంజీవి కొత్త సినిమా

  చిరంజీవికి ఈ మధ్య కాలం బాగా కలిసొస్తోంది. 2014 మెగా నామ సంవత్సరంలా కనిపిస్తోంది. ప్రజారాజ్యం పూర్తిగా మునిగిపోయే స్థితిలో, అయినవాళ్లు, దగ్గరివాళ్లు అనుకున్నవాళ్లంతా హ్యాండిచ్చి ఓటి పడవ మునకేస్తుందనుకున్న స్థితిలో చిరు తెలివిగా కాంగ్రెస్ లోకి జంప్ చేశారు. తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి సోనియా గ్యాంగ్ తో డీల్ కుదుర్చుకున్నారు.   అప్పట్లో చిరంజీవి తిరిగి సరిదిద్దుకోలేనంత ఘోర తప్పిదం చేశాడని ఊరూవాడా కోడై కూసింది. తన మానాన తనని ఉండనీయకుండా రాజకీయంగా మటాష్ అయిపోయాడంటూ అంతా కాకుల్లా పొడుచుకు తిన్నారు. పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాదనే సామెతని రుజువుచేస్తూ చిరంజీవి ఓపిగ్గా ఎదురుచూసి ఇప్పుడు సోనియా కోటలో పాగా వేశారు.   ప్రజారాజ్యం పార్టీని ముంచేసి కాంగ్రెస్ మహాసాగరంలో కేంద్రమంత్రిగా తేలిన చిరంజీవి భుజస్కంథాలమీద పార్టీ భారం అంతకంతకూ మోపవుతోందని గల్లీ లీడర్లనుంచి ఢిల్లీ పెద్దలదాకా అంతా నమ్ముతున్నారు. ఇప్పటికే ఆనం సోదరులు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కాబోయే ముఖ్యమంత్రి అంటూ చిరంజీవికి బాజా కొట్టడం మొదలుపెట్టారు.     రాజకీయాల్లో పీకల్లోతు మునిగిపోయారు కాబట్టి చిరంజీవి ఇక సినిమాల జోలికెళ్లరంటూ ఏపీలో ఇండస్ట్రీ వర్గాలుకూడా గట్టిగానే మాట్లాడుకున్నాయ్. పరుచూరి బ్రదర్స్ రాసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా త్వరలోనే తెరకెక్కబోతోందన్న వార్తల్లో పసలేదని తేలిపోయింది. చిరు 150వ చిత్రాన్ని తనే డైరెక్ట్ చేస్తానంటూ పూరీ జగన్నాధ్ ఇచ్చిన ఆఫర్ నచ్చలేదో మరేదైనా కారణమో తెలీదు కానీ..  ఆ ప్రసక్తే కనుమరుగైపోయింది.   కష్టాలన్నీ తీరిపోయి హాయిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు చిరంజీవికి సినిమాలగురించి ఆలోచించే ఓపికా తీరికా దొరికాయన్నది అభిమానుల కొత్త ఆలోచన. చిరు సినిమా ఛరిష్మా పార్టీకికూడా బాగా ఉపయోగపడుతుందన్న భావనతోఉన్న కాంగ్రెస్ వర్గాలుకూడా 2014 ఎన్నికలకల్లా చిరంజీవితో కొత్త సినిమా చేయిస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. రమేష్ చంద్ర మహర్షి రాసిన అధినేత నవల ఆధారంగా కొత్త సినిమా స్క్రిప్ట్ కూడా రెడీ అయ్యిందన్న వార్తలు వినిపిస్తున్నాయ్.   చిరంజీవి 150వ చిత్రాన్ని అటు రాజకీయ పరంగానూ, ఇటు దూరమైన ఓ వర్గం అభిమానుల్ని తిరిగి ఆకట్టుకోవడానిగ్గానూ ఉపయోగించుకుంటే బాగుంటుందని మెగాస్టార్ కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. తన లేటెస్ట్ సినిమాలో జనంలోకి చొచ్చుకుపోయే పొలిటికల్ క్యారెక్టర్ ని చేయడం ద్వారా చాలా తేలిగ్గా 2014 ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించుకోవచ్చని చిరు భావిస్తున్నారని ప్రచారం కూడా సాగుతోంది. అప్పటికి కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్ధి చిరంజీవే అన్న ప్రచారం గల్లీ నుంచి ఢిల్లీ దాకా బలంగా జరుగుతోంది.  

