భార్యాభర్తల మధ్య సైలెంట్ డైవోర్స్ గురించి  తెలుసా..!

  నేటి కాలంలో విడాకుల కేసులు పెరిగినప్పటికీ, విడాకుల కొత్త పోకడలు కూడా ఉనికిలోకి వచ్చాయి. ఈ కొత్త విడాకుల నిబంధనలలో గ్రే విడాకులు, స్లీవ్ విడాకులు, సిల్వర్ విడాకులు మొదలైనవి ఉన్నాయి. అదే సమయంలో ఈ రోజుల్లో  నిశ్శబ్ద విడాకుల కేసులు కూడా పెరుగుతున్నాయి. సైలెంట్ డైవోర్స్ అంటే నిశ్శబ్ద విడాకులు. ఈ రకమైన విడాకులలో చాలా సార్లు దంపతులకు తమ సంబంధం నిశ్శబ్ద విడాకుల వైపు కదులుతోందని లేదా వారు ఇప్పటికే సైలెంట్ డైవర్స్   తీసుకున్నారని వారి కూడా  తెలియదు. తమ మధ్య సైలెంట్ గా విడాకులు  జరిగాయని ఆ జంట గ్రహించినప్పుడు వారు చట్టబద్ధంగా విడిపోతారు. ఇది విడాకుల చట్టపరమైన ప్రక్రియకు ముందు దశ కావచ్చని ఫ్యామిలీ కౌన్సిలర్లు అంటున్నారు. సైలెంట్ డైవర్స్ అంటే.. సైలెంట్ డైవర్స్  అంటే భార్యాభర్తలు చట్టబద్ధంగా కలిసి ఉండే వైవాహిక పరిస్థితి. అంటే విడాకులు తీసుకోలేదు కానీ భావోద్వేగ, మానసిక,  కమ్యూనికేషన్ స్థాయిలో ఒకరి నుండి ఒకరు పూర్తిగా విడిపోతారు. ఇద్దరూ ఒకే ఇంట్లో  నివసిస్తుంటారు కానీ వారి మధ్య ఎటువంటి భావోద్వేగ సంబంధం లేదా సంభాషణ ఉండదు. వారి మధ్య భౌతిక దూరం కూడా ఉండవచ్చు. ఇది బంధం నిశ్శబ్దంగా అదృశ్యమవడాన్ని సూచిస్తుంది. సైలెంట్ డైవోర్స్ లో ఇద్దరి మధ్య సంబంధం సజీవంగా ఉంటుంది.  కానీ బంధంలో ఆత్మ,  జంట మధ్య పరస్పర అనుబంధం చనిపోతుంది. సైలెంట్ డైవర్స్ సిగ్నల్స్ ఇవే.. భార్యాభర్తల మధ్య బంధం సైలెంట్ డైవోర్స్ వైపు వెళుతోందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి కొన్ని సిగ్నల్స్ కనిపిస్తాయి.  వాటి ద్వారా దీన్ని గుర్తించి జాగ్రత్త వడవచ్చు. సంభాషణ ఉండదు.. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు సాధారణ విషయాలే కాదు.. ఒకరితో ఒకరు ముఖ్యమైన విషయాల గురించి కూడా మాట్లాడుకోరు. వారి మధ్య దాదాపుగా కమ్యూనికేషన్ ఉండదు. రోజువారీ విషయాలు కేవలం లాంఛనాలుగా జరుగుతూ ఉంటాయి. ఎమోషనల్ డిస్టెన్స్.. భార్యాభర్తలు ఒకరి భావాలను ఒకరు పట్టించుకోరు. ఇద్దరి మధ్య ఎమోషన్ డిస్టెన్స్ ఏర్పడుతుంది. ఒకరి సుఖదుఃఖాలను ఒకరు పంచుకోరు.  ఒకరి సమస్యలను లేదా ఆలోచనలను ఒకరు పట్టించుకోరు. శారీరక దూరం.. సైలెంట్ డైవర్స్ దిశగా వేళ్లే భార్యాభర్తల బంధంలో  వారి శారీరక  సంబంధాన్ని కోల్పోతారు. కలిసి కూర్చోవడం, ఒకరి చేతులు ఒకరు పట్టుకోవడం, కౌగిలించుకోవడం,  కలిసి పడుకోవడం వంటివి దూరం అవుతాయి.   గదిని పంచుకోవచ్చు కానీ రూమ్‌మేట్ లాగా ఎవరికి వారు ఉంటారు. సమయం ఇవ్వకపోవడం.. భార్యాభర్తలు ఒకరికొకరు సమయం ఇవ్వనప్పుడు సమయాన్ని కలిసి  గడపాలని అనుకోరు . కలిసి తినాలనే కోరిక, బయటకు వెళ్లాలనే కోరిక లేదా సెలవు దినాల్లో కలిసి సమయం గడపాలనే కోరిక తగ్గినప్పుడు వారు సైలెంట్ డైవోర్స్ వైపు  ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఆసక్తి.. సాధారణంగా భార్యాభర్తలు  ఒకరి జీవితం గురించి ఒకరు తెలుసుకోవాలనుకుంటారు. వారు గొడవ పడినా, తమ భాగస్వామి రోజు ఎలా గడిచిందో, ఏం చేశారో, తమ స్నేహితులు ఎలా ఉన్నారో తెలుసుకోవడంలో   ఆసక్తి కలిగి ఉంటారు. కానీ వారి మధ్య అలాంటి సాధారణ విషయాలు కూడా  అదృశ్యమైనప్పుడు, వారి మధ్య సైలెంట్ డైవర్స్ పరిస్థితి ఏర్పడుతుంది. గొడవలు.. కొన్నిసార్లు వాదనలు లేదా విభేదాలు లేకపోవడం మంచిదని అనిపించవచ్చు. కానీ వాటి మధ్య ఎటువంటి భావోద్వేగ సంబంధం లేదని కూడా ఇది సూచిస్తుంది. వారికి ఒకరి నుండి ఒకరు ఎటువంటి ఆశలు ఉండవు. కాబట్టి వారు ఒకరితో ఒకరు గొడవ పడటానికి కూడా ఇష్టపడరు. సైలెంట్ డైవోర్స్ గురించి కొన్ని నిజాలు.. భార్యాభర్తలు చాలా మంది తమ పిల్లలను పెంచడానికి మాత్రమే కలిసి ఉంటారు. వారు భార్యాభర్తలుగా తమ సంబంధంలో సంతోషంగా లేరు కానీ తమ పిల్లల కోసం చట్టబద్ధంగా విడాకులు తీసుకోకుండా ఉంటారు విడాకులు సమాజంలో అవమానానికి కారణమవుతున్నాయి. సామాజిక కళంకం, కుటుంబ ఒత్తిడి,  విమర్శల భయాన్ని నివారించడానికి, జంటలు విడాకులు తీసుకోరు,  అందుకే ఇద్దరి మధ్య సైలెంట్ వాతావరణం ఏర్పడుతుంది. దీన్నే సైలెంట్ డైవోర్స్ అంటారు. భర్తలు డైవోర్స్ వల్ల ఆర్థికంగా లాస్ అవుతారు. దీని వల్ల విడాకులు ఇవ్వకుండా  ఆర్థిక లక్ష్యాల  కోసం రాజీగా  సైలెంట్ డైవోర్స్ ఎంచుకుంటారు. బంధంలో ప్రేమ, గౌరవం,  అవగాహన కాలక్రమేణా ముగిసినప్పుడు ప్రజలు బాధ్యతల కోసం మాత్రమే కలిసి ఉంటారు.                                         *రూపశ్రీ.  

వివాహం తర్వాత మగవాళ్లు  పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదట..!

వివాహం ఇద్దరు వ్యక్తుల జీవితాలను మార్చే సంఘటన.  ఇది జీవితంలో చాలా ముఖ్యమైన దశ.  వివాహం తరువాత సంతోషకరమైన వైవాహిక జీవితం కావాలి అంటే  మగవాళ్లు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు. ఇంతకీ అవేంటో ఎందుకు చేయకూడదో తెలుసుకుంటే.. వివాహం తర్వాత పురుషులు చేయకూడని పనులు.. వివాహం అయిన మగవాళ్లు ఎక్కడికైనా వెళ్ళేముందు ఆలోచించాలి.  తొందర పడి సొంతంగా ఎక్కడికైనా వెళ్లాలని అనుకోవడం వల్ల అతని జీవితంలో నష్టపోయే అవకాశమే ఎక్కువ ఉంటుంది. ఇతరుల ఉద్దేశాలు ఏంటో అర్థం చేసుకోకుండా ఇతరులతో వెళ్లడం చాలా నష్టాలకు దారి తీస్తుంది. వివాహం అయిన తరువాత మగవాళ్లు బయటి మహిళల పట్ల ఆకర్షితులు అవుతుంటారు. ఇలా ఆకర్షితులు అయ్యే మగవాళ్లకు వారి వైవాహిక జీవితంలో చాలా ప్రమాదాలు ఎదురవుతాయి.  ఇది అవతలి వ్యక్తి మనోభావాలను కూడా దెబ్బతీస్తుంది.  అలాంటి ప్రవర్తన వల్ల మొత్తం కుటుంబం అంతా ప్రభావితమవుతుంది. మనిషికి సంతృప్తి అనేది లభించడం చాలా కష్టం.  ఎప్పుడూ ఇంకా ఇంకా కావాలని అనుకుంటూనే ఉంటాడు. వివాహం అయిన మగవాళ్లు ఉన్న వాటితో తృప్తి చెందలేకపోతే  ఆ వ్యక్తి అశాంతికి లోనవుతాడు. ఈ అసంతృప్తి వైవాహిక జీవితంలో కూడా చాలా నష్టాలు,  సమస్యలకు కారణం అవుతుంది. నిర్ణయాలు అందరూ తీసుకుంటారు. కానీ వివాహం అయిన మగవాళ్లు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచించాల్సి ఉంటుంది.  భవిష్యత్తు గురించి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా నష్టపోతారు. అలాగే నిర్ణయాలు తీసుకునే ముందు భార్యకు తప్పకుండా చెప్పాలి.                                 *రూపశ్రీ.  

అందరూ మిమ్మల్ని ఇష్టపడాలంటే.. ఇలా చేయండి..!

ఇల్లు అయినా,  ఆఫీసు అయినా.. వేరే ఇతర ప్రదేశమైనా.. అందరూ మనల్ని ఇష్టపడాలని,  అందరూ మనకు ఆకర్షితమవ్వాలని,  మనల్ని గౌరవించాలని అనుకోవడంలో తప్పు లేదు. అయితే అన్ని చోట్లా ఈ గౌరవం,  అబిమానం దొరకడం కష్టం. కానీ అసాధ్యం ఏమీ కాదు.  ఈ విషయం గురించి ఆచార్య చాణక్యుడు  చాలా వివరంగా చెప్పాడు.  ఆయన చెప్పిన కొన్ని విధానాలు పాటించడం వల్ల ఆఫీసు అయినా,  ఇల్లు అయినా మరొక ప్రదేశం అయినా అందరూ గౌరవం ఇస్తూ,  ఇష్టపడతారు కూడా. ఇంతకూ చాణక్యుడు చెప్పిన విషయాలేంటో తెలుసుకుంటే.. సమిష్టి కృషి.. ఆచార్య చాణక్యుడి ప్రకారం సమిష్టి కృషితో ముందుకు వెళ్లే వారు అందరి నుండి గౌరవం పొందుతారు. అంతేకాదు అందరూ ఇలాంటి వారిని ఇష్టపడతారు.  తమ పనులు చేసుకుని వెళ్లిపోయే వారి కంటే అందరినీ తమతో కలుపుకుంటూ పనులలో వేగంగా ముందుకు వెళ్ళేవారు ఆపీసులలో మంచి గుర్తింపు,  గౌరవం తెచ్చుకోగలుగుతారు. అంతేకాదు.. అందరికీ ఎంకరేజ్ చేస్తూ ఉండాలి కూడా. పరిష్కారం.. ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యను తొందరగా పరిష్కారం చేసుకోవడం ఇతరులకు సంబంధించిన సమస్యలను అయినా తొందరగా పరిష్కరించడం చాలా మంచి విషయం. కానీ దురదృష్ట పశాత్తు చాలా మంది సమస్యలను తొందరగా పరిష్కరించడంలో చాలా నిర్లక్ష్యంగా లేదా చాలా జాప్యం చేస్తూ ఉంటారు.  కానీ సమస్యలు ఏవేనా,  ఎవరివి అయినా తొందరగా పరిష్కారం చేస్తే అందరూ గౌరవిస్తారు, ఇష్టపడతారు కూడా. గౌరవం.. ఆపీసులో అందరినీ గౌరవించాలి. పెద్దవారు అయినా  చిన్నవారు అయినా గౌరవించాలి. అలా వారికి గౌరవం ఇచ్చినప్పుడు ఎదుటివారు కూడా గౌరవం పొందుతారు. తమ కంటే తక్కువ స్థాయి ఉద్యోగస్థులను కూడా గౌరవించే వారిని అందరూ ఎల్లప్పుడూ గౌరవిస్తారు. అవకాశాలు ఇవ్వడం.. ఇతరులకు అవకాశాలు ఇవ్వడం, అవకాశాలు చూపించడం అనేది ఆపీసులలో ప్రతిభావంతులైన వ్యక్తులు ముందుకు సాగడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది.  ఒకరి ప్రతిభను ప్రోత్సహించినప్పుడు ఆ వ్యక్తి మాత్రమే కాదు.. ఆ వ్యక్తి ప్రతిభను ప్రోత్సహించిన వ్యక్తి కూడా ఇతరుల నుండి గౌరవం పొందరుతారు.  తద్వారా అందరూ ఇష్టపడతారు.                                        *రూపశ్రీ.

