మలబద్దకం పైల్స్ గా మారకూడదు అంటే.. ఈ 6 పండ్లు తినండి చాలు..!

  మలబద్దకం.. మలవిసర్జన సరిగా జరగకపోతే ఏర్పడే సమస్య.  ప్రతి రోజూ సాఫీగా మలవిసర్జన జరగడం శరీరం ఆరోగ్యంగా ఉన్నది అనడానికి ఒక ముఖ్య సంకేతం.  అయితే వారానికి 2-3 సార్లు మాత్రమే మల విసర్జన జరుగుతూ ఉంటే.. దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇది భవిష్యత్తులో చాలా ప్రమాదకరంగా మారే సమస్యకు దారి తీస్తుంది.  ముఖ్యంగా  మలబద్ధకం వల్ల పైల్స్, రక్తంతో కూడిన పైల్స్, ఆపై పగుళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మలబద్దకం తగ్గిపోవాలన్నా,  మలబద్దకం ఫైల్స్ సమస్యకు దారి తీయకూడదన్నా.. 6 రకాల పండ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో  మంచిదని అంటున్నారు ఆహార నిపుణులు.  దీని గురించి తెలుసుకుంటే.. కెవి.. డెంగ్యూ చికిత్సలో కివి తినడం మంచిది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది,  ఇన్ఫెక్షన్ల నుండి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. ఈ ఆకుపచ్చ పండులో ఆక్టినిడిన్ ఉందని, ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. పియర్.. పియర్  పండులో సార్బిటాల్ ఉంటుంది. ఇది చక్కెర ఆల్కహాల్, ఇది భేదిమందుగా పనిచేస్తుంది. కానీ దానిని తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సార్బిటాల్‌ను అధికంగా తీసుకోవడం వల్ల ఉబ్బరం,  విరేచనాలు వస్తాయి. ఇందులో అధిక FODMAP రసాయనం ఉంటుంది. అందువల్ల ఇలా జరుగుతుంది. ఆపిల్.. ఆపిల్ తినడం వల్ల మలబద్ధకంతో సహా అన్ని రకాల వ్యాధులను నయం చేయవచ్చు. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది . ఇది ప్రేగు కదలికను సులభతరం చేస్తుంది. ఆపిల్ తినడం వల్ల గుండె, మెదడు ఆరోగ్యంగా ఉంటాయి. బొప్పాయి.. ఎన్నో ఏళ్ల  నుండి బొప్పాయి కడుపుకు మంచిదని చెబుతున్నారు . ఇది మలబద్ధకాన్ని తొలగించి కడుపుని క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. వైద్యుల ప్రకారం ఇది జీర్ణ ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది, ఇవి ఆహారం సరిగా జీర్ణం కావడానికి  బాధ్యత వహిస్తాయి. ప్రూనే, బెర్రీలు. ఈ రెండు పండ్లు  చాలా అద్బుతం చేస్తాయ్. ప్రూనేలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అవి ప్రేగు కదలికను సులభతరం చేయడానికి గొప్ప మార్గం. బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు,  ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.                                        *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

ఆరోగ్యకరమైన హోళికి ఆరోగ్య చిట్కాలు!

హోళి అంటే ఇష్టం లేనిది ఎవరికి?? చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు హోళి సందడిలో తమవంతు పాత్ర పోషిస్తారు. అయితే హోళి సంబరాలలో అక్కడక్కడా అపశ్రుతులు చోటుచేసుకుంటు ఉంటాయి. హోళిని హాయిగా ఎంజాయ్ చేస్తూ.. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు అవసరం. మీ చర్మ సంరక్షణ తప్పనిసరి:  చర్మాన్ని వీలైనంత జిడ్డుగా చేయడం చాలా ముఖ్యం, తద్వారా రంగులు చర్మం మీద  వ్యాప్తి చెందడానికి లేదా అంటుకునే అవకాశం ఉండదు. ఇందుకోసం కొబ్బరి నూనె రాసుకోవచ్చు. కొబ్బరి నూనె వల్ల మరొక లాభం ఏంటంటే చర్మం పొడిబారకుండా చేస్తుంది. అలాగే శరీరం మీద రంగులు క్లీన్ చేయడం సులువు అవుతుంది.   సేంద్రీయ రంగుల ఎంపిక:   పర్యావరణ అనుకూలంగానే కాకుండా మన చర్మానికి కూడా అనుకూలమైన రంగులతో హోలీని జరుపుకోవాలి. హానికరమైన రసాయనాలు కలిపిన రంగులను నివారించాలి. రసాయనాలు కలిపిన రంగులు ప్రకాశవంతంగా కనిపిస్తాయి అంతేకాఫు ఇవి నీటిలో చాలా తొందరగా కలిసిపోతాయి. ఈ రంగులు  చర్మం నుండి తొలగించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. చర్మాన్ని డ్యామేజ్ చేస్తాయి. ఇన్ఫెక్షన్లు, సైడ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. బంతి పువ్వు, గులాబీ, మందారం, చెట్ల ఆకులు, పసుపు ఇలా పువ్వుల రెక్కల నుండి రంగులు తయారుచేసుకోవచ్చు. .  హైడ్రేటెడ్ గా ఉండాలి:  హోలీ వేసవిలో వస్తుంది, హోళి సమయానికి వేసవి మొదలైపోయి ఉంటుంది. దీనివల్ల బయట ఎండలు భగ్గుమంటుంటాయి. ఈ ఎండల్లో రంగులు చల్లుకుని ఎంజాయ్ చేసినా.. మరొకవైపు ఎండ దెబ్బ మాములుగా ఉండదు.  కాబట్టి హైడ్రేటెడ్ గా ఉండటం చాలా అవసరం. నీరు, గ్లూకోజ్, జ్యూస్‌లు, శరీరాన్ని తిరిగి శక్తివంతం చేయడంలో సహాయపడతాయి.  పైగా ఇవి చర్మం పొడిబారకుండా తేమగా ఉండేలా చేస్తాయి.   కళ్ళను తేలిగ్గా తీసుకోవద్దు:  మీరు రోజూ  కాంటాక్ట్ లెన్స్‌లను ధరించేవారు అయితే, రంగులతో ఆడుకునే ముందు వాటిని తీసివేయడం మంచిది. కళ్ళజోడు మీద రంగులు లేదా నీళ్లు పడితే ఎదుటి ప్రాంతాన్ని మసగ్గా కనిపించేలా చేస్తాయి. ఇది ఇబ్బందే అనుకోవచ్చు. అలాగని కళ్ళజోడు లేకుండా హొలీ ఆడేటప్పుడు రంగులు నేరుగా కళ్ళలోకి పడకుండా అజాగ్రత్త పడాలి. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. కాబట్టి కళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి.  స్వీట్ల దగ్గరా జాగ్రత్త:  హోలీ సమయంలో మార్కెట్‌లో కల్తీ ఖోయా, మావా అమ్ముతారు. ఇంకా ఇలాంటి కల్తీ పదార్థాలతో స్వీట్లు తయారుచేస్తారు. ఇలాంటివే ఆఫర్స్ కింద, డిస్కౌంట్ల కింద అమ్మేస్తారు. కాబట్టి స్వీట్స్ కొనేముందు జాగ్రత్తగా ఉండాలి. .  శరీరాన్ని ఇలా కవర్ చేయాలి: హొలీ ఆడేటప్పుడు యావరేజ్ గా ఉన్న బట్టలు వేసుకోవాలి. దీనివల్ల వాటిమీద రంగులు వదలకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ కొత్త బట్టలు అయితే నాశనం అయిపోతాయి. ఫుల్ హాండ్స్ ఉన్న టాప్స్, ఫుల్ గా కాళ్లను కవర్ చేసే ప్యాంట్స్ వేసుకోవాలి. దీనీవల్ల రంగులు శరీరాన్ని పాడుచేసే అవకాశం తక్కువ. పాత డెనిమ్ జీన్స్, పొడవాటి పైజామాలను ఎంచుకోవచ్చు.  ఇలా ఆరోగ్యకరమైన హోళిని ఎంజాయ్ చేసి, ఆరోగ్యంగా ఉండండి.                                    ◆నిశ్శబ్ద.

హోలీ రంగులతో వ్యాధులను నయం చేయవచ్చా? కలర్ థెరపీ ఏం చెప్తోందంటే..!

