Vijay Diwas History

1971 యుద్ధ విజయానికి ఘన స్మారకం: విజయ్ దివస్..!

  నేడు ప్రస్తుత ప్రపంచ పరిస్థితి ఎలా ఉందంటే ఏ దేశానికాదేశం,  వారి మిలిటరీ శక్తి సామర్ధ్యాలతో భయపెట్టి తమ గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించాలని,ప్రపంచ రాజకీయాల్లో తామే హీరో అవ్వాలని ప్రయత్నిస్తున్నాయి. అయితే ప్రపంచంలోని  గొప్ప మిలిటరీ శక్తుల్లో ఒకటిగా పేరుగాంచిన భారతదేశం మాత్రం ఎప్పుడూ తన బలం, అధికారం చూపించుకోవటానికి ఏ దేశంపైనా మొదటిగా దాడి చేయలేదు. ఇప్పటికీ అదే సిద్దాంతం అనుసరిస్తుంది. అయితే ఒకానొక సమయంలో  మన పొరుగు దేశమైన పాకిస్తానుతో యుద్ధం చేయాల్సి వచ్చింది. అది కూడా స్వార్ధ ప్రయోజనాల గురించి కాకుండా, పాకిస్తాన్ ప్రజల కోసమే చేయాల్సి వచ్చింది. ఈ యుద్ధమే  మన  దేశ సైన్యపు శక్తి సామర్ధ్యాల గురించి ప్రపంచ దేశాలకి తెలిసేలా చేసింది. ప్రపంచ యుద్ధ చరిత్రలో మన దేశాన్ని హీరోని చేసింది. అలాంటి గొప్ప యుద్ధం గురించి, అందులో వీరోచితంగా పోరాడిన సైన్యపు త్యాగాల గురించి స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఆ  విజయాన్ని, విజయం తెచ్చిపెట్టిన సైన్యాన్ని స్మరించుకోవటానికి గానూ విజయ్ దివస్ జరుపుకుంటున్నారు.  సినిమా సక్సెస్ లు, సినిమాలలో హీరోల త్యాగాలు కాదు.. రియల్ లైప్ లో హీరోలుగా, ఒక యుద్దాన్ని విజయవంతం చేసిన వీరులుగా భారతీయ ఆర్మీని కొనియాడటానికి విజయ్ దివస్ వేదికగా మారుతుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 16న, భారతదేశం విజయ్ దివస్‌ను జరుపుకుంటుంది. 1971లో  భారతదేశం, పాకిస్థాన్ల  మధ్య జరిగిన యుద్ధంలో విజయాన్ని బంగ్లాదేశ్ స్వాతంత్య్రానికి  మద్దతుగా భారతదేశం చేసిన త్యాగాలను స్మరించుకునే ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. యుద్దం ఎందుకు జరిగింది.. భారతదేశం, పాకిస్తాన్ విభజన జరిగిన తరవాత 1971కి ముందు పాకిస్తాన్ అనేది మన దేశానికి తూర్పు, పడమరల్లో కూడా ఉందేది. అయితే  తూర్పు పాకిస్థాన్(నేటి బంగ్లాదేశ్)  ప్రజలు పాకిస్థాన్ శాసనానికి వ్యతిరేకంగా ఆయుధ పోరాటం చేశారు. వారికి భారత దేశం మద్దతు దొరకటంతో  తూర్పు పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా అవతరించి బంగ్లాదేశ్ దేశంగా మారింది. ఈ గొడవకంతటికి చాలా విషయాలు కారణాలుగా నిలిచాయి.  వాటిలో భాషా విభేదం చాలా ఉంది.  తూర్పు పాకిస్థాన్‌లో ఎక్కువ మంది బెంగాళీ మాట్లాడేవారు.  అయితే పశ్చిమ పాకిస్థాన్‌లో ఉర్దూను అధికార భాషగా ప్రకటించడం పట్ల తూర్పు పాకిస్థాన్‌లో నిరసనలు చెలరేగాయి. ఆర్థిక అసమానతలు కూడా విభేదాలకు కారణమయింది.  మొత్తం పాకిస్తాన్  ఆర్ధికాదాయంలో తూర్పు పాకిస్థాన్ నుంచి అధిక  ఆర్థిక ఆదాయం సమకూరుతున్నప్పటికీ, దాని ప్రయోజనాలు మాత్రం పశ్చిమ పాకిస్థాన్‌ పొందేది. దీని వ్ల  తూర్పు పాకిస్తాన్ ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని కలిగేది.  రాజకీయకంగా కూడా రెండు భాగాలలో విబేధాలు ఎక్కువగా ండేవి1970 ఎన్నికల్లో అవామీ లీగ్, షేక్ ముజీబుర్ రెహ్మాన్ నాయకత్వంలో తూర్పు పాకిస్థాన్‌లో విజయం సాధించింది. అయినప్పటికీ పశ్చిమ పాకిస్థాన్  ఈ విజయాన్ని అంగీకరించలేదు. వీటన్నింటి వల్ల పాకిస్తాన్ లోనే రెండు భాగాల మధ్య విభేదాలు చాలా ఎక్కువ అయ్యాయి. పాక్ దాడి-  భారత్ ప్రతిస్పందన ఎలా ఉందంటే.. మార్చి 26, 1971న, పాకిస్థాన్ సైన్యం ఆపరేషన్ సెర్చ్‌ లైట్ ప్రారంభించి, తూర్పు పాకిస్థాన్‌లో బెంగాళీ ప్రజలను పీడించటం మొదలుపెట్టింది. దీంతో భయపడిపోయిన దాదాపు  కోటిమంది  శరణార్థులు తూర్పు పాకిస్థాన్ నుంచి భారతదేశంలోకి వచ్చారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, అస్సాం, మెఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లోకి వచ్చారు. ఇదిలాగే కొనసాగితే భారత దేశం సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుందన్న నిజాన్ని గ్రహించి, ఈ పరిస్థితిని చక్కబెట్టటానికి భారత్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. మొదట భారతదేశం ఈ పరిస్థితిని దౌత్యపరంగా పరిష్కరించాలనే  ప్రయత్నించింది. కానీ, ప్రపంచదేశాల  నుండి తగిన ప్రతిస్పందన రాకపోవడంతో భారతదేశం సైనిక చర్య చేపట్టింది. భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ, తూర్పు పాకిస్తాన్ ప్రజలతో ఏర్పడిన స్వాతంత్ర సైన్యమైన ముక్తి బహిని సైన్యానికి పూర్తి మద్దతు అందించారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ విజయ్ మొదలైంది. 1971 డిసెంబర్ 3వ తేదీన భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఇది 13 రోజులపాటూ  కొనసాగి డిసెంబర్ 16న ముగిసింది. ఇందులో ఆపరేషన్ విజయ్ ద్వారా భారత సైన్యం, ముక్తి బహినిసైన్యంతో కలిసి, తూర్పు పాకిస్థాన్‌లో ఉన్న  పాకిస్థాన్ సైన్యాన్ని ఎదుర్కొని అనేక విజయాలు సాధించింది.  ఈ యుద్దంలో పలు చిన్నచిన్న యుద్దాలు సాగాయి.  వీటిలో లాంగేవాలా యుద్ధం, ఆపరేషన్ ట్రైడెంట్ వంటివి ఉన్నాయి. డాకాలో 93,000 మంది పాకిస్థాన్ సైనికులు భారత సైన్యానికి లొంగిపోవటంతో ఈ యుద్ధానికి తెర పడింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధిక సైనికులు  లొంగిపోయిన యుద్ధంగా ఇది  చరిత్రలో నిలిచింది. 1971,  డిసెంబర్ 16వ తేదీన, బంగ్లాదేశ్ ఒక స్వతంత్ర దేశంగా అవతరించింది. ఈ యుద్ధంలో సుమారు 3,900 భారత సైనికులు అమరులయ్యారు, 9,851 మంది గాయపడ్డారు. వారు సాదించిపెట్టిన విజయానికి  గుర్తుగా,  సైన్యం చేసిన  త్యాగాలకి స్మరించుకుంటూ  భారతదేశంలో ఈ రోజుని  విజయ్ దివస్‌గా,  బంగ్లాదేశ్‌లో విజయ్ దిబోష్‌గా జరుపుకుంటారు.  ప్రతీ పౌరుడు మానవత్వంతో మన దేశం, సైన్యం చేసిన త్యాగాలని  స్మరించుకుని,  భారతీయుడిగా గర్వపడాలి. వీటి నుంచి ముఖ్యంగా యువత    స్ఫూర్తిని పొందాలి.                                                    *రూపశ్రీ.

Do you trust your workers

మీ పని మనిషి మీద మీకు నమ్మకం ఎక్కువా? పొరపాటున కూడా ఈ విషయాలు ఆమె ముందు చర్చించకండి!

  ఇప్పటి కాలంలో చాలా ఇళ్లలో ఇంటిపని చేయడానికి పని మనుషులను నియమించుకుని ఉంటున్నారు. ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ పట్టణాలలో ఉంటూ.. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నా.. పిల్లలను చూసుకుంటూ ఉద్యోగాలు చేస్తూ ఇంటి పనులు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నా.. పని మనుషులను పెట్టుకోవడం చాలా మంచి ఆప్షన్ అనుకుంటారు. దీనికి తగ్గట్టే చాలా మంది పని మనుషులు నమ్మకంగా ఉంటారు.  నిజాయితీగా పని చేస్తూ ఒకే చోట కాకుండా వివిధ ఇళ్ళలో పని చేస్తూ కుటుంబాలను పోషించుకుంటూ ఉంటారు కూడా. అయితే మనుషుల మీద నమ్మకంతో చాలామంది చాలా విషయాలు పని మనుషుల దగ్గర చర్చిస్తూ ఉంటారు.  పని మనిషిని ఇంట్లో మనిషిగా చూస్తూ అన్ని చెప్పుకుంటూ ఉంటారు కూడా.  కానీ కొన్ని సార్లు కొన్ని విషయాలు వారి ముందు  చర్చించడం వల్ల  ఇంటి భద్రతకు, కుటుంబ సభ్యుల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. లాకర్..  ఇంట్లో లాకర్ ఉండి, అందులో నగలు, డబ్బు మొదలైనవి ఉంచినట్లయితే. ఇంటి పనిమనిషి ముందు దాని గురించి అస్సలు మాట్లాడకూడదు. మీరు దాని స్థానాన్ని కూడా బయటకు ప్రస్తావించకూడదు.  కొందరు ఇంట్లో వారితో మాట్లాడుతూ.. ఫలానా వస్తువు లాకర్ లో ఉంది చూడు,  లాకర్ కీస్ ఫలానా చోట ఉంటాయి చూడు అంటూ మాట్లాడుతుంటారు.  పని మనిషి చాలామంచిది లే అనుకుంటారు. కానీ ఇది లాకర్ గూర్చి,  లాకర్ లో ఉండే వస్తువుల గూర్చి అభద్రతను ఏర్పరుస్తుంది. ఖర్చులు.. ఖర్చుల గురించి మాట్లాడకూడనంత పెద్ద  విషయం ఏంటని చాలా మందికి అనిపించవచ్చు. కానీ ఇక్కడ కూరగాయలు, కిరాణా మొదలైన చిన్న ఖర్చులు అయితే పర్లేదు.. కానీ  షాపింగ్ కు వెళ్లి వచ్చిన ఖర్చులు.. ఖరీదైన వస్తువులు కొన్న ఖర్చులు. ఖరీదైన వస్తువులు మొదలైనవి చర్చించ కూడదు.  నెలకు రూ. 2000 చెల్లించే పనిమనిషి ముందు   వేల రూపాయల ఖర్చుల గురించి ప్రస్తావించడం, చర్చించడం.. వాటి గూర్చి చెప్పడం అస్సలు మంచిది కాదు. ప్రయాణాలు.. బయటకు వెళ్లాలని అనుకుంటే దానికి సంబంధించిన సమాచారాన్ని పని మనుషులకు చెప్పకుండా ఉండటం మంచిది.    ఎక్కడికి వెళుతున్నారు, ఏ సమయానికి వెళతారు, ఎప్పుడు వస్తారు, ఎంత ఖర్చవుతుంది వంటి ఏవైనా వివరాలను ఇంట్లో పనిమనిషి లేనప్పుడు మాత్రమే చర్చించాలి. ఎక్కువ రోజుల ప్రయాణాలు చేయాల్సి వస్తే ఒకరోజులో వచ్చేస్తా అని చెప్పి ఆ తరువాత షెడ్యూల్ మారిందని మీకు కావల్సినన్ని రోజులు పని మనిషిని రావొద్దని చెప్పవచ్చు. కానీ ఇన్ని రోజులు ఊర్లో ఉండను అనే విషాయన్ని  ముందే చెప్పకండి. పిల్లల సమాచారం.. పిల్లలు ఏ పాఠశాలలో చదువుతున్నారు, వారి ఫీజులు ఎంత, వారు కోచింగ్ లేదా ప్రాక్టీస్ కోసం ఎక్కడికి వెళతారు, వారిని ఎవరు పికప్ చేస్తారు, వారి టైమింగ్‌లు ఏమిటి,  వారికి పాకెట్ మనీ ఎంత ఇస్తారు, వారు ఎక్కడికి వెళతారు మొదలైనవి పనిమనిషి ముందు లేదా వారితో నేరుగా సమాచారాన్ని పంచుకోవడం చేయకూడదు. మొబైల్, ఇంటర్నెట్.. మొబైల్,  ఇంటర్నెట్ వంటి రెండు అంశాలుగ చాలా కీలకంగా మారాయి.  ఇవి జీవితంలో సౌలభ్యంతో పాటు అతిపెద్ద భద్రతా ముప్పును కూడా తెచ్చాయి. కొంచెం వివరాలు బయటకు పొక్కినా  బ్యాంక్ అకౌంట్  మొత్తం ఖాళీగా అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల పని మనిషి ముందు వీటికి సంబంధించిన వివరాలు చెప్పకూడదు. అలాగే వస్తువుల విలువ కూడా బయటకు చెప్పకూడదు.                                          *రూపశ్రీ.  

National Energy Conservation Day

మనం చేసే పొదుపు, భవిష్యత్తు తరాలకి అందించే బహుమతి...జాతీయ ఇంధన పరిరక్షణా దినోత్సవం 2024!

  శరీరానికి నీరు ఇంధనం వంటివి అని చెబుతారు. ఒక వాహనానికి ఇంధనం ఎంత అవసరమో.. మనిషి శరీరానికి నీరు అంతే అవసరం. శరీరానికి నీరు బాగా లభిస్తేనే శరీరంలో అవయవాలు బాగా పని చేస్తాయి. అట్లాగే మనిషి జీవితంలో బోలెడు కార్యకలాపాలు సాగడానికి ఇంధనాలు అవసరం అవుతాయి. ప్రకృతి ఇచ్చిన సహజ వనరులతో పాటు.. చాలా రకాల ఇంధనాలు మనిషి రోజువారీ జీవిత కార్యకలాపాలకు అవసరం. కొన్ని వనరులను ఒక రూపం నుంచి మరో రూపానికి మార్చగలం తప్ప సృష్టించలేము అనే విషయం తెలిసిందే. ఇలా వనరుల మీద అవగాహన పెంచి మానవ మనుగడను ఇబ్బందులలో పడకుండా ఉండేందుకు అందరికీ అవగాహన కల్పించే దిశగా ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీని గూర్చి మరింతగా తెలుసుకుంటే.. జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం.. 1991వ సంవత్సరం డిసెంబర్ 14న, మొదటిసారి  మన భారతదేశంలో ‘జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని’ జరుపుకున్నారు. 2001 ఎనర్జీ కన్జర్వేషన్ యాక్టులో  భాగంగా  ‘బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ’ (BEE) స్థాపించబడింది. అప్పటి నుండి ప్రతీ సంవత్సరం ఇంధనం   పొదుపు చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించడానికి  వ్యక్తులు, పరిశ్రమలు,  ప్రభుత్వ సంస్థలు వినియోగించే శక్తి వృధా కాకుండా చూడటం, పచ్చదనంతో కూడిన వాతావరణాన్ని పెంచడం,   ఇంధన-పొదుపు పద్ధతులను అనుసరించేలా ప్రోత్సహించడమనే విషయాలను లక్ష్యంగా చేసుకుని సాగుతోంది.  ఈ దినోత్సవాన్ని విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ అవగాహన ప్రచారాలు, అవార్డు వేడుకలు, వ్యక్తిగత, సంస్థాగత స్థాయిలలో శక్తి పరిరక్షణా  ప్రాముఖ్యతను తెలియజేసే కార్యక్రమాల రూపంలో జరుపుతుంది.  థీమ్.. "పవరింగ్  సస్టైనబిలిటీ: ఎవ్రీ వాట్ కౌంట్స్”. ఈ థీమ్ స్వల్ప స్థాయిలోనైనా ఇంధన సంరక్షణలో వ్యక్తిగత, సామూహిక ప్రయత్నం చేయటంలో ఉన్న  కీలక పాత్రను నొక్కి చెబుతుంది. వ్యక్తులు, పరిశ్రమలు, ప్రభుత్వాలు స్థిరమైన ఇంధన పొదుపు  పద్ధతులను అవలంబించేలా ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం.   ప్రాముఖ్యత.. బాధ్యతాయుతంగా ఇంధనాలను ఉపయోగించుకోవాలనే ఆలోచన పెంచి,  పెరుగుతున్న ఇంధన డిమాండ్ల గురించి ప్రజలకు అవగాహన కల్పించి, ఇంధన పొదుపు పద్ధతుల వైపు మళ్లేలా వారిని ప్రోత్సహించడమే  దీని ప్రత్యేకత.   ఇంధన పొదుపు  ప్రాముఖ్యతపై వ్యక్తులు, సంస్థలు, పరిశ్రమలకు అవగాహన కల్పిస్తుంది.   స్థిరమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది.  శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించవలసిన విషయాన్ని నొక్కి చెప్తుంది.  ఇంధన భద్రతను సాధించాలనే మన  భారతదేశ లక్ష్యానికి మద్దతు ఇస్తుంది.  పర్యావరణం దెబ్బతినటానికి కారణమవుతున్న  కార్బన్ ఫుట్ ప్రింటుని వీలైనంతవరకూ  తగ్గించాల్సిన ఆవశ్యకతని తెలియజేస్తుంది.   ప్రభుత్వాలు, సంస్థలు ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా, ఎంతలా మనకి పొదుపు గురించి చెప్పినా కూడా చివరికి ఫలితం రావటమనేది ప్రతీ వ్యక్తి చేతిలో ఉంటుంది. వ్యక్తిగతంగా మనం ఎంతవరకూ దాని కోసం పని చేస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి మన  ఇంట్లో అవసరం లేకుండా వెలిగే ఒక లైటునో, తిరుతున్న ఒక ఫ్యానునో ఆపకుండా బయటకి వచ్చి పర్యావరణం గురించి, కాలుష్యం గురించి మాట్లాడటం వింతగా ఉంటుంది కదా.. అందుకే ఇంధన పొదుపుకి ఉన్న ఆవశ్యకత, అవసరం తెలుసుకుని, దానికి తగిన చర్యలు మన ఇంటినుంచి  మనమే మొదలుపెట్టాలి.  పౌరులంతా బాధ్యతగా ప్రవర్తిస్తే ఇదేమీ అసాధ్యం కాదు... ఈ రోజు మనం ముందడుగు వేయకపోతే మన భవిష్యత్తు తరాలకి అందాల్సిన శక్తివనరులని మనమే హరించి, చేతులారా మనమే వారి జీవితాలని నరకం చేసినవాళ్లమవుతాం....                              *రూపశ్రీ 

