ఖరీదైన ఆహారాలు అక్కర్లేదు.. రోజూ వీటిని గుప్పెడు తింటే ఉక్కులా మారతారు..

ఆరోగ్యమే మహాబాగ్యం అన్నారు. తీసుకునే ఆహారం అంతా శరీరం కోసమే. కానీ చాలామంది శరీరం కోసం కాకుండా రుచి కోసం, జిహ్వచాపల్యం కోసం అహారం తింటారు. దీని వల్ల ఆరోగ్యంగా ఉండాల్సిన శరీరం ట్రబుల్ ఇచ్చిన ఇంజిన్ లా మారుతుంది.  కొందరు శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఖరీదైన ఆహారాలు తినాలనే భావనలో ఉంటారు. అందుకే తాము ఆరోగ్యంగా లేమని సమర్థించుకుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే శరీరానికి అద్బుతమైన బలాన్ని చేకూర్చే ఆహారాలు ఖరీదైనవే కాదు, తక్కువ ధరలో సాధారణ పౌరులకు కూడా లభిస్తాయి. కానీ వాటిని గుర్తించి తినడం చాలా ముఖ్యం.  చాలామంది రాత్రి బాదం పప్పులను నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే వాటిని తింటుంటారు. కానీ బాదం పప్పులు అక్కర్లేదు. చికెను, మటనూ అసలే వద్దూ..  ప్రతిరోజూ గుప్పెడు నానబెట్టిన శనగలు తింటే చాలు. శరీరం ఉక్కులా మారుతుంది. అసలు నానబెట్టిన శనగలు తింటే కలిగే లాభాలేంటి?  వీటిని ఎలా తినాలి? తెలుసుకుంటే.. నల్లశనగలు బాదం పప్పు కంటే అద్బుతమైన పోషకాలు కలిగి ఉంటాయి. మాంసాహారం కంటే బలం చేకూరుస్తాయి. వీటిలో కాల్షియం, ప్రోటీన్, పైబర్, విటమిన్లు, మినరల్స్ సమృద్దిగా ఉంటాయి. వీటిని వేయించి తినవచ్చు, లేదంటే నానబెట్టి తినవచ్చు, నానబెట్టిన శనగలను మొలకలు తెప్పించి ఆ మొలకలు కూడా తినవచ్చు. ఇవి చాలా బలం. గుప్పెడు శనగలను రాత్రి సమయంలో కప్పు నీటిలో వేసి నానబెట్టాలి. ఉదయాన్నే ఈ శనగలను పరగడుపున తినాలి. మగవారు నానబెట్టిన శనగలను తిన్న తరువాత గోరువెచ్చని పాలు తాగితే వారిలో స్పెర్మ్ కౌంట్ మెరుగవుతుంది. లైంగిక శక్తి పెరుగుతుంది. ప్రతిరోజూ మొలకెత్తిన శనగలు తినడం వల్ల మలబద్దకం అనే సమస్య అసలు వేధించదు. ఎన్నో రోజులుగా బాదిస్తున్న మలబద్దకం కూడా కేవలం నల్ల శనగలను తినడం వల్ల  పరిష్కారం అవుతుంది. వీటిలో  ఉండే ఫైబర్ పేగులు మూసుకుపోకుండా చేస్తుంది. వృద్దులలో కీళ్ల నొప్పులు సాధారణం. కానీ నానబెట్టిన శనగలను తింటూంటే వృద్దులలో కీళ్లనొప్పులు ఆశ్చర్యకరంగా తగ్గిపోతాయి. వీటిలో ఉన్న కాల్షియం ఎముకలకు బలాన్ని ఇస్తుంది. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి కాలేయం పనితీరు సమర్థవంతంగా ఉండటం ఎంతో అవసరం. ఈ పనితీరులో కాలేయం కొన్నిసార్లు పాడైపోతుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ నానబెట్టిన నల్ల శనగలు తినడం శ్రేయస్కరం. వయసు పెరిగేకొద్ది ఎముకలు బలహీనంగా మారతాయి.  బలహీనమైన ఎముకలుంటే బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. బోలు ఎముకల వ్యాధి రాకూడదంటే చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ నల్ల శనగలు తినాలి. నల్లశనగలలో ఐరన్, పాస్పరస్ సమృద్దిగా ఉంటాయి. ఈ కారణంగా ఇది హిమోగ్లోబిన్ ను పెంచుతుంది. రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడేవారు ప్రతి రోజూ నల్లశనగలు తింటూంటే తొందరగానే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. బద్దకం, అలసట నివారించడానికి. శరీరంలో నూతనోత్తేజం నింపడానికి నల్లశనగలు భలే ఉపయోగపడతాయి. మొలకెత్తిన శనగలను ప్రతిరోజూ తింటూంటే  తొందరలోనే శరీరంలో  శక్తి పుంజుకుంటుంది. శరీరం దృఢంగా, చురుగ్గా మారడం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పట్లో చాలామందిలో చక్కెర వ్యాధి పెద్ద సమస్యగా ఉంది. నల్లశనగలు ప్రతిరోజూ తినడం వల్ల ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. శరీరంలో అదనపు గ్లూకోజ్ ను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. మధుమేహం ఉన్నవారు వీటిని రోజూ తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.                                           *నిశ్శబ్ద.