ఆపరేషన్ సింధూర్.. ఈ పేరు వెనుక రహస్యం ఇదే..!

మూడు రోజుల కిందట భారత్ సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాల మీద మెరుపు దాడులు చేసింది.  ఈ సైనిక చర్యలో భాగంగా పాకిస్తాన్‌లోని అనేక ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసింది. అర్థరాత్రి జరిగిన ఈ సంఘటన మరుసటి రోజు యావత్ భారతదేశాన్ని ఆకర్షించింది. ఈ వార్త వెలువడిన వెంటనే, దేశవాసుల తడి కళ్ళు భారత సైన్యం పట్ల విశ్వాసం,  గౌరవాన్ని ప్రతిబింబించాయి. ఇది కేవలం ఒక ఆపరేషన్ కాదు భారత దేశ పౌరులపై జరిగిన పిరికి దాడికి తగిన సమాధానం. ఈ  ఆపరేషన్ కు సింధూర్ అనే పేరు పెట్టడం దేశాన్ని,  దేశ ప్రజలను మరింతగా ఆకర్షించింది. ఈ పేరు వెనుక ఉన్న రహస్యం తెలుసుకుంటే.. "సిందూర్" అనేది ఒక చిన్న ఎర్ర చుక్క.  ఇది  భారతీయ హిందూ మత స్త్రీలకు ఎంతో పవిత్రమైనది.   ఇది భారతీయ స్త్రీ గౌరవం, ప్రేమ మరియు శక్తికి చిహ్నం.  స్త్రీల నుదుటిపై ఉన్న సింధూరం పహల్గామ్ భూమిపై రక్తంతో కలిసినప్పుడు, ఈ అవమానాన్ని సహించబోమని దేశం నిర్ణయించుకుంది. ఈ భావన ఫలితంగానే ఆపరేషన్ సింధూర్ ఏర్పడింది. ప్రాముఖ్యత.. భారతీయ సంస్కృతిలో సిందూరం అలంకరణలో ఒక భాగం మాత్రమే కాదు, ఇది లోతైన మతపరమైన,  సాంస్కృతిక అర్థాలతో కూడా ముడిపడి ఉంది. ఇది వివాహిత స్త్రీ గుర్తింపుకు,  తన భర్త దీర్ఘాయుష్షు పొందాలనే  కోరికకు చిహ్నం. స్త్రీ నుదిటిన సింధూరం పెట్టుకుంటారు. దీనిని అజ్ఞ చక్రం లేదా మూడవ కన్ను అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశం ఆత్మ,  చైతన్యానికి కేంద్రంగా పరిగణించబడుతుంది. శక్తి.. సింధూరం  ఎరుపు రంగు లో ఉంటుంది. ఇది శక్తకి చిహ్నం.  ఇది శక్తిని,  పోరాటాన్ని సూచిస్తుంది. ఈ రంగు స్త్రీ  అంతర్గత బలం,  దృఢత్వాన్ని కూడా తెలియజేస్తుంది. దుర్గాదేవి విగ్రహాన్ని పూజించేటప్పుడు అమ్మవారి నుదిటిపై సింధూరం పూయడానికి ఇదే కారణం. శాంతియుతంగా ఉండే భారతదేశం చాలా పవిత్రమైన,  ఎంతో గొప్ప దేశంగా పేర్కొనబడుతుంది. అయితే అదే సమయంలో భారతదేశ పౌరుల మతం,  గౌరవం దెబ్బతింటే ముఖ్యంగా మహిళల గౌరవం,  మహిళల జీవితం,  మతం మీద దాడి జరిగితే ఎలా ఉంటుందో ఆపరేషన్ సింధూర్ వివరిస్తుంది. చిటికెడు సింధూరం ధర తక్కువే కానీ,  భారతీయ మహిళల నుదుటన ఉన్న సింధూరం జోలికి వెళితే ఎలా ఉంటుందో ఎంతటి పర్యవసానాలు ఉంటాయో ఆపరేషన్ సింధూర్ తెలుపుతుంది.                         *రూపశ్రీ.

పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలా ఉండాలి?

పిల్లలకు ఈమధ్య కాలంలో మెదడు చురుగ్గా అవ్వడం కోసం ఫోనెటిక్ నెంబర్స్ గురించి చెబుతున్నారు. అయితే ఈ నంబర్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఇది ప్రాచీన కాలంలో గ్రీకు దేశంలోవారు తమ జ్ఞాపకశక్తితో రాజుల మెప్పు పొందేందుకు అక్కడి  ఆస్థాన పండితులు కనుగొన్నారు. అచ్చుల హల్లుల ఉచ్ఛారణకు ఒక్కొక్క అంకెను కేటాయించి వాటితో పెద్ద పెద్ద అంకెలను పదాలుగా గుర్తుంచుకొని ఆ అంకెలను వెంటనే ఏ క్రమంలో అడిగితే ఆ క్రమంలో చెప్పగలగడం ఈ పద్ధతి యొక్క విశేషం. ఈ విధానాలతో అనేక మంది జ్ఞాపక శక్తి ప్రదర్శనలు ఇస్తూ మానవ మెదడు యొక్క అద్భుత శక్తిని తెలియచేయడం అందరికీ తెలిసినదే. ఈ ప్రదర్శనల వల్ల ఏమిటి లాభం అనే సందేహం కొంతమంది మేధావులకు ఉన్నప్పటికీ తమకు తెలివితేటలు లేవు తాము సరిగా చదవలేమని ఆత్మన్యూనత భావంతో బాధపడే విద్యార్థులలో ఇటువంటి ప్రదర్శనలు మంచి ఆత్మవిశ్వాసం కలిగిస్తాయనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అన్నింటికన్నా జ్ఞాపకశక్తికి అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే ఆ విషయం పట్ల ఒక వ్యక్తికున్న ఆసక్తి మరియు ప్రాధాన్యత. చాలా మంది డబ్బు విషయంలో గాని, ఇష్టమైన వారి పుట్టినరోజు విషయంలో గాని, తమ అభిమాన హీరో సినిమా వివరాల గురించి గాని, అభిమాన క్రికెటెర్ల రికార్డుల గురించి గాని ఏ మాత్రం మరచిపోవడం ఉండదు. ఎందుకంటే వాటికి వారు అధిక ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి. అలాగే చదువు కూడా అత్యంత ప్రాధాన్యతతో కూడిన విషయం అనే అవగాహన మరియు శ్రద్ధ వారికి కల్పిస్తే వాటికి సంబంధించిన విషయాలను వారు మరచిపోయే పరిస్థితి తలెత్తదు.  బాల్యం యొక్క అమాయకత్వం వలన తల్లిదండ్రుల నిర్లక్ష్యం వలన వారు చదువు పట్ల ఆసక్తి కనబరచకపోవచ్చును. పై విషయాలన్నింటినీ చదివాక ఏమి అర్థం అవుతుందంటే... శారీరకంగా, పుట్టుకతో ప్రతీ విద్యార్థికి ఒకే రకమైన మేథస్సు, సామర్ధ్యం ఉంటుందని మానసిక శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా తెలియచేసారు. పైన పేర్కొన్న అంశాలు చదివితే అందరికీ అదే అనిపిస్తుంది. ఈ మెదడు దాని సామర్ధ్యం అందరికీ ఒకేలా ఉన్నప్పుడు మరి అందరి యొక్క పనితీరు, ఫలితాలు మరియు పెరఫార్మెన్స్ ఒకేలా ఎందుకు ఉండటం లేదు. ఈ విషయం గురించి ప్రశ్న వేసుకుంటే… చాలామంది తెల్ల ముఖాలు వేస్తారు.  దీనికి సరైన విధంగా అర్థమయ్యేట్టుగా కంప్యూటర్ పరిభాషలో చెప్పుకుంటే హార్డ్వేర్ అందరికీ ఒకేలా ఉంది కాని సాఫ్ట్వేర్ సరిగా తయారుచేయాల్సిన బాధ్యత అటు తల్లిదండ్రులది మరియు ఇటు ఉపాధ్యాయులదే. అన్నింటికన్నా ఒక విషయం బాగా గుర్తుండాలంటే ఆ విషయం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందని ఆ విద్యార్థి గ్రహించాలి. అందుకే శ్రద్ధ అంటే తెలుసుకోవాలనే ఉత్సుకత, తెలుసుకోడానికి సంసిద్ధత మరియు నేర్పుతున్నవారిపట్ల గౌరవభావం. అందువలనే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. నేర్చుకోవాలనే ఆసక్తిని కలిగించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది మరియు ఆసక్తి కరంగా బోధించాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులదే.. మరి వారి సహజ సామర్థ్యాలు మరుగునపడకుండా వారికి వారు సంపూర్ణంగా ఉపయోగపడే విధంగా తయారుచేయవలసిన గురుతర బాధ్యత అటు తల్లిదండ్రుల చేతిలో ఇటు ఉపాధ్యాయుల చేతిలో ఉంటుందనడం నిర్వివాదాంశం కదా!! ఇదే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి. వాటిని పాటించాలి.                                   ◆నిశ్శబ్ద.

పెళ్లైన మహిళ జీవితాన్ని నాశనం చేసే విషయాలు ఇవే..!