Sri Potti Sriramulu death Anniversary

తెలుగుజాతి మరవలేని త్యాగం.... మరవకూడని త్యాగం…శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి 2024

  ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవియైన మహాపురుషుడని, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడని, మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడని అంటూ ఆయన చేసిన త్యాగాన్ని  ఏదో రెండు మాటల్లో చెప్పేస్తే అయిపోయేది కాదు. ఒక మనిషి తన శరీరం నిలువునా కుళ్లిపోతున్నా, క్రుంగి కృశించిపోతున్నా కూడా తన కోసం, తన కుటుంబం కోసం  కాకుండా, నిస్వార్ధంగా మొత్తం తెలుగు జాతి ఆత్మ గౌరవం కాపాడటం కోసం, 1952వ సంవత్సరం,  డిసెంబర్  15న తన ఆత్మ శరీరాన్ని విడిచే వరకూ పోరాటం చేశారు. ఆయన మరెవరో కాదు, శ్రీశ్రీ పొట్టి శ్రీరాములు గారు. తెలుగువారిగా మనమిప్పుడు  పొందుతున్న గౌరవం ఆనాడు  ఆయన చేసిన త్యాగం వల్ల వచ్చిందని ఇప్పటికీ తెలుగుజాతి వారందరకీ  తెలియకపోవటం చాలా  బాధాకరం.  మన జాతి కోసం ప్రాణాలర్పించిన ఆ మహనీయుని గురించి తెలుసుకోవాల్సిన అవసరం  నేటి యువతకి ఎంతైనా ఉంది.....    జీవిత విశేషాల.. పొట్టి శ్రీరాములుగారు  1901,  మార్చి 16వ తేదీన న మద్రాసునగరంలోని, జార్జిటౌనులో నివాసముంటున్న   గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. వారి పూర్వీకులది ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని, కనిగిరి ప్రాంతంలో ఉన్న  పడమటిపల్లె గ్రామం. ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసు లోనే జరిగింది. తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదివాడు. తరువాత "గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే"లో చేరి,  దాదాపు నాలుగేళ్ళు అక్కడే ఉద్యోగం చేసాడు. 1928లో శ్రీరాములు దంపతులకి కలిగిన బిడ్డ చనిపోయాడు. తరువాత కొద్ది రోజులకే అతని భార్య కూడా చనిపోయింది. ఈ బాధాకర సంఘటనలన్నీ ఎదుర్కొన్న 25 ఏళ్ల వయసున్న  శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేసాడు. ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి, గాంధీజీ అనుచరుడిగా  సబర్మతి ఆశ్రమంలో చేరాడు. స్వాతంత్ర్యోద్యమంలో కూడా పాల్గొన్నాడు. భారత స్వాతంత్రోద్యమంలో పాత్ర.. పొట్టి శ్రీరాములు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించాడు. తర్వాత మళ్ళీ 1941-1942 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల మూడుసార్లు జైలుశిక్ష అనుభవించాడు. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లోను, ఆంధ్రలో కృష్ణా జిల్లాలోని కొమరవోలులోను గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.  కొమరవోలులో యెర్నేని సుబ్రహ్మణ్యం నెలకొల్పిన గాంధీ ఆశ్రమంలో చేరాడు. కులమతాల పట్టింపులు లేకుండా ఎవరి ఇంట్లోనైనా భోజనం చేసేవాడు. 1946లో నెల్లూరు జిల్లా  మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశంకోసం నిరాహారదీక్ష బూని, సాధించారు. మరోసారి నిరాహారదీక్ష చేసి, మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపజేసారు. గాంధీజీకి శ్రీరాములు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు పదిమంది ఉంటే ఒక్క సంవత్సరంలోనే స్వతంత్రం సాధించవచ్చునని గాంధీజీ అనేవారట.   జీవితం చివరిదశలో నెల్లూరులో ఉంటూ, ఆయన హరిజనోద్ధరణకు కృషిచేసాడు. దీనిగురించిన నినాదాలను అట్టలమీద  రాసి, మెడకు వేలాడేసుకుని ప్రచారం చేసేవాడు. కాళ్ళకు చెప్పులు, తలకు గొడుగు లేకుండా మండుటెండల్లో తిరుగుతూ ప్రచారం చేసే ఆయన్ను పిచ్చివాడనేవారు. కానీ  ఆ పిచ్చివాడే ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకుని, అమరజీవి అయ్యాడు. ఆంధ్ర రాష్ట్రసాధన దీక్ష.. అప్పట్లో మనం మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలోనే ఉండేవారం.  మద్రాసు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రకాశం పంతులు గారు..  రాజగోపాలాచారి  రాజకీయానికి, అహంకారానికి బలై తన పదవిని పోగొట్టుకున్నారు. దాంతో తెలుగువారంటే ఆరంభ శూరులు మాత్రమేనని పుకారు అంతటా పుట్టించారు. తమిళుల హేళనలు దౌర్జన్యాలు మితిమీరినా కూడా, మనల్ని తెలుగువారు అని కాకుండా మద్రాసీయులనే  పిలిచేవారు. స్వాతంత్ర్యం వచ్చాక కూడా మనకు గుర్తింపులేదు. మద్రాసు మొదలు తంజావూరు వరకు తెలుగువారితో నిండిపోయింది. కానీ తెలుగుకు మాత్రం ప్రాధాన్యత లేదు. 1952 నాటికి కూడా  మద్రాసు వాళ్లమనే తప్ప  ఆంధ్రావాళ్లంటే ప్రపంచానికి తెలియదు. ఈ బాధ భరించలేక స్వామి సీతారాం అనే ఆయన గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కానీ రాజాజీ ప్రభుత్వం ఆ శిబిరాన్ని అణచివేసి,  సీతారాం దీక్షను భగ్నం చేసింది. పైగా తెలుగువారు ఆరంభశూరులు అని మళ్ళీ హేళన చేసింది.  ఈ అవమానాన్ని దిగమింగుకోలేని పొట్టి శ్రీరాములుగారు స్పందించారు. సర్కార్ ఎక్స్ ప్రెస్లో గుడివాడలో ఎక్కి మద్రాసులో దిగి 1952,  అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తిగారి ఇంట దీక్ష ప్రారంభించారు. చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష, క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. రాజాజీ కోపంతో ఊగిపోయాడు. రాష్ర్టాన్ని ముక్కలు కానివ్వను అని సవాల్ చేశారు.  ఎవరైనా కాంగ్రేస్ వారు ఆ వైపుకు వెళ్ళారా.... వారి అంతు చూస్తానన్నారు. దీనితో కాంగ్రెస్ వాడైన పొట్టి శ్రీరాములు ఒంటరివాడైపోయాడు.  9వ రోజు నెహ్రూకి తెలిసి రాజాజీకీ పోన్ చేసారు. అవన్నీ ఉడత ఊపులేనని తాను అణిచివేస్తానని రాజాజీ నెహ్రూకు నమ్మబలికారు. తెలుగువారు లక్షల మంది ఉన్న మద్రాసు నగరంలో ఆదరణ లభిస్తుందనుకుంటే ఒక్కరూ అటువైపు రాలేదు. అప్పట్లో తెలుగువారి ఐక్యత అంత హీనంగా ఉండేది.  ఈ సమస్య కాంగ్రెస్ ది కాదని, తెలుగువారి ఆత్మగౌరవం కోసమని నాయకులు గ్రహించలేకపోయారు. తెలుగు నాయకులంతా ముఖం చాటేశారు. ప్రజలు మాత్రం శ్రీరాములకి మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు.  58 రోజులు ఒక మనిషి ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తుంటే ఏ తెలుగువారికీ జాలీ దయ కలగలేదు. టంగుటూరి ప్రకాశం పంతులుగారు రాజాజీకీ వ్యతిరేకం గనుక ఆయన వెళ్ళి మద్దతు ప్రకటించారు. రోజురోజుకూ ఆరోగ్యం క్షీణస్తున్నా, శ్రీరాములులో మనోధైర్యం మాత్రం మరింత పెరుగుతుండేది. పొట్టిశ్రీరాములు శారీరక స్థితి నిరాహారంతో ఎప్పుడో అదుపుతప్పింది. శరీరం ఎంత క్షీణిస్తున్నా కూడా డాక్టర్లు వారిస్తున్నప్పటికీ కూడా  ఆయన స్పృహలో లేని సమయంలో కూడా తనకి ఏ గ్లూకోజ్ ఎక్కించద్దని ఖరాఖండిగా చెప్పేశారు. క్రుంగిపోతున్న శరీరం వల్ల కలిగే  బాధ భరించలేక ఆయన గావుకేకలు పెట్టేవారు. పేగులు పుండ్లుపడి పురుగులు  నోటి వెంట వచ్చేవి. కళ్ళు చెవులు నుంచి కూడా వచ్చేవి. జీర్ణవ్యవస్థ తిరగబడి మలం కూడా నోటినుంచి వచ్చేది. వర్ణించటానికి వీలులేనంత దారుణమైన శారీరక దాష్టీకంతో నిండుకుండ వంటి శ్రీరాములు నిర్జీవుడవ్వటానికి 58 రోజులుపట్టింది. అలా  డిసెంబర్ 15,  రాత్రి 11.23 గంటలకు పొట్టి శ్రీరాములు ఆంధ్రరాష్ట్రం కోసం తనను తాను బలిదానం చేసుకొన్నాడు.  ఆయన తెలుగువారి కోసం ఎంత దారుణమైన మరణవేదన అనుభవించి అసువులు బాసారో చెప్పటానికి మాటలే లేవు.  చనిపోయిన తర్వాత.. అతి దారుణమైన విషయమేంటంటే,  ఆయన మన తెలుగువారి కోసమే చనిపోయారని తెలిసినా కూడా ఆయన పార్ధివదేహాన్ని ముట్టుకోవడానికి కూడా మొదట తెలుగువాళ్లు రాలేదు. తెలుగుజాతి కోసం తన ప్రాణాలు దానం చేసిన ఆ మహనీయుడి పార్ఢివదేహాన్ని  ఎవరికీ తెలియకుండా తీసుకువెళ్ళటం సబబుకాదని భావించి, తెలుగువాళ్ళ కళ్లు తెరిపించడానికి యేర్నేని సాధు సుబ్రహ్మణ్యం , ఘంటసాలగారు మరికొంతమంది ముందుకి వచ్చి   ఒక ఎద్దులబండి మాట్లాడి దేహాన్ని  అందులోకి ఎక్కించారు. ఘంటసాలగారు అప్పటికప్పుడే ఆశువుగా తన వీరకంఠాన్ని ఎలుగెత్తి ‘తెలుగుజాతి పౌరుషం చచ్చిందని, చీము నెత్తురు లేని తెలుగుజాతి కోసం అసువులు  బాసిన శ్రీరాములు నువ్వంటూ’  గొంతెత్తి పాడుతూ శవయాత్ర ప్రారంభించారు. యేర్నేని సాధు సుబ్రహ్మణ్యంగారే అమరజీవి శ్రీరాములకు దహనక్రియలు,  కర్మకాండ జరిపారు. పొట్టి శ్రీరాములు గారు  ప్రాణాలర్పించిన విషయం తెలిసిన  ప్రజలు ఆగ్రహావేశులై, హింసాత్మకచర్యలకు పాల్పడ్డారు. చివరికి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ దిగి వచ్చి, డిసెంబర్ 19న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేస్తూ ఒక  ప్రకటన చేసారు. అలా కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1న  ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచారు. ఇలా పొట్టి శ్రీరాములు గారు అమరుడై ఆంధ్రరాష్ట్ర సాధనకు కారణమయ్యాడు.                                   *రూపశ్రీ 

text neck syndrome symptoms

టెక్స్ట్ నెక్ సిండ్రోమ్..వామ్మో యూత్ లో పెరిగిపోతున్న ఈ వ్యాధి గురించి తెలుసా?

  ప్రపంచవ్యాప్తంగా యువతలో  టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అనే వ్యాధి పెరిగిపోతోందట. సోషల్ మీడియా మొత్తం ఈ వ్యాధి గురించి కోడై కూస్తోంది.  జీవనశైలి,  ఆహారం.. ఈ రెండూ  ప్రపంచవ్యాప్తంగా అన్ని వయసుల ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేశాయి. యువత  కూడా ఎక్కువగా దీని బారిన పడుతున్నారు. యువతలో పెరుగుతున్న మధుమేహం,  రక్తపోటు సమస్య నిపుణులను ఆందోళనకు గురిచేయడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా యువతలో పెరుగుతున్న టెక్స్ట్ నెక్ వ్యాధి ఇప్పుడు అందరిని కలవర పెడుతోంది. ఈ సమస్య భరించలేని నొప్పిని కలిగించడమే కాకుండా అనేక  అసౌకర్యాలను కూడా పెంచుతుందని అంటున్నారు. అసలు టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అనే సమస్య ఏంటి? ఇది ఎందుకు వస్తుంది? దీని నివారణకు ఏం చేయాలి? తెలుసుకుంటే..  టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అనేది కొత్త పదం. దీనిని టెక్ నెక్ లేదా స్మార్ట్‌ఫోన్ నెక్ అని కూడా అంటారు. ముందుకు వంగి మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కువసేపు చూడటం వలన మెడపై అదనపు ఒత్తిడి,  టెన్షన్ పెరుగుతుంది. దాని కారణంగా టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ సమస్య వస్తుంది. సింపుల్ గా  అర్థం చేసుకుంటే స్క్రీన్ వైపు చూసేందుకు  తలను ముందుకు,  క్రిందికి వంచినప్పుడు టెక్స్ట్ నెక్ సమస్య ఏర్పడుతుంది.  దీని కారణంగా మెడ  వెన్నెముకపై ఒత్తిడి మళ్లీ మళ్లీ పెరుగుతుంది. కదల్చకుండా ఉన్నప్పుడు  మనిషి తల 10-12 పౌండ్ల (నాలుగున్నర నుండి ఐదు కిలోల వరకు) మధ్య బరువు ఉంటుంది.  కానీ ముందుకు వంగినప్పుడు ఈ బరువు పెరుగుతుంది. ఇది మెడ కండరాలు,  వెన్నెముకపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది.  35 శాతం మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు టెక్స్ట్ నెక్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారని తేలింది. 15-18 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు స్మార్ట్‌ఫోన్‌లలో ఎక్కువ సమయం గడిపేవారికి ఈ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ మెడ, ఎగువ వీపు,  భుజాలలో నొప్పిని కలిగిస్తుంది. సకాలంలో వైద్యం అందకపోవడం వల్ల సమస్యలు పెరుగుతాయి. చికిత్స చేయకుండా వదిలేస్తే మెడ నొప్పి చుట్టుపక్కల కండరాలను కూడా ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది. ఎగువ వెనుక కండరాలలో అసమతుల్యత ప్రమాదం కూడా పెరుగుతుంది. దీనితో పాటు  కొంత సమయం పాటు మెడను ఒకే భంగిమలో ఉంచడంలో ఇబ్బంది పడవచ్చు. టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ సమస్య కాలక్రమేణా మీ 'జీవన నాణ్యత'పై కూడా ప్రభావం చూపుతుంది. పరిష్కారాలు.. టెక్స్ట్ నెక్ సమస్య రాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తూనే ఉండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. యువకులు తమ ఫోన్‌లతో ఎక్కువ నిమగ్నమై ఉంటారు కాబట్టి, వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగిస్తున్నప్పుడు సరైన భంగిమలో ఉండటం ముఖ్యం.  మెడను చాలా ముందుకు వంచకూడదు.  ఏ వస్తువు వాడినా దాన్ని కంటి ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. మెడ మరియు భుజాలను సాగదీయడానికి,  విశ్రాంతి తీసుకోవడానికి తరచుగా విరామం తీసుకోవాలి. ల్యాప్‌టాప్ స్టాండ్‌లు,  ఫోన్ హోల్డర్‌లను ఉపయోగించడం ద్వారా కూడా టెక్స్ట్ నెక్ సిండ్రోమ్‌ను నివారించవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే కొంత సమయం వరకు మెడ లేదా వెన్నునొప్పి ఉంటే, దానిని నిర్లక్ష్యం చేయకూడు.  ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.                                                               *రూపశ్రీ.  