మద్యపానం కంటే మహా ప్రమాదకరమైన అలవాటు.. తెలీకుండానే ప్రజల ఆయుష్షు హాం.. ఫట్..

జీవితకాలాన్ని తగ్గించడంలోనూ, ప్రాణ ప్రమాదాలు పెంచడంలోనూ మద్యపానం ఎప్పుడూ ప్రథమ స్థానంలోనే ఉంటుంది. దీని కారణంగా క్యాన్సర్ లు చాలా తొందరగా వచ్చేస్తాయి. ఇన్నాళ్ళు మనుషులలో  ఉన్న చాలా చెడ్డ అలవాటు అంటే మద్యపానంనే పేర్కొనేవారు, దాన్నే చూపించేవారు. కానీ మద్యపానం కంటే అతిపెద్ద  ప్రమాదకరమైన అలవాటు చాలా మంది ప్రజలలో ఉంది.  ఇది మనిషి జీవితకాలాన్నిగణనీయంగా తగ్గిస్తుందని తేలింది.అసలంత ప్రమాదకరమైన అలవాటు ఏమిటి? ప్రమాదమని తెలియకుండానే ప్రజలు దీని బారిన ఎలా పడుతున్నారు తెలుసుకుంటే.. ఈ రోజుల్లో ప్రజలు గంటల తరబడి ఆఫీసులలో కూర్చొని పని చేయవలసి వస్తోంది.  సగటున ఒక ఉద్యోగి రోజుకు 9 నుండి 10 గంటలు కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేస్తున్నారు.  ఇలా పనిచేసేవారిలో చాలామందికి శారీరక శ్రమ చేసే అలవాటు ఉండదు. ఎందుకంటే ఉరుకులు పరుగుల మీద ఆఫీసులకు వెళ్ళడం, ఆ తరువాత  అక్కడ 10గంటలు పని చేయడం తిరిగి ఇంటికి చేరుకోవడంతో చాలా అలసిపోతారు. ఆ తరువాత ఇంట్లో కూడా టీవి, మొబైల్ బ్రౌజింగ్ లో సమయం గడుపుతారు. దీంతో అసలు శారరీక శ్రమ చేసే వెలుసుబాటే ఉండదు. మరికొందరు రోజంతా మంచం లేదా సోఫాపై పడుకుంటారు. పెద్దగా పనులు చేయకుండానే రోజు గడిపేస్తారు. ఇలా ప్రత్యేకత ఏమీ లేకుండా నిశ్చలమైన జీవనశైలి కలిగిన వ్యక్తులను మీద చేసిన పరిశోధనలలో చాలా షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. దాదాపు 12వేల మంది జీవనశైలిని పరిశోధకులు పరిశీలించారు. వీరు కనీసం రెండేళ్ళపాటు ఫిజికల్ యాక్టివిటీ రీడింగ్  ట్రాక్ చేయగల డిజిటల్ పరికరాన్ని తమ వెంటే ఉంచుకున్నారు.  వీరిలో ప్రతి రోజూ సగటున 10గంటల సేపు నిశ్చలంగా కూర్చుని ఉన్నవారిలో  ఆరోగ్య పరంగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతిరోజూ 12గంటల కంటే ఎక్కువ సేపు కూర్చుని పనిచేసేవారిలో 7శాతం మంది  5సంవత్సరాలలో ఒకరి తరువాత  మరొకరు మరణించారు.  ప్రతిరోజూ 12గంటలు కూర్చుని పనిచేసి రోజులో 22నిమిషాల కంటే తక్కువగా శారీరక శ్రమ చేసేవారిలో మరణ ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం అనేది ఇప్పటి ఉద్యోగాల రీత్యా తప్పించుకోలేని విషయం.  కానీ దీని వల్ల కలిగే ప్రమాదాలను తప్పించుకోవాలంటే మాత్రం ప్రతిరోజూ కనీసం 22నిమిషాల కంటే ఎక్కువసేపు వ్యాయామం చెయ్యాలి. లేకపోతే 10 నుండి 12 గంటలు పనిచేయడమనే అలవాటు ముందుగానే మరణాన్ని వెంటబెట్టుకొస్తుంది. వ్యాయామానికి కూడా షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి. సైక్లింగ్, రన్నింగ్, ఏరోబిక్ వ్యాయామాలు మొదలైనవి రోజులో కనీసం 10నిమిషాలు అయినా ఉండాలి. ఇవి మాత్రమే కాకుండా ఇంటి పని, తోట పని మొదలైనవి సొంతంగా చేసుకుంటే చాలా మంచిది. బిజీ షెడ్యూల్ కారణంగా వ్యాయామం చేయడానికి సమయం లేదని చెప్పేవారు కనీసం 10నిమిషాలు అయినా వ్యాయామాలు చేయడం ద్వారా మరణ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.  కేవలం వ్యాయామం చేయడం ద్వారా మరణ ప్రమాదాన్ని 35శాతం తగ్గించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి ప్రతిరోజూ కనీసం 22నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేయడం, వీలైన వరకు శారీరక శ్రమ చేయడం  వల్ల మరణ ప్రమాదాన్ని దూరంగా ఉంచవచ్చు.                                                      *నిశ్శబ్ద.