    పెళ్లి ప్రతి మహిళ జీవితంలో చాలా ముఖ్యమైన దశ.  కేవలం మహిళలకే కాదు.. మగవారికి కూడా ఇది ముఖ్యమైన దశే. కానీ పెళ్లి కారణంగా జరిగే అన్యాయం,  నష్టం మగవారితో పోలిస్తే ఆడవారికే ఎక్కువగా ఉంటోంది.  మగవారి కంటే ఆడవారే పెళ్లి తర్వాత జీవితాన్ని నష్టపోతున్న వారు అధికంగా ఉంటున్నారు.  పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరూ సర్దుకుపోమ్మా..అని అమ్మాయిలకే చెబుతూ ఉంటారు. అలాగే.. వివాహ బంధం విఫలమైతే కాపురం నిలబెట్టుకోలేక పోయింది అనే మాట కూడా  అంటారు.  అయితే అసలు వైఫల్యం వరకు ఎందుకు వెళుతుంది.  పెళ్లి తర్వాత మహిళల జీవితాన్ని దెబ్బతీసే అంశాలు ఏంటి? తెలుసుకంటే.. పెళ్లి.. పెళ్లి అనేది ఆడ, మగ ఇద్దరికీ సంబంధించిన విషయం. ఇద్దరు వ్యక్తులు ఒక జంటగా మారిన తరువాత,  భార్యాభర్తలు అయిన తరువాత వారి మద్య ప్రేమ మాత్రమే కాకుండా చాలా విషయాలు ఉంటాయి. భార్యాభర్తల వరకు వస్తే.. వారి బంధం బాగానే ఉంటుంది. పెళ్ళి చేసుకుని కుటుంబాన్ని వదిలి,  భర్త తో అత్తింటికి చేరిన అమ్మాయితో అత్తింటి కుటుంబ సభ్యులు ఆరోగ్యకరమైన రిలేషన్ షిప్ ను మెయింటైన్ చేస్తే అంతా బాగానే ఉంటుంది. కానీ చాలామంది అమ్మాయిల జీవితాల్లో ప్రేమ, గౌరవం రెండూ లోపిస్తాయి.   ప్రేమ, గౌరవం లోపిస్తే.. ప్రతి వ్యక్తికి ప్రేమ, గౌరవం ఉన్నప్పుడే సంతోషంగా ఉండగలుగుతారు. కానీ  అత్తారింట్లో ఒక అమ్మాయికి ప్రేమ, గౌరవం లోపిస్తే ఆ అమ్మాయి సంతోషంగా ఉండలేదు. దీనికి కారణం అత్తామామలు.  ఆ ఇంటి కుటుంబ సభ్యులు. చాలా వరకు అత్తారింట్లో ఆడపిల్లలను వారి అత్తామామలు మొదట్లో బానే మాట్లాడినా ఆ తరువాత కించపరిచి మాట్లాడుతుంటారు. ఇక అమ్మాయిలలో ఏదైనా లోపం ఉంటే మాత్రం  అదే విషయాన్ని ప్రతిసారి ప్రస్తావించి  ఆమెను మానసిక క్షోభకు గురిచేస్తూ ఉంటారు. తోడి కోడళ్లు.. చాలా ఇళ్లలో తోడి కోడళ్ల వల్ల ఖచ్చితంగా ఒక  కోడలు బాధితురాలిగా మారుతుంది.  అత్తగారు, మామగారు, కుటుంబ సభ్యులు కోడళ్ల మధ్య జరిగే చాలా విషయాలను పట్టించుకోరు. జిత్తులమారి స్వభావం ఉన్న కోడళ్లు మంచితనంతో ఉన్నవారిని వేధిస్తూనే ఉంటారు. ఇంటి పని దగ్గర నుండి  చాలా విషయాలలో బాధపెడుతుంటారు.   అత్తగారు.. అత్తగారు ఎప్పటికీ తల్లిలా ఉండదని,  తల్లిలా చూడలేదని చాలామంది అంటూ ఉంటారు. నిజానికి అత్తగారి విషయంలో అమ్మాయిలకు మనసులో ఒక నెగిటివ్ ఫీలింగ్ ఏర్పడటానికి కారణం కూడా అత్తగారి ప్రవర్తనే.  అత్తగారు ఎప్పుడూ కోడలికి వ్యతిరేకంగానే ఉంటారు.  కోడలు మంచిగా మాట్లాడినా సరే గిట్టని అత్తగారు ఉన్నారు.  కోడలు అత్తగారిని మెప్పించాలని,  అత్తగారికి నచ్చే పనులు చేసినా సరే.. కోడలిని విమర్మించేవారు ఎక్కువ. కోడలు ఏం చేసినా ఆమెను సూటిపోటి మాటలతో హింసించే వారు ఎక్కువగా ఉంటున్నారు. అత్తగారి ప్రవర్తన విషయంలో కోడలు తన భర్తతో ఏదైనా చెప్పినా భర్త నుండి ఆమెకు ఎలాంటి  సహకారం, ఓదార్పు ఉండవు. ఇలా ఉన్నప్పుడు కోడలు మానసికంగా దెబ్బతింటుంది.  మనసులోనే ఆమె చాలా బాధలోకి వెళుతుంది. భర్త.. చాలామంది అమ్మాయిలు పెళ్లి తర్వాత భర్త చేసే ద్రోహానికి బలి అవుతూ ఉంటారు. చాలా మంది మగవాళ్లు పెళ్లి అనేది ఇష్టం లేకుండానే అవసరం కోసం చేసుకుంటారు.  ఇంటి పని చేయడానికి ఒక అమ్మాయి అవసరం అయిందనో.. డబ్బులు సంపాదించడానికి సంపాదించే అమ్మాయి అవసరం అయ్యిందనో.. తల్లిదండ్రుల బలవంతం మీదనో.. తల్లిదండ్రుల సంతోషం కోసమో.. ఇలా చాలా కారణాల వల్ల అబ్బాయిలు పెళ్లి చేసుకుంటారు. కొందరైతే ఒకరితో ప్రేమ వ్యవహారం,  వివాహేతర సంబంధం పెట్టుకుని మరొక అమ్మాయిని పెద్దల నిర్ణయంతో పెళ్లి చేసుకుంటారు.  ఇలాంటి మగాళ్ల వల్ల అమ్మాయిలకు జీవితంలో సంతోషం అనేది ఉండదు.  జీవితాంతం వారు అత్తమామల సూటిపోటి మాటలు, భర్త నిర్లక్ష్యం మద్య సంతోషం అనేది లేకుండా బ్రతికేస్తారు.  ఇన్ని కారణాల వల్ల అమ్మాయిల జీవితాలు గందరగోళంలో పడి నాశనమవుతున్నాయి.                                      *రూపశ్రీ.

ఆత్మవిశ్వాసానికి ఎంతటి శక్తి ఉంటుందంటే.. ఈ కథనమే గొప్ప ఉదాహరణ!

ఆత్మవిశ్వాసంతో కొండను పిండి చేయవచ్చుననడానికి   దశరథ్ మంజీ సజీవ సాక్ష్యం. బీహార్ రాజధాని పాట్నాకు దాదాపు వంద కిలోమీటర్ల దూరాన ఒక గ్రామం ఉంది. దాని పేరు గెహ్లోర్. ఆ గ్రామానికీ, ప్రక్క గ్రామానికీ మధ్య ఒక కొండ అడ్డంగా ఉంది. గెహ్లోర్ ప్రజలు నిత్యావసరాలు కొనుక్కోవాలన్నా, అత్యవసర పరిస్థితుల్లో వైద్యసహాయం పొందాలన్నా ఆ కొండ చుట్టూ తిరిగి, అవతలి గ్రామానికి పోవాలి. అలా వెళ్ళడానికి సుమారు 32 కిలోమీటర్ల దూరం ఉంది. కొండను తొలిస్తే కేవలం మూడు కిలోమీటర్ల దూరం.  మూడు కిలోమీటర్ల దూరానికి అనవసరంగా 32 కిలోమీటర్లు కొండ చుట్టూ తిరిగి వెళ్ళాలి. శ్రమ దండుగ, సమయం వ్యర్థం. అయినా ఆ గ్రామ ప్రజలు అలాగే తంటాలు పడుతున్నారు. ఆ గ్రామంలోని దశరథ్ మంజీ అనే రైతు ఒకనాడు కొండ అవతల పొలంలో సేద్యం చేస్తున్నాడు. అతని భార్య ఫాగుణీదేవి భర్తకు అన్నం తీసుకొని, కుండ నెత్తి మీద పెట్టుకొని కొండ మధ్యలోనున్న చిన్న చరియ గుండా పోతుండగా రాళ్ళు గుచ్చుకొని క్రింద పడింది. అన్నం నేలపాలయింది. ఆమె గాయాల పాలైంది. ఆ గాయాలతోనే ఆమె మృత్యువుకు బలైంది. కలత చెందిన దశరథ్ మంజీ కొండను తొలిస్తే తప్ప గ్రామానికి మేలు జరుగదని మనస్సులో నిర్ణయించుకొన్నాడు. ఊరి ప్రజలనందరినీ సమావేశపరిచి "నేను ఈ కొండను తొలుస్తాను. అవతలికి దారి చేస్తాను” అని ప్రకటించాడు. ఆ ప్రకటన విని జనమంతా నవ్వుకున్నారు. "ఒరేయ్! కొండను తొలుస్తాడట మొనగాడు" అని అపహేళన చేశారు. అయినా దశరథ్ మంజీ వారి మాటలను పెడచెవిన పెట్టి, చేతులతో ఉలి, సుత్తి పట్టాడు. గుండెల్లో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపుకొన్నాడు. ఎవరి సాయం కోసం ఎదురుచూడకుండా తలవంచుకొని, మౌనంగా, గంభీరంగా అడుగులు వేస్తూ కొండను సమీపించాడు. వినమ్రంగా నమస్కరించి కొట్టడం మొదలుపెట్టాడు. రోజులు, నెలలూ కాదు, ఇరవై రెండు సంవత్సరాలు కొండను కొట్టాడు. మూడు కిలోమీటర్ల పొడవు ముప్ఫై అడుగుల వెడల్పుతో దారి చేశాడు. దశరథ్ మంజీ కొండంత ఆత్మ విశ్వాసం ముందు కొండ చిన్నబోయింది. అతని ఆత్మవిశ్వాసం ముందు తలవంచుకుని దాసోహమంది. మంజీ కృషినీ, ఆత్మ విశ్వాసాన్నీ, పట్టుదలనూ చూసి గ్రామ ప్రజలందరూ విస్తుబోయారు. దశరథ్ కొండను తొలిచి తయారు చేసిన మార్గంలో ఇప్పుడు వాహనాలు కూడా వెళ్తున్నాయి. రోడ్డు కూడా వేశారు. అయితే దశరథ్ మంజీ అనితర సాధ్యమైన ఆత్మవిశ్వాసంతో ఈ మహాకార్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసినా ఆ దృశ్యాన్ని చూసే అదృష్టం అతని భార్యకు లేదు. మంజీ ఆత్మవిశ్వాసానికి కృతజ్ఞతగా గెహ్లోర్ ప్రజలు తమ గ్రామం పేరును మార్చి, దశరథ్ నగర్ అని పిల్చుకుంటున్నారు.  చిన్న చిన్న సమస్యలకే నీరసించిపోయే వారికి ఆత్మవిశ్వాసంతో కొండను తొలిచిన దశరథ్ మంజీ ఆదర్శనీయుడు.                                               *నిశ్శబ్ద.

ఒంటరితనం బాధిస్తోందా?మీకోసమే ఇది!