పోస్ట్ డేటెడ్ రాజీనామా పత్రం

  ఏ ముహూర్తాన కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారోగానీ.. అన్నీ ఆయనకు ఎదురొస్తున్నాయ్. తన తప్పేలేకుండా ఎంత జాగ్రత్తగా మ్యానేజ్ చేయాలనుకున్నా చాలా విషయాలు, సంగతులు అస్సలు కంట్రోల్లోకి రావడం లేదు.   ప్రతిపక్షాలమాట ఎలా ఉన్నా అధికారపక్షంలోనే ఉన్న విపక్షాలనుంచి ఎదురౌతున్న ఒత్తిడి, తెలంగాణ అంశం కిరణ్ కి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయ్. ఇప్పుడు చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయం ఎపిసోడ్ కారణంగా ఎంఐఎం ఏకంగా మద్దతుని ఉపసంహరించింది.   కిరణ్ కుమార్ రెడ్డిమీద రోజుకో ఫిర్యాదు, పూటకో కంప్లైంట్ చందంగా కాంగ్రెస్ అధిష్ఠానానికి నిమిష నిమిషానికీ చాడీలు చేరిపోతున్నాయ్. ఇప్పుడు ఎంఐఎం మద్దతు ఉపసంహరణ వ్యవహారంలో సోనియా కిరణ్ పై మండిపడుతున్నట్టు సమాచారం.   కిరణ్ కుమార్ ని కుర్చీలో కూర్చేబెట్టేరోజే ఎప్పుడు అడిగితే అప్పుడు రాజీనామా చేయాలన్న షరతునుకూడా అధిష్ఠానం విధించిందని వినికిడి. ఆ మేరకు కిందటిసారి సీఎం ఢిల్లీకెళ్లొచ్చినప్పుడు తారీఖు వేయకుండా తన రాజీనామాపత్రాన్ని సమర్పించొచ్చారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.   ఇప్పుడు ఎంఐఎం మద్దతు ఉపసంహరణ ఎపిసోడ్ పుణ్యమా అని కిరణ్ కుమార్ సమర్పించిన రాజీనామా పత్రంపై తారీఖుని వేసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ అధిష్ఠానానికొచ్చేసిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఎప్పట్నుంచో ప్రచారంలోఉన్న సీఎం మార్పిడి కథనం ఇప్పుడు మళ్లీ తెరమీదికొచ్చింది.   నేడోరేపో కిరణ్ కుమార్ రెడ్డిని కుర్చీనుంచి దింపేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కోసం జరుగుతున్న పోటీలో మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కుమారుడు శశిధర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీలో ఉన్నట్టు ఢిల్లీవర్గాల సమాచారం.

నిత్యానంద ఆన్ లైన్ లీలలు

    నిత్యానంద ఎక్కుడున్నాడో తెలీదు. ఎలా ఉన్నాడో తెలీదు.. పోలీసులు కాషాయం కట్టుకున్న ఆ కొంటె కృష్ణుణ్ణి పట్టుకోవడానికి నానా తిప్పలూ పడుతున్నారు. కానీ.. నిత్యానంద ఆచూకీ మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. అజ్ఞాతంలో ఉన్న స్వామివారు మళ్లీ ప్రపంచానికి ప్రకటితమయ్యేవరకూ దందా ఎందుకు బంద్ చేసుకోవాలనుకున్నారో ఏమో.. భక్తుల్ని ఆన్ లైన్ లోనే కరుణిస్తూ వరాల్ని కురిపిస్తున్నారు.   హైదరాబాద్ శివారులో ఉన్న నిత్యానంద ఆశ్రమంలో ఓ ప్రముఖ టీవీ ఛానెల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్ లో ఈ విచిత్రం బైటపడింది. వరసగా లైన్లో వెళ్లి వెయ్యి రూపాయల ఫీజు సమర్పించుకుని టీవీ ఎదురుగా కూర్చుంటే నిత్యానంద దర్శనం దొరుకుతుంది. ముందుగా ఎంపిక చేసుకున్న సమస్యని అడిగితే ఆయనకు తోచిన సమాధానం చెబుతారు. అంతే అక్కడితో వంతు పూర్తై మరొకరికి ఛాన్స్ వస్తుంది.   మామూలుగా నిత్యానంద దర్శనం ఇంటర్ నెట్ లోకూడా దొరుకుతోంది.. కానీ.. ఆ దర్శనంలో కేవలం నిత్యానందని భక్తులు చూసే వీలుమాత్రం ఉంది. అదే ఆశ్రమానికి వెళ్లి ఆన్ లైన్ దర్శనం పొందితే ఆయనతో మాట్లాడే వీలుకూడా ఉంటుంది. పైగా సమస్యని నేరుగా విన్నవించుకునే అవకాశం కూడా..   ఈ విషయంగురించి తెలుసుకున్నవాళ్లు అంతా బాగానే ఉంది గానీ.. స్వామివారి పక్కన రంజిత స్వామిని కూడా ఉంటే అదీ.. ఇద్దరూ రాసలీలలు చూపిస్తే వెయ్యేంటి పదివేలైనా పెట్టడానికి రెడీ అంటున్నారట.