Is wearing woolen clothes itchy

ఉన్ని దుస్తులు ధరిస్తే దురద పెడుతోందా? ఇలా ఎందుకు అవుతుందంటే..!

సీజన్ ను బట్టి దుస్తులను మార్చడం సహజం.  చలికాలంలో ఉన్ని దుస్తులు, స్వెట్టర్లు ధరిస్తే.. వేసవికాలంలో కాటన్ దుస్తులు ధరిస్తుంటాం. అయితే చలికాలంలో ధరించే ఉన్ని దుస్తుల విషయానికి వస్తే చాలామంది అలెర్జీని అనుభవిస్తారు.  ముఖ్యంగా ఈ ఉన్ని దుస్తులు వేసుకోగానే దురదలు వస్తాయి.  చలికి ఇబ్బంది పడే చర్మం మీద ఈ ఉన్ని దుస్తుల వచ్చే దురదలు మరింత అసౌకర్యం కలిగిస్తాయి. అయితే.. ఉన్ని బట్టలు ధరించినప్పుడు ఇలా దురద ఎందుకు పెడుతుందో తెలుసుంటే.. ఉన్ని దుస్తులు ధరించినప్పుడు కొందరికి దురద వస్తుంది. దీనికి టెక్స్టైల్ డెర్మటైటీస్ సమస్య కారణం కావచ్చని అంటున్నారు చర్మ సంరక్షణ నిపుణులు.  దీన్ని ఉన్ని అలెర్జీ అని కూడా పిలుస్తారు.  ఉన్ని దుస్తుల ఫైబర్ క్లాత్ కు మానవ శరీర చర్మం టచ్ అయినప్పుడు చర్మం రియాక్షన్ అవుతుంది. దీని వల్ల దురద కలుగుతుంది. ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు చలికాలంలో ఉన్ని దుస్తులు ధరించినప్పుడు ఈ ఉన్ని దుస్తుల అలెర్జీ సమస్యను ఎక్కువగా ఎదుర్కుంటారు. ఉన్ని దుస్తుల ఫైబర్స్ ను చర్మం పై రుద్దినప్పుడు చర్మం పై ఎర్రటి దద్దుర్లు ఏర్పడతాయి.  దీని కారణంగా చర్మం మరింత కందిపోయనట్టు అవుతుంది. చలికాలంలో ఉన్ని దుస్తులను ధరించడం వల్ల ఇలా అలెర్జీ ఎదుర్కునే సమస్య ఉన్నా సరే.. కొందరు చలికారణంగా వాటినే ధరించాలని అనుకుంటారు.  చాలామంది ఇదొక అలెర్జీ సమస్య అనే విషయం కూడా తెలియదు. ఈ కారణంగా అలెర్జీ ఉన్నా సరే దుస్తులు ధరిస్తారు. కానీ ఇలా అలెర్జీ ఉన్నవారు ఉన్నికి బదులు ఇతర ఫ్యాబ్రిక్స్ ను కూడా ఉపయోగించవచ్చు. ఒకవేళ ఉన్ని దుస్తులు ధరించడం వల్ల అలెర్జీ ఎదురవుతూ ఉంటే సింపుల్ గా పాత ఉన్ని స్వెటర్లు,  దుస్తులను  ఎండలో ఉంచి ఆ తరువాత వాటిని డ్రై క్లీన్ చేసిన తరువాత వాటిని ధరించాలి. అప్పుడే స్కిన్ అలెర్జీలు తగ్గే అవకాశం ఉంటుంది.                                                    *రూపశ్రీ.

International Universal Health Coverage Day

ఇంటర్నేషనల్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే 2024…!

  నేడు పేదవారైనా, మధ్య తరగతివారైనా ఆరోగ్యం కాపాడుకుంటే చాలు  ఆస్తి కాపాడుకున్నట్టే అని భావిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో వైద్యం  అంత సులువుగా అందట్లేదు. ప్రతినెలా సాధారణ ఖర్చులు  వెళ్లబెట్టటానికే కష్టపడుతున్న కుటుంబంలో ఒకరికి ఏదైనా పెద్ద అనారోగ్యం వస్తే ఖర్చుపెట్టి  వైద్యం చేయించుకునేంత స్థోమత ఉండదు. ఆ కుటుంబం తీవ్ర పేదరికంలోకి లాగేయబడుతుంది. దీనికి తగ్గట్టు ప్రపంచం కూడా చాలా రకాల ఆరోగ్య సమస్యల ఉచ్చులో చిక్కుకుంటోంది. వీటిని అధిగమించడానికి సరైన జీవనశైలి సగటు పౌరుడికి కష్టంగా మారుతోంది.  ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ సార్వత్రిక ఆరోగ్య కవరేజీని అందించే దిశగా దేశాలను ప్రోత్సహించే తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి 2012వ సంవత్సరం డిసెంబర్ 12న ఆమోదించింది.  అప్పటినుంచి  ప్రతీ ఏటా డిసెంబర్12న అంతర్జాతీయ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డేగా జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరికీ,  ప్రతిచోటా నాణ్యమైన, చవకైన ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉండాలనేదే దీని వెనుక ఉన్న ఆలోచన.. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే : ఇంటర్నేషనల్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే అనేది ప్రపంచంలో బలమైన ఆరోగ్య వ్యవస్థ అవసరం గురించి అవగాహన పెంచడానికి ఉద్దేశించబడింది.  ఇప్పటికీ మంచి  ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను పొందలేకపోతున్న   లక్షలాది మంది ప్రజల గురించి అవగాహన కల్పిస్తుంది. తద్వారా ఆరోగ్య రంగంలో  ప్రపంచ దేశాల నాయకులను మరింత వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సహిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ రోజున కొత్త థీమ్‌ను అనుసరిస్తూ  ఆ సంవత్సరానికి సంబంధించిన ఎజెండాను హైలైట్ చేస్తుంది.  2024 థీమ్:    “ఆరోగ్యం-  ప్రభుత్వ బాధ్యత” అనే అంశం ఈ ఏడాది థీమ్ గా ఎంచుకోబడింది.  ఇది ప్రజలందరికీ సమానమైన ఆరోగ్య సంరక్షణను అందించడంలోనూ,  ప్రపంచ ఆరోగ్య ఈక్విటీని పరిష్కరించడంలోనూ, వైద్య ఖర్చులని తగ్గించి ఆర్థిక రక్షణను ప్రోత్సహించడంలోనూ ‘ప్రభుత్వాల పాత్రను’  తెలియజేస్తుంది.  ఎందుకు అవసరం? ఈరోజు ప్రజలు గడుపుతున్న జీవనశైలిని పరిశీలిస్తే.. మంచి వైద్యం అందటం కూడా ఒక అవసరంగా మారిపోయింది.  ముఖ్యంగా పట్టణీకరణ చెందిన  దేశాలలో పౌరులు అనేక ఆరోగ్య సమస్యలకు దారితీసే ఒక వేగవంతమైన జీవనశైలిని గడపడం అలవాటు చేసుకున్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ 2022 నివేదిక ప్రకారం, పట్టణీకరణ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు అధిక వైద్య ఖర్చుని  ఎదుర్కొంటున్నాయి.  దీని ఫలితంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య వైద్య వనరుల వ్యత్యాసానికి దారితీస్తుంది. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అనేది ప్రజలు  నివసించే ప్రాంతంతో సంబందం లేకుండా  అందరికీ సమానమైన ఆరోగ్య సంరక్షణ అవకాశాలను అందించడం ద్వారా ఒక పరిష్కారాన్ని అందిస్తుంది. యూనివర్సల్ హెల్త్ కవరేజ్(UHC) అనేది వ్యక్తులు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోకుండా వారికి అవసరమైనప్పుడు ఎక్కడైనా నాణ్యమైన  ఆరోగ్య సేవలను పొందగలిగేలా చేయటమే  లక్ష్యంగా పెట్టుకుంది. ఇది చికిత్స నుండి ప్రత్యేక సంరక్షణ వరకు అన్నింటికీ అవసరమైన ఖర్చులని  కవర్ చేస్తుంది.  యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ప్రయోజనాలు ఇవే.. అందరికీ ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉంటుంది.  సాంఘిక, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ సమానంగా ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందించటమే యూనివర్సల్ హెల్త్ కవరేజ్  అత్యంత ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి.  అనుకోకుండా ఏర్పడే ఆర్థిక భారాల నుండి రక్షిస్తుంది. ఇది వ్యక్తులు, కుటుంబాలను ఆరోగ్యం కోసం చేసే  ఖర్చుల నుండి రక్షిస్తుంది. వారిని  వైద్య ఖర్చుల వల్ల పేదరికంలోకి  పడకుండా చేస్తుంది. ఆరోగ్య సంరక్షణ ఖర్చులను వెంటనే పెట్టుకునే పని  లేకుండా చేయటం వల్ల   వైద్య రుణాలతో  కుటుంబాలు పేదరికంలో పడకుండా చేయటం వల్ల  వారి వద్ద ఉండే  డబ్బు పెట్టుబడులు రూపంలో ఆర్ధిక వ్యవస్థలోకి వచ్చి ఆర్ధిక వృద్ధి సాద్యమవుతుంది. పిల్లలు ఆరోగ్యంగా ఎదగడానికి, దేశం  అభివృద్ధికి దోహదపడే వ్యక్తులకు విద్యను అందించడానికి కూడా ఈ డబ్బు సాయపడుతుంది.  ప్రజలు వైద్య ఖర్చులకి భయపడి చికిత్స చేసుకోకపోతే కొన్ని వ్యాధులు  మహమ్మారిగా ప్రపంచమంతా ప్రబలే  అవకాశం ఉంటుంది. కానీ UHC వల్ల వాళ్ళు ఖర్చు భయం లేకుండా  వైద్యానికొస్తే ముందస్తుగా వ్యాధులని గుర్తించి, తగిన  చికిత్స చేయడానికి వీలవుతుంది. తద్వారా  ఆరోగ్యకరమైన, సురక్షితమైన ప్రపంచానికి దోహదం చేస్తుంది. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే అందరికీ సమానమైన ఆరోగ్య సంరక్షణ అవకాశాలను ప్రోత్సహిస్తుంది. వ్యక్తులు,  కుటుంబాలపై ఆరోగ్య సంరక్షణ ఖర్చుల ఆర్థిక భారాన్ని తగ్గించి మెరుగైన ఆర్థిక వృద్ధి,  అభివృద్ధి, మెరుగైన ఆరోగ్యం, పౌరుల శ్రేయస్సుతో సహా అనేక ప్రయోజనాలని కలిగి ఉంటుంది.  ఐతే ఐక్యరాజ్య సమితి UHCని ఆమోదించి 12 సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ,  ఇప్పటికీ ఎన్నో దేశాల్లో, ఎంతో మంది నాణ్యమైన, చవకైన వైద్యాన్ని పొందలేకపోతున్నారు. ఒక నివేదిక ప్రకారం సుమారు 20శాతం జనాభా వైద్యఖర్చుల వల్ల  పేదరికంలోకి జారిపోతోంది. .  ప్రజలను ముఖ్యంగా పేద, బలహీన వర్గాలవారిని  ఆరోగ్య ఖర్చుల నుండి రక్షించడంలో ప్రభుత్వాలు తగినంత పెట్టుబడి పెట్టే వరకు  ఈ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డేలు ఎన్ని జరిగినా ఉపయోగం ఉండదు. అందుకే WHO ఆర్థిక రక్షణ చర్యలను తీసుకోవటంలో  తక్షణ చర్య కోసం పిలుపునిచ్చింది. ప్రపంచమంతా అందరికీ సమానంగా సరైన వైద్య సదుపాయాలు అందాలని, ఆరోగ్యం కాపాడుకునే ప్రయత్నంలో ఏ ఒక్క వ్యక్తి లేదా కుటుంబం కూడా రోడ్డున పడకూడదనేదే దీని ఉద్దేశం.                                        *రూపశ్రీ 

UNICEF Foundation Day 2024

అవకాశాల నిచ్చెన అందిస్తే,  ప్రపంచంలోని పిల్లలంతా ప్రయోజకులే... యూనిసెఫ్ ఫౌండేషన్ డే 2024..!

  సాధారణంగా ఏ తల్లిదండ్రులైనా  ‘పిల్లలే మా ఆస్తి, వారిని పెంచి, పోషించి వారి కాళ్ళ మీద వారు నిలబడితే అదే చాలు’ అని అంటుంటారు. అదే లక్ష్యంగా పని చేస్తారు కూడా.  అయితే పిల్లల భవిష్యత్తు బాగుపడటానికి  అన్ని సౌకర్యాలు కల్పించే, అన్ని అవకాశాలు అందుకునేలా ప్రోత్సహించే తల్లిదండ్రులు ఉంటే పిల్లలకి ఎటువంటి ఇబ్బందీ లేదు. వారి హక్కులకి వచ్చిన ఆటంకమేమీ ఉండదు. కానీ ఈ ప్రపంచంలో చాలా మంది పేద, బలహీన వర్గాల్లోని పిల్లలు ఇప్పటికీ  కనీస సౌకర్యాలకి, సామాన్య హక్కులకి దూరమైపోతున్నారు.  అలాంటి పేద, బలహీన వర్గాల పిల్లల తల్లిదండ్రుల స్థానంలో నిలబడి, వారికి సాయం అందించి, భవిష్యత్తుకి భరోసా ఇవ్వటానికి, అలాగే అత్యవసర సహాయం అందించటానికి  ఒక సంస్థ ప్రాణం పోసుకుంది. అదే ‘యూనిసెఫ్’(UNICEF). యూనిసెఫ్ చరిత్ర: రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యవసర అవసరాలకు పరిష్కారంగా, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ (యూనిసెఫ్)ను  1946సంవత్సరం,  డిసెంబర్ 11వ తేదీన  ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ స్థాపించింది. కాలక్రమంలో ఇది ఐక్యరాజ్యసమితి వ్యవస్థలో శాశ్వత భాగంగా మారింది. దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్ సిటీలో ఉంది. ప్రారంభంలో ఇది రెండో ప్రపంచ యుద్ధ ప్రభావిత ఐరోపాలోని ప్రజలకు ఆహారం, బట్టలు, ఆరోగ్య సంరక్షణ సేవలు అందించేది. కానీ ప్రస్తుతం ఈ సంస్థ 190 కంటే ఎక్కువ దేశాలలో వివిధ కార్యకలాపాలతో, పిల్లల మేలుకోసం ప్రపంచ సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది.  ఈ సంస్థ శిశు మరణాలను తగ్గించడంలో, విద్యను మెరుగుపరచడంలో, పేద పిల్లలకు మద్దతు ఇచ్చే పనుల్లో అనేక విధాలుగా తోడ్పాటు అందించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా పిల్లల హక్కులు, సంక్షేమం కోసం గణనీయంగా కృషి చేసింది.  యూనిసెఫ్ చేసిన ఈ  పని ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడింది.  అందులో 1965లో యుద్ధాల వల్ల ప్రభావితమైన పిల్లలకు సహాయం చేయడంలో యూనిసెఫ్ చేసిన కృషికి నోబెల్ శాంతి బహుమతి కూడా  దక్కింది.   యూనిసెఫ్ ఫౌండేషన్ డే: యూనిసెఫ్ స్థాపించినదానికి గుర్తుగా ప్రతీ సంవత్సరం డిసెంబర్ 11న యూనిసెఫ్ ఫౌండేషన్ డే జరుపుకుంటారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా పిల్లల సంక్షేమంపై యూనిసెఫ్  ప్రభావాన్ని గుర్తుచేసుకుంటారు. విద్య అందించడం, అత్యవసర సహాయం చేయడం, పిల్లల హక్కులకు మద్దతు ఇవ్వడం ద్వారా యూనిసెఫ్ పిల్లల జీవితాలను మెరుగుపరచడంలో పోషిస్తున్న కీలక పాత్రని గుర్తించడం,  దాని కృషిని కొనియాడటం ఈ రోజు ముఖ్య ఉద్దేశ్యం. . ఈ ఏడాది డిసెంబర్11న యూనిసెఫ్  78వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. యూనిసెఫ్ చేసే పనులు..   టీకాలు, ఆరోగ్య కార్యక్రమాల ద్వారా పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం.  బాలికల జీవన పరిస్థితులను మెరుగుపరచడం. పేద వర్గాలలో   శిశు మరణాలను తగ్గించడం. ప్రకృతి విపత్తులు, యుద్ధాల వంటి అత్యవసర  సమయాల్లో సహాయం అందించడం. పిల్లలకి సమాన విద్యావకాశాలను అందిస్తూ, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం  చేస్తుంది. మరొక ముఖ్య విషయం ఏమిటంటే..  190 కంటే ఎక్కువ దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రతి పిల్లవాడికి మౌలిక అవసరాలు, హక్కులు అందించేలా కృషి చేస్తోంది. యూనిసెఫ్ 1946లో స్థాపించబడినప్పటి  నుండి నేటి వరకు పిల్లల జీవితాలని మెరుగుపర్చటంలో  విశేషమైన ప్రగతిని నమోదు చేసింది. యూనిసెఫ్  వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్లు మిలియన్ల కొద్దీ పిల్లలను నివారించదగిన వ్యాధుల నుండి రక్షించాయి. ఉదాహరణకు, 2018లో, 65.5 మిలియన్ల మంది పిల్లలకు పొలియో వంటి ఐదు వ్యాధులపై వ్యాక్సిన్లు అందించింది. సుమారు 4 మిలియన్ మంది తీవ్ర కుష్టు వ్యాధితో బాధపడుతున్న పిల్లలకి  చికిత్స అందజేసింది.  వారికి సహాయపడే పోషక ఆహారం, చికిత్సలు అందించింది.  12 మిలియన్ల మంది పిల్లలకు విద్యా అవకాశాలను అందించింది.  నాణ్యమైన విద్యను అందించడం, పాఠశాలలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం మీద దృష్టి పెట్టింది. యూనిసెఫ్ చేస్తున్న ఈ ప్రయత్నాలు భవిష్యత్ తరం కోసం ఒక బలమైన పునాది వేయడంలో సహాయపడుతున్నాయి. బాల హక్కుల ఒప్పందాన్ని  దాదాపు అన్ని దేశాలు ఆమోదించేందుకు యూనిసెఫ్ కృషి చేసింది.  ఇది పిల్లలపై హింస, దుర్వినియోగం, దోపిడీని నివారించడానికి గల మార్గాన్ని సుగమం చేసింది. 1965లో యుద్ధ ప్రభావిత పిల్లలకు సహాయం చేయడంలో యూనిసెఫ్ కృషికి నోబెల్ శాంతి బహుమతి లభించింది.  దీంతో ఇది  ప్రపంచ గుర్తింపుని పొందింది. యూనిసెఫ్ అత్యవసర సమయాల్లో కూడా వేగంగా స్పందించి,  ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవలు, సహాయ కార్యక్రమాలని  చేస్తోంది.   2018లో 90 దేశాలలో 285 మానవతా అత్యవసర పరిస్థితులకు స్పందించింది. ప్రకృతి విపత్తులు లేదా ఘర్షణల కారణంగా ఎదురయ్యే సంక్షోభ సమయంలో అవసరమైన వనరులను సమీకరించి, తక్షణ సహాయాన్ని అందించడంలో సమర్థవంతంగా పనిచేసింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో, యూనిసెఫ్ తన వ్యూహాలను సరిచేసుకుంది. ఇది ఆరోగ్య సమస్యలను పరిష్కరించడమే కాకుండా, విద్య, మానసిక ఆరోగ్యంపై ఏర్పడిన  ప్రభావాలను ఎదుర్కొనడంపై కూడా దృష్టి పెట్టింది. ఇలా యూనిసెఫ్ ప్రపంచ వ్యాప్తంగా జరిగే ప్రతి సంక్షోభంలోనూ,  ప్రతి విపత్తులోనూ పిల్లలకు అపన్న హస్తాన్ని అందిస్తోంది.                                            *రూపశ్రీ.  