  ఎన్నో నిద్రలేని రాత్రులు  ఒంటరిగా పక్కమీద కూర్చుని అనంతార్థాల విశ్వాన్ని అర్ధరహితంగా గమనిస్తున్నప్పుడు చాలామందికి తోడుగా ఎవరుంటారో తెలుసా??.... ఒంటరి తనమే.. భయంకరమైన ఒంటరితనం వెంటగా ఉంటుంది. అయితే చాలామందికి ఒంటరిగా ఉండటానికి, ఒంటరి తనానికి మధ్య ఉన్న సన్నని గీత కనబడదు. చుట్టూ ఎవరూ లేకుండా ఒంటరిగా ఉంటే అది భౌతికంగా ఒంటరిగా ఉండటం. కానీ చుట్టూ ఎవరున్నా లేకపోయినా మనసులో ఒక అంధకారం ఉంటే అది మానసికంగా మనిషిని నిలువనీయని ఒంటరితనం అవుతుంది. ఒంటరి తనానికి, ఒంటరిగా ఉండటానికి తేడా ఉంటుంది.  అయితే   ఒంటరి తనమే మనిషిని ఒంటరిగా వుండేటట్లు చేస్తుంది. ఒంటరిగా ఉండటం యాదృచ్ఛికం కావచ్చు. కానీ అది తాత్కాలికమైనది, లేదా స్వయంకృతం.  కానీ ఎలా చూసినా ఒంటరి తనం మాత్రం శాపం.  అది శాశ్వతంగా అంటి పెట్టుకొనుండేది. ఇదే ఒంటరి తనంతో బాధపడే ఒక వ్యక్తి ఆవేదన, మన జీవితాలలో రెండు విషయాలెప్పుడూ మనని వెంటాడుతుంటాయి. అవి, ప్రేమ-ఒంటరి తనం. ప్రేమ బలమైనది. శక్తివంతమైనది. కానీ, అదెప్పుడు శిఖరాగ్రాలలోనే ఉండదు. కాబట్టి, ప్రేను క్షీణించినప్పుడల్లా ఒంటరితనం విజృంభిస్తుంది. ఈ ఒంటరితనాన్ని ప్రతి మనిషి తన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అనుభవించి తీరతాడు అయితే ప్రధానంగా బడిలో చదువుకునే పిల్లలు, కాలేజీ విద్యార్థులు, గృహిణిలు, విడాకులు తీసుకున్న దంపతులు దీని బారిన అధికంగా పడుతుంటారు. మనిషి మీద ఒత్తిడి అధికమవుతున్న కొద్దీ ఈ ఒంటరి తనం అధికమవుతుంది. శిశువుకి తల్లితో సాన్నిహిత్యం లేకపోతే ఒంటరితనం ప్రాప్తిస్తుంది. పిల్లలకి ఆటపాటల్లో తల్లిదండ్రుల సహచర్యం లేకపోయినా లేదా వాళ్ళతో మాట్లాడేవారే కరువయినా గానీ వారు ఒంటరితనానికి లోనవుతారు. స్కూల్లోగానీ, ఆటల్లోగానీ తన స్నేహితులచే తిరస్కరింపబడేవాడు. భయంకరమైన ఒంటరితనానికి లోనవుతాడు. ఒంటరి తనానికి కారణాలు అనేకం. మనిషి సహజ పద్ధతివల్ల అయితేనేమి, బుద్ధికౌశల్యం లోపించడం వల్ల అయితేనేమి, పేదరికంవల్ల అయితేనేమీ, తప్పు చేసినందుపల్లె గానీ లేదా వైఫల్యాల వల్ల అయితేనేమి ఒంటరితనం అలవడుతుంది. ఆకర్షణీయంగా లేవనే భావన, అంగవైకల్యాలు ఒంటరి తనాన్ని అధికం చేస్తాయి. ఒక్కోసారి అస్వస్థతవల్ల కూడా ఒంటరితనం ఏర్పడవచ్చు.. అయితే, తమలోని ఒంటరితనపు భావనే తమ అస్వస్థతకు అసలైన కారణమని చాలామంది గ్రహించరు. ఒక్కోసారి మనం నివసిస్తున్న పరిసరాలు కూడా మనని ఒంటరితనానికి లోనుచేస్తాయి. ఆందోళనలు, వాతావరణ కాలుష్యం, రణగొణ ధ్వనులతో నిండిపోయిన పట్నవాసం, నైతిక విలువలు లోపించిన కుటుంబ సభ్యుల ప్రవర్తన, ప్రేమ రాహిత్యం, గుర్తింపులేని గానుగెద్దు జీవితం ఇవన్నీ మానసికంగా మనని కృంగదీసి మనని ఒంటరి వాళ్ళని చేయవచ్చు. ఒంటరి తనానికి కారణాలేమైనా కానివ్వండి దానివలన ఏర్పడే ఫలితాలు మాత్రం చాలా బాధాకరమైనవి. ఒంటరి తనమనేది పూర్తిగా మానసికమైనది. కాబట్టి, అన్నిటి కన్నా ముందు మానసికంగా ఒంటరితనాన్ని ఎదుర్కోడానికి సన్నద్ధులు కావాలి. నలుగురు మధ్య గడిపినంత మాత్రాన ఒంటరితనం పారిపోదు. ఒంటరితనం వేరు. ఒంటరిగా ఉండటం వేరు.  ఒంటరితనం కన్నా ఆందోళన చెందటమే నయం ఆందోళనకన్నా మనం ఈర్ష్యపడే వ్యక్తితో స్నేహామే నయం అన్నాడో ప్రఖ్యాత రచయిత కాబట్టి మన మనస్సు క్లిష్టమైన వ్యక్తితో సంపూర్ణంగా "స్నేహం చెయ్యాలి ఒక్కోసారి కొన్ని రకాల వ్యక్తుల సమక్షంలో మనం ఒంటరితనాన్ని పూర్తిగా మర్చిపోగలుగుతాం. అటువంటి వ్యక్తుల మనస్తత్వాన్ని గ్రహించి మీరు వ్యక్తిత్వాన్ని  అలాగే మలుచుకోడానికి ప్రయత్నించవచ్చు.. మనసులోని కల్మషాన్ని, ఈర్ష్యాద్వేషాల్ని, ద్వంద ప్రవృత్తుల్ని తగ్గించుకోగలిగిననాడు ఒంటరితనం దానంతట అదే నిష్క్రమిస్తుంది. బ్రతుకు శాపం గావచ్చు. కానీ ఆహ్లాదమైన స్నేహం వరం. దాన్ని తాము అనుభవిస్తూ..  ఇతరులకు పంచితే.. అదే ఒంటరితనాన్ని తరిమి కొట్టడానికి తిరుగులేని సాధనం అవుతుంది.                                              ◆నిశ్శబ్ద.

అమ్మాయిలూ…ఈతప్పు చేయొద్దు!

జీవితంలో తప్పులు జరగడం అనేది సహజం. ఆ తప్పులలో కొన్నింటిని సరిదిద్దుకోవద్దు, అయితే కొన్ని తప్పులు సరిదిద్దుకోలేరు. అలా సరిదిద్దుకోలేమని చాలామందికి తెలియకుండా తప్పులు చేస్తారు. అమ్మాయిలు తమ జీవితంలో కొన్ని తప్పులు చేస్తారని, తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారని కొన్ని సర్వేలలో స్పష్టమయింది. అమ్మాయిల ఆలోచనా విధానమే దానికి కారణమని కౌన్సిలర్లు అభిప్రాయపడుతున్నారు. అమ్మాయిలు చేసే తప్పులు, తీసుకునే తప్పు నిర్ణయాల గురించి అమ్మాయిలు తప్పక తెలుసుకోవాలి మరి. స్వేచ్ఛను కోల్పోవద్దు! స్వేచ్ఛ అంటే చాలామంది వేరే అర్థం తీసుకుంటారు. పొట్టి పొట్టి బట్టలేసుకుని ఇష్టమొచ్చినట్టు తిరుగుతూ నా ఇష్టం నా స్వేచ్ఛ అనే వాళ్లకు నిజమైన స్వేచ్ఛ అంటే అర్థం తెలియకపోవచ్చు.  కానీ స్వేచ్ఛ అంటే ఒకరి చెప్పుచేతల్లో లేకుండా ఇష్టమైనదాన్ని పొందడం.  నచ్చినది తినడం, నచ్చినది చదవడం, నచ్చినది భయం లేకుండా అడగడం. ఇవన్నీ అమ్మాయిలలో ఆత్మవిశ్వాసపు స్థాయిలను చాలా గొప్పగా తీర్చిదిద్దుతాయి. ఏదైనా అడిగితే ఇంట్లో ఏమంటారో అనే భయాన్ని వదిలిపెట్టాలి. అవసరమైన వస్తువు ఎందుకు అవసరం అనే విషయాన్ని వివరించాలి. భారంగా ఆలోచించొద్దు! చాలామంది ఇళ్లలో అడపిల్లల్ని భారంగా చూస్తారు. ఇది చిన్నతనంలో ఎక్కువగా కనిపించకపోయినా పెద్దయ్యే కొద్దీ ఈ భావాన్ని తల్లిదండ్రులు ఆడపిల్లల దగ్గర మాటల్లో వ్యక్తం చేస్తుంటారు.  ఆడపిల్లలు ఏదైనా ఖరీదైన వస్తువులు అడిగినప్పుడు "నీకోసం ఇంత దాచిపెట్టాలి. ఇప్పుడే ఇంతింత ఖర్చులు భరించాలంటే ఎలా??"  "నువ్వు ఇలా అడిగితే ఎలా రేపు నీ పెళ్లికి చాలా డబ్బు కావొద్దు" అని అంటుంటారు. అవన్నీ విని విని ఆడపిల్లలు కుటుంబానికి భారం అవుతారేమో అని చదువు విషయంలో పెద్దపెద్ద కలలవైపు వెళ్లకుండా ఆగిపోతారు. నిజానికి భారం అవుతున్నామేమో అనే ఆలోచనతోనే ఆడపిల్లలు ఇంటి భారాన్ని మోస్తున్నవాళ్ళున్నారు. ఇంటి భారం మోయడం తప్పుకాదు కానీ తామే ఇంటికి భారం అనుకోవడం తప్పు. కాంప్రమైజ్ అవ్వద్దు! ఆడపిల్ల అంటేనే కాంప్రమైజ్ కి మారుపేరు అన్నట్టు పెంచుతారు కొందరు. తినే విషయం దగ్గర నుండి అవసరమైన వస్తువుల వరకు ప్రతిదాంట్లో కాంప్రమైజ్ అవడం నేర్పిస్తారు. ఇలా  కాంప్రమైజ్ ల మధ్య బతికి ఆడపిల్లలు వేసే ఒక పెద్ద రాంగ్ స్టెప్ ఏమిటంటే జీవితకాల నిర్ణయం అయిన పెళ్లి విషయంలో కూడా కాంప్రమైజ్ అయిపోవడం. ఇంట్లో వాళ్లకు భారం తగ్గిపోతుంది, ఏదో ఒక సంబంధం అడ్జస్ట్ అయిపోతే సరిపోతుంది. ఇంట్లో ఇబ్బందులు అవుతున్నాయి నా పెళ్లైపోతే అంత సెట్ అయిపోతుంది అని ఆలోచించే అమ్మాయిలు ఈకాలంలో కూడా ఉన్నారంటే ఆశ్చర్యమే వేస్తుంది. ఇష్టాలు వదిలిపెట్టద్దు!! అందరికీ ఇష్టాలుంటాయి. అలాగే ఆడపిల్లలకు కూడా. కానీ ఇంట్లో తల్లిదండ్రుల కష్టాలను చూసే ఆడపిల్లలు తమ ఇష్టాలను బయటపెట్టరు. ముఖ్యంగా ఆర్థికపరమైన ఇష్టాలను బయటపెట్టని వాళ్ళున్నారు. అలాగని అందరూ ఇలా త్యాగం చేసేస్తారని అనడం లేదు. కానీ ఆడపిల్లలు తమకున్న చిన్న చిన్న ఇష్టాలను వధులుకోకూడదు. ఆ అసంతృప్తి చాలా మానసిక సమస్యలకు దారితీస్తుంది. ఆర్థిక సంపాదన మానుకోవద్దు! కొంతమంది మగవాళ్లకు సంపాదన బాగుంది కదా అనే ఆలోచనతో ఆడపిల్లలను సంపాదించడానికి ప్రోత్సహించరు. తల్లిదండ్రులేమో ఆడపిల్లను బయటకు పంపించాలంటే భయమనే సాకుతో ఉద్యోగానికి పంపరు, పెళ్లయ్యాక భర్త, అత్తమామలు ఏమో మా సంపాదన ఉందిగా ఇంట్లో హాయిగా ఉంటే చాలు అంటారు. ఇలా రెండు వైపులా ఆడపిల్లలను ఆర్థికంగా ముందడుగు వేయకుండా చేసేవాళ్ళు ఉన్నారు. తమకంటూ ఆర్థిక సంపాదన లేకపోతే పెళ్లి కాని వాళ్ళు అయినా, పెళ్లి అయిన వాళ్ళు అయినా తమ అవసరాల కోసం భర్త దగ్గర, అత్తమామల దగ్గర చెయ్యి చాపుతూనే ఉండాలి. అందుకే తమ చేతిలో ఏ విద్య ఉన్నా, దాని సహాయంతో తమకంటూ కొంత సంపాదించుకోవాలి. ఏమో ఎవరు చెప్పొచ్చారు ఇలా సంపాదించే ఆడపిల్లలు ఆర్థిక వేత్తలు కూడా కాగలరు. ◆ వెంకటేష్ పువ్వాడ.

అసంతృప్తితో అతిగా టీవి

  అదేపనిగా టీవి చూడటంలో మునిగిపోతున్నారా? అయితే మీరు తాజాగా వెలుగుచూసిన ఓ సర్వే వివరాలు తెలుసుకోవాల్సిందే. మేరీ ల్యాండ్ విశ్వవిద్యాలయం నలబై వేలమందితో చేసిన అధ్యయనం ఆసక్తిగొలిపే విషయాలను బయటపెట్టింది. వివిధ రకాల సమస్యలు, కోరికలుండి అవి తీరక అసంతృప్తితో ఉన్నవారు అధికంగా టీవి చుస్తుంటారని ఆ సర్వే వెల్లడించింది. ఆనందంగా ఉదేవారు టీవి చూసే గంటలతో పోల్చినపుడు అసంతృప్తిపరులు 30 శాతం అధికంగా కార్యక్రమాల విక్షణకు కేటాయిస్త్రున్నారు. తాత్కాలికంగా ఇది మనసుకు ఊరటనిచినప్పటికి దీర్ఘకాలంలో తీవ్ర నిరాశకు గురి చేస్తుందనేది సారాంశం. ఈ అసంతృప్తికి దూరం కావడం ఎలా అనేది దాన్లోనే బయటపడింది. పుస్తకాలు చదవడం ,స్నేహితులతో కాలక్షేపం చేయడం చక్కటి లైంగిక సంబంధాలు కలిగి ఉండటంవంటివి ఆనందానికి అసలైన మార్గాలని సర్వేలో పాల్గొన్న వారు తేల్చి చెప్పారు.

మనసును స్వాధీనం చేసుకోవడానికి ఏమి చేయాలి?