    హోలీ అనేది రంగుల పండుగ. ఈ పండుగలో ప్రజలు తమకు ఇష్టమైన వారికి,  స్నేహితులకు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలుపుతారు.  రంగులు చల్లుకుంటూ  పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. రంగులు వేయడం అనేది మతానికి లేదా కేవలం సరదాకి మాత్రమే పరిమితం కాదు, దానికి శాస్త్రీయ కారణం కూడా ఉంది. హోలీ రంగులతో ఆడుకోవడం కూడా ఆరోగ్యకరమేనట.  ఇది మన మానసిక స్థితి,  శక్తి స్థాయిలపై తీవ్ర ప్రభావాన్ని చూపే ఒక రకమైన కలర్ థెరపీ అంటున్నారు వైద్యులు. హోలీ సమయంలో రంగులతో ఆడుకోవడం వల్ల మనస్సులో ఆనందం, శక్తి,  ఆశావాదం కలుగుతాయి.  హోలీలో రంగులను ఉపయోగించడం ద్వారా  శారీరక, మానసిక,  భావోద్వేగ ప్రయోజనాలను పొందుతాము. కాబట్టి హోలీలోని రంగుల వెనుక నిజాన్ని అర్థం చేసుకోవాలి.  హోలీ రంగుల శాస్త్రీయ ప్రాముఖ్యత, కలర్ థెరపీ అంటే ఏమిటి.. దాని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుంటే.. కలర్ థెరపీ అంటే ఏమిటి?   కలర్ థెరపీ అనేది రంగుల ద్వారా మానసిక,  శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే పద్ధతి. దీనిని క్రోమోథెరపీ అని కూడా అంటారు. ఈ చికిత్సలో ప్రతి రంగుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రంగులు,  లైట్లు ఉపయోగించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతాయి. కలర్ థెరపీ ఎలా పనిచేస్తుంది? కలర్ థెరపీలో, రంగుల ద్వారా శరీరంలోని అనేక అంశాలను సమతుల్యం చేసే ప్రయత్నం జరుగుతుంది. మనం ఒక రంగును చూసినప్పుడు, మన మెదడు ఆ రంగు తరంగాలను అందుకుంటుంది.  మన భావోద్వేగాలు, శరీరం తదనుగుణంగా స్పందిస్తాయి.   కలర్ థెరపీ  ప్రయోజనాలు .. ఎరుపు ఎరుపు రంగు శక్తిని,  ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంది. ఈ రంగు ఉత్సాహాన్ని,  ధైర్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.  అలసటను తొలగిస్తుంది. అయితే అధిక ఎరుపు రంగు కోపం,  దూకుడును కూడా పెంచుతుంది.  కాబట్టి దీనిని సమతుల్య పద్ధతిలో ఉపయోగించాలి.   పసుపు రంగు పసుపు అనేది సానుకూలత,  తెలివితేటల రంగు. ఈ రంగు ఆనందం, ఆత్మవిశ్వాసం,  సృజనాత్మకతను పెంచుతుంది. జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది,  ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. ఈ రంగు మానసిక నిరాశ,  ఒత్తిడిని తొలగించడంలో సహాయపడుతుంది.   ఆకుపచ్చ రంగు ఆకుపచ్చ రంగు అంతర్గత శాంతి,  సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఇది గుండె,  ఊపిరితిత్తుల పనితీరును బలపరుస్తుంది. ప్రకృతితో ముడిపడి ఉన్న ఈ రంగు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. నీలం రంగు నీలం చల్లదనం,  శాంతిని సూచిస్తుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.  ఒత్తిడిని తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో నీలం రంగు కూడా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. హోలీలో రంగుల శాస్త్రీయ ప్రాముఖ్యత.. హోలీ పండుగ వసంత ఋతువులో వస్తుంది. ఈ సమయంలో వాతావరణంలో మార్పులు జరుగుతాయి. దీనివల్ల శరీరంలో అనేక రకాల ఇన్ఫెక్షన్లు,  అలెర్జీలు వచ్చే అవకాశం పెరుగుతుంది. అందువల్ల, వసంతకాలంలో రంగులను ఉపయోగించడం వల్ల మన శరీరం సానుకూల శక్తితో నింపబడుతుంది. రంగులతో ఆడుకోవడం వల్ల ఎండార్ఫిన్లు (ఆనంద హార్మోన్లు) విడుదలవుతాయి, ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. హోలీ సమయంలో, ప్రజలు తమ ఇళ్ల బయట ఎండలో రంగులతో ఆడుకుంటారు. సూర్యకాంతి ఎముకలకు మేలు చేసే విటమిన్ డి ని అందిస్తుంది. సహజ రంగులు చర్మానికి కూడా మేలు చేస్తాయి.  టాక్సిన్లను బయటకు పంపడంలో సహాయపడతాయి.   కలర్ థెరపీని ఎలా తీసుకోవాలి? హోలీ రోజున రంగులతో ఆడుకోవడమే కాకుండా, అనేక విధాలుగా కలర్ థెరపీని తీసుకోవచ్చు.  ఇల్లు లేదా ఆఫీసు గోడలపై మనసును ప్రశాంతపరిచే రంగులను ఉపయోగించవచ్చు. రంగురంగుల చిత్రాలతో అలంకరించి వాటిని చూస్తుండాలి.  దుస్తులు,  వస్తువులను మీ మానసిక స్థితికి సరిపోయే రంగులను చేర్చండి. రంగురంగుల లైటింగ్,  అలంకరణలతో మానసిక స్థితిని ప్రభావితం చేయండి. రోజువారీ ధ్యానం లేదా యోగా సమయంలో తగిన రంగులపై ధ్యానం చేయాలి.                                                       *రూపశ్రీ.  

హోలీ ఆడుతున్నప్పుడు కళ్లలో రంగు పడితే  ఏం చేయాలి?

    హోలీ అనేది రంగులు చల్లుకుంటూ జరుపుకునే  ఉత్సాహాల పండుగ. ఎంతో రుచికరమైన ఆహారాలు తయారు చేయడం,  స్నేహితులు ఆత్మీయులను కలవడం, అన్నింటి కంటే ముఖ్యంగా రంగులు చల్లుకుంటూ ఆనందాన్ని, ప్రేమను పంచుకోవడం  ఈ పండుగను చాలా ప్రత్యేకంగా నిలబెడతాయి. అయితే హోలీ ఆనందం ,  ఉత్సాహం మధ్య, ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండటం కూడా చాలా ముఖ్యం. హోలీ సమయంలో అనారోగ్యకరమైన ఆహారం తినడం వల్ల రక్తంలో చక్కెర పెరిగే ప్రమాదం ఉంది.  అయితే సింథటిక్ రంగులు,   ఆస్తమా,  శ్వాసకోశ సమస్యలను పెంచుతాయి. అలాంటి రోగులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. హోలీ ఆడుతున్నప్పుడు కంటి భద్రతను విషయంలో జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. సింథటిక్ లేదా కెమికల్ రంగులు కంటి చికాకు, ఎరుపుదనం,  తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. హోలీ ఆడుతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే, అది కార్నియల్ ఇన్ఫెక్షన్ లేదా కంటి చూపు పూర్తీగా పోవడం వంటి  కారణాలకు దారి తీయవచ్చు. హోలీ ఆడుతున్నప్పుడు కంటి సంరక్షణ ఎలాగంటే.. కొన్నిసార్లు మార్కెట్లో లభించే రంగులలో మెత్తగా రుబ్బిన గాజు,  హానికరమైన రసాయనాలు ఉండవచ్చు. ఇవి చర్మానికి,  కళ్ళకు తీవ్రమైన హాని కలిగిస్తాయి.  పొడి రంగులలో లేదా గులాల్‌లో మెరుపును చూసినట్లయితే, అది గాజు పొడి కావచ్చు. అందువల్ల, రంగులతో ఆడుకునేటప్పుడు కళ్ళు వంటి సున్నితమైన శరీర భాగాలను రక్షించుకోవడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం. కంటి వైద్యులు ఏం చెప్తున్నారు.. హోలీ సమయంలో,  తరువాత, OPDలో కంటి సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని కంటి వైద్యులు చెబుతున్నారు. హోలీ ఆడుతున్నప్పుడు  కళ్ళను రక్షించుకోవడానికి గాగుల్స్ లేదా సన్ గ్లాసెస్ ధరించాలి. ఇది కళ్ళను రంగు,  మురికి నీటి నుండి రక్షించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు మీరు సేంద్రీయ,  మూలికా రంగులను మాత్రమే ఉపయోగించడం చాలా ముఖ్యం. రసాయనాలు కలిగిన రంగులు కళ్ళలో చికాకు,  అలెర్జీలకు కారణమవుతాయి. హోలీ తర్వాత  కళ్ళు మంటగా ఉంటే ఏమి చేయాలి? హోలీ తర్వాత కళ్ళలో చికాకు లేదా ఎరుపు అనిపిస్తే  కళ్ళకు ఉపశమనం కలిగించడానికి  సులభమైన ఇంటి నివారణలను ప్రయత్నించవచ్చు. వాపు తగ్గించడానికి,  చికాకు నుండి ఉపశమనానికి శుభ్రమైన గుడ్డను ఉపయోగించి కోల్డ్ కంప్రెస్‌ను చేయాలి.  కళ్ళను శుభ్రపరచడానికి,  రిఫ్రెష్ చేయడానికి చల్లని రోజ్ వాటర్ ఉపయోగించాలి.  తాజా కలబందను కళ్ళ చుట్టూ రాయాలి. వెంటనే కళ్లు  చల్లగా కావడం కోసం  మూసిన కనురెప్పలపై చల్లని దోసకాయ ముక్కలను ఉంచాలి.        *రూపశ్రీ.  

రోజూ 10 నిమిషాలు స్కిప్పింగ్ చేస్తే శరీరంలో కలిగే మార్పులివే..!