చలికాలంలో ఈ డ్రైఫ్రూట్స్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?

   డ్రై ఫ్రూట్స్ మీ బరువు, కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా మీ ఎముకలు, రోగనిరోధక శక్తికి కూడా ఉత్తమమైనవి. చలికాలంలో కొన్ని ప్రత్యేకమైన డ్రై ఫ్రూట్స్ తినడం మొదలుపెడితే.. మరెన్నో ప్రయోజనాలను పొందొచ్చు.. జంక్ ఫుడ్ కు ఇవి ఉత్తమ ప్రత్యామ్నాయం. చలికాలంలో డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ మీకు బలాన్ని అందించడమే కాకుండా మీ ఆహారాన్ని సమతుల్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. ఇది మీ చర్మం, జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.డ్రై ఫ్రూట్స్‌లో ఉండే పోషకాలు ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు అవసరం. పాలీఫెనాల్-రిచ్ డ్రై ఫ్రూట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్‌లను చూపించడం ద్వారా రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ డ్రై ఫ్రూట్స్‌లో షుగర్, క్యాలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు వాటిని తినకూడదు. ఎందుకంటే ఇది షుగర్ లెవెల్ పెంచి గ్యాస్ట్రిక్ సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి చలికాలం కోసం ఉత్తమమైన డ్రై ఫ్రూట్స్ ఏవో తెలుసుకుందాం. వాల్ నట్స్: క్యాన్సర్, ఊబకాయం, మధుమేహం, బరువు నిర్వహణ, అభిజ్ఞా, పునరుత్పత్తి ఆరోగ్యం,  అనేక ఇతర జీవనశైలి సమస్యలతో సహా అనేక వ్యాధుల చికిత్సకు వాల్‌నట్‌లు సహాయపడతాయని పరిశోధనలో తేలింది. ఇది పోషకాల పవర్‌హౌస్‌గా కూడా పనిచేస్తుంది. వాల్‌నట్‌లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి, నిద్రను ప్రేరేపిస్తాయి. చర్మం, జుట్టుకు అనుకూలంగా ఉంటాయి. ఎండు ద్రాక్ష: చలికాలంలో జుట్టు పొడిబారడం, బలహీనంగా మారడం వంటి సమస్యలతో సతమతమవుతున్నట్లయితే రోజూ నల్ల ఎండుద్రాక్షను తినండి. ఇందులో పెద్ద మొత్తంలో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది తలకు పోషణనిస్తుంది. జీడిపప్పు: జీడిపప్పులో అధిక మొత్తంలో బహుళ అసంతృప్త, మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు అవసరం. వీటిలో మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. బాదంపప్పు: చలికాలంలో బాదంపప్పు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బాదం యొక్క గ్లైసెమిక్ లోడ్ మీకు బలమైన జీర్ణ వ్యవస్థను కూడా అందిస్తుంది. పిస్తా: పిస్తాలో యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల వార్మింగ్ గుణాలు ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో, బరువును నియంత్రించడంలో,  జీర్ణ సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. అందువల్ల, డ్రై ఫ్రూట్స్ మంచి ఆరోగ్యాన్ని పెంపొందించడం వల్ల ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలం. కాబట్టి ఇప్పుడు వీటిని మీ ఆహారంలో చేర్చుకోండి.  