International Mountain Day

పర్వతాలు పర్యావరణ వ్యవస్థకి  ప్రాణదాతలు.... ఇంటర్నేషనల్ మౌంటెన్ డే 2024..

  పర్వతాలు వాతావరణ సమతుల్యతను కాపాడటమే కాకుండా, మొక్కలజాతులు, నీటి వనరులు, జీవవైవిధ్యానికి ముఖ్యమైన మూలాలుగా ఉంటాయి. ఇవి ప్రపంచ ప్రధాన నదులకి  మూలాలు.  జలచక్రంలో ముఖ్యమైన పాత్ర పోషించి మానవ మనుగడకి అవసరమైన ఆహారోత్పత్తిలో కూడా సాయపడుతున్నాయి. పర్వతాలు పర్వత ప్రాంతాల్లో నివసించే వారికి మాత్రమే కాకుండా లోతట్టు ప్రాంతాల్లో నివసించే కోట్ల మందికి కీలకమైనవి. అంతర్జాతీయ పర్వత దినోత్సవ చరిత్ర: 1992లో జరిగిన ఐక్యరాజ్యసమితి పర్యావరణ సమావేశంలో, “విరిగిపోతున్న పర్యావరణవ్యవస్థ నిర్వహణ : సుస్థిర పర్వత అభివృద్ధి” అనే అధ్యాయాన్ని ఆమోదించారు. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి 2002ను పర్వతాల అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించింది. 2003 నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 11న అంతర్జాతీయ పర్వత దినోత్సవంగా  జరపాలని నిర్ణయించింది.  ఈ రోజు పర్వతాల అభివృద్ధిని ప్రోత్సహించడానికిగానూ స్థానిక, జాతీయ,  అంతర్జాతీయ స్థాయిలో కార్యక్రమాలను నిర్వహించడానికి ఐక్యరాజ్య సమితి ప్రజలకు పిలుపునిచ్చింది. ఐక్యరాజ్య సమితి ఈ పర్వత దినోత్సవ బాధ్యతను  ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO)కు అప్పగించింది. భూమి మీద జీవజాల మనుగడలో కీలక పాత్ర పోషిస్తున్న పర్వతాల ప్రాముఖ్యతను ప్రజలకి తెలియజేయడానికి,  ప్రధానంగా పర్వతాల సంరక్షణ అవసరాన్ని, వాటికి ఎదురయ్యే ముప్పులను గురించి అవగాహన కల్పించడంపై దృష్టి సారించడంలో ఈరోజు కీలకమవుతుంది. పర్వతాల సంరక్షణ సుస్థిర అభివృద్ధికి ముఖ్యమైనది.  వాతావరణ మార్పులు, పర్వతాల నుంచి దొరికే వనరుల అధిక వినియోగం కారణంగా తీవ్రమైన ముప్పులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో పర్వతాల సంరక్షణ అత్యవసరమని తెలియజేస్తుంది. అంతర్జాతీయ పర్వత దినోత్సవం 2024 - థీమ్: "స్థిరమైన భవిష్యత్తు కోసం పర్వత పరిష్కారాలు –ఆవిష్కరణ, అనుసరణ, యువత " అనే థీమ్ ను ఏడాది రూపకల్పన చేసింది.  కొత్త కొత్త ఆవిష్కరణల ద్వారా, సాంకేతికతని ఆడాప్ట్ చేసుకోవటం ద్వారా, యువతని భాగస్వామ్యం చేసుకోవటం ద్వారా పర్వత ప్రాంతాలకి చెందిన ప్రదేశాల వారసత్వ నిర్వహణ, స్థిరమైన అభివృద్ధికిగానూ  జియో పార్కుల సహకారాన్ని ప్రోత్సహించటం మీద దృష్టి సారించింది. యువత సుస్థిర భవిష్యత్తు నిర్మాణంలో పర్వత సముదాయాలు కీలక పాత్ర పోషిస్తాయనే విషయాన్ని ఈ అంశం హైలైట్ చేస్తోంది. అంతర్జాతీయ పర్వత దినోత్సవం ఎందుకు అవసరమంటే.. 2003 నుండి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) నేతృత్వంలో జరుపుకుంటున్న అంతర్జాతీయ పర్వత దినోత్సవం పర్వతాల ప్రాముఖ్యతపై ప్రజల్లో  అవగాహన పెంచుతుంది. ఇది పర్వత అభివృద్ధికి సంబంధించిన అవకాశాలు,  సవాళ్లను హైలైట్ చేస్తూ,  పర్వత సముదాయాల్లో  సానుకూల మార్పులు తీసుకురావడానికి ప్రజల  సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. పర్వతాల ప్రాముఖ్యతను గుర్తించడంలో,  వాటి సంరక్షణకు కృషి చేయడం వల్ల  పర్యావరణానికి, సమాజానికి ఎంత ప్రయోజనం ఉంటుందో గుర్తు చేయడం  ద్వారా ప్రజలలో అవగాహనను పెంచుతుంది. పర్వతాలు ఎందుకు ముఖ్యం..   పర్వతాలు జల చక్రంలో కీలకమైనవి.  శీతాకాలంలో పర్వతాలపై పడే మంచు వసంత, వేసవి కాలంలో కరుగుతుంది, ఇది వ్యవసాయం, నివాసాలు,  పరిశ్రమలకు అవసరమైన నీటిని అందిస్తుంది. పర్వతాలు లేకపోతే ఇది జరగదు.  కొన్ని చోట్ల సుమారు 90% నదుల నీరు పర్వతాల నుండే ఉత్పన్నమవుతుంది.  పర్వతాలు ప్రపంచ జనాభాలో సగానికి త్రాగునీటిని అందిస్తాయి. పర్వతాలు చెక్క, గనులు,  ఇతర వనరుల కోసం కూడా ముఖ్యమైనవి. పర్వతాల నుండి ప్రవహించే నీరు ప్రధాన హైడ్రోఎలక్ట్రిక్ శక్తికి మూలం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, పర్వత ప్రాంతాల నుండి లభించే వృక్ష,  ఇంధన వనరులు  ప్రాథమిక శక్తి మూలం. వ్యవసాయం, శుద్ధమైన శక్తి,  ఔషదాల కోసం కూడా పర్వతాలు ముఖ్యమైనవి. పర్వతాలు అనేక మొక్కలు,  జంతువులకు నివాసాన్ని అందిస్తాయి. ఇవి జీవవైవిధ్యాన్ని నిలబెట్టడంలో,  పర్యావరణ సమతౌల్యాన్ని కొనసాగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రపంచంలో ఉన్న జీవవైవిధ్య హాట్‌స్పాట్లలో అధికభాగం  పర్వతాల్లోనే ఉన్నాయి.పర్వతాలు ప్రకృతి యొక్క అమూల్యమైన ఆభరణాలు. ప్రపంచ జనాభాలో 15% ప్రజలు పర్వత ప్రాంతాల్లో నివసిస్తారు. భారత దేశంలో*హిమాలయాలు,  వింధ్య పర్వతాలు, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, నీలగిరి కొండలు,  పాపి కొండలు వంటి ఎన్నో ప్రఖ్యాతి చెందిన ప్రాంతాలు ఉన్నాయి.  వీటిని కాపాడుకోవడం అందరి భాద్యత. పర్వతాలు ప్రకృతిలో భాగమైనప్పుడు ప్రకృతి పరిరక్షణ అందరి కర్తవ్యం అని గుర్తించాలి.                                       *రూపశ్రీ.   

Alfred Nobel birth anniversary

ప్రపంచ ప్రతిభకు పట్టం కట్టే ఆల్ఫ్రెడ్ నోబెల్ జయంతి..!

  నోబెల్ బహుమతి.. ప్రపంచం మొత్తం మీద ఎంతో గొప్పగా పేర్కొనే గుర్తింపు. ఎంతో మంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు నోబెల్ బహుమతి సాధించాలనే తపనతో ప్రయోగాలు చేస్తూనే ఉంటారు.  ఒక గొప్ప ఆవిష్కరణ సాధ్యం చేసిన వారికి నోబెల్ బహుమతి ప్రధానం చేయబడుతుంది. ఇది కూడా కొన్ని వర్గాల వారికే ఇవ్వబడుతుంది.  భారతదేశానికి భారత రత్న ఎలాంటిదో ప్రపంచానికి నోబెల్ బహుమతి అలాంటిది. అసలు నోబెల్ బహుమతి ఎలా పుట్టింది? నోబెల్ బహుమతి ఎందుకు ఇస్తారు? దీని విలువ ఎంత? తెలుసుకుంటే.. స్వీడన్‌కు చెందిన ఆవిష్కర్త,  పండితుడు అల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ 1833 అక్టోబర్ 21న స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో ఇమ్మాన్యుయేల్ నోబెల్,  కరోలినా ఆండ్రియేట్ నోబెల్ దంపతులకు జన్మించాడు. చిన్న వయస్సులోనే ఇంజనీరింగ్, ముఖ్యంగా పేలుడు పదార్థాలపై ఆసక్తి చూపించారు. తన తండ్రి నుండి మౌలిక ఆవిష్కరణ సూత్రాలను నేర్చుకున్నారు. ఆయన   కెరీర్ లో  355 పేటెంట్లను సొంతం చేసుకున్నాడు.  ఇందులో డైనమైట్  అత్యంత ప్రసిద్ధ ఆవిష్కరణగా నిలిచింది. తరువాత సింథటిక్ మూలకం "నోబెలియం" ఆయన గౌరవార్థం పేరు పెట్టబడింది. నోబెల్ వారసత్వం.. నోబెల్  ఆవిష్కరణలకంటే ఆయన  వారసత్వం ఎక్కువగా కొనసాగింది. డైనమైట్ నుండి మంచి సంపద సొంతం చేసుకుని,  నోబెల్ బహుమతుల స్థాపనను ఏర్పరిచాడు.  1901లో ప్రారంభమైన ఈ బహుమతులు  ఆర్థిక శాస్త్రం, సాహిత్యం, రసాయన శాస్త్రం,  శాంతి రంగాలలో  కృషి చేసిన వారిని గౌరవిస్తాయి.  ఈ బహుమతులు నోబెల్  మానవత్వాన్ని ముందుకు తీసుకెళ్లే దృక్కోణాన్ని ప్రతిబింబిస్తాయి. 1884లో రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నోబెల్‌ను సభ్యునిగా ఎన్నుకుంది. 1893లో ఆయన ఉప్సాలా యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ పొందాడు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న స్టాక్‌హోమ్‌లో నిర్వహించే నోబెల్ బహుమతి కార్యక్రమం అల్ఫ్రెడ్ నోబెల్ మరణాన్ని గుర్తు చేస్తూ జరుపుకుంటారు. నోబెల్ బహుమతుల ప్రకటన  అక్టోబరులో జరుగుతుంది.   అల్ఫ్రెడ్ నోబెల్  కవిగా కూడా రాణించాడు. నోబెల్‌  రాసిన  ఉత్తరాలలో ఆయన యవ్వన దశలో రాసిన కవితలను ధ్వంసం చేశారని తెలిసింది. "ఎ రిడిల్" అనే కవితా రచనని ఆయన మొదటి కవితగా రచించాడు. నోబెల్ బహుమతి.. 1895 నవంబర్ 27న, పారిస్‌లో అల్ఫ్రెడ్ నోబెల్ తన చివరి సంతకం చేశాడు. ఇందులో తన సంపదను ఐదు భాగాలుగా విభజించి, రసాయన శాస్త్రం, వైద్య శాస్త్రం లేదా ఫిజియాలజీ, సాహిత్యం,  శాంతి రంగాలలో  కృషి చేసిన వారికి బహుమతులు ఇవ్వాలని పేర్కొన్నాడు. బహుమతులు ఇవ్వడంలో అభ్యర్థుల జాతి,  పుట్టుపూర్వకతను పరిగణనలోకి తీసుకోకుండా, ప్రతిభ ఉన్నవారికి బహుమతి ఇవ్వాలని నా స్వంత కల అని నోబెల్ ప్రస్తావించాడు. నోబెల్ యొక్క ఆవిష్కరణలు,  కృషి.. నైట్రోగ్లిసరిన్ ఫ్యాక్టరీ (1862): నోబెల్ పేలుడు పదార్థాల పరిశ్రమకు పునాది వేసాడు. డైనమైట్ (1867): డైనమైట్‌ను ఆవిష్కరించడానికి నోబెల్ నైట్రోగ్లిసరిన్‌తో కీసెల్గుర్‌ను కలిపి ఒక సురక్షితమైన ఉత్పత్తిని తయారుచేసారు. బ్లాస్టింగ్ జెలటిన్ (1875): 1875లో ఆయన బ్లాస్టింగ్ జెలటిన్‌ను ఆవిష్కరించారు. నోబెల్  ఆవిష్కరణలు,  విశ్వనాగరిక శ్రేయస్సుకు చేసిన కృషి ఆయనను చరిత్రలో చిరస్థాయిగా నిలిపాయి. నోబెల్‌   వారసత్వం, ఆయన చేపట్టిన పనులు  మానవాళి మీద అమూల్యమైన ప్రభావాన్ని చూపిస్తాయి.                                           *రూపశ్రీ.

Tips for Success

జీవితంలో విజయం వరించాలంటే ఇవే కీ పాయింట్స్..!