  స్కిప్పింగ్  కేవలం పిల్లల ఆట అని  అనుకుంటే పొరబడ్డట్టే. ఇది  శారీరక దృఢత్వాన్ని అద్భుతంగా పెంచే గొప్ప కార్డియో వ్యాయామం అని కొత్త అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇది శరీరంలో ఆక్సిజన్ వినియోగ పరిమాణాన్ని పెంచడంలో సహాయపడుతుంది, తద్వారా స్టామినా,  శక్తి స్థాయిలు రెండూ మెరుగుపడతాయి. స్కిప్పింగ్ సరదాగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనికి జిమ్ అవసరం లేదు, మంచి నాణ్యమైన తాడు,  కొంచెం ఖాళీ స్థలం ఉంటే సులభంగా చేయవచ్చు.  ప్రతిరోజూ 10 నుండి 15 నిమిషాలు స్కిప్పింగ్ చేస్తే   గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందట.  కేలరీలు కరిగిపోతాయి, మొత్తం శరీరంలోని కండరాలు చురుగ్గా మారుతాయి. ఇంకా రోజూ 10 నిమిషాలు స్కిప్పింగ్ చేస్తే శరీరంలో కలిగే మార్పులేంటో తెలుసుకుంటే.. స్కిప్పింగ్ అనేది అధిక-తీవ్రత కలిగిన కార్డియో వ్యాయామం. దీని వల్ల  గుండె,  ఊపిరితిత్తులు బలపడతాయి . స్కిప్పింగ్  వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తుల పనితీరు సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది శరీరంలో ఆక్సిజన్  ప్రసరణకు సహాయపడుతుంది.  రన్నింగ్  లేదా సైక్లింగ్ పట్ల ఆసక్తి లేకపోతే స్కిప్పింగ్  మంచి ఎంపిక  అవుతుంది. మొదటి 20 సెకన్ల పాటు నెమ్మదిగా స్కిప్పింగ్ ఆడి ఆపై క్రమంగా  వేగాన్ని పెంచాలి. రెండు నుండి మూడు నిమిషాల సెట్లలో 5 నుండి 10 నిమిషాలు స్కిప్పింగ్ చేయవచ్చు.  క్రమంగా  సమయం, వేగం రెండింటినీ పెంచుకోవచ్చు. బరువు తగ్గడానికి..  బరువు తగ్గాలనుకుంటే స్కిప్పింగ్ మంచి ఎంపిక. ఇది 10 నిమిషాల్లో 100 నుండి 150 కేలరీలు బర్న్ చేయగలదు. స్కిప్పింగ్  జీవక్రియను పెంచుతుంది, దీని కారణంగా శరీరం నిరంతరం కొవ్వును కాల్చేస్తుంది. ఒక నిమిషం స్కిప్పింగ్ చేసి ఆపై 30 సెకన్ల పాటు విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ ప్రక్రియను కనీసం 10 సార్లు రిపీట్  చేయాలి. వ్యాయామం చేసేటప్పుడు కండరాలు కోలుకోవడానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. శరీరం బ్యాలెన్సింగ్.. స్కిప్పింగ్  వల్ల  చేతులు, కాళ్ళు,  కళ్ళ సమన్వయం మెరుగుపడుతుంది. ఇది  దృష్టిని,  ప్రతిచర్యలను మెరుగుపరుస్తుంది. అథ్లెట్లు, నృత్యకారులు స్కిప్పింగ్ ను ఇష్టపడతారు, ఇది శరీర సమతుల్యతను మెరుగుపరుస్తుంది. దీనివల్ల పడిపోవడం లేదా గాయపడే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. ఇది శరీరంలో నాడీ కండరాల నియంత్రణను పెంచుతుంది. తద్వారా శరీర కదలికలను మెరుగుపరుస్తుంది. ఒక కాలుతో నెమ్మదిగా స్కిప్పింగ్ చేయాలి. ఇందులో చాలా రకాలు ఉన్నాయి.  వాటిని ట్రై చేస్తూ బోర్ కొట్టకుండా చూసుకోవచ్చు.                                *రూపశ్రీ.

చెరకు రసం వేసవిలో మంచిదే.. కానీ వీళ్లకు డేంజర్..!

  వేసవి కాలం ప్రారంభం కావడంతోనే  చెరకు రసం కోసం డిమాండ్ కూడా పెరుగుతుంది. చెరకు రసం సహజమైన,  ఆరోగ్యకరమైన పానీయంగా పరిగణించబడుతుంది. ఇది వేసవిలో శరీరాన్ని చల్లబరుస్తుంది.  శక్తిని అందిస్తుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు,  సహజ చక్కెరలు ఉంటాయి, ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అయితే, చెరకు రసం అందరికీ ప్రయోజనకరంగా ఉండదు  కొంతమంది దీనిని తాగకుండా ఉండటమే మంచిదని ఆహార నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇది వారి ఆరోగ్యానికి హానికరం కావచ్చు. చెరకు రసం ఎవరు తాగకూడదో.. ఎందుకు తాగకూడదో..  తెలుసుకుంటే.. డయాబెటిస్ రోగులు.. చెరకు రసంలో అధిక మొత్తంలో సహజ చక్కెర ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది . డయాబెటిస్ ఉన్న రోగులు తమ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవాలని వైద్యులు చెబుతారు. అటువంటి పరిస్థితిలో చెరకు రసం తాగడం వల్ల వారి చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. అయితే.. డయాబెటిస్ ఉన్న రోగులు చెరకు రసం తాగాలనుకుంటే వైద్యుడిని సంప్రదించి చాలా తక్కువ పరిమాణంలో తాగాలి. ఊబకాయం.. చెరకు రసంలో కేలరీలు,  చక్కెర పుష్కలంగా ఉంటాయి.  బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నా లేదా ఊబకాయంతో ఉన్నా, చెరకు రసం  తాగడం సరైనది కాదు. దీన్ని ఎక్కువగా తాగడం వల్ల బరువు పెరగవచ్చు.  అధిక రక్తపోటు, గుండె జబ్బులు,  మధుమేహం వంటి ఊబకాయం సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది . దంత సమస్యలు.. చెరకు రసంలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది, ఇది దంతాలకు హానికరం.  బలహీనమైన దంతాలు లేదా కుహరం సమస్యలు ఉంటే చెరకు రసం తాగడం మానుకోవాలి. చక్కెర దంతాలలో బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, ఇది దంత సమస్యలను మరింత పెంచుతుంది. జీర్ణ సమస్యలు.. చెరకు రసం చల్లగా ఉంటుంది. ఇది కొంతమంది జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది.  గ్యాస్, అసిడిటీ లేదా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) వంటి కడుపు సమస్యలు ఉంటే, చెరకు రసం తాగడం మానుకోవాలి. ఇది కడుపులో చల్లదనాన్ని కలిగిస్తుంది,  జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, ఇది సమస్యలను పెంచుతుంది. మూత్రపిండ వ్యాధి.. చెరకు రసంలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. మూత్రపిండాల వ్యాధి ఉన్న రోగులు పొటాషియంను పరిమిత పరిమాణంలో తీసుకోవాలి, ఎందుకంటే  మూత్రపిండాలు శరీరం నుండి అదనపు పొటాషియంను తొలగించలేవు.  అటువంటి పరిస్థితిలో చెరకు రసం తాగడం వల్ల వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది.                                               *రూపశ్రీ.

కొల్లాజెన్ బూస్ట్ ఫుడ్స్.. ఇవి తింటే  వృద్దాప్యం అస్సలు రాదు..!

మహిళలకు 30 ఏళ్ల వయస్సు దాటగానే  కొత్త ప్రయాణం మొదలైనట్టే ఉంటుంది. కెరీర్, కుటుంబం,  వ్యక్తిగత జీవితంలో కొత్త విషయాలు వచ్చి చేరే సమయం ఇదే.  30 ఏళ్ళ తరువాత మహిళల జీవనశైలి మారడమే కాకుండా, శరీరం లోపల కూడా చాలా మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా దీని ప్రభావం చర్మ ఆరోగ్యంపై స్పష్టంగా కనిపిస్తుంది. 30 ఏళ్లు దాటిన తర్వాత, శరీరంలో కొల్లాజెన్ స్థాయి క్రమంగా తగ్గుతుంది. దీనివల్ల చర్మంపై ముడతలు, కీళ్లు లూజ్ కావడం,  దృఢత్వం కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి.  అయితే దీని వల్ల   ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆహార నిపుణులు అంటున్నారు. ఆహారంలో కొన్ని పదార్థాలు  చేర్చుకుంటే కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది.   చర్మం,  కీళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు,  కూరగాయలు.. నారింజ, నిమ్మ, ఆమ్లా, కివి, స్ట్రాబెర్రీ, బొప్పాయి,  క్యాప్సికమ్ వంటివి  ఆహారంలో భాగంగా చేసుకోవాలి. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంతో పాటు చర్మ కాంతిని కాపాడుతుంది.  ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం.. గుడ్డు, చేపలు, చికెన్, కాటేజ్ చీజ్, పెరుగు,  పప్పులు ప్రోటీన్ కు అద్భుతమైన వనరులు. అవి కొల్లాజెన్ ఏర్పడటానికి,  శరీర బలాన్ని కాపాడుకోవడానికి అవసరమైన అమైనో ఆమ్లాలతో సమృద్ధిగా ఉంటాయి. గింజలు, విత్తానాలు.. బాదం, వాల్‌నట్స్, చియా గింజలు,  అవిసె గింజలు వంటి డ్రై ఫ్రూట్స్ తినాలి . వీటిలో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు,  యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఆకుకూరలు.. పాలకూర, మెంతులు, బ్రోకలీ,  క్యాబేజీ వంటి కూరగాయలు  శరీరంలో క్లోరోఫిల్ మొత్తాన్ని పెంచడం ద్వారా కొల్లాజెన్ నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి.                                *రూపశ్రీ.

ఎముకలను దెబ్బ తీసే ఆహారాల గురించి తెలుసా?