సైకోటిక్ బ్రేక్ డౌన్.. సెలబ్రిటీస్ నుండి సాధారణ వ్యక్తుల వరకు ఎవ్వరినీ వదలదిది..

అనారోగ్యం వచ్చిందంటే  హాస్పిటల్స్ కు పరిగెత్తి వైద్యం చేయించుకుంటారు. పేదల దగ్గర డబ్బులుండవని, ధనికుల దగ్గర.. ముఖ్యంగా సెలబ్రిటీస్ దగ్గర డబ్బు చాలా ఉంటుందని అందుకే వారు ఏ జబ్బుకైనా వైద్యం చేయించుకోగలుగుతారని అంటారు. కానీ సెలబ్రిటీలు సైతం జయించలేని జబ్బులు ఏవైనా ఉన్నాయంటే అవి మానసిక సమస్యలే. నిజానికి సెలబ్రిటీలకు కూడా చాలా తొందరగా మానసిక సమస్యలు వస్తుంటాయి. దీనికి కారణం వారి జీవనశైలి కూడా.  మానసికంగా ఇబ్బంది పట్టే సమస్యలలో సైకోటిక్ బ్రేక్ డౌన్  ప్రధానమైనది. అమెరికన్  గాయని లేడీ గాగా తన 19సంవత్సరాల వయసులో ఓ మ్యూజిక్  డైరెక్టర్ చేతిలో అత్యాచారానికి గురై సైకోటిక్ బ్రేక్ డౌన్ కు లోనైంది. ఆ సమయంలో తను  పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ తో బాధపడ్డానని స్వయంగా ఆమె చెప్పుకుంది.  సైకోటిక్ బ్రేక్ డౌన్ లో పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ప్రధానమైనది.  అసలు  ఈ మానసిక సమస్య లక్షణాలు ఏంటి?  ఇది మనిషిని ఎలా ప్రభావితం చేస్తుంది? పూర్తీగా తెలుసుకుంటే.. పోస్ట్ ట్రామాటిక్  స్ట్రెస్ డిజార్డర్.. కొన్ని వ్యాధుల లక్షణాలు బయటకు కనిపిస్తే కొన్ని బయటకు కనిపించవు. సాధారణంగా శారీరక వ్యాధులు కొన్ని లక్షణాల రూపంలో బయటపడుతుంటాయి.  కానీ మానసిక వ్యాధులు మాత్రం క్లిష్టతరమైనవి. చాలా గమనిస్తే తప్ప వాటిని తెలుసుకోలేం.  పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్టర్ అనేది మనిషి మానసికంగా చాలా దారుణంగా దెబ్బ తిన్న వారిలో కలుగుతుంది. కానీ దాని ఫలితాన్ని బాధితులు అంత  తొందరగా అర్థం చేసుకోలేరు. భావోద్వేగాలు.. కొన్నిసార్లు మీరు అతిగా భావోద్వేగానికి గురైనప్పుడు, మీరు చిన్న విషయాలకు కూడా ఏడుపు ప్రారంభిస్తారు. ఒక వ్యక్తి ఎటువంటి కారణం లేకుండా విపరీతమైన అలసటను అనుభవిస్తాడు. మనస్సు సున్నా స్థితికి వెళుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అసలైన, అలాంటి సమయాల్లో మీరు మానసికంగా అలసటకు గురవుతారు. ఇది మీ మెదడుకు విరామ సమయం అని అర్థం. ఇందులో మీరు ఒత్తిడికి గురవుతారు మరియు పరిస్థితులను సరిగ్గా నిర్వహించలేరు. ఇది కెరీర్‌పైనే కాదు వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఆందోళన, ఒత్తిడి.. ఆందోళన, ఒత్తిడి సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు చిన్న విషయాలకు కూడా ఆందోళన పడతారు.  ఒత్తిడి అనుభవిస్తారు. భావోద్వేగాల విషయంలో  అలసటకు గురికావడం ఈ సమస్య ఉన్నవారిలో బయటకు కనిపించే లక్షణం.  ఈ సమస్య ఉన్న వారు చుట్టుప్రక్కల  విషయాలపై దృష్టిపెట్టలేరు. భావోద్వేగాలను  అదుపు చేసుకోలేరు.  నిరంతరాయంగా ఇలాంటి ఫీలింగ్స్ ఎదుర్కొంటున్నట్టైతే  వారు వ్యాధి బారిన పడ్డారని అర్థం చేసుకోవాలి.  దీన్నుండి బయటపడాలంటే  మనిషికి విరామం కావాలి. ఆ విరామంలో సరైన నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ అలా తీసుకోలేని పక్షంలో అది వ్యక్తికి చాలా హానికరం. ఇలాంటి సమస్య ఉన్నవారు  చాలా జాగ్రత్తగా జీవితాన్ని లీడ్ చేసుకోవాల్సి ఉంటుంది.                                                                   *నిశ్శబ్ద.