పెడద్రోవ పడుతున్న టెక్నికల్ నాలెడ్జ్

    వైద్యవిద్య ప్రవేశ పరీక్షల్లో మరోసారి హైటెక్ కాపీయింగ్ బట్టబయలైంది. వైద్యవిద్య సంస్థల్లో చండీగఢ్ పీజీఐఎంఈఆర్ కూ దేశంలో ప్రత్యేక స్థానం ఉంది. దేశ వ్యాప్తంగా ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారు ఇందులో సీటు కోసం పోటీ పడతారు. పీజీఐలోని వివిధ విభాగాల్లో పేజీ వైద్యకోర్సుల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో అత్యాధునిక పరికరాలతో కాపీయింగ్ కూ పాల్పడుతూ చండీగఢ్ లో పలు రాష్ట్రాలకు చెందిన ఏడుగురు వైద్య విద్యార్ధినులు పట్టుబడ్డారు. వీరిలో తెలుగువారు కూడా ఉన్నారు. పలువురు ప్రముఖుల పిల్లలు కూడా ఇందులో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. పీజీఐఎంఈఆర్ లో ఎండీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో కాపీ జరుగుతున్నట్లు తమకు సమాచారం అందిందని సీబీఐ డిఐజీ మహేష్ అగర్వాల్ తెలిపారు. ఇక్కడి నాలుగు పరీక్షా కేంద్రాల్లో బ్లూటూత్ సహా అత్యాధునిక పరికరాలతో కాపీయింగ్ కు పాల్పడుతున్న ఏడుగురు విద్యార్ధినులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఓ విద్యార్ధిని చెవిలో సూక్ష్మ పరికరాన్ని అమర్చుకొందని, ఆమెకు శస్త్రచికిత్స చేసి దానిని బయటకు తీయాల్సి ఉందని వివరించారు. ఇందుకు పీజీఐఎంఈఆర్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. నిందుతులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.ఈ కుంభకోణానికి సంబందించి హైదరాబాద్, పాట్నా నగరాలలో పలువురును అరెస్ట్ చేసినట్లు తెలిపారు.      యువత ఇలాంటి పెడ దోరణలకు అలవాటు పడకుండా వాళ్ళని మంచి మార్గంలో మళ్ళించేందుకు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు తెలుగువన్.కాం "ఓక మంచి మాట" పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నడుపుతోంది. కౌన్సుల్లింగ్ సైకాలజిస్ట్ డాక్టర్ వంగావరపు రవికుమార్ ఆధ్వర్యంలో "టోరి"లో యువతకు సలహాలు సూచనలు ఇస్తూ మార్గ నిర్దేశం చేసే కార్య క్రమాన్ని ప్రసారం చేస్తోంది. దేశ విదేశాల నుంచి ఈ కార్యక్రమాన్నికి ఆదరణ లబిస్తుంది.                                                                    

    సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ మరోసారి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుని ఉన్నపళంగా అమలుచేస్తే అది అందమైన ధనిక మహిళలకు ఉపయోగపడుతుంది తప్ప అందంగా లేని గ్రామీణ మహిళలకు ఉపయోగం లేదంటూ అడ్డంగా మాట్లాడి ఇరుక్కున్నారు.   ములాయం చేసిన వ్యాఖ్యలపై మహిళాలోకం గళమెత్తింది. తీవ్రస్థాయిలో నిరసన తెలుపుతోంది. యూపీలోని బారాబంకీ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ములాయం ఉద్దేశం ఏదైనా నేరుగా ఆయన గ్రామీణ మహిళల్ని అనాకారులన్నట్టేనంటూ మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఆడాళ్లంటే అంత చులకనా అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.     గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు ములాయం ఇలాగే అడ్డంగా మాట్లాడి మహిళాలోకం నుంచి తీవ్రస్థాయిలో నిరసనలు ఎదుర్కున్నారు. బిల్లుని ఉన్నది ఉన్నట్టుగా ఆమోదిస్తే పార్లమెంట్ లో యూత్ ఈల వేస్తారంటూ అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయ్. ఇప్పుడు మళ్లీ చాలా రోజుల తర్వాత ములాయం మరోసారి అలాంటి మాటలే మాట్లాడి మహిళాలోకం ఆగ్రహాన్ని చవిచూస్తున్నారు.

కేజ్రీవాల్ తర్వాతి టార్గెట్ ఎవరు?