  ఎముకలు శరీర ఫిట్‌నెస్ లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటేనే శరీరం దృఢంగా ఉంటుంది. అయితే ఎముకల ఆరోగ్యం మీద శ్రద్ద చూపే వారు తక్కువే.  ఏవైనా టెస్ట్ లు చేయించుకున్నప్పుడు తప్పితే ఎముకలు బలంగా ఉన్నాయా లేదా బలహీనంగా ఉన్నాయా అనే విషయం తెలుసుకోలేరు.  అయితే చాలా వరకు ఎముకలు బలహీనంగా మారడానికి ఆహారం,  జీవనశైలి కారణం అవుతుంది. కొన్ని ఆహారపు అలవాట్లు శరీరానికి స్లో పాయిజన్ లాగా పనిచేస్తాయి. వెంటనే ఈ ఆహారపు అలవాట్లు మానేయడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు, ఆహార నిపుణులు అంటున్నారు. ఉప్పు.. ఉప్పు లేని కూర తినలేము అనే విషయం తెలిసిందే. అయితే అసలు ఉప్పు లేకపోయినా ఆరోగ్యానికి ముప్పే.. అలాగే ఉప్పు ఎక్కువ తిన్నా ఆరోగ్యానికి ముప్పే.. ముఖ్యంగా ఎముకలకు చాలా ముప్పు వాటిల్లుతుంది. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో కాల్షియం లోపం ఏర్పడుతుంది.  దీని కారణం ఎముకలు బలహీనం అవుతాయి. ధూమపానం, మద్యపానం.. ధూమపానం,  మద్యపానం అలవాట్లు శరీరంలో కాల్షియం, విటమిన్-డి స్థాయిలను తగ్గిస్తాయి.  ఇవి ఎముకలను దెబ్బతీస్తాయి.  ఈ  అలవాట్లకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. లేకపోతే ఎముకల బలహీనత, ఎముకలు దెబ్బతినడం,  కీళ్లు  బలహీనంగా మారడం వంటి సమస్యలు వస్తాయి. చక్కెర.. చక్కెర ఎక్కువగా తినడం వల్ల కాల్షియం,  మెగ్నీషియం శోషణ దెబ్బతింటుంది.  అంటే కాల్షియం,  మెగ్నీషియం పుష్కలంగా ఉన్న ఆహారాలు తీసుకున్నా సరే.. వాటిని శరీరం గ్రహించలేదు.  ఈ కారణంగా ఎముకలు బలహీనం అవుతాయి. వ్యాయామం.. శరీరం దృఢంగా ఉండాలన్నా, ఎముకలు బలంగా మారాలన్నా శరీరానికి వ్యాయామం చాలా అవసరం. వ్యాయామం చేయకపోతే ఎముకల చలనం తగ్గుతుంది.  ఈ కారణంగా  ఎముకలు బలహీనంగా, పెళుసుగా మారే అవకాశం ఉంటుంది. శీతల పానీయాలు.. శీతల పానీయాలు చాలా మందికి చాలా ఇష్టమైన ఎంపిక.  ఎర్రటి ఎండలో చల్లగా కూల్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడతారు. కానీ కార్బోనేటెడ్ పానీయాలలో ఉండే ఫాస్పోరిక్  ఆమ్లం ఎముకల నుండి కాల్షియం ను గ్రహిస్తుంది. వాటిని బలహీనపరుస్తుంది. జీవనశైలి.. మంచి జీవనశైలి ఎప్పుడూ శరీరాన్ని, ఎముకలను దృఢంగా ఉంచుతుంది.  సరైన ఆహారం ఎంపిక జీవనశైలిలో ప్రధానం.  అలాగే వ్యాయామం కూడా మంచి ఎంపికగా ఉంటుంది. ఇవి రెండూ శరీరాన్ని,  ఎముకలను బలంగా మార్చుతాయి.                                    *రూపశ్రీ.  

ధరచూసి భయపడతాం కానీ కివిని రెగ్యులర్ గా తింటే కలిగే లాభాలివే!

ప్రతిరోజూ ఆహారంలో పండ్లు తీసుకోవడం చాలా మంచిదని దీనివల్ల ఆరోగ్యానికి ఢోకా ఉండదని అంటారు. అయితే పండ్లలో కొన్ని ఖరీదైనవి ఉంటాయి, మరికొన్ని తక్కువ ధరకే లభ్యమయ్యేవి ఉంటాయి. ధర విషయం పక్కన పెడితే ప్రతి పండుకూ దాని ప్రత్యేకత ఉంటుంది. చాలా మంది కివి పేరు చెబితే అధిక ధర అంటూ బ్యాక్ స్టెప్ వేస్తుంటారు. కానీ ధర అయినా సరే కివి పండును ఆహారంలో భాగం చేసుకుంటూ మాత్రం హాస్పిలట్స్ లో పోసే వందలు, వేల ఖర్చు ఈజీగా తగ్గినట్టేనట.  కివి పండును ఆహారంలో భాగంగా తీసుకుంటే  రోగనిరోధక వ్యవస్థ బలపడటంతో పాటు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.  తక్కువ కేలరీలతో, ఫైబర్ పుష్కలంగా ఉండే కివి పండులో డైజెస్టివ్ ఎంజైమ్ లు అయిన వియమిన్-సి ఉంటుంది. ఇది బరువు తగ్గడం నుండి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. కివి పండు రెగ్యులర్ గా ఆహారంలో భాగం చేసుకుంటే కలిగే ప్రయోజనాలు ఇవే.. రోగనిరోధక శక్తి.. కివి పండులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. రోజూవారీ వ్యక్తికి కావలసిన విటమిన్-సి లో 80శాతం వరకు  కివి పండు నుండే పొందవచ్చు.  విటమిన్-సి శరీరంలో గొప్ప యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.  ఆక్సీకరణ నష్టం నుండి కణాలను రక్షిస్తుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థను ఏర్పరిచి అంటు వ్యాధుల  ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పొటాషియం మెండు.. గుండె, మూత్రపిండాలు, కండరాలు, నరాలు  సక్రమంగా పనిచేయాలంటే పొటాషియం చాలా అవసరం. ఒక కివి పండులో సుమారు 215మిగ్రా ల పొటాషియం ఉంటుంది.  కివిని తీసుకోవడం వల్ల శరీరానికి కావలసింత పొటాషియం లభిస్తుంది.  ఇది  అధిక రక్తపోటు, స్ట్రోక్, గుండె సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది.  అంతే కాదు మూత్రపిండాల్లో రాళ్లు, బోలు ఎముకల వ్యాధి నుండి కాపాడుతుంది. రక్తం గడ్డకట్టే పనికి చెక్..  సాధారణంగా దిగువ సిరల్లో రక్తం గడ్డ కట్టే సమస్య ఏర్పడుతుంది.  ఇది మెదడులో రక్తప్రసరణకు అంతరాయం కలిగిస్తుంది.  గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాలకు కూడా దారితీస్తుంది.  కివి రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గించడం ద్వారా రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది.  కివి పండ్లలో ఆహారంలో తీసుకుంటూ ఉంటే రక్తంలో కొవ్వు కరిగిపోయి  గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్ట్రోక్ సమస్యను కూడా తగ్గిస్తుంది. జీర్ణఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. కివిలో కరిగే ఫైబర్స్, కరగని పైబర్స్ రెండూ ఉంటాయి. ఇందులో మూడు వంతులు కరిగే ఫైబర్, రెండు వంతుల కరగని పైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంతో పాటు గుండె, జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కివిలో ఉండే ఫైబర్ మొత్తం శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుంది.                                                           *నిశ్శబ్ద.

ద్రాక్ష తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా?

  ద్రాక్ష ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటి.  తీగలకు కాసే ఈ ద్రాక్ష పండ్లు చాలా రుచిగా ఉంటాయి. తియ్యగా, పుల్లగా, జ్యూసీగా ఉండే ద్రాక్ష పండ్లు పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. అయితే ద్రాక్ష పండ్లలో ఉండే పోషకాల గురించి,  ద్రాక్ష పండ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియవు.  వీటి గురించి తెలుసుకుంటే.. సీజన్ వారిగా లభించే పండ్లలో ద్రాక్ష పండ్లు కూడా ఒకటి.  సాధారణంగానే ఎండు ద్రాక్ష తీసుకుంటే ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు అని చెబుతుంటాం.  అలాంటిది సీజన్ లో దొరికే తాజా ద్రాక్ష పండ్లు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయట.  ద్రాక్ష పండ్ల సీజన్ లో మిస్సవకుండా ద్రాక్ష పండ్లు తినాలని ఆహార నిపుణులు చెబుతున్నారు. ద్రాక్ష పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు,  విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.  ఈ పండు అనేక విధాలుగా ప్రయోజనాలు చేకూరుస్తాయి. ద్రాక్షలో రెస్వెరాట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది.  ఇది కొలెస్ట్రాల్,  రక్తపోటును నియంత్రించడంలో  బాగా సహాయపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ధమనులకు ఆటంకం కలుగుతుంది.  అదే ద్రాక్ష తింటే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కాబట్టి ధమనులు శుభ్రంగా ఉంటాయి.  గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు ద్రాక్ష పండ్లు బాగా తీసుకోవడం  మంచిది. ద్రాక్ష పండ్లలో విటమిన్-సి,  యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.  ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.  ఎప్పుడైనా జ్వరం చేసినప్పుడు,  ఆరోగ్యం బాగాలేనప్పుడు యాపిల్ లాంటి పండ్లతో పాటు ద్రాక్ష పండ్లు బాగా తినమని చెబుతుంటారు.  దీని వెనుక కారణం ద్రాక్ష రోగనిరోధక శక్తిని పెంచడమే.. ద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  ద్రాక్షపై పొట్టు మాత్రమే కాకుండా ద్రాక్షలోపలి కండలో కూడా ఫైబర్ ఉంటుంది.  ఇది మలబద్దకం నుండి ఉపశమనం పొందడంలో జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.  మలబద్దకం సమస్యతో ఇబ్బంది పడేవారు రోజూ ఒక కప్పు ద్రాక్ష పండ్లు తింటే సమస్య తగ్గుతుంది. ద్రాక్ష పండ్లు చర్మానికి కూడా చాలా మేలు చేస్తాయి.  ఈ పండ్లలో ఉండే పోషకాలు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. ద్రాక్ష పండ్లలో ఉండే సమ్మేళనాలు రక్తాన్ని శుద్ది చేస్తాయి.  రక్తంలో ఉండే వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతాయి. దీని వల్ల చర్మం తాజాగా, యవ్వనంగా, మచ్చలు లేకుండా క్లియర్ గా ఉంటుంది. ద్రాక్షలో ఉండే లుటిన్,  జియాక్సంతిన్ అనే సమ్మేళనాలు కంటి చూపును మెరుగుపరుస్తాయి.  కంటి చూపు బలహీనంగా ఉన్నవారు,  ఎక్కువసేపు కంప్యూటర్ ముందు పని చేయాల్సిన వారు కంటి అలసటను తొలగించుకోవడానికి ద్రాక్ష పండ్లను బాగా తినవచ్చు.                        *రూపశ్రీ.