మనసును తమ స్వాధీనంలో ఉంచుకోవాలన్న ఆసక్తి అందరికీ ఉంటుంది. సాధారణంగా మనలో ప్రతి ఒక్కరికీ మనసు నియంత్రణ గురించి ఎంతో కొంత తెలుసు. మనందరం మనసుల్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. కానీ, దాని గురించి మరికొంత తెలుసుకొని, మరింత మెరుగ్గా, సమర్థంగా మనసును స్వాధీనంలో ఉంచుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఈ విషయంలో మనకు ఎవరు సహాయం చేయగలరు? ఎవరైతే తమ మనసును సంపూర్ణంగా స్వాధీనంలో ఉంచుకున్నారో వారు మాత్రమే మనకు సహాయపడగలరు! మనోనిగ్రహం ఎంతో ఆసక్తికరమైన ఆట. అయితే అది మనకు అంతర్గతమైనది. గెలుపు ఓటములను లెక్క చేయని మనస్తత్వం (క్రీడాస్ఫూర్తి) ఉంటే అప్పుడప్పుడు, తాత్కాలికంగా ఓడిపోతున్నట్లు తోచినా, ఈ ఆటను గొప్పగా ఆనందించవచ్చు. ఈ ఆట ఆడడానికి నైపుణ్యం, చురుకుదనం, హాస్యస్ఫూర్తి, మంచి హృదయం, వ్యూహాత్మక శక్తి, ధీరోదాత్తత అవసరం. అప్పుడే నూరుసార్లు అపజయం పాలైనా గుండె జారిపోకుండా నిలదొక్కుకోగలం.  అత్యున్నత యోగస్థితిని ఎలా పొందగలమో శ్రీకృష్ణుడు భగవద్గీతలో వివరించాడు. అర్జునుడు ఆయన చెప్పినది విని నిస్పృహతో భగవానుణ్ణి ఈ క్రింది విధంగా అడిగాడు. అతని నిస్పృహను మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. “ఓ కృష్ణా! మనను అత్యంత చంచలమైనది! నువ్వు బోధించే ఈ యోగం సంపూర్ణంగా నిశ్చలమైన మనసును కలిగివున్నప్పుడే సాధ్యం కదా! కాబట్టి ఈ యోగస్థితి మనలో ఏ విధంగా నిలిచి ఉండగలదో నాకు అర్థం కావడం లేదు. అంతేకాక  మనసు అశాంతితో అల్లకల్లోలంగా ఉంటుంది. అది శక్తిమంతమైనది, మూర్ఖమైనది. గాలిని నిగ్రహించడం ఎంత కష్టమో మనసును నిగ్రహించడం కూడా అంతే కష్టమని నాకు తోస్తున్నది” అని అర్జునుడు తన సందేహాన్ని వెలిబుచ్చాడు. మానవులందరూ సర్వసాధారణంగా అడిగే ఈ ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణుడు సర్వమానవాళీ ఎల్లకాలం గుర్తుంచుకోదగిన సందేశాన్నిచ్చాడు. మనసు నియంత్రణకు సంబంధించిన భారతీయ ఆలోచనా ధోరణి, సాధనా విధానం చాలావరకూ ఈ సందేహం మీదే ఆధారపడ్డాయి.  శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు.. “ఓ అర్జునా! నిస్సందేహంగా మనసు ఎంతో చంచలమైనది. దాన్ని నియంత్రించడం చాలా కష్టం. కానీ అభ్యాస వైరాగ్యాల ద్వారా దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు.” 'అభ్యాసం', 'వైరాగ్యం' అనే ఈ రెండు మాటలలో శ్రీకృష్ణుడు మనసును స్వాధీనం చేసుకోవడానికి సంబంధించిన రహస్యాన్నంతటినీ  అందించాడు. కానీ, వాటిని మన జీవనస్రవంతిలోకి తెచ్చేది ఎలా? అదే అసలు సమస్య. దీన్ని పరిష్కరించడానికి.. => మనసును స్వాధీనపరచుకోవాలన్న దృఢ సంకల్పం కలిగివుండాలి. => మనసు స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. => మనోనిగ్రహం కోసం క్రమం తప్పకుండా ప్రయత్నించాలి.  ఈ మూడు చేస్తే మనసు స్వాధీనంలో ఉంటుంది.                                      *రూపశ్రీ.  

కష్టజీవులకు సలాం!

  కష్టజీవులు ఎవరు?? తమ స్వేదాన్ని ధారపోసి దేశాలను నడిపిస్తున్నవారు. వారే లేకుంటే ఏ దేశానికి కూడా అభివృద్ధి అనేది శూన్యం. ఒక విత్తనాన్ని నాటిన తరువాత అది మొలక వచ్చి, మొక్కగా మారి, ఎదుగుతూ వృక్షమై పండ్లను, పువ్వులను ఇస్తుందంటే దానికి భూమి లోపలి నుండి వేర్ల ద్వారా పోషకాలు, నీరు మొదలైనవి అందుతూ ఉండటం వల్లనే దాని ఎదుగుదల సాధ్యమయ్యింది. ఆ చెట్టుకు కనుక వేర్లు లేకపోతే అది క్రమంగా పచ్చదనం కోల్పోయి, వాడిపోయి, మోడుగా మిగిలిపోతుంది.  దేశము ఒక వృక్షమైతే, దేశాన్ని నడిపిస్తున్న కార్మికులు వేర్ల వంటి వాళ్ళు.  కానీ సమాజంలో ఏమి జరుగుతుంది?? కార్మికులంటే ఒకానొక చిన్న చూపు అందరికీ. ఎంత చిన్న చూపు అంటే బయట ఎవరి వల్ల అయినా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, ఇంట్లో వాళ్ళ వల్ల ఏదైనా ఇబ్బంది ఎదుర్కొన్నప్పుడు, ఎవ్వరిమీద అయినా కోపం ఉన్నప్పుడు ఇలా మనిషి జీవితంలో ఉన్న ఎన్నో రకాల అనిశ్చితి మరియు అసహన సందర్భాలలో బయటి చిన్న కార్మికులపైన ఆ కోపం, చిరాకు, అసహనాన్ని తొందరగా వెళ్లగక్కేస్తూ ఉంటారు చాలా మంది. అయితే ఆ చిన్న కార్మికులకు ఆ పని తప్ప వేరే ఏవిధమైన ఆదాయవనరు లేకపోవడం వల్ల మనసు చంపుకుని ముందుకు వెళ్ళిపోతారు. ఈసమాజంలో డబ్బుంటే చాలు బ్రతకవచ్చు అనుకునేవాళ్ళు ఒకసారి కార్మికులు, తమకు అవసరమైనవి అన్నీ సమకూర్చి పెట్టేవాళ్ళు లేకపోతే ఎలా?? అనే ఒకానొక ప్రశ్న వేసుకుంటే దిక్కులు చూడాల్సి వస్తుంది తప్ప సమాధానం దొరకదు.  ఎందుకంటే కార్మిక శక్తిని కాదని ఈ ప్రపంచం బ్రతకలేదు. ఒకవేళ వాళ్ళను కాదని బతకడానికి ప్రయత్నం చేసినా కొన్ని పనులు చేసుకోవడానికి ఈ ప్రపంచానికి ఆ కార్మికులు, శ్రామికులే అవసరం అవుతారు. అంతటి గొప్ప కార్మికుల విషయంలో ఈ ప్రపంచం చర్య ఎలా ఉంటుంది అంటే శ్రమ దోపిడీ రూపంలో ఉంటుంది. ప్రపంచం కార్మిక దినోత్సవాన్ని మే 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. ఈరోజు వెనక ఉద్దేశం అందరితో సమానమైన పని గంటలు అన్ని రకాల పనులు చేసేవారికి కావాలని చేసిన పోరాట పలితం, పనికి తగ్గ వేతనం కావాలని చేసిన పోరాట పలితం. తన పేరుతోనే  ఒక గొప్ప విప్లవాన్ని ప్రపంచానికి పరిచయం చేసినవాడు కార్ల్ మర్క్స్. ఈయన గొంతెత్తి "ప్రపంచ శ్రామికులారా ఏకం కండి. పోరాడితే పోయేదేమి లేదు సంకెళ్లు తప్ప" అని గొంతెత్తి ప్రపంచ కార్మికులకు, కష్టపడి పనిచేసి శ్రమదోపిడికి గురవుతున్న వాళ్లకు పిలిలుపిచ్చాడు. ఈ శ్రమదోపిడి అనేది ఎన్నో ఏళ్లకేళ్ళుగా ఎన్నెన్నో దేశాలలో సాగుతున్న ఒక దారుణ వ్యవస్థ. దీన్ని  అంతమొందించాలని కార్మికుల కోసం కార్ల్ మార్క్స్ కూడా పోరాటం చేసాడు.  రెండు వందల సంవత్సరాల క్రితం కార్ల్ మార్క్స్ నినాదం నేటి తరానికి కూడా సరిగ్గా సరిపోతోంది అంటే ఈ సమాజం అభివృద్ధిలో శ్రామికులు అలాగే ఉన్నారు కానీ బడా బాబులే బాగా ఎదుగుతున్నారని అనిపిస్తోంది. అయితే అక్షరాస్యత కలిగిన వారికి  కాస్త ప్రశ్నించే తత్వం ఉందని సంతోషపడదామని అనుకునే లోపు ఎంతటి వారైనా ఈ దోపిడికి గురవుతున్నవారే అని నేటి ఉద్యోగాల తీరు, ఆఫీసు పని గంటలు, యాజమాన్యాల ఒత్తిడి స్పష్టం చేస్తున్నాయి. 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల రీక్రియషన్ అనే వాటిని సాధించుకోవడానికి పనులు మానేసి నిరసన తెలుపుతూ కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మేము మనుషులమే మా శ్రమకు పరిమితులు కావాలని వాటిని సాధించుకున్న రోజు.  మే డే అనగానే ప్రపంచాన్ని వారి శక్తిని స్మరించుకుని వదిలేయకుండా వాటి కష్టాన్ని గుర్తించి, వారి శ్రమను దోచుకోకుండా శ్రమకు తగ్గ పలితాన్ని వారికి ఎల్లవేళలా అందించడమే సాటి పౌరులు మరియు ప్రపంచ దేశాల కర్తవ్యం అని తెలుసుకోవాలి.                                 ◆వెంకటేష్ పువ్వాడ.

మనిషి జీవితం పరిపూర్ణత సాధించాలంటే తెలుసుకోవలసింది ఇదే..