    సామాజిక కార్యకర్తగా పోరాటం మొదలుపెట్టి సొంత పార్టీ పెట్టి ఎగ్జిస్టింగ్ పొలిటీషియన్స్ ని పాతా కొత్తా తేడా లేకుండా ఏకి పారేస్తున్న కేజ్రీవాల్ ఇప్పుడు దేశంలోని ప్రథాన పార్టీలు, నేతలకి కొరకరాని కొయ్యగా మారారు. కేజ్రీవాల్ నోరు తెరుస్తున్నాడంటే రాజకీయ నేతలకు వణుకుపుడుతోంది.   సమాచార చట్టం ఆధారంగా పక్కా వివరాలు సేకరించి పెట్టుకున్నాకే, అన్ని ఆధారాలతో కేజ్రీవాల్ ఇతర పార్టీల నేతలమీద విరుచుకుపడుతున్నారు. ఆటుమొన్న సల్మాన్ ఖుర్షీద్, మొన్న రాబర్ట్ వాద్రా, నిన్న గడ్కరీ.. మరి ఇవాళ ఎవరి వంతో..?   కేజ్రీవాల్ నోరు తెరిస్తే ఎప్పుడు ఏ పేరు కంపైపోతుందోనని జనం తెగ టెన్షన్ పడి చస్తున్నారు. ఏకడమంటూ మొదలుపెడితే చివరికంటా నిలబడాలనేది కేజ్రీవాల్ స్ట్రేటజీగా కనిపిస్తోంది. అందుకే.. అంబానీ లాంటి కార్పొరేట్ల కబంధ హస్తాల్లో చిక్కుకు పోయారంటూ ప్రథాని మన్మోహన్ మీదకూడా కేజ్రీవాల్ ఆరోపణలు గుప్పించారు.     కేజ్రీవాల్ దగ్గర ఆరోపణలకు సంబంధించిన పూర్తి ఆధారాలున్నాయనీ, అందుకే ఆయన అంత గట్టిగా మాట్లాడగలుగుతున్నారనీ ఆర్మీ మాజీ చీఫ్ వి.కె.సింగ్ కూడా ప్రకటించాక జనంలో పిచ్చగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. కేజ్రీవాల్ చేస్తున్న ఆరోపణలపై నిష్ఫాక్షికంగా విచారణ జరిపిస్తే నిజాలు నిగ్గుతేలతాయని సింగ్ అంటున్నారు.   కాంగ్రెస్ నేతల్ని ఇన్నాళ్లూ దగాకోరులుగా చిత్రీకరిస్తూ తాము సుద్దపూసలమన్నట్టు ఫోజు పెట్టిన భారతీయ జనతా పార్టీ నేతలుకూడా ఇప్పుడు గడ్కరీపై కేజ్రీచేసిన ఆరోపణలతో తోకలు ముడిచారు. పూర్తి సుగర్స్  సంస్థలో పెట్టిన పెట్టుబడులన్నీ పూర్తిగా బినామీలేనన్న సంగతి దేశం మొత్తానికీ తెలిసిపోవడంతో ఎవరూ ఏమీ మాట్లాడలేని పరిస్థితి.

హైదరాబాద్ లో మేల్ ప్రాస్టిట్యూట్ దందా

  హైదరాబాద్ లో హైటెక్ వ్యభిచారం రాకెట్ మూడు పూలూ ఆరుకాయలుగా సాగుతోంది. డబ్బుపారేసి సుఖాన్ని కొనుక్కునే పురుష పుంగవుల స్థానంలో ఇప్పుడు మహిళలు కూడా పెరిగిపోయారు. అబ్బాయిలకు డబ్బులిచ్చి సుఖాన్ని కోరుకునే ఆడవాళ్ల సంఖ్య బాగా ఎక్కువై పోయింది. కాల్ బాయ్స్ సంస్కృతి రాజధానిలో విపరీతంగా పెరిగిపోతోంది.   గంటకో రేటు, పూటకో రేటు చొప్పున కాల్ బాయ్స్ చార్జ్ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే కాల్ బాయ్స్ గా పనిచేస్తున్నవాళ్లలో ఎక్కువ శాతం మంది బాగా డబ్బున్నవాళ్ల పిల్లలే ఉండడం. సుఖానికి సుఖం, జల్సాలు చేసుకోవడానికి డబ్బుకూడా వస్తాయన్న ఆశతో కుర్రాళ్లు ఈ విష సంస్కృతికి అలవాటుపడుతున్నారు.   విషయం ఎక్కడా బైటికి పొక్కకుండా సీక్రెట్ గా ఉంచుతాడన్న నమ్మకాన్ని కలిగించగలిగిన కాల్ బాయ్స్ కి కాసులపంట పండుతోందని విచారణలో తేలింది. ఇంటర్ నెట్ లో సోషల్ సైట్స్, ఫ్రెండ్ నెట్ వర్క్ ల ఆధారంగా మేల్ ప్రాస్టిట్యూషన్ దందా చాపకింద నీరులా విస్తరిస్తోంది.