  విజయం.. ప్రతి వ్యక్తి కల. ముఖ్యంగా యువత విజయం అనే ఒక లక్ష్యం కోసం చాలా శ్రమిస్తూ ఉంటారు. జీవితంలో విజయం సాధించాలంటే దానికంటూ కొన్ని కమిట్‌మెంట్స్ ఉండాలి. కొన్ని త్యాగాలు చేయాలి,  మరికొన్ని ఇష్టంగా మార్చుకోవాలి.  జీవితంలో సంతోషంగా గడిచిపోయే దారిలో విజయం ఎప్పటికీ లభించదు.  కష్టమైన దారిని దాటితేనే విజయాన్ని అందుకోగలుగుతారు.  కొందరికి ఈ విషయం తెలిసినా దాన్ని చేరుకునే మార్గం, జీవితంలో చేసుకోవాల్సిన మార్పులు,  మార్చుకోవాల్సిన ఆలోచనా విధానం మొదలైనవి మాత్రం తెలియకుండా ఉంటాయి.  అయితే విజేతలు కావాలంటే కొన్ని విషయాలు తప్పక తెలుసుకుని పాటించాలి. రోజును ఎలా ప్రారంభించినా సరే.. సాయంత్రం ఉండే అలవాట్లలో కొన్ని జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తాయట.  ఈ అలవాట్లే జీవితంలో విజయాన్ని,  విజయ శిఖరాల వైపు వ్యక్తులను తీసుకెళ్తాయి.  అందుకే ప్రతిరోజూ సాయంత్రం కొన్ని పనులు తప్పక చేయాలి. ప్రతిరోజూ సాయంత్రం 10 నుండి 15 నిమిషాలు ధ్యానం చేయాలి.  ధ్యానం చేయడం ద్వారా మనస్సును శాంతంగా ఉంచుకోవచ్చు.  మనస్సును సంతోషంగా ఉంచుకోవచ్చు.  దీని వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. రోజంతా అనుభవించిన ఒత్తిడి కూడా సాయంత్రం ధ్యానం చేయడం వల్ల మాయమవుతుంది. ధ్యానం చేయడంతో పాటు యోగ కూడా చేయాలి.  తేలికపాటి యోగ చేయడం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది.  శరీరం ఫిట్ గా కూడా ఉంటుంది.  ఒక వ్యక్తి జీవితంలో విజయం సాధించాలంటే శారీరకంగా ఫిట్ గా ఉండటం చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు లక్ష్యాలు సాధించడంలో ముందుంటారు. ప్రతిరోజూ సాయంత్రం సమయంలో కాసింత వాకింగ్,  యోగ,  ధ్యానం చేయగానే వెచ్చని నీటితో స్నానం చేయాలి.  ఇది శరీరానికి చాలా రిలాక్సింగ్ ను ఇస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతుంది.  మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. రాత్రి సమయంలో హాయిగా నిద్రపోవడానికి కారణమవుతుంది. ప్రణాళిక ఒక వ్యక్తి కార్యాచరణను సులభతరం చేస్తుంది. రేపటి రోజు చేయాల్సిన కార్యాచరణను ముందు రోజే రెఢీ చేసి పెట్టుకోవడం వల్ల పనులకు తగ్గట్టు సన్నద్ధం కావచ్చు. ఇది సమయాన్ని కూడా పర్పెక్ట్ గా వినియోగించుకునేలా చేస్తుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఏదైనా మంచి పుస్తకంలో కొన్ని పేజీలను తప్పక చదవాలి. దీని వల్ల రాత్రి పడుకునే ముందు మానసికంగా ప్రశాంతత లభిస్తుంది.  ఇది మంచి నిద్రకు దారితీస్తుంది. సాయంత్రం సమయంలో కొన్ని నిమిషాలు రోజును రివిజన్ చేసుకోవడం ఎంతో సహాయపడుతుంది.  ఆ రోజు ఉదయం లేచిన నుండి సాయంత్రం ఏ పనులు చేయగలిగాం,  ఏవి చేయలేకపోయాం అనే విషయం గమనించుకోవచ్చు.  ఒక వేళ ఏదైనా పని చేయలేకపోతే అలా పనులు మిగుల్చకుండా ఎలా పూర్తీ చేయాలో కూడా తెలుస్తుంది. రాత్రి సమయంలో తీసుకునే భోజనం చాలా తేలికగా ఉండాలి.  ఆహారం చాలా భారీగా తీసుకుంటే అది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.  అదే తేలికగా ఉన్న ఆహారం తీసుకుంటే హాయిగా నిద్ర పడుతుంది. అలాగని అస్సలు తినకుండా ఉండటం కూడా మంచిది కాదు.. ముఖ్యంగా నిద్రపోవడానికి కనీసం రెండు నుండి మూడు గంటల ముందే భోజనం ముగించాలి. ఫోన్ కు వ్యసనపరులుగా ఉండటం అంటే లక్ష్యాలను లైట్ గా తీసుకున్నట్టే.. ఫోన్ ను కూడా లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడే వస్తువుగా వినియోగించడం మంచిది.  టీవీ, ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్.. ఇతర గ్యాడ్జెట్స్ ను లక్ష్యాల కోసం,  కమ్యూనికేషన్ కోసం మాత్రమే వినియోగించాలి.  అనవసరమైన కాలయాపన కోసం వినియోగించకూడదు. నిద్రపోవడానికి ఒక ఖచ్చితమైన సమయాన్ని నిర్ణయించుకోవాలి.  ప్రతిరోజూ ఎన్నిపనులు ఉన్నా ఒకే సమయానికి నిద్రపోవాలి. దీని వల్ల మరుసటి రోజు ఉదయం కూడా ఖచ్చితమైన సమయానికి నిద్ర లేవడం పనులను క్రమశిక్షణగా పూర్తీ చేసుకోవడం సాధ్యమవుతుంది.                                                  *రూపశ్రీ.

Human Rights Day

“ఒకరి హక్కుల్ని కాల రాయటమంటే, వారి అస్తిత్వాన్ని కాల్చివేయటమే” -మానవ హక్కుల దినోత్సవం 2024 !

  మనమంతా ఒప్పుకోవాల్సిన, గుర్తించాల్సిన విషయం ఏమంటే, ఈ భూమి మీద ఉండే ప్రతీ జీవికి కొన్ని హక్కులు ఉంటాయి.  జీవించే హక్కు, స్వేచ్చ సమానంగానే ఉంటాయి. ఈ విశాల ప్రపంచంలో ప్రతీ జీవికి దానికంటూ ఓ గుర్తింపు, ప్రత్యేకత కూడా ఉంటాయి. ఈ భూమి మీదున్న జీవజాలమంతా ఒకటి ఇంకోదానిపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆధారపడి ఉంటుంది. ఈ ప్రకృతిలో దేని విలువ దానికి ఉంటుంది. మనుషుల విషయంలో కూడా అంతే.   నేటి ప్రపంచం లింగం, జాతి, వర్గం, మతం వంటి విభాగాలుగా, వివక్షలతో విభజించబడింది. ఇది చాలా సాధారణం అనిపించవచ్చు కానీ అలా విభజించబడిన వారికి మాత్రం నరకప్రాయంగా ఉంటుంది. ఈ క్రూరత్వానికి  బలవుతున్న వారిలో అమాయక పిల్లలు కూడా ప్రధానంగా ఉన్నారు. ప్రతి పిల్లవాడు, ప్రతి వ్యక్తి  కులం, మతం,  రంగు,  ఆర్థిక స్థితి  వంటి విషయాలు పరిగణలోకి తీసుకోబడకుండా అందరిలో సమానంగా   ఉండే ప్రపంచం కనిపించడం లేదు. ఈ వివక్ష ప్రజలను వేరు చేస్తోంది.  ఈ బేధాలతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి వారికున్న మౌలిక హక్కుల్ని,  స్వేచ్ఛను ప్రపంచానికి గుర్తు చేయడానికి డిసెంబర్ 10వ తేదీన ప్రతీ సంవత్సరం మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటారు. 1948లో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్(UDHR) ని  ఆమోదించిన జ్ఞాపకార్థంగా జరుపుకునే ఈ రోజున  సమాజంలోని వ్యక్తులు, సంస్థలు,  ప్రభుత్వాలన్నీ   కలిసి ఈ హక్కులను కాపాడేందుకు, హక్కుల పరిరక్షణని ప్రోత్సహించేందుకు కృషి చేయాలని పిలుపునిస్తుంది. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (UDHR): మానవ హక్కులపై కీలక పత్రమైన  యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (UDHR) అనేది 1948లో ఆమోదించబడింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రజల హక్కులు,  స్వేచ్ఛలను రక్షించడమే  ప్రధాన కారణంగా  ఐక్యరాజ్యసమితి స్థాపన జరిగింది.  అన్ని దేశాల ప్రజల హక్కుల సాధనకు ఒక "సామాన్య ప్రమాణం"గా  ఇది  రూపొందించబడింది. ఈ ప్రామాణిక పత్రం 500కి పైగా భాషలలోకి అనువాదమైంది. ఇది గౌరవం, స్వేచ్చ, సమానత్వం, సోదరతత్వం అనే నాలుగు స్థంబాల మీద  నిర్మితమైంది. ఇందులో 30 కీలకమైన అంశాలు ఉన్నాయి. సాధాలణంగా ప్రజలకు ఉన్న హక్కులలో  స్వేచ్ఛగా జీవించే హక్కు,  భద్రత, వివక్ష లేకుండా సమానత్వం సాధించటం.  సమ న్యాయం. ఆలోచన, మత స్వేచ్ఛ.  విద్య,  పనికి సంబంధించిన హక్కులు.. మొదలైనవి ప్రధానంగా ఉంటాయి. మానవ హక్కుల దినోత్సవం 2024 : థీమ్ సంవత్సరానికి ఒక ముఖ్య అంశాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని సాధించే దిశగా ప్రభుత్వాలు కార్యాచరణ చేపడతాయి. 2024కు గానూ.. "మన  హక్కులు, మన  భవిష్యత్తు, తక్షణమే". అనే థీమ్ రూపొందించబడింది.  దీనికి తగినట్టే..  మానవ హక్కులనేవి ప్రతీరోజూ, ప్రతీ చోటా ప్రజలని ఎంతలా  ప్రభావితం చేస్తాయో చూపిస్తుంది. మానవ హక్కుల్ని  కాపాడుకోవటం వల్ల సమాజం మీద స్పష్టమైన సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయనే విషయం చెప్తుంది. మానవ హక్కుల దినోత్సవం ఎందుకు జరుపుకోవాలంటే..  మానవ హక్కుల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా  హక్కుల సాధన కోసం ఉద్యమాలు చేసిన,  పోరాడిన వ్యక్తులను, వారి కృషిని గుర్తుచేస్తుంది. వారు చేపట్టిన  ఉద్యమాల స్ఫూర్తిని ప్రజలలో కూడా రగిలించి న్యాయపరంగా మన హక్కుల సాధన సాధ్యమేననే నమ్మకాన్ని కలిగిస్తుంది. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా  సమానత్వం, స్వేచ్ఛ,  వ్యక్తిగత గౌరవం యొక్క ప్రాముఖ్యతను పౌరులందరికీ  గుర్తుచేస్తుంది. ప్రతి ఒక్కరు సురక్షితంగా, వివక్షకు గురి కాకుండా ఉండే   ప్రపంచాన్ని సృష్టించడానికి ప్రజలందరూ  కలిసి పనిచేసే దిశగా ప్రజలను  ప్రోత్సహిస్తుంది. రోజువారీ జీవితాల్లో మానవ హక్కుల కోసం నిలబడటంలో,  న్యాయం జరిగే సమాజాన్ని నిర్మించడంలో సహకరించడానికి ప్రజల  పాత్రన ఎంత అవసరమో గుర్తుచేస్తుంది. మానవ హక్కుల పరిరక్షణ కోసం ఏం చేయాలి? మానవ హక్కుల దినోత్సవంలో ప్రజలు  భాగమై వాటి పరిరక్షణ కోసం తమ  వంతు ప్రయత్నం   చేయాలనుకుంటే   మానవ హక్కులని ప్రోత్సహిస్తూ, అవగాహన పెంపొందిస్తూ, సామాజిక న్యాయం కోసం కృషి చేసే సంస్థలకు మద్దతు ఇవ్వవచ్చు.  మానవ హక్కుల గురించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పాలి. మానవ హక్కుల ప్రాధాన్యత, వాటి వల్ల ప్రజలకు చేకూరే మేలు,  సమాజంలో ఏర్పడే మార్పుల గురించి చెప్పాలి.  వివక్ష,  అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలి.  మానవ హక్కుల సాధన, సమాజిక న్యాయం అనేది  ప్రతి వ్యక్తి తనతోనే మొదలవ్వాలనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. సమానత్వం, స్వేచ్ఛ కోసం జరుపుతున్న సమాజ  పోరాటంలో ఎవరూ వెనుకబడకుండా చూసుకోవడం అందరి బాధ్యత. అందుకు తగిన విధానాలను, విలువలని పాటించడం ద్వారా మానవ హక్కుల పరిరక్షణలో ప్రతి వ్యక్తి తన పాత్రను తాను సమర్థవంతంగా  నెరవేర్చవచ్చు.  వ్యక్తిగత హక్కులు కాపాడుకుంటూ, ఇతర హక్కుల్ని గౌరవిస్తూ ముందుకెళ్తే, ఒక మెరుగైన భవిష్యత్తును సృష్టించగలమనీ, సానుకూల మార్పును తీసుకురాగలమని స్పష్టంగా చెప్పవచ్చు.                                                *రూపశ్రీ.  

 International Anti Corruption Day

అవినీతి ముల్లులు చేసే అన్యాయానికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత యువతదే..!

