బైక్ ర్యాలీస్ కి నో పర్మిషన్..
ప్రస్తుత ఎమ్మెల్సి ఎన్నికల ప్రచారానికి గాను హైదరాబాద్ నగరంలో బైక్ ర్యాలీలకు అనుమతిలేదని పోలీసు అధికారులకు స్పష్టం చేశారు. ఎన్నికల ఏర్పాట్లపై జిహెచ్ఎంసి కార్యాలయంలో కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి నిర్వహించిన సమావేశంలో నగర పోలీసు అడిషనల్ సిపి డి.ఎస్.చౌహాన్, జాయింట్ సిపి అరుణ్ జోషి, సెంట్రల్ జోన్ జాయింట్ సిపి విశ్వప్రసాద్, ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రియాంక అలా, అడిషనల్ కమిషనర్ పంకజ లు పాల్గొన్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 191 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వీటికి విస్తృత బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి నిర్వహించే ర్యాలీలు, సభలు, సమావేశాల పై ముందస్తుగా అనమతులు పొందాలని, ముఖ్యంగా సభలు, సమావేశాలు, ర్యాలీల నిర్వహణపై తేదీ, సమయం, రూట్లను స్పష్టంగా తెలియజేయాలని అడిషనల్ కమిషనర్ చౌహాన్ స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించి రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాన్ని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేయనున్నట్లు లోకేష్ కుమార్ తెలిపారు. ఒక్కో హాల్ లో 7 టేబుళ్ల చొప్పున 8 గదుల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, కౌంటింగ్ పూర్తికి దాదాపు 40 గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉందని అన్నారు.