గుడ్లు తినే ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవలసిన విషయాలు ఇవీ..!

  గుడ్లు పోషకాహారంలో ఒక భాగం. ఆరోగ్యంగా ఉండటానికి చిన్న పిల్లలు పెద్దలు వృద్దులు మహిళలు గర్భవతులు రోజుకు ఒక గుడ్డు అయినా తప్పనిసరిగా తినాలని చెబుతారు.  గుడ్డులో పోషకాలు శరీరానికి చాలా మేలు చేకూరుస్తాయి. అయితే గుడ్లు తినేవారు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే.. రోజుకు ఎన్ని గుడ్లు.. గుడ్లు ఆరోగ్యానికి మంచిదని చాలామంది గుడ్లను ఎక్కువగా ఆహారంలో తీసుకుంటూ ఉంటారు. మరికొందరు అయితే వారంలో ఓ రెండు సార్లు గుడ్లు తీసుకుంటూ ఉంటారు.  కానీ అసలు రోజుకు ఎన్ని గుడ్లు తినడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి అనే విషయం చాలామందికి స్పష్టంగా తెలియదు.  శారీరక శ్రమ ఎక్కువ చేస్తూ శరీర కండరాలకు ఎక్కువ పని కలిగే పనులు చేసేవారు రోజుకు ఒకటి నుండి మూడు గుడ్లు తీసుకోవచ్చు.  జిమ్ కు వెళ్లేవారు, ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకునేవారు.. పోషకాల కొరతతో ఇబ్బంది పడేవారు ఇలా తీసుకోవచ్చు.  సాధారణంగా ఆరోగ్యంగా బాగా ధృఢంగా ఉన్నవారు అయితే రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు తీసుకోవచ్చు.  ఎక్కువ శారీరక శ్రమ చేయని వారు అయితే ఎక్కువ గుడ్లను వాటిలోని పచ్చ సొనతో కలిపి తీసుకోకూడదు. గుడ్లలో ఎక్కువ నాణ్యత కలిగిన ప్రోటీన్ ఉంటుంది.  ఇది కండరాల పెరుగుదలకు, కండరాల మరమ్మత్తుకు సహాయపడుతుంది.  కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.  అందుకే రోజుకు ఒక గుడ్డు తింటూ ఉంటే శరీర కండరాలు బాగా బలంగా ఉంటాయి. గుడ్లలో విటమిన్-ఎ,  విటమిన్-డి,  విటమిన్-బి12,  భాస్వరం,  సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి.  ఇవి మొత్తం ఆరోగ్యానికి చాలా అవసరం అవుతాయి. గుడ్లు తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ఉంటుంది.  దీని వల్ల ఆకలి అనే మాట చాలా సేపు అనిపించదు.  ఈ కారణంగా రోజువారీ తీసుకునే కేలరీలు తగ్గుతాయి. ఇది బరువును నియంత్రించడంలో,  బరువు తగ్గడంలో సహాయపడుతుంది. గుడ్లు కంటిచూపును మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి.  ఇందులో లుటిన్ ఉంటుంది.  జియాక్సంతిన్ కూడా ఉంటుంది.   ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి. అయితే గుడ్లు ఆరోగ్యానికి మంచిదని అధికపరిమాణంలో తీసుకోకూడదు.  గుడ్లలో ఉండే పచ్చ సొనలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది.  ఇది శరీరంలో కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని పెంచుతుంది. కేలరీలు ఇందులోనే ఎక్కువ ఉంటాయి కాబట్టి పచ్చ సొనను ఎక్కువగా తినేవారు బరువు పెరిగే అవకాశం కూడా ఎక్కువ.                             *రూపశ్రీ

కలర్స్ కు వ్యాధులకు సంబంధం ఏంటి? టాబ్లెట్స్ వేర్వేరు కలర్స్ లో ఎందుకుంటాయి..?

  ఏదైనా అనారోగ్యం చేసినప్పుడు, నలతగా ఉన్నప్పుడు వైద్యుడిని కలపడం సహజమే.  వైద్యులు జబ్బు నయం కావడానికి కొన్ని రకాల టాబ్లెట్స్ రాసి ఇస్తారు. అయితే ఈ టాబ్లెట్స్ అన్నీ ఒకే రంగులో ఉండవు.  ఒక్కో రకం టాబ్లెట్ ఒక్కో రంగులో ఉండటం చూడవచ్చు. అసలు టాబ్లెట్స్ ఎందుకు ఇలా వేరువేరు రంగులలో ఉంటాయి? వ్యాధులకు,  టాబ్లెట్ల రంగులకు లింక్ ఏంటి? ఇవన్నీ యాదృశ్చికంగా అలా తయారవుతాయా లేక దీని వెనుక ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? ఈ విషయాల గురించి తెలుసుకుంటే.. ఎరుపు, నీలం, ఆకుపచ్చ,  పసుపు.. ఇలా టాబ్లెట్లు చాలా రకాల రంగులలో ఉంటాయి.  టాబ్లెట్లు అన్నీ ఒకే రంగులో ఉంటే వాటిని  మింగడానికి ఏదైనా సమస్య ఉంటుందని ఎప్పుడైనా అనిపించిందా? టాబ్లెట్లకు ఉండే రంగు ఎప్పుడైనా మనసును ప్రభావితం చేసిందా? ఇవన్నీ చాలామంది పట్టించుకోరు. కానీ  టాబ్లెట్ల తయారీ సంస్థలైన ఫార్మసీ సంస్థలు ప్రణాళికా బద్దంగానే ఇలా మందులను రంగురంగులలో తయారు చేస్తాయని అంటున్నారు. పేషెంట్లకు జరిగే మేలు.. ఒక రోగి ఒకేసారి ఎక్కువ మందులు తీసుకున్నప్పుడు, వివిధ రంగుల మాత్రలు ఉంటే ఏ టాబ్లెట్ దేనికి వేసుకుంటున్నాం అనే విషయం గుర్తించడానికి సహాయపడుతుంది. అన్ని మాత్రలు ఒకేలా తెల్లగా ఉంటే రోగులకు మందులను గుర్తుంచుకోవడం కష్టం అవుతుంది. ఇది ముఖ్యంగా వృద్ధులకు,  దృష్టి లోపం ఉన్నవారికి ఇబ్బంది. అందుకే టాబ్లెట్లు వైద్యులు,  ఫార్మసిస్ట్‌లకు  సులభం.. మెడికల్ స్టోర్లలో పనిచేసే వైద్యులు,  ఫార్మసిస్ట్‌లు కూడా మందులను త్వరగా గుర్తించడానికి వాటి రంగులపై ఆధారపడతారు. ఇది తప్పు జరిగే అవకాశాన్ని తగ్గిస్తుంది.  సరైన ఔషధం రోగికి చేరుతుంది. ఔషదం ప్రభావం.. చాలా సార్లు కంపెనీలు మందుల రంగును రోగి మనస్సును కూడా ప్రభావితం చేసే విధంగా ఎంచుకుంటాయి. కొన్ని ఉదాహరణలు గమనిస్తే.. నీలం, ఆకుపచ్చ మాత్రలు: సాధారణంగా నొప్పి నివారణ మందులు, ఆందోళన నివారణ, మత్తుమందుల కోసం ఈ రంగులు ఉపయోగిస్తారు ఎందుకంటే ఈ రంగులు మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి. ఎరుపు,  నారింజ మాత్రలు: శక్తిని పెంచేవి లేదా వేగంగా పనిచేసే మాత్రలలో ఈ రంగులు వాడతారు ఎందుకంటే ఈ రంగులు శక్తి,  శరీర పనితీరు పెరుగుదలను సూచిస్తాయి. నలుపు,  ముదురు గోధుమ రంగు మాత్రలు: వీటిలో ఐరన్, విటమిన్ సంబంధిత మందులు ఉంటాయి. ఇవి శరీరంలో పోషకాలను పెంచడానికి పనిచేస్తాయి. సూర్యకాంతి,  ఔషధ రక్షణ.. కొన్ని మందులు ఎండలో త్వరగా చెడిపోతాయి. అందుకే కంపెనీలు ఔషధాన్ని సూర్యకాంతి నుండి రక్షించడంలో సహాయపడే రంగులను ఎంచుకుంటాయి. ముదురు రంగు పూత ఔషధ నాణ్యతను ఎక్కువ కాలం పాటు ఉండేలా చేస్తుంది. రుచి,  వాసన.. కొన్ని మందులు చాలా చేదుగా ఉంటాయి,  రోగులకు వాటి రుచి నచ్చదు. ఈ రంగు పూత ఔషధాన్ని ఆకర్షణీయంగా కనిపించడమే కాకుండా దాని చేదు రుచిని దాచిపెడుతుంది. దీని వలన రోగులు దానిని మింగడం సులభం అవుతుంది. పిల్లలను ఆకర్షించడానికి.. పిల్లలకు మందులు ఇవ్వడం చాలా కష్టమైన పని. అందుకే కంపెనీలు చాక్లెట్, స్ట్రాబెర్రీ, నారింజ రుచిగల సిరప్‌లు,  రంగురంగుల చూయింగ్ టాబ్లెట్‌లను తయారు చేస్తాయి. వ్యాధిని బట్టి మందుల రంగులు నిర్ణయించబడతాయా? సరళంగా చెప్పాలంట, ఔషధం యొక్క రంగు వ్యాధిపై ఆధారపడి ఉండదు. కానీ రోగి  మానసిక స్థితి, ఔషధం  గుర్తింపు,  దాని భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇది నిర్ణయించబడుతుంది. అయితే కొన్నిసార్లు వైద్యులు మానసిక ప్రభావాల కోసం నిర్దిష్ట రంగుల మందులను కూడా  రాసిస్తుంటారు.                                           *రూపశ్రీ.