జీవితంలో మనిషికి ఎన్నెన్నో అలవాట్లు ఉంటాయి. వాటిల్లో కొన్ని ఉపయోగకరమైతే మరికొన్ని పతనానికి దారితీస్తాయి. ఈ అలవాట్లకి కారణం అతని మానసిక ఆలోచనా ధోరణే తెలివైనవాడు తన ఆలోచనా ధోరణిని నియంత్రిస్తే, మూర్ఖుడు ఆలోచనల చేత నియంత్రింపబడతాడు. తెలివైనవాడు ముందు తను ఏం ఆలోచించాలో, ఎలా ఆలోచించాలో నిర్ణయించుకుంటాడు. బాహ్య విషయాలు అతని ఆలోచనా ధోరణిని భంగపరచకుండా జాగ్రత్త వహిస్తాడు. కానీ తెలివి తక్కువవాడు అలా కాదు. అస్థిరమైన ఆలోచనలతో ఇతర విషయాల ప్రభావంతో తన నిర్ణయాలను క్షణం క్షణం మార్చుకుంటూ జీవితాన్ని వెళ్ళదీస్తాడు. ఆలోచనా రాహిత్యం మనిషిని ఉన్మత్తుడ్ని చేస్తుంది. మనిషి వైఫల్యానికి ప్రధాన కారణం అతని అశ్రద్ధతో కూడిన ఆలోచనా ధోరణులే సరైన, నిజమైన ఆలోచన గల మానసిక ప్రవృత్తి మాత్రమే మనిషి తప్పుడు జీవితాన్ని సరిచేయగలదు. సరైన, నిర్దుష్టమైన నడవడిక మాత్రమే మనిషి జీవితంలో శాంతిని ప్రసాదించి, సఫలీకృతుడ్ని చేయగలదు. ఆలోచనలని నియంత్రించాలంటే ముందు మనలో గజిబిజిగా కలిగే ఆలోచనలను క్రమబద్దం చేయాలి. తార్కికతను అలవర్చుకోవాలి. ఒకదానికి మరోదానికి మధ్యన సారూప్యత, సామరస్యత ఉండాలి. పొంతన లేనట్లుండే అనంతమైన ఆలోచనా పరంపరల్ని ఓ క్రియాశీలకమైన రూపంలోకి మరల్చుకోవాలి. మన ఆచనలు మన నియమాలకు గానీ లేదా మన ధోరణికి గానీ విరుద్దంగా వుండకూడదు. మనం ఇతరుల మీద చూపించే జాలిగానీ, దయగానీ, క్షమగుణం గాని మనల్ని ఇబ్బందుల్లో పడేయగూడదు. నీతితో కూడిన నియమాలకు నీతికర వాతావరణంలో కూడా కట్టుబడి వుండాలి. మనలో కలిగే ఆలోచనలలో, స్పందనలలో ఏవి నిజాలో, ఏవి అపోహలో తేల్చుకోవాలి. మనలోని విజ్ఞాన పరిధుల్ని కనుగొనాలి. మనకేం తెలుసో మనకి తెలియాలి. అలాగే, మనకేం తెలియదో కూడా మనకు తెలియాలి. ఏవి సత్యాలో, ఏవి అభిప్రాయాలో మనం గ్రహించాలి. చాలా మంది తమ నమ్మకాలని తమకు తెలిసిన జ్ఞానంగా భావిస్తారు, అది సమంజసం కాదు. తప్పుగా ఆలోచించే వాడి చేష్టలు కూడా దుర్మార్గంగా వుంటాయి. దానికి తగ్గట్టు సమస్యలు అవిశ్రాంతంగా వచ్చి పడుతుంటాయి. తనని ఇతరులు నాశనం చేస్తారని, మోసం చేస్తారని, తనకి కీడు తలపెడతారని ఊహిస్తుంటాడు. తనని తాను రక్షించుకునే ప్రయత్నంలో ధర్మాన్ని పూర్తిగా విస్మరిస్తాడు. ఫలితంగా తన దుర్మార్గపు అంచనాలకు తానే బలి అవుతాడు, ఆత్మ పరిశీలన లేకపోవడం చేత దుర్మార్గానికి సన్మార్గానికి మధ్య తేడా గ్రహించలేడు. కాని సరైన పంథాలో ఆలోచించేవాడు అలాకాదు. తన గురించి గాని, తన వ్యక్తిగత శ్రద్ధ గురించిగాని ఆలోచించడు. తనపై ఇతరులు ప్రదర్శిస్తున్న ఈర్ష్యాద్వేషాలు అతనికి మానసిక అస్తిరతను కలిగించవు. అతనెప్పుడు “ఫలానావ్యక్తి నాకు కీడు తలపెట్టాడు" అని ఆలోచించడు. కేవలం తన దుశ్చేష్టలే తనని నాశనం చేస్తాయి తప్ప ఇతరుల చేష్టలు  తననేమి చేయలేవని గ్రహిస్తాడు. తన భవిష్యత్తు, తన ఎదుగుదల కేవలం తన చేతుల్లోనే వుందని గ్రహిస్తాడు. విషయాసక్తి, విషయావగాహన వుంటుంది. యదార్థాలని యదార్థాలుగా చూస్తాడు కష్టాలు వచ్చినప్పుడు విపరీతంగా కదిలిపోడు. అలాగే ఆనందవు సమయాలలో వివరీతంగా చలించడు జీవితపు ఆటుపోట్లకు తట్టుకునే మానసిక స్థైర్యాన్ని సంతరించుకుంటాడు. తన చుట్టూ వున్న ప్రకృతినుంచీ, తన చుట్టూవున్న సమాజం నుంచీ నిరంతరమూ నేర్చుకుంటూనే వుంటాడు. మనిషి ఎంతైనా నేర్చుకోవచ్చు కానీ, దానికి తగ్గ సమయస్ఫూర్తి ధర్మచింతన లేకపోతే అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ముందు మనిషి తనని తాను జయించుకోగలిగిన నాడు ఆధర్మాన్ని జయించగలడు. కష్టాలు, బాధలు చిరాకులు ప్రతి మనిషికీ వుంటాయి. అయితే వాటిని ఓపికతో, ఓ నిర్దుష్టమైన ప్రణాళిక, వ్యూహంతో ఛేదించ గలిగిననాడు మనిషి జీవితం పరిపూర్ణతను సంతరించుకుంటుంది.                                  ◆నిశ్శబ్ద.

విజయవంతమైన నాయకుడు కావడానికి చాణక్యుడు చెప్పిన సలహాలు.. !

  ఒక వ్యక్తి చాణక్య నీతి సూత్రాలను లోతుగా అధ్యయనం చేస్తే అతను జీవితంలో ప్రతి అడుగులోనూ విజయం సాధిస్తాడు. చాణక్యుడి బోధనలు మానవాళిని సరైన మార్గంలోకి తీసుకురావడంలో సహాయపడతాయి. ప్రతి వ్యక్తి జీవితంలో పురోగతి సాధించాలని కోరుకుంటాడు. చాలా మంది నాయకత్వం కావాలని కోరుకుంటారు.  కానీ కొన్ని లోపాల కారణంగా వారు వెనుకబడిపోతారు. చాణక్య నీతిలో అలాంటి కొన్ని విషయాలు ప్రస్తావించబడ్డాయి.  వాటిని దృష్టిలో ఉంచుకుంటే ఎవరైనా సులభంగా మంచి నాయకుడు  కావచ్చట. చాణక్యుడు దార్శనిక నాయకత్వం  ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. ఒక నాయకుడికి స్పష్టమైన దృష్టి ఉంటుంది. ఇది జట్టును ఒక సాధారణ లక్ష్యం వైపు సమలేఖనం చేస్తుంది. సమర్థవంతమైన నాయకుడిగా మారడానికి స్పష్టమైన ఆలోచించన,  పారదర్శకత..  నమ్మకాన్ని పెంచడంలో సహాయపడుతాయట. ఏదైనా పెద్ద పనిని ప్లాన్ చేసే ముందు లేదా తర్వాత అనేక రకాల అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ ఈలోగా ఓపికగల నాయకుడు తన ధైర్యాన్ని తగ్గించుకోడు లేదా జట్టును కూడా కుంగిపోనివ్వడు. సమస్యలకు త్వరిత,  సంతోషకరమైన పరిష్కారాలను కనుగొనడం, పరిస్థితులను మార్చడంలో  నాయకుడు  కీలక పాత్ర పోషిస్తాడు.  జీవితంలో గొప్ప విజయాన్ని సాధించాలనుకుంటే మొదట  సమయం  ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. సమయం విలువను అర్థం చేసుకున్న వారు జీవితంలో శిఖరాగ్రానికి చేరుకుంటారు. నాయకుడు స్వయంగా తన పనిలో ఆలస్యంగా వస్తే అది తన చుట్టూ ఉన్న వారిపై  చెడు ప్రభావం చూపుతుంది. చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి తన తెలివితేటలతో ప్రజలను తన వైపుకు ఆకర్షించుకోవాలి,  కార్యాలయంలో పని చేయాలి. నిజాయితీగా పనిచేస్తున్నట్టు అందరికీ   కనిపించాలి. అప్పుడు ఆ వ్యక్తి విలువ పెరుగుతుంది. ఇలా జరిగినప్పుడు ఆ వ్యక్తి తమ నాయకుడుగా ఉండాలని అందరూ కోరుకుంటారు. పరిమిత వనరులతో,  ప్రతికూల పరిస్థితులలో తమ లక్ష్యాలను సాధించే వ్యక్తులు నాయకులు అయ్యే గుణాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే నేటి యుగంలో నిర్వహణ ఒక వ్యక్తి నుండి బహుళ పనులను ఆశిస్తుంది. ప్రతి ఒక్కరు పనిలో సమర్ధవంతంగా ఉంటే, అది వారిని  నాయకుడిగా ఎదగడానికి మార్గం సుగమం చేస్తుంది.                                                        *రూపశ్రీ.

కాశ్మీర్ కు ఆ పేరు ఎలా వచ్చింది?

కాశ్మీర్ అనేది కేవలం ఒక భూభాగం కాదు. చరిత్ర, జానపద కథలు,  సంస్కృతి  పొరలతో చుట్టబడిన పేరు.  కాశ్మీర్ గురించి తెలుసుకునే కొద్దీ  లెక్కలేనన్ని కథలు బయటపడతాయి. ఒకప్పుడు 'భూమిపై స్వర్గం' అని పిలువబడే ఈ ప్రాంతం ఇప్పటికీ దాని అందానికి ప్రసిద్ధి చెందింది, అయితే దాని పేరు యొక్క మూలం   చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. దీని గురించి తెలుసుకుంటే.. కాశ్మీర్ యొక్క పురాతన జానపద కథలు.. కాశ్మీర్ అనే పదం ఒక పాత జానపద కథలో మూలాలను కలిగి ఉన్నట్టు తెలుస్తుంది. ఈ లోయ ఒక పెద్ద సరస్సు ఎండిపోవడం ద్వారా ఉనికిలోకి వచ్చిందని చెబుతారు.  వేల సంవత్సరాల నాటి జానపద కథ ప్రకారం కాశ్మీర్ ఒకప్పుడు ఒక పెద్ద సరస్సు. ఇక్కడ ఎవరూ నివసించేవారు కాదు.  కేవలం నీరు మాత్రమే ఉండేది. తరువాత  కశ్యప మహర్షి వచ్చాడు.  ఈయన భృగు వంశానికి చెందిన వాడు. ఈయన కొండలను నుండి ఆ సరస్సు నీటిని బయటకు తీశాడట.  ఇది మానవ నివాసానికి అనువైన భూమిని సృష్టించింది. అది చాలా అందంగా ఉండటంతో  "భూతల స్వర్గం" అని పిలువబడిందట.  తరువాత ఇది "కశ్యపమార్", తరువాత  చివరకు నేటి "కాశ్మీర్" గా మారిందని చెబుతారు. ఈ సరస్సు,  కశ్యప మహర్షి కథ 12వ శతాబ్దపు చరిత్రకారుడు కల్హణుడు రాసిన రాజతరంగిణి పుస్తకంలో కూడా ప్రస్తావించబడిందట. ఏ భారతీయ గ్రంథంలోనైనా కాశ్మీర్ చారిత్రాత్మకంగా నమోదు చేయబడటం ఇదే మొదటిసారి. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ ప్రణాళిక అభివృద్ధి,  పర్యవేక్షణ విభాగం వెబ్‌సైట్‌లో కూడా ఇది ప్రస్తావించబడింది. కాశ్మీర్ అనే పేరుకు అర్థం ఏమిటి? సంస్కృతంలో “కా” అంటే జలం (నీరు),  “షామిర” అంటే ఎండబెట్టడం అని అర్థం. దీని ప్రకారం, 'కాశ్మీర్' అనే పదానికి సాహిత్యపరమైన అర్థం  "ఎండిన నీరు" అంటే నీటి నుండి బయటపడిన భూమి. మరొక అభిప్రాయం ప్రకారం, 'కాస్' అంటే కాలువ లేదా వాగు,  'మీర్' అంటే పర్వతం. ఈ వివరణ ప్రకారం కాశ్మీర్ అంటే "పర్వతాల మధ్య ప్రవహించే ప్రవాహాల భూమి" అని అర్థం. పురాతన గ్రంథాలు,  విదేశీ పత్రాలలో కాశ్మీర్.. భారతదేశం నుండి మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం నుండి పండితులకు,  ప్రయాణికులకు కాశ్మీర్ ఒక ఆకర్షణీయ కేంద్రంగా ఉంది. క్రీస్తుపూర్వం 550లో గ్రీకు చరిత్రకారుడు హెకాటేయస్ ఈ ప్రాంతాన్ని 'కాస్పాపిరోస్' అని పిలిచాడు. తదనంతరం, రోమన్ ఖగోళ శాస్త్రవేత్త టోలెమీ (క్రీ.శ. 150) దీనిని 'కాస్పెరియా' అని పిలిచాడు. చైనా రికార్డులలో కూడా కాశ్మీర్ ప్రస్తావన ఉంది - దీనిని 'కి-పిన్' అని, టాంగ్ రాజవంశం కాలంలో 'కియా-షి-మి-లో' అని పిలిచేవారు. ఇది 7వ, 8వ శతాబ్దాల పత్రాలలో ఉందట. అల్బెరుని కళ్ళ ద్వారా కాశ్మీర్ దృశ్యం.. 11వ శతాబ్దపు ఖ్వరాజ్మీ పండితుడు భారతదేశపు మొదటి మానవ శాస్త్రవేత్త అని కూడా పిలువబడే అల్బెరుని, కితాబ్-ఉల్-హింద్‌లో కాశ్మీర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఇక్కడి భౌగోళిక నిర్మాణంతో పాటు భాష, సమాజం, మతం, సంస్కృతిని కూడా ఆయన లోతుగా విశ్లేషించారు. అతని ప్రకారం కాశ్మీర్ మధ్య ఆసియా,  పంజాబ్ మైదానాల మధ్య ఉన్న ఒక పర్వత ప్రాంతం. సంస్కృతి,  ప్రకృతి రెండింటిలోనూ ఇది  చాలా గొప్పది. గుర్తింపు  వ్యాప్తి.. 13వ శతాబ్దపు ఇటాలియన్ యాత్రికుడు మార్కో పోలో కూడా కాశ్మీర్ గురించి ప్రస్తావించాడు. వారు దానిని 'కాశీమూర్' అని, దాని నివాసులను 'కాశ్మీరియన్లు' అని పిలిచారు. ఆ సమయంలోనే కాశ్మీర్ గుర్తింపు సుదూర దేశాలకు కూడా చేరుకుందని ఆయన రచనల ద్వారా స్పష్టమవుతోంది.  ఫిదా హస్నైన్  ప్రొఫెసర్ రాసిన చాలా ఆసక్తికరమైన,  చర్చనీయాంశమైన సిద్ధాంతం. అతని ప్రకారం కాశ్మీరీ ప్రజల మూలాలు బాగ్దాద్ సమీపంలో స్థిరపడిన 'కాస్' అనే యూదు సమాజానికి చెందినవి. ఈ కులం క్రమంగా ఆఫ్ఘనిస్తాన్ మీదుగా హిందూకుష్ దాటి కాశ్మీర్ చేరుకుని ఇక్కడ స్థిరపడింది.  ఈ సిద్ధాంతం ఇంకా విస్తృతంగా ఆమోదించబడనప్పటికీ ఇది ఖచ్చితంగా కాశ్మీర్ యొక్క వైవిధ్య గుర్తింపులోని మరొక కోణాన్ని చూపుతుంది. జంబులోచన్ రాజు పాత్ర.. 9వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు జంబులోచన్ కాలంలో కాశ్మీర్ అనే పేరు వచ్చిందని చాలా మంది స్థానికులు నమ్ముతారు. వారు స్థాపించిన నగరాలు, పరిపాలనా వ్యవస్థలు కాశ్మీర్‌కు ఒక సాంస్కృతిక నిర్మాణాన్ని అందించాయి.  బహుశా ఈ ప్రాంతం 'కాశ్మీర్' అని పిలువబడిన సమయం ఇదే అయి ఉండవచ్చు. కాశ్మీర్ లోయలు ఎంత అందంగా ఉన్నా, దాని కథ కూడా అంతే మర్మమైనది.  అందుకే కాశ్మీర్ కేవలం ఒక ప్రదేశం కాదు అదొక అనుభూతి.  దానిని అర్థం చేసుకోవడానికి హృదయం,  మనస్సు రెండూ అవసరం అని చెబుతారు.                                     *రూపశ్రీ.