శీతాకాలంలో డయాబెటీస్ పేషెంట్లకు సూపర్ ఫుడ్స్ ఇవే..!

ఈ సీజన్‌లో జలుబు, దగ్గు  వంటి సమస్యలు రావడం సర్వసాధారణం.ఈ వ్యాధులు అంత తీవ్రమైనవి కానప్పటికీ, ఒక వ్యక్తికి వచ్చినప్పుడుఅనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు సిరప్ తాగుతుంటారు. ఇంకొంతమంది ఈ సమస్య నుండి బయటపడటానికి సులభమైన ఇంటి నివారణలను ప్రయత్నిస్తారు. అటువంటి పరిస్థితిలో, జలుబు, దగ్గు సమస్యను తగ్గించేందుకు సహాయపడే కొన్ని సులభమైన, ఎఫెక్టివ్ హోం రెమెడీస్ గురించి తెలుసుకుందాం. మీరు కూడా జలుబు, దగ్గు  సమస్యతో బాధపడుతున్నట్లయితే, ఖచ్చితంగా ఈ టిప్స్ పాటించండి. తేనె,అల్లం రసం: అల్లం రసం జలుబు, దగ్గు  దివ్యౌషధం కంటే తక్కువ కాదు. దీని నుండి ఉపశమనం పొందడానికి, మీరు తేనె, అల్లం రసం తీసుకోవచ్చు. మీరు జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్లయితే, అల్లం, తేనె రసాన్ని వేడి చేసి వెంటనే త్రాగితే, తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఉప్పు నీటితో పుక్కిలించాలి:  మీరు జలుబుతో పాటు గొంతు దృఢత్వం, కఫం, దగ్గుతో బాధపడుతున్నట్లయితే, ఉప్పు నీటితో పుక్కిలించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇలా చేయడం వల్ల గొంతులో పేరుకుపోయిన కఫం పోతుంది. గొంతు వాపు నుండి ఉపశమనం లభిస్తుంది, అటువంటి పరిస్థితిలో, మీరు కూడా జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్లయితే, ఖచ్చితంగా పుక్కిలించండి.   ఆవిరి తీసుకోవడం: ఆవిరి పట్టుకుంటే జలుబు, దగ్గు నుండి చాలా ఉపశమనం ఉంటుంది. ఇలా చేయడం వల్ల మూసుకుపోయిన ముక్కు క్లియర్ అవుతుంది. దీని కోసం, సాధారణ నీటి ఆవిరిని తీసుకోవడం ద్వారా లేదా ట్రీ ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్, లెమన్ గ్రాస్ ఆయిల్, లవంగం నూనె జోడించడం ద్వారా ఆవిరిని తీసుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు కూడా జలుబు, దగ్గుతో బాధపడుతుంటే, ఖచ్చితంగా ఈ ఇంటి నివారణలను అనుసరించండి. తులసి అల్లం టీ తాగండి: జలుబు, దగ్గు, ఫ్లూ సాధారణంగా ఇంటి నివారణల ద్వారా నయమవుతాయి. అటువంటి పరిస్థితిలో, మీరు కూడా జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్లయితే, తులసి, అల్లం వేసి టీ తయారు చేసి, సిప్ చేస్తూ త్రాగండి. ఇది మీకు దగ్గు, జలుబు నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. తేనె, లవంగాలు తినండి : మీరు దగ్గు లేదా జలుబుతో బాధపడుతున్నట్లయితే, లవంగాలు, తేనెను  తినండి. లవంగాలను గ్రైండ్ చేసి తేనెతో కలిపి రోజుకు 2-3 సార్లు తింటే దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది.  