  బాధ్యతగా చేయమని అప్పగించిన అధికారాన్ని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడాన్నే అవినీతి అంటారు. ‘అవినీతి తిమింగలాలు’ అనే  మాట చాలా సార్లు పేపర్లలో రావటం చదువుతూనే ఉంటాము. మన సమాజంలో చాప కింద నీరులా అల్లుకుపోయిన అవినీతిని నిర్మూలించటానికి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా దాన్ని అరికట్టటం వీలు పడట్లేదు. ఎందుకంటే ఈ అవినీతి అనేది  వ్యవస్థలో కింది నుంచి పై స్థాయివరకూ ఉంది. ఒక సాధారణ క్రింది స్థాయి ఉద్యోగి మొదలుకుని ఉన్నత స్థాయి ఉద్యోగులు, నాయకులు,  సంస్థల వరకూ చాలా మటుకు ఈ అవినీతిలో భాగమైపోతున్నారు. "దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నారు" అన్న చందాన తయారయింది నేటి సమాజం. ఇది ఎంత స్థాయివరకూ ఉందంటే, ఏదైనా వ్యవస్థలో మన పని జరగటానికి, అవినీతిలో మనమూ భాగమైతేనే సాధ్యమవుతుందనే  ఆలోచనా విధానానికి ప్రజలు వచ్చేశారు. అంతలా అవినీతి వ్యవస్థలోకి చొరబడిపోయి  ఇది సర్వసాధారణమే అన్నట్టు మారిపోయింది.   అవినీతి జరగటం వల్ల అర్హులైనవాళ్లు అన్నీ కోల్పోతారు, అనర్హులైనవాళ్లు అవినీతి సాయంతో  అందలమెక్కుతారు. ఇలా అవినీతి  ఎంతోమంది జీవితాలని ఛిన్నాభిన్నం చేసింది, చేస్తుంది, చేస్తూనే ఉంటుంది. ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న అవినీతిని అరికట్టాలనే ఉద్దేశ్యంతో అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతి ఏడాది డిసెంబర్ 9వ తేదీన జరుపుకుంటున్నారు.  దీని గురించి మరికాస్త విస్తృతంగా తెలుసుకుంటే.. అవినీతి వల్ల కలిగే దుష్ప్రభావాలు.. ప్రజలకి  వ్యవస్థలపై నమ్మకం తగ్గిపోతుంది. న్యాయపాలనను దెబ్బతీసి, పౌరుల స్వేచ్ఛను పరిమితం చేస్తుంది. ఆర్థిక ప్రగతికి ఆటంకంగా మారుతుంది. సమాజంలో అసమానతలను పెంచుతుంది. ప్రజాస్వామ్యాన్ని, పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది. మానవ హక్కుల రక్షణలో ఆటంకం ఏర్పడుతుంది,  పేదలకు అవసరమైన సేవలు అందకుండా పోతాయి. ఆరోగ్యం, విద్యా ప్రమాణాలు తగ్గి, జీవనంలో నాణ్యత తగ్గిపోతుంది. అవినీతికి వ్యతిరేకంగా ఎదురు తిరిగిన సందర్భాలు అరకొర ఉన్నప్పటికీ, అవి సమాజం నుంచి అవినీతిని దూరం చేయలేకపోతున్నాయి. వేళ్లూనుకుపోయిన అవినీతిని మూలాల నుంచి పెకిలిస్తే తప్ప దాన్ని నాశనం చేయలేము. అవినీతి అనేది సాధారణంగా తీసుకోవాల్సిన విషయం కాదని, దాని వల్ల సమాజానికి ఎంత నష్టమో, నైతికత, న్యాయం ద్వారా చట్టబద్దంగా అవినీతిపై పోరాడటం ఎలాగానే  విషయాన్ని  ప్రజలకి అర్ధమయ్యేలా చెప్పాలి. అందుకే ప్రపంచవ్యాప్తంగా అవినీతి గురించి అవగాహన పెంచడం, నిజాయితీ, బాధ్యత అనే నైతిక విలువలను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించి, అవినీతి రహిత సమాజాన్ని నిర్మించే  లక్ష్యంగా  ఐక్యరాజ్యసమితి సాధారణ సభ  రిజల్యూషన్ 58/4 ద్వారా,  2003వ సంవత్సరం నుంచి డిసెంబర్ 9వ తేదీని ‘అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినంగా’ ప్రకటించింది. ఈ దినోత్సవం, అవినీతి సమస్యలపై అవగాహన పెంచడంలో, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. 2024.. థీమ్.. 2024వ సంవత్సరానికిగానూ  "అవినీతి వ్యతిరేక పోరాటంలో  యువతతో ఐక్యం కావటం,  రేపటి నైతికతను నిర్మించడం".అనే థీమ్ లక్ష్యంగా ఉంది.  అవినీతి వల్ల జరిగే చెడు  ప్రభావాల గురించి యువతకు అవగాహన కల్పించి, వారిని  అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తారు.  యువతను నిర్ణయాలు తీసుకునే అధికారులతో చర్చలు జరిపేలా ప్రోత్సహిస్తారు. యువత భాగస్వామ్యంతో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో జరిగే అవినీతిని నిర్మూలించే లక్ష్యంగా పనిచేస్తారు. భారతదేశంలో అవినీతి వ్యతిరేక చర్యలు: భారతదేశంలో అవినీతి నియంత్రణ కోసం వివిధ చట్టాలు, సంస్థలు అమల్లో ఉన్నాయి.  ఉదాహరణకు లోక్‌పాల్, సి‌వి‌సి,  సీబీఐ వంటి సంస్థలు అవినీతికి పాల్పడినవారికి తగిన శిక్ష పడేలా చేస్తాయి.  అవినీతి వ్యతిరేక ప్రచారాలు, అవగాహన కార్యక్రమాలు కూడా  దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. భారతదేశంలో ప్రస్తుతమున్న అవినీతి వ్యతిరేక చట్టాలు, విధానాలు: అవినీతి నిరోధక చట్టం, 1988: అవినీతి నిర్వచనాలు, దోషులకు శిక్షలు ఇందులో ఉంటాయి. భారతీయ న్యాయ సంహిత, 2023: అవినీతి,  లంచాలపై నూతన నిబంధనలు ఉన్న చట్టమిది. లోక్‌పాల్, లోకాయుక్త చట్టం, 2013: అవినీతి నిర్మూలనపై ప్రజా బాధ్యతను పెంచటానికి చేసిన చట్టం. విశిల్ బ్లోవర్స్ ప్రొటెక్షన్ చట్టం, 2014: అవినీతి విషయాలను బట్టబయలు చేసిన వారిని రక్షించే చట్టం.   ఇతర చట్టాలు: మనీలాండరింగ్ నిరోధక చట్టం,2002,  బెనామీ లావాదేవీలు చట్టం,1988,  బ్లాక్ మనీ, పన్ను విధానం చట్టం,2015. చట్టాలు అమలు చేసే సంస్థలు: * కేంద్ర విజిలెన్స్ కమిషన్: ప్రభుత్వ విభాగాల్లో అవినీతి నివారణ,  పర్యవేక్షణ బాధ్యతలు చూసుకుంటుంది. * సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్: అవినీతి సంబంధించిన ప్రధాన కేసులు విచారణ చేస్తాయి. * స్టేట్ ఏంటీ కరప్షన్ బ్యూరోలు: రాష్ట్ర స్థాయి కేసుల పరిశీలన చేస్తాయి. అవినీతి అవగాహన సూచిక:  ‘ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్’ అనే అంతర్జాతీయ సంస్థ, ప్రతి సంవత్సరం అవినీతి అవగాహన సూచికను ప్రచురిస్తుంది.  ఇందులో ఒక  సూచీ ప్రకారం ఒక దేశానికి సున్నా నుండి వంద  వరకు కొన్ని పాయింట్లను ఇస్తారు. వాటి ఆధారంగా ఒక దేశ స్థానం నిర్ణయిస్తారు. [సున్న(అతి ఎక్కువ అవినీతి), వంద(అతి తక్కువ అవినీతి)]  2023లో భారతదేశానికి  మొత్తం 180 దేశాలలో 93వ స్థానం లభించింది.   మన దేశానికి దక్కిన ఈ స్థానం, మన దేశంలో  అవినీతి నిర్మూలనకి మరింత బలమైన చట్టాలు, విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని  సూచిస్తోంది. అవినీతి నిర్మూలన కోసం ఏం చేయాలి? యువత ప్రోత్సాహం:  అవినీతి రహిత భవిష్యత్తును నిర్మించడంలో యువత పాత్రను గుర్తించాలి. గ్లోబల్ ఐక్యత:  అంతర్జాతీయంగా దేశాల మధ్య అవినీతి నిర్మూలనలో సహకారాన్ని పెంపొందించాలి. చట్టపరమైన సంస్కరణలు: అవినీతి అవగాహనా సూచికలో వెనుకబడిన దేశాలన్నీ  మరింత కఠినమైన చట్టాలను ఆమోదించేలా కృషి చేయాలి. పాలనా వ్యవస్థ మెరుగుదల:  ప్రభుత్వ ఆచరణాత్మకతను పెంపొందించాలి. ప్రజలకి వ్యవస్థలపై నమ్మకం కలగాలన్నా, శాంతి, భద్రతలకి ఆటంకం కలగకుండా,   సమాజ అభివృద్ధి లక్ష్యాలు నెరవేరాలన్నా, అవినీతి రహిత సమాజం కోసం అందరం కలసికట్టుగా  పని చేయాలి.  అప్పుడే అది సాధ్యమవుతుంది. ప్రతీ పౌరుడు తన అవసరం కోసమో, స్వార్ధ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమో అవినీతికి పాల్పడకుండా ఉంటూ, అలా పాల్పడేవారిని నివారించటం చేస్తే మనం కలలు కంటున్న అవినీతి రహిత సమాజాన్ని తొందరలోనే చూడగలమని ఆశిద్దాం. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంత ఆశ చూపించినా నైతికతని  కోల్పోకుండా, అధికార దుర్వినియోగం చేయకుండా, తమ బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తూ,  సమాజ శ్రేయస్సు కోసం తన శక్తికి మించి శ్రమిస్తున్న ప్రతీ వ్యక్తిని ఈ సమాజం గౌరవించి, ప్రేరణగా తీసుకుని ముందుకు వెళ్లాలి. అప్పుడే అవినీతిని అంతం చేయడం సాధ్యమవుతుంది.                                                  *రూపశ్రీ.

Vidura successful tips

విదురుడు చెప్పిన ఈ విషయాలు పాటిస్తే తలపెట్టిన కార్యాలలో విజయం తథ్యం..!

  విదురుడు ధృతరాష్ట్రునికి తమ్ముడు.  ఈయన దాసికి జన్మించిన వాడు కావడంతో రాజు కాలేకపోయాడు. అయితేనేం ధృతరాష్ట్రుని వద్ద మంత్రిగా ఉండేవాడు. విదురుడు న్యాయశాస్త్రాలు అవపోశన పట్టాడు. నీతి శాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నాడు.  మహారాజు ధృతరాష్ట్రుడికి,  విదురుడికి మహా భారత యుద్దం ముందు కొన్ని చర్చలు సాగాయి.అందులో భాగంగా విదురుడు చెప్పిన కొన్ని నీతి వాక్యాలు, విషయాలు విదుర నీతి పేరుతో ప్రసిద్ధి కాంచాయి.  చాణక్య నీతి లాగా విదుర నీతిని పాటించిన వారు జీవితంలో ఉత్తములుగా ఉంటారట. విదురుడు చెప్పిన కొన్ని విషయాలు పాటిస్తే  విజేతలు కావడం తథ్యం అంటున్నారు. ఇంతకీ అవేంటో తెలుసుకుంటే.. జ్ఞానం.. నిజమైన జ్ఞానం ఉన్న వ్యక్తి ఎవరు అనే విషయం చాలామందికి తెలియదు. తన సామర్థ్యం ఏంటి అనేది క్షుణ్ణంగా తెలుసుకుని తన జ్ఞానాన్ని గుర్తించి దాన్ని సరైన సమయంలో సరైన స్థలంలో  ఉపయోగించుకునే వాడే నిజమైన జ్ఞాని అని విదురుడు చెప్పుకొచ్చాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తి తను ఏర్పరుచుకున్న లక్ష్యాన్ని చేరుకుని కచ్చితంగా విజేత అవుతాడట. మూర్ఖుడు.. నిజమైన జ్ఞానం ఉన్న వ్యక్తితో పాటు మూర్ఖులు కూడా ఉంటారు.  అసలు మూర్ఖుడు అనే విషయాన్ని నిజమైన మూర్ఖుడు కూడా ఒప్పుకోడు.  ప్రతి ఒక్కరూ తాము చాలా జ్ఞానవంతులం అనే అంటారు.  కానీ విదురుడు చెప్పాడు నిజమైన మూర్ఖుడు అంటే ఎవరో.. పిలవకుండానే లోపలికి వచ్చేవాడు.. అడగకుండానే మాట్లాడేవాడు  మూర్ఖుడు అని విదురుడు అన్నాడు. ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలట. పనులు.. ఏ పనులు చెయ్యాలి.. ఏ పనులు చెయ్యకూడదు అనే విషయంలో కొంత స్పష్టత ఉండటం అవసరం. వ్యక్తి చేసే పనే ఆ వ్యక్తిని ఉత్తముడిగా నిలబెడుతుంది.  మనసుకు, శరీరానికి బాధ కలిగించే డబ్బు సంపాదన,  లేదా మతాన్ని ఉల్లంఘించే పని చేయడం ఎప్పుడూ తప్పు పని కిందే లెక్క వస్తుందట.  అంతే కాదు.. ఏదైనా బెనిఫిట్ కలుగుతుంది అంటే శుత్రువు ముందు అయినా సరే..  తల వంచే పనులు ఎప్పటికీ చేయకూడదు అని విదురుడు చెప్పాడు.   తెలివి.. తెలివైన వ్యక్తులు ఎవరు అంటే అందరూ మేమంటే మేము అని అనుకుంటారు. కానీ తెలివైన వ్యక్తులు అంటే జ్ఞానం కలిగిన వారు.. ఇలాంటి వ్యక్తులు ఏ పనిని అయినా, ఏ విషయాన్ని అయినా తొందరగా అర్థం చేసుకుంటారు. అవతలి వ్యక్తి మాటలను ఎంతో శ్రద్దతో,  ఓర్పుతో వెంటాడు.  ఏ ఉద్దేశ్యం లేకుండా మాట్లాడని వారు తెలివైన వారు.  ముఖ్యంగా తమ సమయాన్ని వృధా చేసే విషయాల పట్ల దూరంగా ఉండేవాడు నిజమైన తెలివిగల వాడు అని విదురుడు చెప్పాడు.  ప్రతి వ్యక్తి ఈ పనులన్నీ అలవాటు చేసుకుని పైన చెప్పుకున్నట్టు ఉంటే.. ఆ వ్యక్తులు జీవితంలో    తలపెట్టిన ఏ పనిలో అయినా విజయం సాధించడం ఖాయం అంట.                                              *రూపశ్రీ.  

Armed forces flag day

అమరవీరుల జెండా వందనం.. సాయుధ దళాల జెండా దినోత్సవం -2024..

సాయుధ దళాల జెండా దినోత్సవం 2024 మనం రోజూ అనుభవించే ఎన్నో సౌకర్యాలు, సుఖాలు  ఉండకపోయినా,  రాత్రనక, పగలనక  గడ్డ కట్టించే మంచుపర్వతాలలో, మండించే ఎడారిలో పనిచేస్తున్న ఆర్మీ,  తీరప్రాంతానికి ఏ ప్రమాదం చేరకుండా సముద్రం  మద్యలో అడ్డుగోడలా నిలబడి రక్షిస్తున్న నేవీ,  దేశ రక్షణ కోసం గగన మార్గంలో కూడా డేగ కళ్ళతో తిరుగుతూ ఏ ప్రమాదమూ మన దేశపునెత్తి మీద పడకుండా రక్షిస్తున్న ఎయిర్ఫోర్సుల్లో  ప్రతీ  సైనికుడు నిస్వార్ధంగా పనిచేస్తున్నాడు అంటే దానికి కారణం, వాళ్ళు ఈ దేశాన్ని ఒక తల్లిగా,  దేశంలోని పౌరులందరినీ  తమ కుటుంబంగా  భావించి,  మనల్ని  ఇంట్లో సుఖంగా పడుకోనిస్తూ,  వాళ్ళుమాత్రం  ఇంటి బయట అహర్నిశలు కాపు కాస్తున్నారు.      అలా నిస్వార్ధంగా, నిర్భయంగా  మనందరి కోసం ప్రతీ సైనికుడు అక్కడ పనిచేస్తున్నారు అంటే, వారి వెనుక త్యాగం చేసే ఒక కుటుంబం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ కుటుంబం దేశం కోసం తన బిడ్డని సమర్పించింది. మరి అలాంటప్పుడు ఆ సైనికుడి మీదైనా, అతని కుటుంబం మీదైనా బాధ్యత  మనందరికీ  ఉంటుంది. ఒక సైనికుడికి  కష్టం వస్తే దేశమంతా ఏకమై కుటుంబంలా నిలబడుతుందన్న నమ్మకాన్ని  సైనికుల్లో కలిగించటానికి, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ,  ఒక కుటుంబంగా వారికి అండగా నిలబడటానికి ఈ సాయుధ దళ దినోత్సవం జరుపుకోవటం మొదలుపెట్టారు.  సాయుధ దళాల జెండా దినోత్సవం: చరిత్ర భారత సాయుధ దళాలయిన   ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులో చేరి,  మన దేశ రక్షణ కోసం వీరోచితంగా పోరాడుతున్న, పోరాడి అమరులయిన  సైనికులను  గౌరవించడానికి సాయుధ దళాల జెండా దినోత్సవం జరుపుకుంటారు. సైనిక సిబ్బంది, వారి కుటుంబ  సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి సాయుధ దళాల జెండా దినోత్సవం జరపటమనేది డిసెంబర్ 7, 1949 నుంచి మొదలైంది. ఈ రోజున  దేశంలోని శాంతి, స్వేచ్ఛ,  భద్రతను కాపాడడంలో సైనికులు చేసిన  త్యాగాలను, దేశ రక్షణలో  వారికున్న అంకితభావాన్ని గుర్తించి, గౌరవిస్తారు.  అదనంగా, వారి  సంక్షేమానికి నిధులను సమీకరించడం జరుగుతుంది.  సాయుధ దళాల జెండా దినోత్సవం ప్రాముఖ్యత:  ప్రత్యేకమైన ఈరోజున  పౌరులంతా,   రక్షణ దళాలు, వారి కుటుంబాల పట్ల తమకున్న  కృతజ్ఞతను వ్యక్తపరిచే అవకాశం పొందుతారు. ఈ రోజున అందించే దేశ పౌరులు వివిధ రూపాల్లో  అందించే విరాళాలను  మాజీ  సైనికులు, యుద్ధ వితంతువులు, వికలాంగులైన సైనికుల  పరిస్థితిని మెరుగుపర్చటానికి ఉపయోగిస్తారు. ఇలాంటి ఒక దినోత్సవం జరుపుకోవటం వల్ల  సైనిక సిబ్బందికి,  పౌరులకి  మధ్య ఉన్న బంధం  బలోపేతం అవుతుంది.   పౌరులందరిలోనూ  ఐక్యత, దేశభక్తి భావనలను ప్రోత్సహిస్తుంది.   సాయుధ దళాల జెండా దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటారు? భారత సైనిక సిబ్బంది సాంప్రదాయ, సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు, ఉత్సవాలు, ఇతర వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా రెడ్, బ్లూ, లైట్ బ్లూ  రంగులతో కూడిన త్రివర్ణ జెండాలు (భారత సైన్యం యొక్క మూడు విభాగాలను సూచిస్తూ) పంపిణీ చేస్తారు. పౌరులంతా  ఈ జెండాలను ధరించడం వీరులను గౌరవించడానికి ఒక  ప్రతీక అవుతుంది.  ప్రధాన లక్ష్యాలు: 1.    భారత సాయుధ దళాల అంకితభావం,  త్యాగాలను గుర్తించి, గౌరవించటం.  2.    అమరవీరుల కుటుంబాలు, మాజీ సైనికులు,  దివ్యాంగ సైనికుల సంక్షేమం కోసం నిధులను సమీకరించడం. 3.    దేశ రక్షణలో పాల్గొనే వారికి మద్దతు అందించడంలో పౌరుల బాధ్యతను ప్రేరేపించడం. సాయుధ దళాల జెండా దినోత్సవ నిధి :   రక్షణ మంత్రిత్వ శాఖ కమిటీ,  1949లో సాయుధ దళాల జెండా దినోత్సవ నిధిని సృష్టించింది. 1993లో, యుద్ధ బలిదాన దాతల నిధి, కేంద్ర సైనిక్ బోర్డ్ నిధి, మాజీ సైనికుల సంక్షేమ నిధి, ఇతర విభాగాలకు సంబంధించిన నిధులన్నింటినీ కలిపి ఒకే నిధిగా, ‘సాయుధ దళాల జెండా దినోత్సవ నిధి’గా మార్చింది.   నిధి ఉపయోగాలు: •    అమరవీరుల కుటుంబాలకి, యుద్ధంలో గాయపడి  వికలాంగులైన   సైనికులకు మద్దతు ఇస్తారు.  •    మాజీ సైనికుల జీవన పరిస్థితి మెరుగుపర్చటానికి  ఆర్థిక సహాయం అందిస్తారు. •    సైనికుల పిల్లల విద్యకు అవసరమైన ఆర్థిక సహాయం చేసి, వారి భవిష్యత్తుకి భరోసా ఇస్తారు.    అయితే ఈ ‘సాయుధ దళాల జెండా దినోత్సవం’ అనేది కేవలం ఆర్థిక మద్దతు ఇవ్వడానికి మాత్రమే కాదు,   ఇది ఐక్యత, గౌరవం, జాతీయ గర్వానికి ప్రతీక. ఈ రోజున పౌరులు సైనికుల సంక్షేమంలో అందరూ చురుకుగా పాల్గొని, దేశం కోసం  త్యాగాలు చేసిన వీరుల పట్ల తమ కృతజ్ఞతను వ్యక్తం చేయటం గొప్ప విషయం. మనల్ని తమ కుటుంబంగా భావించి కాపాడుతున్న ప్రతీ వీర సైనికుడిని, మనం కూడా  మన ఇంటి బిడ్డగా భావించి వారి కష్ట, నష్టాల్లో పాలుపంచుకుని, అందరం ఐకమత్యంగా ఉందాం. అప్పుడే మన భారతదేశానికున్న   వసుదైక కుటుంబ భావనని నిలబెట్టినవాళ్ళమవుతాం.                                           *రూపశ్రీ .  