నాన్ స్టిక్ వంటపాత్రలు ఎంత చేటు చేస్తాయో తెలుసా?

  ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఇంట్లో నాన్-స్టిక్ వంట సామాగ్రిని ఉపయోగించడం సర్వసాధారణమైపోయింది. ఈ పాత్రలు వంటను సులభతరం చేస్తాయి, వంట చేసేటప్పుడు పదార్థాలు మాడిపోవడం, వంటపాత్రలకు అతుక్కుపోవడం వంటి సమస్యలు ఉండవు. అయితే నాన్-స్టిక్ వంట సామాగ్రిని ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రమాదాలు కూడా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నాన్-స్టిక్ వంట సామాగ్రిని ఉపయోగించడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుంటే.. విషపూరిత రసాయనాల ప్రమాదం.. నాన్-స్టిక్ వంట సామాగ్రిని తయారు చేయడానికి పాలిటెట్రాఫ్లోరోఎథిలిన్ (PTFE) అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు. ఇది ఆహారం అంటుకోకుండా నిరోధించే సింథటిక్ పదార్థం. అయితే ఈ పాత్రను వేడెక్కినప్పుడు, అది రసాయనికంగా విచ్ఛిన్నం కావడం ప్రారంభమవుతుంది. విషపూరిత పొగలను విడుదల చేస్తుంది. ఈ పొగలను పీల్చడం వల్ల తలనొప్పి, తలతిరుగుడు,  ఫ్లూ లాంటి లక్షణాలు వస్తాయి.  ఈ పొగ వాతావరణంలో ఎక్కువ సేపు ఉండటం వల్ల ఆరోగద్య సమస్యలు కూడా వస్తాయి. పెర్ఫ్లోరోక్టానోయిక్ యాసిడ్ (PFOA) ప్రమాదాలు.. నాన్-స్టిక్ వంట సామాగ్రిని తయారు చేసే ప్రక్రియలో PFOA అనే రసాయనాన్ని కూడా ఉపయోగిస్తారు. ఈ రసాయనం ఆరోగ్యానికి హానికరం.  PFOA  వల్ల క్యాన్సర్, థైరాయిడ్ రుగ్మతలు, కాలేయం దెబ్బతినడం,  రోగనిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. ఇప్పుడు చాలా కంపెనీలు PFOA లేని ఉత్పత్తులను తయారు చేస్తున్నప్పటికీ కొన్నింటిలో ఈ రసాయనం ఉండే అవకాశం ఉంది. హానికరమైన పదార్థాల విడుదల.. నాన్-స్టిక్ వంట సామాగ్రిని చాలా ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర వేడి చేసినప్పుడు, దాని పూత విచ్ఛిన్నం కావడం ప్రారంభమవుతుంది. ఈ చిన్న కణాలు ఆహారంలోకి కలిసిపోతాయి. ఈ కణాలు శరీరంలోకి వెళ్లిన తర్వాత విషపూరితంగా మారవచ్చు. దీనివల్ల జీర్ణవ్యవస్థ, కాలేయం,  మూత్రపిండాలు దెబ్బతింటాయి . దీర్ఘకాలిక వాడకం.. నాన్-స్టిక్ వంట సామాగ్రిని ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల శరీరంలో రసాయనాలు పేరుకుపోతాయి. ఈ రసాయనాలు శరీరంలో నెమ్మదిగా పేరుకుపోయి దీర్ఘకాలంలో తీవ్రమైన వ్యాధులకు కారణమవుతాయి. ముఖ్యంగా, ఇది హార్మోన్ల అసమతుల్యత,  సంతానోత్పత్తి సమస్యలను కలిగిస్తుంది. పర్యావరణంపై ప్రభావం.. నాన్-స్టిక్ వంట సామాగ్రిని తయారు చేయడం,  తరువాత పాడైపోయిన నాన్ స్టిక్ పాత్రలను  నాశనం చేసే ప్రక్రియ కూడా పర్యావరణానికి హాని కలిగిస్తుంది. ఈ పాత్రలలో ఉపయోగించే రసాయనాలు ప్రకృతిలో త్వరగా కరగవు,  పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి . దీనివల్ల మనుషులకే కాదు, జంతువులు, మొక్కలు కూడా నష్టపోతాయి.                                   *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

వేసవికి ముందు ఆహారంలో ఈ 5 అలవాట్లు చేసుకుంటే సీజన్ అంతా సేఫ్..!

  వేసవి కాలం ఎండవేడితో పాటు చాలా రకాల  ఆహ్లాదకర విషయాలను వెంటబెట్టుకు వస్తుంది.  అయితే ఆరోగ్యానికి కూడా అంతే సవాలు విసురుతుంది. మండే ఎండలు, వేడి, చెమట,  తేమ..  మన శక్తిని హరించడమే కాకుండా కడుపు నొప్పి, డీహైడ్రేషన్ వంటి  సమస్యలు, చర్మ సమస్యలు,  బలహీనమైన రోగనిరోధక శక్తి వంటి సమస్యలను కూడా కలిగిస్తాయి. వేసవిలో తరచుగా అనారోగ్యానికి గురికాకుండా ఉండాలంటే  ఆహారంలో కొన్ని అవసరమైన మార్పులు చేసుకోవాలి. వేసవి ఇంకా ముదరకముందే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల వేసవిలో  చురుగ్గా ఉండగలరు. నీరు తాగేశాతం పెంచాలి.. వేసవిలో శరీరం ఎక్కువగా చెమట పడుతుంది. దీనివల్ల శరీరంలో నీరు ,  ఎలక్ట్రోలైట్ల లోపం ఏర్పడుతుంది. ఇది నిర్జలీకరణం, తక్కువ రక్తపోటు, అలసట, తలనొప్పి,  వడదెబ్బకు కారణమవుతుంది. రోజంతా కనీసం 3-4 లీటర్ల నీరు త్రాగాలి. కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మామిడి పన్నా, మజ్జిగ వంటి సహజ పానీయాలు త్రాగాలి. ఎక్కువ కెఫిన్, సోడా ఉన్న పానీయాలను మానుకోవాలి. ఎందుకంటే ఇవి శరీరాన్ని మరింత డీహైడ్రేట్ చేస్తాయి. ఖాళీ కడుపుతో ఎక్కువ చల్లటి నీరు త్రాగకూడదు.  ఎందుకంటే ఇది గొంతు నొప్పికి కారణమవుతుంది. ఆహారం.. వేసవిలో ఎక్కువ కారంగా,  నూనెతో కూడిన ఆహారాన్ని జీర్ణం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. దీనివల్ల అసిడిటీ, ఉబ్బరం, కడుపు నొప్పి, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రాత్రిపూట కారంగా,  వేయించిన ఆహార పదార్థాలను తగ్గించాలి. గంజి, కిచిడి, పెరుగు-బియ్యం, పండ్లు,  కూరగాయలు వంటి తేలికైన,  సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు ఎంచుకోండి. మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, మొలకలు,  సలాడ్ల పరిమాణాన్ని పెంచండి. మీ ఆహారంలో పెరుగును చేర్చుకోండి, ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది,  శరీరాన్ని చల్లబరుస్తుంది. సీజన్.. వేసవిలో లభించే పండ్లు,  కూరగాయలలో సహజంగానే ఎక్కువ నీరు ఉంటుంది. ఇది శరీరానికి హైడ్రేషన్,  అవసరమైన పోషణను అందిస్తుంది. వీటిలో విటమిన్లు, ఖనిజాలు,  యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తాయి . పుచ్చకాయ, సీతాఫలం, బొప్పాయి, నారింజ, మామిడి, పైనాపిల్ వంటి పండ్లను తినండి, ఇవి శరీరానికి తేమను, శక్తిని పెంచుతాయి. దోసకాయ, టమోటా, పొట్లకాయ, సొరకాయ, బీరకాయ,  పాలకూర వంటి కూరగాయలు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. ప్రతిరోజూ  ఆహారంలో పెరుగు,  మజ్జిగను చేర్చుకోండి. పానీయాలు.. వేసవిలో ప్రజలు ఎక్కువగా శీతల పానీయాలు, టీ, కాఫీ,  ఆల్కహాల్ తీసుకుంటారు. అయితే ఇది శరీరంలో డీహైడ్రేషన్, గ్యాస్,  ఆమ్లతను పెంచుతుంది. శీతల పానీయాలకు బదులుగా, ఇంట్లో తయారుచేసిన రోజ్ సిరప్, మామిడి పన్నా, నిమ్మరసం, సత్తు త్రాగండి. టీ,  కాఫీ మొత్తాన్ని తగ్గించి గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ తీసుకోండి . ఆల్కహాల్,  అధిక కెఫిన్ తీసుకోవడం మానుకోవాలి.  ఎందుకంటే అవి నీటి నిలుపుదలని పెంచుతాయి. ఆహారాల ఎంపిక.. వేసవిలో భారీ ఆహారం తినడం వల్ల శరీరం నీరసంగా అనిపిస్తుంది. కాబట్టి తేలికైన కానీ పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ముఖ్యం. పప్పు, పెసర పప్పు, పనీర్, టోఫు, మొలకలు వంటి ఆరోగ్యకరమైన ప్రోటీన్ వనరులను తీసుకోండి.  చియా గింజలు,  సబ్జా,   బాదం వంటి గింజలు,  విత్తనాలను చేర్చుకోండి. తృణధాన్యాలు, మల్టీగ్రెయిన్ బ్రెడ్,  బ్రౌన్ రైస్ తినాలి. ఇవి ఎక్కువ ఫైబర్,  పోషణను అందిస్తాయి. పెరుగు, మజ్జిగ వంటి ప్రోబయోటిక్ ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి శరీరాన్ని చల్లబరుస్తుంది.                                *రూపశ్రీ.