టెక్నాలజీ గురించి పిల్లలు ప్రశ్నిస్తున్నారా? ఇలా స్మార్ట్ గా ఉండండి..!

  ఈ జనరేషన్ ను ఆల్ఫా యుగం అనవచ్చు. ఇది AI, స్మార్ట్ పరికరాలు, ఆన్‌లైన్ లెర్నింగ్,  సోషల్ మీడియా మధ్య పెరుగుతోంది. ఈ తరం వారు టెక్నాలజీకి త్వరగా అలవాటు పడతారు,  యాప్‌లతో పాటు వివిధ గాడ్జెట్‌లను ఉపయోగించడంలో వారి తల్లిదండ్రుల కంటే చాలా ముందున్నారు. యూట్యూబ్, గేమింగ్,  ఓటిటి ప్లాట్‌ఫామ్‌లలో కూడా దీని పట్టు బలంగా మారింది.  ఇప్పుడు జనరల్ బీటా కూడా మన మధ్య ఉన్నారు. వారు సాంకేతికత అభివృద్ధితో  పెరుగుతారు. ఇది నేర్చుకోవడం, వినోదం కోసం AIని ఉపయోగిస్తుంది. కానీ ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు పుట్టినప్పటి నుండి స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లు,  ఇతర గాడ్జెట్‌లతో పరిచయం ఉన్న ఈ పిల్లలు తరచుగా టెక్నాలజీకి సంబంధించిన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. తల్లిదండ్రులు సమాధానం చెప్పకపోతే వారు  నిరాశ చెందుతారు.  సమాధానం చెప్పలేకపోవడం వల్ల తల్లిదండ్రులు కూడా  బాధపడతారు. కొన్నిసార్లు నిస్సహాయంగా భావిస్తారు.   అపరాధ భావన తల్లిదండ్రులలో  చుట్టుముడుతుంది. కానీ ఇది టెక్నాలజీ యుగం.  పిల్లలకు రోల్ మోడల్‌గా మారాలంటే తల్లిదండ్రులు కూడా  టెక్నాలజీతో కనెక్ట్ అవ్వాలి.  'టెక్నో స్మార్ట్ మామ్'గా మారాలి.  ఇది చాలా సులభం. ఎలాగంటే.. పిల్లలను గురువులుగా చేసుకోవాలి.. సాధారణంగా సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తికి సాంకేతికత లేదా సాంకేతిక విషయాలను అర్థం చేసుకోవడం సులభం. అదే సమయంలో సాంకేతికత లేని వ్యక్తికి లేదా ఈ విషయాలపై ఆసక్తి లేని మహిళలకు ఇది కొంచెం కష్టంగా మారుతుంది. నిజానికి కొందరు మహిళలు టెక్నాలజీని ఉపయోగించడం పట్ల భయపడుతున్నారు.  దీనికి కారణం ఏదైనా పొరపాటు చేస్తే నవ్వుల పాలవుతారనే భయం. చాలా మంది తెలుసుకోవలసిన విషయం ఏంటంటే.. పిల్లలు ప్రతి ప్రశ్నకు తమ తల్లి సమాధానం చెప్పాలని ఆశించరు. కానీ వారు కొత్త యాప్ లేదా టెక్నాలజీపై ఆసక్తి చూపినప్పుడు దాని గురించి వారికి ఏమి తెలుసు లేదా దానితో వారు ఏమి చేయాలనుకుంటున్నారో అడగాలి. పిల్లలు పెద్దవారైతే వారి ఫోన్‌లలో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోమని,  దానిని ఎలా సెటప్ చేయాలో,  ఎలా ఉపయోగించాలో చూపించమని అడగాలి. అనేక సర్వేల ప్రకారం 47 శాతం తల్లిదండ్రులు,  సంరక్షకులు తమ పిల్లలకు డిజిటల్ టెక్నాలజీ గురించి తమకన్నా ఎక్కువ తెలుసని భావిస్తున్నారు. కాబట్టి వారిని ఏదైనా అడగడానికి వెనుకాడతారు. నిజంగా ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారని పిల్లలు భావిస్తే  తమ తల్లిదండ్రులు నిపుణులుగా మారడానికి ట్రై చేస్తున్నారని, కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారని తెలుసుకుని పిల్లలు సంతోషపడతారు. పర్యవేక్షించడం సులభం.. డిజిటల్ యుగంలో సాంకేతికత మనం కమ్యూనికేట్ చేసే, పని చేసే,  పిల్లలను పెంచే విధానాన్ని కూడా మార్చింది. కొంతమంది స్క్రీన్‌పై ఎక్కువ సమయం గడపడం హానికరమని వాదించవచ్చు. కానీ సాంకేతికత గొప్ప సాధనంగా ఉండటానికి అనేక మార్గాలు ఉన్నాయి. నేడు అనేక యాప్‌లు,  ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా  పిల్లల మొబైల్ పరికరాలు, వీడియో గేమ్‌లు, సోషల్ మీడియా కార్యకలాపాలు, వారి నిద్ర,  వారి ఆహారాన్ని కూడా పర్యవేక్షించవచ్చు.  పరికరంలో తల్లిదండ్రుల నియంత్రణలను ఉపయోగించడం ద్వారా వారి స్క్రీన్ సమయాన్ని నియంత్రించవచ్చు. దీని కోసం  డిజిటల్  స్టేజ్ ను అర్థం చేసుకోవాలి, అంటే తల్లి సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉంటే, ఆమె ఆన్‌లైన్ భద్రత,  సైబర్ బెదిరింపు వంటి ఇతర ప్రమాదాల గురించి వారిని హెచ్చరించగలదు.  పిల్లలు టెక్నాలజీని సరైన విధంగా  ఉపయోగిస్తున్నారా లేదా అనే దానిపై నిఘా ఉంచగలుగుతారు. ముఖ్యంగా వారు స్మార్ట్‌ఫోన్‌లు,  వీడియో గేమ్‌లకు బానిసలైనప్పుడు ఇది ఉపయోగపడతుంది. కష్టమేమి కాదు.. ఏదైనా చేయాలనే సంకల్పం ఉంటే ఆ మార్గం స్వయంచాలకంగా సృష్టించబడుతుంది. ఐదు సంవత్సరాల క్రితం కూరగాయల నుండి ఇతర రోజువారీ అవసరాల వరకు ప్రతిదీ కొనడానికి డిజిటల్ చెల్లింపులు చేస్తారని ఎవరూ ఊహించలేదు.  కానీ ఇప్పుడు అందరు చేస్తున్నారు.  కోవిడ్ సమయంలో పాఠశాలలు,  కళాశాలలు మూసివేయబడి తరగతులు ఆన్‌లైన్‌లోకి మారినప్పుడు, ఉపాధ్యాయులతో పాటు ఇంట్లో ఉండే తల్లులు కూడా అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఇలాంటి వాటిని టెక్నాలజీనే సులువు చేసింది. ఉపయోగాలు.. పిల్లలు సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. 9 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయ పిల్లలు ప్రతిరోజూ మూడు గంటలు సోషల్ మీడియా,  గేమింగ్‌లో గడుపుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.  ఈ రోజుల్లో సోషల్ మీడియాలో తల్లిదండ్రులుగా ఉండటం,  సాంకేతికతపై దృష్టి సారించి చర్చలు,  కంటెంట్‌ను పంచుకునే గ్రూపులు ఉన్నాయి. వీటి ద్వారా చాలా డవలప్ అవవచ్చు.  నచ్చినది నేర్చుకోవడం ఎల్లప్పుడూ మంచిదని అంటారు. టెక్నాలజీ అనేది ప్రతిరోజూ, ప్రతి క్షణం మారుతూ ఉంటుంది, కానీ  చుట్టూ ఉన్న టెక్నాలజీ గురించి ప్రాథమిక జ్ఞానం కలిగి ఉండటం,  దానిని  అవసరాలకు తగినట్టు మార్చుకోవడం ఎల్లప్పుడూ ఉపయోగపడుతుంది. టెక్నాలజీని స్వీకరిస్తే రూల్ మోడల్ అవుతారు..  టెక్నాలజీకి భయపడాల్సిన అవసరం లేదు.  పిల్లలకు ఆదర్శంగా నిలిచేందుకు ఇది తల్లులకు ఒక అవకాశం.  టెక్నీషియన్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ టెక్నాలజీని  జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. మంచి విషయం ఏమిటంటే అది అంత కష్టం కాదు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న తల్లిగా మారడం ద్వారా  పిల్లలకు మార్గనిర్దేశం చేయడమే కాకుండా సాంకేతికత  చెడు ప్రభావాల నుండి పిల్లలను రక్షించడానికి అనేక చర్యలను కూడా తీసుకోవచ్చు. దీని కోసం సాంకేతిక రంగం వైపు మొదటి అడుగు వేయడం ముఖ్యం. అంటే పిల్లలను వారి స్వంత ఉపాధ్యాయులుగా మార్చడం.  ఇది వారితో తల్లులకు గల సంబంధాన్ని బలోపేతం చేయడమే కాకుండా వారు అనేక ముఖ్యమైన నైపుణ్యాలను కూడా నేర్చుకుంటారు. ఇవన్నీ ఆచరిస్తే స్మార్ట్ మామ్ అవుతారు.                                   *రూపశ్రీ.  

మలేరియా అంతమే అంతిమ లక్ష్యం కావాలి..