అంటరానితనం అంతం కోసం పోరాడిన  మహావ్యక్తి – డా. భీంరావ్ రాంజీ అంబేద్కర్..!

సామాజిక  వివక్ష బలంగా ఉన్న రోజుల్లో ఒక వెనుకబడిన వర్గంలో పుట్టి, పెరిగిన ఒక సాధారణ వ్యక్తి  అప్పటికే    మహావృక్షపు వేర్లలా  సమాజమంతా  అల్లుకుపోయిన అంటరానితనం, కుల వివక్షల మీద పోరాటం మొదలుపెట్టి, అందులో విజయం సాధించటం అంత సులువయిన విషయమేమీ కాదు. ఆ విజయం వెనుక ఎన్నో అవమానాలున్నాయి, ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, మరెన్నో విమర్శలున్నాయి. కానీ అవన్నీ దాటుకుని  వెనుకబడిన వర్గాల జీవితాలు బాగుపడటానికి అవకాశం కల్పించిన ఆ మహానుబావుడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన ఇంకెవరో కాదు…. ఒక దళితునిగా పుట్టి, పెరగటంలో ఒక మనిషి ఎదుర్కొనే కష్ట నష్టాలన్నీ స్వయంగా అనుభవించి, వాటిపై న్యాయ పోరాటం చేసి, దళితుల పాలిట దేవుడిగా పేరు పొందిన  డా.భీంరావ్ రాంజీ అంబేద్కర్ గారు.  అంబేద్కర్ గారి జీవితం ప్రతీ ఒక్కరికీ ప్రేరణ కలిగించే కథ.  అంబేద్కర్ గారు సామాజిక-రాజకీయ సంస్కరణలు  చేసిన వ్యక్తిగా తన ముద్రను భారతదేశ చరిత్రపై విడిచారు.  ఆయన అనేక సామాజిక వివక్షలు, అణచివేతలను ఎదుర్కొన్నప్పటికీ, విద్య ద్వారా విజయం సాధించారు.  సమానత్వం, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడారు. అందుకే ఆయన మరణించిన డిశంబర్ 6వ తేదీన, అంబేద్కర్ వర్ధంతిగా దేశమంతా జరుపుకుని, ఆయనకి నివాళులర్పిస్తారు.  ఆయన పశ్చిమ భారతదేశంలో దళిత మహార్ కుటుంబంలో జన్మించారు.  ఆయన తండ్రి  భారత సైన్యంలో అధికారి. అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచే పాఠశాలలోని  ఉన్నత కులానికి చెందిన తోటి విధ్యార్ధుల చేత అవమానించబడేవారు. అప్పట్లో స్కూల్లో వెనకబడిన వర్గాలవారిని గది బయటనే కూర్చోబెట్టేవారు, అలాగే వారికి నీళ్లు కూడా నేరుగా తీసుకునే హక్కు ఉండేది కాదు. ప్యూన్ లాంటి వారెవరొకరు పైనుంచి పోస్తే కిందనుంచి తాగాల్సిన పరిస్థితి. ఈ విషయం గురించే ప్రస్తావిస్తూ ఆయన రాసిన పుస్తకంలో “నో ప్యూన్, నో వాటర్” అని రాశారు. అంటే ప్యూన్ రానిరోజున నీళ్ళు కూడా తాగకుండా వుండేవారని రాశారు.    ఆయన బరోడా గాయకవార్(రాజు) అందించిన స్కాలర్‌షిప్ సహాయంతో  అమెరికా, బ్రిటన్, జర్మనీలోని విశ్వవిద్యాలయాలలో చదువుకున్నారు. గాయకవార్ అభ్యర్థన మేరకు బరోడా పబ్లిక్ సర్వీస్‌లో చేరినప్పటికీ, అక్కడ కూడా వెనుకబడిన వర్గం నుంచి వచ్చినవాడిగా, ఉన్నత కులానికి చెందిన  సహచరుల చేత అవమానాలు ఎదుర్కొనటంతో,  తన దృష్టిని న్యాయవాద వృత్తి, బోధనవైపు మళ్లించారు. అంటరానితనం మీద పోరాటం మొదలుపెట్టారు.    దళితులలో ప్రముఖ నాయకుడిగా ఎదిగి, వారి హక్కుల కోసం పత్రికలను స్థాపించి, ప్రభుత్వ శాసన మండలిలో ప్రత్యేక ప్రాతినిధ్యం పొందడంలో విజయం సాధించారు. విద్య అనే ఆయుధంతో,  న్యాయమనే నిప్పుతో ఆయన పోరాటం సాగింది. 1947వ సంవత్సరంలో  అంబేద్కర్ స్వతంత్ర భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రిగా నియమితులయ్యారు.   రాజ్యాంగ రూపకల్పన కమిటీ అధ్యక్షునిగా నియమితులయ్యారు.  అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆయన సమాజంలో అణచివేతకు గురైన వర్గాల హక్కులను కాపాడటానికి న్యాయబద్ధమైన మార్గాలను ప్రవేశపెట్టారు. అలాగే, కుల వివక్ష నిర్మూలన, అగ్రవర్ణాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆయన నిరంతరం పని చేశారు. జనవరి 26, 1950న రాజ్యాంగం స్వీకరించటంలో  ప్రముఖ పాత్ర పోషించారు. ఈ జనవరి 26నే గణతంత్ర దినోత్సవం దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ప్రభుత్వ విధానాల మీద  నిరాశ చెందడంతో,  1951లో ఆయన మంత్రి పదవి నుంచి రాజీనామా చేశారు. ఆయన తన జీవితంలో ఎన్నో పుస్తకాలు చదివారు, ఎన్నో పుస్తకాలు రాశారు. ఆయన  వ్యక్తిగత స్వేచ్ఛపై ధృఢమైన నమ్మకాన్ని కలిగి ఉండేవారు. కుల వ్యవస్థని  తీవ్రంగా విమర్శించారు. కులవ్యవస్థకు హిందూ ధర్మం ఆధారంగా ఉందని ఆయన చేసిన ఆరోపణలు వివాదాస్పదంగా మారి, హిందువులలో ఆగ్రహం కలిగించాయి.  హిందూ సిద్ధాంతంలో తాననుకుంటున్న స్పష్టమైన మార్పులు  లేవని భావించి, 1956లో ఆయన హిందూ మతాన్ని విడిచిపెట్టి బౌద్ధమతాన్ని స్వీకరించారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఈ వేడుకలో ఆయనతో పాటు 2 లక్షలమందికిపైగా దళితులు కూడా బౌద్ధమతంలో చేరారు. ఈ రోజు అతడి సేవలు, ఆలోచనలు, ఈ   సమాజానికి ఆయన అందించిన మార్గదర్శకత్వాన్ని స్మరించుకునే రోజుగా నిలుస్తుంది. ప్రత్యేకంగా దళితుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం,  సామాజిక సమానత్వాన్ని సాధించేందుకు ఆయన చేసిన కృషి  చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది. అంబేద్కర్‌ గారి మరణానంతరం 1990వ సంవత్సరంలో  భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన  భారతరత్నను ప్రదానం చేశారు. ఆయనని  గౌరవిస్తూ అనుచరులు  జై భీమ్ అనే నినాదం పలుకుతారు. ఆయన  గౌరవప్రదంగా  బాబాసాహెబ్ అని  కూడా పిలవబడ్డారు    దీని అర్థం "గౌరవనీయమైన తండ్రి". అని. ఆ మహానుభావుడు సమాజం కోసం చేసిన కృషికి నేడు ఆయన విగ్రహం లేని ఊరు ఉండదనటం  అతిశయోక్తి కాదేమో...అలాగే  'స్టాచ్యూ  ఆఫ్ సోషల్ జస్టిస్' పేరుతో విజయవాడలో  కాంస్య విగ్రహం నిర్మించారు. ఇది దేశంలోనే రెండో ఎత్తయిన విగ్రహం కావటం విశేషం.అలాగే తెలంగాణలో కూడా  నిర్మించారు. అంబేద్కర్ గారి గురించి తెలుసుకుని మనమేం చేయాలి?  డా. అంబేద్కర్ గారు  ఆశించిన సమానత్వం, సామాజిక న్యాయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఆయన జీవితం మనకు సంఘర్షణ, ధైర్యం, సేవాస్ఫూర్తికి ప్రతీక. ఈ రోజున ఆయన ఆశయాలను గౌరవిస్తూ, సామాజిక విభేదాలను తొలగించేందుకు కృషి చేయడం మన బాధ్యత. డా. అంబేద్కర్ గారి మరణ దినం మనకు ఆయన ఆశయాలను గుర్తుచేసే రోజు మాత్రమే కాకుండా, ఈ రోజుకీ పూర్తిగా మన సమాజాన్ని విడిచిపెట్టకుండా పట్టి పీడిస్తున్న కుల వివక్ష, అంటరానితనం రూపుమాపటానికి మనం చేయాల్సిన కృషిని గుర్తు చేయాలి.  సామాజిక సమానత్వం కోసం మనందరం కలిసి పని చేయాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెబుతుంది.                                   *రూపశ్రీ 

నేలతల్లికి నీరాజనం –  ప్రపంచ నేల  దినోత్సవం 2024.. ! 

  మనం మట్టిని  భూమాత, నేలతల్లి అని పిలవటం దాని లక్షణానికి అచ్చంగా సరిపోతుంది. ఎందుకంటే ఒక అమ్మ ఎలా అయితే తన పిల్లల్ని పెంచి, పోషించటానికి తనలోని శక్తి సన్నగిళ్లేవరకూ పాటుపడుతుందో, అలాగే ఈ నేల తనలోని సారమంతా సన్నగిళ్లేవరకూ మొక్కల్ని పెంచి, పోషించి ఈ భూమి మీద ఉన్న జీవజాల  మనుగడకి ఆధారమవుతుంది. అయితే శక్తి సన్నగిల్లిన తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత ఎలా అయితే పిల్లలకి ఉంటుందో, అలాగే నేలతల్లి  అందించిన ఆహారం తింటున్న మనకి దాని గొప్పదనాన్ని గుర్తించి, దాని బాగోగులు కూడా చూసుకోవాల్సిన  బాధ్యత ఉందనటంలో ఎలాంటి సందేహం లేదు.  ప్రపంచ నేల  దినోత్సవం మన ఆహారంలో 95%కి పైగా నేలలోనుంచే ఉత్పత్తి అవుతోంది. కాబట్టి, ఈ సహజ వనరు ఆరోగ్యంగా ఉండటమనేది మనుషులకే కాదు, భూమి మీద ఉన్న  జీవజాలమంతటి  మనుగడకీ  అవసరమే. అందుకే భూమి మీద హాయిగా జీవించాలంటే   నేలకున్న  ప్రాముఖ్యతను తెలియజేస్తూ,  ప్రపంచ నేల దినోత్సవం ఆవిష్కరణను 2002లో ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ సాయిల్ సైన్సెస్’ ప్రతిపాదించింది. దీన్ని 2013లో ‘ఆహార, వ్యవసాయ సంస్థ’ అధికారికంగా ఆమోదించింది. ఆ తర్వాత, ‘సంయుక్త జాతుల సాధారణ అసెంబ్లీ’ ఈ దినోత్సవాన్ని 2013 డిసెంబర్‌లో ఆమోదించింది. కానీ ఈ దినోత్సవానికి డిసెంబర్ 5ని ఎంచుకోవడమన్నది   థాయ్‌లాండ్‌కు చెందిన భూమిబోల్ ఆదుల్యదేజ్ అనే రాజు గౌరవార్ధం జరిగింది. 2024కి గానూ ప్రపంచ నేల దినోత్సవ థీమ్: “నేలని సంరక్షించండి - కొలవడం, పర్యవేక్షించడం, నిర్వహించడం” ఈ సంవత్సరం ఎంచుకున్న థీమ్ అనేది  నేల ఆరోగ్యం, ఆహార భద్రత, పర్యావరణ స్ధిరత్వం మధ్య అనుబంధాన్ని బలంగా చూపిస్తుంది. ఆహార భద్రతను, వాతావరణ మార్పులను ఎదుర్కోవడాన్ని, పర్యావరణ వ్యవస్థల స్ధిరత్వాన్ని అందించడంలో నేలకి సంబంధించిన  ఖచ్చితమైన డేటా అవసరమని చెప్తుంది.   భారత భౌగోళిక, వాతావరణ పరిస్థితుల కారణంగా ఒండ్రుమట్టి, నల్లరేగడి, బంకమట్టి, ఎర్రమట్టి నేలలు, ఎడారి నేలలు, కొండప్రాంతపు నేలలని వివిధ రకాల మట్టి పుడుతుంది. అయితే  ఒక్కో రకపు మట్టి కొన్నికొన్ని    ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండి, రకరకాల   పంటలకు అనుకులంగా ఉంటుంది.  వ్యవసాయ పద్ధతులను మెరుగుపరచడంలో, ఆహార భద్రతను కల్పించడంలో మట్టి మీద  అవగాహన ఉండటం చాలా ముఖ్యమైనది.  నేలకున్న సమస్యలు.. సవాళ్లు, ముప్పులు:  నేలకి  సహజ ప్రక్రియలవల్ల,  మానవ చర్యల ద్వారా కూడా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలు మట్టి ఆరోగ్యం, జీవవైవిధ్యం, ఆహార భద్రతపై ప్రభావం చూపుతున్నాయి. ఇక్కడ నేలని ముప్పులోకి నెట్టే ప్రధాన సవాళ్లుగా కొన్నింటిని చెప్పవచ్చు.    నేల దెబ్బతినడం:   నీరు, గాలి ద్వారా మట్టి కొట్టుకుపోతుంటుంది. అలాగే  అడవులని నరికేయటం, పంటల మార్పిడి లేకపోవడం, ఇంకా  మారుతున్న వ్యవసాయ పద్ధతులు మట్టిని త్వరగా దెబ్బతినేలా చేస్తాయి. పంటలకి  పోషక లోపం:   భారతదేశంలో ప్రాంతాలను బట్టి  చాలా భాగం నేలలు నత్రజని, ఫాస్ఫరస్ లోపంతో ఉన్నాయి.  అందువల్ల ఎరువు ఎంత వేయాలో అనే అవగాహన కూడా లేని రైతులు, సబ్సిడీలో తీసుకున్న రసాయన ఎరువులని  విపరీతంగా ఉపయోగించటం వల్ల నేల సారం మారిపోయి పంటలకి పోషణ అందట్లేదు.  ఎడారీకరణ:   పెరుగుతున్న జనాభా ఒత్తిడి కారణంగా అడవులని కొట్టేయటం వల్ల, పశువుల అధిక మేత వలన సారవంతమైన నేలలు సారం కోల్పోయి ఎడారిగా మారుతున్నాయి.   నీరు నిల్వ ఉండిపోవటం:   నీటిపారుదల సరైన విధంగా లేకపోవడం, నేలలో వాటర్ చానల్స్‌ నుంచి నీరు లీకేజీ అవ్వటం వల్ల లక్షల ఎకరాల భూములు నీటితో నిండిపోతున్నాయి. దీనివల్ల మట్టి నిర్మాణం దెబ్బతిని, ఉత్పాదకత తగ్గిపోతుంది.  ఉప్పదనం,  క్షారతనం:   నీటిపారుదల అధికంగా ఉండే ప్రదేశాల్లో   మట్టిలో ఉప్పు పేరుకు పోవడం వల్ల కూడా అక్కడ నేల పంటకి అనుకూలం కాకుండా పోతుంది.  పట్టణీకరణ,  పాడుబడిన భూములు:   పట్టణాలకి వలసలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ స్థలానికి డిమాండ్ పెరిగి చుట్టుపక్కల మంచి పొలాలు కూడా లే-అవుట్లగా మార్చేస్తున్నారు. అలాగే  రసాయనాలు,  లోహాలతో  పరిశ్రమల వ్యర్థాలు నేలని కాలుష్యం చేస్తాయి.  పారిశ్రామీకరణ:   నేలని నాశనం చేసే ఓపెన్-కాస్ట్ మైనింగ్, పరిశ్రమల కోసం వ్యవసాయ భూములు, అటవీ ప్రాంతాలని ఆక్రమించుకోవటం.  ప్రపంచ నేల దినోత్సవాన్ని ఎలా జరుపుకోవాలి?  నేల సారాన్ని కాపాడటం: నేలలోని పైపొరల్లో  ఖనిజాలు, సేంద్రీయ పదార్థాలు, నీరు, గాలి ఉంటాయి.  ఇది మొక్కల పెరుగుదలకు బలంగా ఉండి, భూమిపై జీవం మద్దతు కోసం అవసరమైనది.  అందుకే ఈ నేల సారం కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం:  ఆరోగ్యవంతమైన నేల  ఆహార భద్రతకు కీలకం. కాబట్టి నేల పాడవకుండా వ్యవసాయ విధానాలు పాటించేలా ప్రోత్సహించాలి.  జీవ వైవిధ్యాన్ని కాపాడటం: నేడు రకరకాల రసాయనాల వినియోగం వల్ల సహజంగా నేల సారాన్ని పెంచటంలో సాయపడుతున్న జీవులు చనిపోతున్నాయి. అందుకే న్యూట్రియంట్ సైక్లింగ్,  కార్బన్ నిల్వల్లో  కీలక పాత్ర పోషించే జీవులను రక్షించాలి.  అవగాహన కలిగించడం:  భవిష్యత్ తరాలకు నేల  సంరక్షణ అనేది ఈ భూమి మీద మానవ మనుగడకి చాలా అవసరమనే  అవగాహన కలిగించాలి.  నేలని కాపాడుకోవటానికి ఏం చేయాలి?    మొక్కలు నాటటం:    మట్టి కొట్టుకుపోయే ప్రాంతాల్లో వృక్షాలు నాటడం దారా  మట్టిని దెబ్బతినకుండా కాపాడవచ్చు.  వాటర్‌షెడ్ మేనేజ్‌మెంట్:    ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (IWDP) వంటి కార్యక్రమాలు ద్వారా నీటి పారుదలని సమర్ధవంతంగా  నిర్వహించాలి.  టెర్రేస్ వ్యవసాయం:  పర్వత ప్రాంతాల్లో నేలను మెట్లు లాగా  పైనుంచి కిందవరకూ చెక్కి ఉంచే విధానంలో  మట్టి నీటితో పాటూ కిందకి కొట్టుకుపోకుండా కాపాడుతుంది.   ఆర్గానిక్ వ్యవసాయం:  రసాయన ఎరువులు వినియోగం తగ్గించి ఆర్గానిక్  ఎరువులు ఉపయోగిస్తూ వ్యవసాయం చేస్తే నేల సారం పెరుగుతుంది.  నేలను  కాపాడటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఇలా చేస్తే మనవంతు మన నేల తల్లికి సేవ చేసిన వాళ్ళమవుతాం. అందుకే  మట్టిని సంరక్షించడంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. "ఆరోగ్యకరమైన నేల, ఆరోగ్యకరమైన గ్రహం!" “ ఆరోగ్యకరమైన గ్రహం, ఆహ్లాదకరమైన జీవితం”అనే విషయాన్ని మర్చిపోకూడదు.                                  *రూపశ్రీ.