తిన్న తరువాత 5 నిమిషాలు నడిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

  నేటి బిజీ జీవితంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా భోజనానికి ముందు ఆ తరువాత చాలా మంది వివిధ రకాల అలవాట్లు పెట్టుకుంటారు.  వాటికి అనుగుణంగా అలవాట్లు పాటిస్తారు. అయితే భోజనం చేసిన తర్వాత కేవలం 5 నిమిషాల నడక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు,  ఫిట్‌నెస్ నిపుణులు అంటున్నారు. ఈ చిన్న అలవాటు  ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందో తెలుసుకుంటే.. జీర్ణవ్యవస్థ.. తిన్న తర్వాత నడవడం వల్ల జీర్ణవ్యవస్థ ఉత్తేజితమవుతుంది. మనం నడిచినప్పుడు శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఇది ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.  గ్యాస్, ఆమ్లతత్వం,  అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది. అలాగే ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, తద్వారా మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది. చక్కెర స్థాయిలు.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు భోజనం తర్వాత నడవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. తిన్న తర్వాత చక్కెర స్థాయి పెరుగుతుంది. కానీ 5-10 నిమిషాలు నడవడం ద్వారా శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగుపడుతుంది.  రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. ఈ అలవాటు టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. బరువు.. బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు తిన్న తర్వాత నడవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది . ఇది శరీరంలోని కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. జీవక్రియను పెంచుతుంది . భోజనం తర్వాత క్రమం తప్పకుండా నడవడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు తగ్గి బరువు నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యం.. భోజనం చేసిన తర్వాత నడవడం కూడా గుండెకు చాలా మేలు చేస్తుంది.  ఇది రక్తపోటును నియంత్రిస్తుంది, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.  గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. మానసిక స్థితి.. భోజనం చేసిన తర్వాత నడవడం వల్ల శారీరక ఆరోగ్యానికే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. ఇది ఒత్తిడి,  ఆందోళనను తగ్గిస్తుంది.  మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. నడక వల్ల శరీరంలో ఎండార్ఫిన్ హార్మోన్ల స్థాయి పెరుగుతుంది. ఇది సంతోషంగా ఉండే  భావనను ఇస్తుంది.  శక్తి స్థాయిలు.. తిన్న తర్వాత తరచుగా సోమరితనంగా,  నీరసంగా అనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో 5 నిమిషాల నడక శరీరంలో శక్తి స్థాయిని పెంచుతుంది.  దీనివల్ల తిరిగి  రిలాక్స్ గా, ఫ్రెష్  గా అనిపిస్తుంది. ఇది శరీరాన్ని చురుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. నిద్ర నాణ్యత.. రాత్రి భోజనం తర్వాత నడవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది శరీరానికి  విశ్రాంతినిస్తుంది.  నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. మంచి నిద్ర వల్ల శరీరం ఆరోగ్యంగా,  తాజాగా ఉంటుంది.                                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

ఉబ్బరం సమస్య నుండి తక్షణమే రిలీఫ్ ఇచ్చే చిట్కాలు ఇవీ..!

    ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం, ఎక్కువగా వేయించిన ఆహారాన్ని తినడం, రాత్రి ఆలస్యంగా తినడం,  నీటిశాతం ఉన్న ఆహారం తినకపోవడం  వంటి అనేక కారణాల వల్ల ఉబ్బరం లేదా గుండెల్లో మంట వస్తుంది. కడుపులో గ్యాస్ నిండినప్పుడు, అసౌకర్యం, కడుపు నొప్పి,  భారంగా అనిపించడం మొదలవుతుంది.  ఈ సమస్యలు ఉంటే ఆహారం తినాలన్నా,  తిన్న తరువాత ఆహారం జీర్ణం కావాలన్నా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి.  ఈ సమస్యల నుండి చిటికెలో ఉపశమనం లభించాలంటే కింది అద్బుతమైన చిట్కాలు తెలుసుకుని పాటించాలి. సోంపు.. కడుపు ఉబ్బరం నుండి ఉపశమనం పొందడంలో సోంపు తీసుకోవడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కడుపులోని వాయువును బయటకు పంపడంలో సహాయపడతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా దుర్వాసనను కూడా తొలగిస్తుంది. ఎలా ఉపయోగించాలి? ఆహారం తిన్న తర్వాత ఒక చెంచా సోంపు నమలవచ్చు.  సోంపు టీ తయారు చేసి త్రాగవచ్చు. (ఒక కప్పు వేడి నీటిలో ఒక టీస్పూన్ సోంపు వేసి, 5 నిమిషాలు మరిగించి, వడకట్టి త్రాగాలి) రాత్రిపూట సోంపును నీటిలో నానబెట్టి, ఉదయం ఈ నీటిని త్రాగాలి. అల్లం.. అల్లం యాంటీ బాక్టీరియల్,  యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది కడుపు చికాకు,  వాపును తగ్గిస్తుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తుంది.  కడుపు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది . ఎలా ఉపయోగించాలి? ఒక చిన్న అల్లం ముక్కను నమలవచ్చు. అల్లం టీ తయారు చేసుకుని తాగవచ్చు. వేడి నీటిలో అల్లం వేసి మరిగించి, తేనె వేసి త్రాగవచ్చు. నిమ్మరసం,  అల్లం రసం కలిపి తాగడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది. పెరుగు.. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్  జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో,  కడుపు వాయువును తగ్గించడంలో సహాయపడతాయి. ఇది పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.  కడుపులో ఏర్పడే హానికరమైన బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. ఎలా ఉపయోగించాలి? రోజూ ఒక గిన్నెడు తాజా పెరుగు తినాలి. పెరుగులో కొద్దిగా రాతి ఉప్పు,  పుదీనా కలిపి తినడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది. మజ్జిగ  తాగడం కూడా ఉబ్బరం తగ్గడానికి సహాయపడుతుంది. మజ్జిగలో అందులో వేయించిన జీలకర్ర కలిపి త్రాగాలి. సెలెరీ.. సెలెరీలో థైమోల్ అనే మూలకం ఉంటుంది, ఇది గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది.  కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఇది అజీర్ణం,  ఆమ్లత్వానికి కూడా సహాయపడుతుంది. ఎలా ఉపయోగించాలి? గోరువెచ్చని నీటితో అర టీస్పూన్ సెలెరీ తీసుకోండి. సెలెరీని వేయించి, దానికి నల్ల ఉప్పు వేసి తినడం వల్ల కూడా తక్షణ ఉపశమనం లభిస్తుంది. సెలెరీ,  తేనె కలిపి తినడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. పుదీనా.. పుదీనాలో ఉండే మెంథాల్ కడుపు నొప్పి,  ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఇది కడుపును చల్లబరుస్తుంది.  జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎలా ఉపయోగించాలి? పుదీనా ఆకులను నమలవచ్చు. పుదీనా టీ తయారు చేసి త్రాగవచ్చు. (పుదీనా ఆకులను వేడి నీటిలో వేసి, కొంత సమయం తర్వాత వడకట్టి త్రాగాలి) పుదీనా రసం తీసి తేనెతో కలిపి తీసుకోవడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది.  ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. నీరు ఎక్కువగా త్రాగాలి.  నీరు ఎక్కువగా త్రాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. తేలికపాటి ఆహారాలు తిసుకోవాలి. వేయించిన,  కారంగా ఉండే ఆహారాలను నివారించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వాకింగ్,  యోగా గ్యాస్ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. భోజనం చేసిన వెంటనే పడుకోకూడదు. భోజనం చేసిన తర్వాత కొంతసేపు నడవాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.                           *రూపశ్రీ.

వైట్ రైస్.. బ్లౌన్ రైస్.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదంటే..!