నేడు ప్రపంచ మలేరియా దినోత్సవం. మలేరియా గురించి అవగాహన పెంచడానికి,  వ్యాధిని నియంత్రించడానికి, నివారించడానికి,  చివరికి మలేరియాను రూపుమాపడానికి  చర్యలను ప్రోత్సహించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఏర్పాటు చేసిన రోజిది.  ప్రతి సంవత్సరం మలేరియా దినోత్సవం సందర్భంగా ఒక థీమ్ ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తారు.  ఈ సంవత్సరం మలేరియా దినోత్సవం  థీమ్.. "మలేరియా మనతోనే అంతం అవుతుంది.  ఇది మలేరియా నిర్మూలన వైపు పురోగతిని వేగవంతం చేయడానికి అన్ని స్థాయిలలో ప్రయత్నాలను  శక్తివంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.  ఆడ అనాఫిలిస్ దోమల కాటు ద్వారా సంక్రమించే పరాన్నజీవుల వల్ల వచ్చే మలేరియా లక్షలాది మంది ప్రజలను, ముఖ్యంగా ఉష్ణమండల,  ఉపఉష్ణమండల ప్రాంతాలలో ప్రభావితం చేస్తూనే ఉంది. మలేరియా దినోత్సవం  మలేరియాను ఎదుర్కోవడంలో సాధించిన పురోగతిని అందరికీ గుర్తు చేస్తుంది.  ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తుచేసుకునేందుకు అవకాశం ఇస్తుంది.   వ్యాధి భారాన్ని తగ్గించడానికి వనరులు, ఆవిష్కరణలు,  ప్రజల భాగస్వామ్యాన్ని సమీకరిస్తుంది. చికిత్సతో పాటు, ఈ ప్రాణాంతక అనారోగ్యం నుండి వ్యక్తులు,  సమాజాలను రక్షించడంలో నివారణ చిట్కాలు కీలకమైనవి. మలేరియా ముందస్తు హెచ్చరిక సంకేతాలు & లక్షణాలు.. మలేరియా ముందస్తు హెచ్చరిక సంకేతాలు,  లక్షణాలు ఇతర వైద్య పరిస్థితులకు దగ్గరగా ఉండవచ్చు. అయితే మలేరియా తీవ్రత మారవచ్చు.  మలేరియాను వ్యాప్తి చేసే  దోమ కుట్టిన 10-15 రోజుల తర్వాత లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. చికిత్స చేయకుండా వదిలేస్తే, మలేరియా అవయవ వైఫల్యం, కోమా లేదా మరణం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి మలేరియా అని  అనుమానించినట్లయితే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. మలేరియా  సాధారణ ముందస్తు హెచ్చరిక సంకేతాలు.. జ్వరం అకస్మాత్తుగా వచ్చే అధిక జ్వరం అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటి. చలి చాలా మందికి చలి వస్తుంది. అది తీవ్రంగా ఉండవచ్చు. తరువాత చెమట పడుతుంది. చెమటలు పడటం చలి తర్వాత, జ్వరం తగ్గవచ్చు,   విపరీతంగా చెమట పట్టవచ్చు. తలనొప్పి మలేరియా కేసుల్లో తలనొప్పి, తరచుగా మధ్యస్థం నుండి తీవ్రంగా ఉండటం సాధారణం. అలసట చాలా అలసటగా లేదా బలహీనంగా అనిపించడం విలక్షణమైనది, ఇతర లక్షణాలు తగ్గిన తర్వాత కూడా ఇది కొనసాగవచ్చు. వికారం,  వాంతులు మలేరియా ఉన్న చాలా మంది వ్యక్తులు వికారం,  వాంతులు అనుభూతి చెందుతారు. కండరాలు,  కీళ్ల నొప్పి కండరాలు,  కీళ్లలో నొప్పులు సర్వసాధారణం. రక్తహీనత ఈ పరాన్నజీవి ఎర్ర రక్త కణాలను నాశనం చేస్తుంది. ఇది రక్తహీనతకు (తక్కువ ఎర్ర రక్త కణాల సంఖ్య) దారితీస్తుంది. దీని వలన అలసట, బలహీనత,  పాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దగ్గు కొంతమందికి తేలికపాటి దగ్గు వస్తుంది. కడుపు నొప్పి కొంతమంది వ్యక్తులు పొత్తికడుపులో అసౌకర్యం లేదా నొప్పిని అనుభవిస్తారు. పై లక్షణాలు కనిపిస్తే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి.                                        *రూపశ్రీ.

ప్రతి భర్త రోజూ ఈ 5 పనులు చేస్తే బార్య ఎప్పటికీ నిరాశ పడదు..!

వివాహం అనేది భారతీయ సమాజంలో జీవితాంతం నిలిచే బంధంగా పరిగణించబడే సంబంధం. అయితే  ఈ జీవిత బంధాన్ని సంతోషంగా గడపాలనుకుంటే ఆ సంబంధంలో ప్రేమ, గౌరవం అవసరం. చాలా మంది భార్యాభర్తలు ఒకరినొకరు చాలా ప్రేమిస్తారు కానీ  వారి మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. దీనికి చాలా కారణాలు ఉండవచ్చు, వాటిలో ఒకటి నిరాశ. ఒక అమ్మాయి తన తల్లిదండ్రులను, కుటుంబాన్ని వదిలి తన భర్త ఇంటికి వచ్చినప్పుడు, ఆమె అతన్ని అంగీకరించడమే కాకుండా తన భర్త పద్ధతులను, ఇష్టాయిష్టాలను కూడా స్వీకరిస్తుంది. కానీ ఒక పురుషుడు తన భార్య తనకు ఎంత ప్రత్యేకమైనదో ఆమెకు తెలియజేయడంలో విఫలమవుతాడు. ఈ కారణంగా  స్త్రీలు తమ భర్తల పట్ల,  ఆ సంబంధం పట్ల నిరాశ చెందుతారు.  భర్త భార్యను నిరాశపరచకూడదనుకుంటే, ఆమె భర్తను ఎల్లప్పుడూ ప్రేమించాలని,   సంబంధం సంతోషంగా ఉండాలని కోరుకుంటే ప్రతి భర్త ఈ ఐదు పనులు ప్రతిరోజూ చేయాలి. ప్రేమను వ్యక్తపరచడం..  అవకాశం దొరికినప్పుడల్లా భార్యతో "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని చెప్పాలి.  ప్రేమను వ్యక్తపరచడం వల్ల  భార్య పట్ల  శ్రద్ధ వహిస్తున్నారని ఆమెకు భరోసా లభిస్తుంది. రోజూ  ప్రేమను వ్యక్తపరచడంతో పాటు వారితో రోజుకు రెండు మూడు సార్లు ప్రేమగా మాట్లాడితే మహిళలు కూడా దీన్ని చాలా ఇష్టపడతారు. ప్రేమ ఉంది కానీ దానిని వ్యక్తపరచకపోతే లేదా చూపించకపోతే భార్యకు ఎలా తెలుస్తుంది? కలిసి తినడం.. దంపతులు ఎంత బిజీగా ఉన్నా కనీసం  భోజనం కలిసి తినాలి. భర్త రోజుకు ఒకసారి అయినా భార్యతో కూర్చుని భోజనం చేయాలి. అల్పాహారం అయినా, భోజనం అయినా, రాత్రి భోజనం అయినా ఇద్దరూ కలిసి కూర్చుని భోజనం చేసినప్పుడు వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. అలాగే కుటుంబం ఉన్నప్పటికీ భర్త లేకుండా భార్య భోజనం చేసినప్పుడు ఆమె ఒంటరిగా ఫీలవుతుంది. కాబట్టి భర్త  తన భార్యతో కలిసి భోజనం  చేయడానికి సమయం కేటాయించాలి. బయటకు వెళ్ళే ముందు.. ఆఫీసుకు వెళ్లే ముందు భార్యతో సమయం గడపాలని కోరుకుంటున్నారని, కానీ మీరు పనికి వెళ్లాలని ఆమెకు అనిపించేలా చేయండి. దీనికోసం మీరు ప్రేమపూర్వకమైన ఒక నోట్ రాయవచ్చు లేదా ఇంటి నుండి బయలుదేరే ముందు వారిని కౌగిలించుకుని  జాగ్రత్త చెప్పవచ్చు.  ఈ చిన్న  విషయాలు వారికి  ప్రేమను అర్థం అయ్యేలా చేస్తుంది. కౌగిలి.. ఉదయం నిద్ర లేవగానే  భార్యను కౌగిలించుకోవడం ప్రతి భార్య చాలా సేఫ్ ఫీలింగ్ అనుభూతి చెందుతుంది. ప్రతి భార్య తన భర్త చేతుల్లో సురక్షితంగా,  సుఖంగా ఉంటుంది. ప్రేమను వ్యక్తపరచడానికి,  భార్య హృదయాన్ని గెలుచుకోవడానికి కౌగిలించుకోవడం మంచి మార్గం.  ఆఫీసుకు వెళ్ళేటప్పుడు లేదా తిరిగి వచ్చినప్పుడు భార్యను కౌగిలించుకోవడం ఇద్దరికీ చాలా ఊరట ఇస్తుంది. ఫిర్యాదు వద్దు, మద్దతు ఇవ్వాలి.. మహిళలు తమ భర్తలను, అత్తమామలను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. ఇందుకోసం ఆమె తన భర్త మద్దతు మాత్రమే కోరుకుంటుంది. అయితే, భర్త తమ భార్య లోపాల గురించి ఫిర్యాదు చేసినప్పుడు భార్య నిరుత్సాహపడుతుంది. మీరు వారితో ఉన్నారనే భావన వారికి కలిగించాలి. ఫిర్యాదు చేయడానికి బదులుగా, చిన్న పనులలో వారికి మద్దతు ఇవ్వాలి. మంచం సర్దడం లేదా  టీ తయారు చేయడం వంటి చిన్న చిన్న పనులు చేయడం ద్వారా  వారి హృదయాలను గెలుచుకోవచ్చు.                                 *రూపశ్రీ

చెమట వాసనతో ఇబ్బంది పడుతున్నారా? నీటిలో వీటిని కలిపి స్నానం చేస్తే మ్యాజిక్కే..!

  మండుతున్న ఎండల కారణంగా ప్రజల పరిస్థితి మరింత దిగజారుతోంది. ఈ సీజన్‌లో ప్రతి రెండవ వ్యక్తి చెమటతో ఇబ్బంది పడుతుండటం గమనించవచ్చు. దీని వల్ల చాలా మంది  ఇబ్బంది పడుతుంటారు. చెమట వల్ల  శరీరం దుర్వాసన రావడం ప్రారంభమవుతుంది. ఈ దుర్వాసన కారణంగా  నలుగురిలో కలవడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.  ఈ సమస్యతో ఇబ్బంది  పడేవారు  స్నానపు నీటిలో కొన్ని వస్తువులను జోడించడం ద్వారా చెమట వాసనను వదిలించుకోవచ్చు.  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. వేప ఆకులు..  చెమట వాసనతో  ఇబ్బంది పడుతుంటే, స్నానపు నీటిలో వేప ఆకులు వేసి మరిగించాలి. దీని కోసం ఒక గిన్నెలో నీరు తీసుకుని, అందులో వేప ఆకులు వేయాలి. ఇప్పుడు ఈ నీటిని మరిగించాలి. నీరు చల్లబడిన తర్వాత దానిని వడకట్టి స్నానపు నీటిలో కలపాలి. ఇప్పుడు ఈ నీరు స్నానానికి ఉపయోగించాలి. రోజ్ వాటర్.. రోజ్ వాటర్ ఉంటే చెమట వాసనను తొలగించడానికి దాన్ని ఉపయోగించవచ్చు. దీన్ని ఉపయోగించడానికి  స్నానపు నీటిలో రెండు నుండి మూడు చెంచాల రోజ్ వాటర్ కలపాలి. ఇప్పుడు ఈ నీరు స్నానానికి ఉపయోగించవచ్చు. రోజ్ వాటర్ ని నీటిలో కలిపి ప్రతిరోజూ ఆ నీటితో స్నానం చేయాలి. దీన్ని ఉపయోగించడం ద్వారా  చెమట వాసన నుండి ఉపశమనం పొందవచ్చు. బేకింగ్ సోడా.. బేకింగ్ సోడా ప్రతి భారతీయ వంటగదిలో కనిపిస్తుంది.   చెమట దుర్వాసనను వదిలించుకోవడానికి  బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు. రెండు చెంచాల బేకింగ్ సోడాను స్నానపు నీటిలో కలిపి, ఆ నీటితో స్నానం చేయాలి. ఈ నీటితో స్నానం చేసే ముందు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ బేకింగ్ సోడా అందరికీ సరిపోదు. దీని కారణంగా  అలెర్జీలను ఎదుర్కోవలసి రావచ్చు. అలోవెరా జెల్..  ఇంట్లో అలోవెరా మొక్క ఉంటే స్నానం చేసే నీటిలో అలోవెరా జెల్ కలపాలి. ఈ నీటితో స్నానం చేయడం వల్ల శరీరంపై ఉన్న బ్యాక్టీరియా కూడా తొలగిపోతుంది. ఈ నీరు చర్మాన్ని చల్లబరుస్తుంది,  శరీరం తాజాగా అనిపిస్తుంది.                                    *రూపశ్రీ.