భారత నేవీ డే 2024 - విదేశీ శక్తుల మీద ఉక్కుపాదం.. భారత నౌకాదళం.. !

  ఏ దేశానికయినా అన్నివైపుల నుంచి రక్షణ కల్పించటానికి భద్రతా దళాల పాత్ర చాలా ఉంటుంది. అయితే మారుతున్న ప్రపంచ దేశాల స్థితిగతులు, విధివిధానాల వల్ల  మన దేశ భద్రత పరంగా, ఆర్ధికపరంగా  భారత నేవీ పాత్ర ముఖ్యమైనదిగా  మారింది. దేశ ఆర్ధిక వ్యవస్థ పుంజుకోవటంలో సముద్రమార్గాల ద్వారా  జరిగే వాణిజ్య రవాణా  కీలకమవుతుంది. ఒక పక్క రవాణా  సజావుగా సాగేలా చేస్తూ,  ఇంకో పక్క విదేశీ శక్తులనుంచి మన దేశాన్ని కాపాడుతున్న మన  నేవీ ఎంతో గొప్పది.      1971లో భారతదేశానికి, పాకిస్థానుకి  మధ్య  జరిగిన యుద్ధంలో  డిసెంబర్ నాలుగో తేదీన   ట్రైడెంట్ ఆపరేషన్లో  వీరోచితంగా పొరాడి, భారత నేవీ గొప్ప విజయాన్ని  సాదించింది. ఆ యుద్ధంలో  భారత నేవీ  పాకిస్థాన్ ప్రధాన పోర్ట్ నగరమైన  కరాచీపై ధైర్యంగా దాడి చేసింది. ఇది ఒక ప్రధాన సైనిక విజయమే కాకుండా, భారత నేవీకి ఉన్న  శక్తిని ప్రపంచానికి తెలియజేసింది. అందుకే దేశ రక్షణలో వారి పాత్రను, త్యాగాలను గౌరవించేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 4న భారత నౌకాదళ దినోత్సవం నిర్వహిస్తారు. మన దేశ  భద్రత కోసం ప్రాణత్యాగాలు చేసి, దేశ రక్షణ కోసం  సముద్ర సరిహద్దులను అహర్నిశలు కాపుకాసి మన నౌకాదళం చేస్తున్న కృషిని, వారు సాధించిన విజయాలను గుర్తుచేసుకోవటానికి జరుపుకునే  నేవీ డే చాలా ప్రత్యేకమైనది.  నౌకాదళ ప్రాముఖ్యత -పాత్ర: భారత దేశం  విస్తృతమైన తీరప్రాంతం కలిగి ఉంది. ఇంత పొడవైన  తీరప్రాంతాన్ని రక్షించటంలోనూ,   మన దేశానికి చెందిన సముద్ర ప్రాంతంలో  శాంతిని  కాపాడడంలోనూ,  సముద్ర మార్గాలను పర్యవేక్షించి,   వాణిజ్య  మార్గాలకి  భద్రత కల్పించటంలోనూ,  ప్రకృతి పరంగా సంభవించే విపత్తుల సమయంలో సహాయం అందించడంలోనూ, అంతర్జాతీయ సముద్ర సహకారాన్ని ప్రోత్సహించడంలోనూ  భారత నౌకాదళం కీలక పాత్ర పోషిస్తుంది.  ప్రతి సంవత్సరం, భారత నౌకాదళం తన వ్యూహాత్మక లక్ష్యాలను ప్రతిబింబించేలా ఓ థీమ్‌ను ఎంచుకుంటుంది. వీటిలో.. రక్షణ, సాంకేతిక అభివృద్ధి, సముద్ర భద్రత వంటి అంశాలపై అవి కేంద్రీకృతమవుతాయి. 2024 సంవత్సరానికి "ఆవిష్కరణ, స్వదేశీకరణ ద్వారా  నౌకాదళ శక్తిని, బలాన్ని పెంచుకోవటం." అనే థీమ్‌ను ఎంచుకోబడింది.  ఇప్పటి నౌకాదళం అత్యాధునిక సాంకేతికతను కలిగిన మిస్సైల్స్, ఫైటర్ జెట్లు, యుద్ధనౌకలను కలిగి ఉంది. భారత నావికాదళంలో INS విక్రాంత్, INS అరిహంత్ వంటి సమర్థవంతమైన  యుద్ధ నౌకలు ఉన్నాయి. ఇవి మన దేశ భద్రతలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి నేవీ డే వేడుకలు:  నేవీ డే సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు జరుగుతాయి.  వేడుకల్లో భాగంగా సీనియర్ అధికారులు నౌకాదళానికి నివాళులు అర్పిస్తారు.  గౌరవనీయులంతా  జెండా ఎగరవేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. సముద్రతీర రక్షణలో  కీలకమైన నౌకాదళ అధికారులను గౌరవించడమే కాకుండా, దేశ భద్రత కోసం సముద్రంలో  ఎన్నో కష్టాలకోర్చి పని చేసిన, పనిచేస్తున్న వీర  సైనికులని గుర్తించి, గౌరవిస్తారు. మాజీ నావికుల సేవలను గౌరవించే ప్రత్యేక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. భారత నౌకాదళ  సైనికుల త్యాగాలను, నిబద్ధతను గుర్తించే ప్రత్యేక కార్యక్రమాలతో  నేవీ డే ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ రోజు నౌకాదళానికి చెందిన యుద్ధనౌకలు ప్రజలకు ప్రదర్శనకు అందుబాటులో ఉంటాయి. నేటి విద్యార్థులు, యువతకి భారత నౌకాదళ గొప్పతనం గురించి, దేశ రక్షణలో దాని ప్రాముఖ్యత గురించి  అవగాహన కల్పించటం ద్వారా  నేవీ పట్ల ఆసక్తి కలిగేలా చేయటానికి ఇదొక అవకాశం.  భారత నౌకాదళానికి లాల్ సలామ్..!!                                         *రూపశ్రీ.  

ప్రపంచ అభివృద్ధి పై వికలాంగుల సంతకాలు! 

  “నన్ను నా సామర్ధ్యం నుంచి తెలుసుకో, నా  వైకల్యం నుంచి కాదు”  -  అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ఈ లోకంలో ప్రతీ తల్లీతండ్రీ తమకి  పుట్టే  బిడ్డ అందంగా, ఆరోగ్యంగా పుట్టాలనే ఆశపడతారు. అలా ఇవ్వమనే  భగవంతుణ్ణి ప్రార్దిస్తారు. కానీ చాలా కారణాల వల్ల కొన్నిసార్లు పిల్లలు రకరకాల వైకల్యాలతో పుడుతూ ఉంటారు. అలాంటి పిల్లలు చాలామటుకు ఈ లోకంలోకొచ్చిన మొదటి క్షణం నుంచే కుటుంబం నుంచి, సమాజం నుంచి ఎంతో వివక్షని ఎదుర్కొంటారు. పెద్దయ్యేవరకూ ఇదే వివక్ష కొనసాగిన సందర్భాలే ఎక్కువ ఉంటాయి. కానీ వాళ్ళు కూడా మన సమాజంలో భాగమేనని, వారికీ సామర్ధ్యాలు ఉంటాయని  గుర్తించి, వాళ్లపై వివక్ష చూపించకుండా వారి అభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం అందరికీ ఉంది.  అందుకే వికలాంగుల హక్కులపై అవగాహన పెంచి, వారి సంక్షేమాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తించిన   ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ద్వారా, 1992 నుంచి డిశంబర్3వ తేదీని అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంగా  జరపటం మొదలుపెట్టింది. ఈ రోజు, సమాన అవకాశాలు, అందుబాటు, సమగ్రత యొక్క ప్రాముఖ్యతను వెల్లడిస్తూ, వికలాంగుల విజయాలు గురించి, సమాజానికి వారు చేసిన  సేవలని గురించి ప్రశంసిస్తుంది. ప్రతి సంవత్సరం డిసెంబరు3న జరుపుకునే వికలాంగుల అంతర్జాతీయ దినోత్సవం ఒకో ఏడాది ఒక ప్రత్యేకమైన అంశాన్ని ప్రవేశపెడుతుంది. "వికలాంగుల నాయకత్వాన్ని పెంపొందించి, సమగ్రత,  స్థిరమైన భవిష్యత్తుకు దారితీయడం." ఇది ఈ ఏడాది థీమ్.  ప్రపంచవ్యాప్తంగా వికలాంగుల విలువైన పాత్రను,  నాయకత్వాన్ని ఇది గుర్తిస్తుంది. అలాగే, వారి జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో వారిని  చేర్చుకోవడం ఎంత ముఖ్యమో గుర్తుచేస్తుంది. ఈ రోజు, వికలాంగులు ఎదుర్కొంటున్న సవాళ్లను గురించి అవగాహన కలిగించడం,  సమాజంలోని అన్ని రంగాల్లో సమానంగా, సంపూర్ణంగా పాల్గొనేలా వారిని  కూడా  ప్రోత్సహించడం కోసం ఒక  వేదికగా పనిచేస్తుంది. వికలాంగుల జీవితాలను మెరుగుపరిచి, వారికి తగిన గౌరవం ఇవ్వటంలో  ప్రభుత్వాలు, సంస్థలు,  సమాజానికి అవకాశాన్ని అందిస్తుంది. వికలాంగుల హక్కులు, సంక్షేమానికి  మద్దతు ఇవ్వడం సాటి మనిషిగా మన బాధ్యత.  వివిధ మార్గాల్లో ప్రతీ ఒక్కరూ ఈ బాధ్యత తీసుకుని వారి అభివృద్ధికి సాయపడవచ్చు.  అందులో కొన్ని తెలుసుకుంటే..  అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం:  వికలాంగులకు సంబంధించిన సమస్యలపై చర్చలు, వర్కుషాపులు నిర్వహించటం ద్వారా ప్రజలకి వారి సమస్యలపై అవగాహన తెప్పించవచ్చు. వైకల్యం అనేది కేవలం  బయటకి కనిపించేది మాత్రమే కాదు, బయటకి కనిపించని (ఆటిజం, డిస్లెక్సియా, డిస్కాల్కులియా) వైకల్యాలు కూడా ఉంటాయని పాఠశాల స్థాయినుంచే గుర్తించి, అటువంటివారి అభివృద్ధి కోసం మనం అందించగలిగే సహకారం ఏమిటనేది అందరికీ అవగాహన కల్పించాలి.   విజయాలను గుర్తించటం:   పుట్టినప్పటి నుంచో లేక ప్రమాదం వల్లనో వైకల్యం వచ్చినప్పటికీ, కఠిన పరిస్థితులకి తలొగ్గకుండా, ఏ వైకల్యం  మమ్మల్ని ఆపలేదని నిరూపిస్తూ,  విజయాలు సాధించిన ఎంతో మంది వికలాంగుల విజయాలను గుర్తించి ప్రశంసించాలి. అప్పుడే అలాంటివారిని చూసి మిగిలిన వారికి ప్రేరణ కలుగుతుంది.  జీవిత అనుభవాలు చెప్పించటం:   ఈ వివక్ష చూపించే సమాజంలో తాము ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న సమస్యలు గురించి ,  వికలాంగుల అనుభవాలను పంచుకుని అవగాహన పెంచవచ్చు. టెక్నాలజీ,  విధానాలలో మార్పులు తీసుకురావటం:  వికలాంగులు కూడా మనలాగే  రోజువారీ జీవితాన్ని గడపగలగాలంటే,   వికలాంగులకి తగిన మౌలిక సదుపాయాలు, రవాణా,  డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను ప్రోత్సహించటం ద్వారా వారు కూడా మనలాగే  అవకాశాలని అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. సమాజంలోని  వైద్య, విద్య, రవాణా సంస్థల్లోనూ,  వారు పని చేసే సంస్థల్లోనూ కొన్ని విధానాల్లో మార్పులు తీసుకురావటం, వారికి ఉపయోగపడే సాంకేతికతని అందుబాటులోకి తీసుకురావటం వంటివి చేయాలి.  అప్పుడే ఉద్యోగుల వృత్తిపరమైన అవసరాలు తీరి వారు కూడా సమాజ అభివృద్ధిలో భాగమవుతారు.  వికలాంగుల సంస్థలకు మద్దతు ఇవ్వటం:  వికలాంగుల సంక్షేమానికి పనిచేసే సంస్థలకు స్వచ్ఛందంగా సేవ చేయండి లేదా సహాయం చేయండి. ఈ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం, గ్లోబల్ నుండి లోకల్ వరకు అన్నిరంగాల్లో, అన్ని విధాలుగా  మనం సులభతరం చేసే మార్గాలు గురించి మాత్రమే కాకుండా, వికలాంగులు కూడా తమ గొంతును వినిపించి, సమాజంలో వారి  భాగస్వామ్యాన్ని కూడా గుర్తించడానికి ఒక అవకాశం ఇస్తుంది. వికలాంగుల మేలు కోసం దీర్ఘకాలిక మార్పులను అమలు చేయడం ప్రారంభించి, వారికి ప్రాముఖ్యతని ఇవ్వటం ద్వారా మరింత సమర్థవంతమైన భవిష్యత్తును రూపొందించవచ్చు.  మనలో ఉన్న వైకల్యాన్ని ఒప్పుకొని క్రుంగిపోవటమే అసలు వైకల్యమని,  మానసికంగా  దృఢంగా నిలబడి,  వైకల్యాన్ని కూడా విజయపధం వైపు నడిచే ప్రేరణగా, బలంగా  మార్చుకున్న గొప్ప వ్యక్తులు ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ ఉన్నారు. అటువంటివారు మిగిలిన అందరికీ ఆదర్శంగా నిలిచి ఈ సమాజంలో వారి పాత్ర కూడా ఉందన్న నిజాన్ని ప్రపంచమంతా  అర్ధం చేసుకుని, వారిపై ఎటువంటి వివక్షా లేని సమాజం వైపు అడుగువేయాలని కోరుకుందాం…                                             *రూపశ్రీ