  ప్రపంచంలో అత్యధికంగా వినియోగించబడే ఆహార పదార్థాలలో బియ్యం ఒకటి. భారతీయులు ఎక్కువగా బియ్యమే ఆహారంగా తీసుకుంటారు. ముఖ్యంగా చాలా ఇళ్లలో తెల్ల బియ్యంతో వండిన అన్నమే ప్రధాన ఆహారం.  అన్నం కడుపు నిండుగా ఉంచుతుంది.  తృప్తిని ఇస్తుంది.  భారతీయులు అన్నానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అంటే.. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని.. అన్నాన్ని ప్రసాదించే దేవత అన్నపూర్ణేశ్వరి అని అంటారు. అయితే ఈ మధ్య కాలంలో బ్రౌన్ రైస్ చాలా వైరల్ అవుతోంది. , తెల్ల బియ్యం,  బ్రౌన్ రైస్  రెండింటిలోో ఏది ఎక్కువ ప్రయోజనకరం అనే ప్రశ్న చాలామందిలో ఏర్పడింది.   ఈ రెండింటిలో ఏది మంచిదో.. ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుందో తెలుసుకుంటే.. ఫైబర్, బరువు నియంత్రణ.. బ్రౌన్ రైస్.. ఇందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది,  బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఫైబర్ ఎందుకు ముఖ్యం అంటే.. ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది, ఇది అతిగా తినడాన్ని తగ్గిస్తుంది.  తెల్ల బియ్యం.. ఇందులో ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి.  దీని కారణంగా ఇది త్వరగా జీర్ణమవుతుంది,  తిన్న తరువాత బ్రౌన్ రైస్ తో పోలిస్తే చాలా తొందరగా ఆకలిగా అనిపించవచ్చు. తెల్ల బియ్యం అతిగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. బ్లడ్ షుగర్ , డయాబెటిస్ కోసం  బ్రౌన్ రైస్ .. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) (~50-55) కలిగి ఉంటుంది. దీని వలన రక్తంలో చక్కెర నెమ్మదిగా పెరుగుతుంది. ఇది డయాబెటిక్ రోగులకు మెరుగైన ఎంపిక. తెల్ల బియ్యం.. ఇది అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ (~70-80) కలిగి ఉంటుంది, దీని వలన రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. డయాబెటిక్ రోగులకు ఇది మంచి ఎంపిక కాదు. డయాబెటిస్ ఉన్నవారు దీన్ని తక్కువ తినడం మంచిది. జీర్ణం.. తెల్ల బియ్యం .. ఇది సులభంగా జీర్ణమవుతుంది, కడుపుకు తేలికగా ఉంటుంది. విరేచనాలు, వాంతులు లేదా కడుపు నొప్పి ఉన్నప్పుడు తెల్ల బియ్యం తినడం ప్రయోజనకరంగా ఉంటుంది.  బ్రౌన్ రైస్.. ఇందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది దీని కారణంగా ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీన్ని చాలా మితంగా తీసుకోవాలి. జీర్ణశక్తి తక్కువ ఉన్నా,  బ్రౌన్ రైస్ ను అధిక మొత్తంలో తిన్నా   గ్యాస్ లేదా ఉబ్బరం సమస్యలు ఉండవచ్చు. గుండె ఆరోగ్యం.. కొలెస్ట్రాల్.. బ్రౌన్ రైస్.. ఇందులో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు,  ఫైబర్ ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించడంలో,  గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. తెల్ల బియ్యం.. ఇందులో పోషకాలు,  ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి తక్కువ మేలు జరుగుతుంది.  ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాలనుకుంటే, బ్రౌన్ రైస్ మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ  జీర్ణ సమస్యలు ఉంటే బ్రౌన్ రైస్ అంత మంచిది కాదు.  తెల్ల బియ్యం కూడా మంచి ఎంపిక. అయితే తెల్ల బియ్యాన్ని పరిమితంగా తీసుకోవాలి.                                     *రూపశ్రీ.  

శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రి.. ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు!

  పరమేశ్వరుడిని లయకారుడు అంటారు.  శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు అంటారు.  శివారాధనకు సోమవారం చాలా ప్రత్యేకమైన రోజు. ఇక ప్రతి నెలా వచ్చే మాస శివరాత్రి రోజు శివుడిని ఎంతో గొప్పగా ఆరాధిస్తారు.  ఇది మాత్రమే కాకుండా ఏడాదికి ఒకసారి వచ్చే మహా శివరాత్రిని మరింత వేభోగంగా జరుపుకుంటారు.  శివపూజలు, శివాభిషేకాలలో ఖచ్చితంగా బిల్వ పత్రి ఉంటుంది.  బిల్వపత్రి అనేది మారేడు ఆకులు.  మారేడు దళాలు అని కూడా అంటారు.  వీటితో పూజ చేస్తే శివుడు చాలా ప్రసన్నం అవుతాడు. శివపూజను సంపూర్ణం చేసే మారేడు దళాలు కేవలం పూజకే కాక.. ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. ఈ మారేడు దళాల వల్ల,  మారేడు ఫలాల వల్ల  కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే. మారేడు దళమే కాదు.. మారేడు చెట్టుకు కాయలు కూడా కాస్తాయి. ఈ కాయలను చాలా మంది పట్టించుకోరు. కానీ ఈ కాయలలో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మారేడు కాయలు వినాయకుడికి ఎంతో ఇష్టమైన వెలగపండును పోలి ఉంటుంది.  వీటి పై భాగం గట్టిగా పెంకులాగా ఉంటుంది.  పండు  లోపల గుజ్జు ఉంటుంది.  ఈ పండులో ఫైబర్,  యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి.  ఇవి జీర్ణవ్యవస్థను బలంగా ఉంచుతాయి. మారేడు పండులో యాంటీ బ్యాక్టీరియల్,  యాంటీ వైరల్  గుణాలు ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి.  రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మారేడు పండును తీసుకుంటే మంచిది. మారేడు పండు తింటే వేడి నుండి బయటపడవచ్చు.  ముఖ్యంగా వేసవికాలంలో ఎదురయ్యే ఎండ వేడి,  హీట్ స్ట్రోక్ వంటి వాటికి మారేడు పండు చక్కని మెడిసిన్ అని చెప్పవచ్చు. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.                                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

అసలు పొటాషియం శరీరానికి ఎందుకు అంత ముఖ్యం తెలుసా?

  శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అనేక రకాల విటమిన్లు,  మినరల్స్,  ఖనిజాలు అవసరం అవుతాయి. అలాంటి వాటిలో పొటాషియం కూడా ఒకటి. ఇది శరీరంలో చాలా రకాల పనులు జరగడానికి అవసరం. కానీ చాలామందికి పొటాషియం గురించి అవగాహన లేదు.  అసలు పొటాషియం శరీరానికి ఎందుకు అవసరం. ఇది శరీరంలో నిర్వహించే పనులు ఏంటి? ఏ ఆహారాలు తీసుకుంటే పొటాషియం శరీరానికి పుష్కలంగా లభిస్తుంది.  వివరంగా తెలుసుకుంటే.. పొటాషియం శరీరానికి అవసరమైన ఖనిజాలలో ప్రముఖమైనది.  ఇది గుండె, కండరాలు, నాడీ వ్యవస్థ,  మూత్ర పిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ముఖ్యం. శరీరానికి తగినంత పొటాషియం అందుతూ ఉంటేనే పై అవయవాలు ఆరోగ్యంగా తమ విధులు అవి సమర్థవంతంగా నిర్వహిస్తాయి. కానీ పొటాషియం లోపిస్తే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. పొటాషియం లోపం వల్ల బలహీనత, కండరాల తిమ్మిరి,  రక్తపోటు.. వంటి సమస్యలు వస్తాయి.  ఈ సమస్యలు రాకూడదు అంటే సమతుల ఆహారంలో పొటాషియం సమృద్దిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా తీసుకుంటేనే శరీరం శక్తివంతంగా ఉంటుంది. పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.  తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె సంబంధ సమస్యలు ఉన్నవారు,  కుటుంబంలో ఎవరికైనా గుండె సంబంధ సమస్యలు ఉంటే ఆ కుటుంబ సభ్యులు గుండె ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. శరీరానికి పొటాషియం ఎందుకు ముఖ్యం అంటే.. ఇది శరీరంలో కాల్షియం తగిన మోతాదులో ఉండేలా చేస్తుంది.  ఎముకల బలానికి పొటాషియం తీసుకోవడం కూడా చాలా అవసరం. అంతేకాదు.. పొటాషియం శరీరానికి సరిపడినంత తీసుకోవడం వల్ల మెదడుకు రక్తప్రసరణ మెరుగు పడుతుంది. తద్వారా స్ట్రోక్ ప్రమాదం కూడా తగ్గుతుంది.  అంటే.. మెదడు సంబంధ సమస్యలు రావద్దని అనుకుంటే పొటాషియం  గల ఆహారాన్ని బాగా తీసుకోవాలి. పొటాషియం బాగా తీసుకోవాలి అని అనిపించినా పొటాషియం ఎందులో ఎక్కువ ఉంటుంది అనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి వారు పొటాషియం రిచ్ ఫుడ్స్ గురించి తెలుసుకోవాలి.  బంగాళదుంపలు,  పాలకూర,  అవకాడో, నారింజ వంటి ఆహారాలు తీసుకోవడం వల్ల పొటాషియం బాగా లభిస్తుంది.                                             *రూపశ్రీ.