కోవిడ్ వచ్చి తగ్గిన వారికోసం కేంద్ర ఆరోగ్యమంత్రి ప్రత్యేకంగా చేసిన ప్రకటన..

కోవిడ్ అనే పేరు వింటేనే ఎంత భయపడతామో అందరికీ తెలిసిందే. కరోనా మొదలైన దగ్గరనుండి అది వివిధ రకాల వేవ్ లు అంటూ ప్రజల మధ్యకు చొచ్చుకు వస్తూనే ఉంది. ఇది రెండు సార్లు చాలా పెద్ద విలయతాండవమే సృష్టించింది. చాలామంది కోవిడ్ కారణంగా చావు అంచులదాకా వెళ్లివచ్చారు. కోవిడ్ మరణపు రుచి చూపించిన తరువాత చాలామంది ఆరోగ్య దృష్ట్యా తీసుకుంటున్న  జాగ్రత్తలే ప్రాణాల మీదకు తెస్తున్నాయని వైద్యులు అంటున్నారు. సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రే  కోవిడ్ వచ్చి తగ్గినవారు ఎవరూ రెండేళ్ల వరకు కొన్ని పనులు చేయకూడదంటూ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి  డాక్టర్ మన్సుఖ్ ఎల్ మాండవ్య తెలిపిన ఆ విషయాలేంటో తెలుసుకుని వాటిని ఫాలో అవ్వడం ప్రతి ఒక్కరి కర్తవ్యం కూడా.. కోవిడ్ సంభవించిన చాలామంది మీద పరిశోధనలు, దేశంలో సంభవిస్తున్న మరణాలను సర్వే చేసిన వైద్యులు కొన్ని విస్తుపోయే నిజాలు వెలిబుచ్చారు. దేశంలో సంభవిస్తున్న గుండెపోటు మరణాలలో కోవిడ్ గుప్పెట్లో చిక్కుకుని నరకం అనుభవించి మరీ బయటపడినవారే అధికశాతం మంది ఉన్నారు. అందుకే కోవిడ్ వచ్చి దాని నుండి బయటపడినవారు ఎవరూ అధికబరువులు ఎత్తడం, రన్నింగ్ చేయడం,  వేగవంతమైన డాన్స్, ఏరోబిక్ వ్యాయామాలు, అధిక శ్రమతో కూడుకున్న ఇంటి పనులు మొదలైనవాటికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన వ్యాయామానికి, గుండెపోటుకు మధ్యగల సంబంధం గురించి వైద్యులు చేసిన పరిశోధనలలో చాలా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. చాలా తీవ్రమైన వ్యాయామాలు చేసినప్పుడు రక్తపోటు, శరీరం డీహైడ్రేషన్ కు గురికావడం చాలా వేగంగానూ, ఆకస్మాత్తుగానూ జరుగుతున్నాయని వైద్యుల పరిశోధనలలో తేలింది. ఇది గుండెమీద ఒత్తిడి కలిగించి  గుండెపోటుకు దారితీస్తుంది.  ఇప్పటికే అధిక రక్తపోటు, గుండె సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారికి ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. పైన చెప్పుకున్న విషయాల ప్రకారం కోవిడ్ బాధితులలో గుండె సంబంధ సమస్యల ప్రమాదం ఎక్కువ కాబట్టి వ్యాయామం ఆపేయాలనే ఆలోచన రావచ్చు. కానీ గుండె ఆరోగ్యంగా ఉండటానికి  వ్యాయామం చాలా అవసరం. అయితే తీవ్రమైన వ్యాయామం గుండెను దెబ్బతీస్తుంది. కాబట్టి  కోవిడ్ నుండి బయటపడినవారు గుండె ఆరోగ్యానికి, శారీరక ఫిట్నెస్ కోసం తేలికపాటి వ్యాయామాలను మాత్రమే ఎంచుకోవాలి. వాకింగ్, మెట్లు ఎక్కడం, యోగా, సైక్లింగ్ వంటి వ్యాయామాలు ప్రతిరోజూ చేయవచ్చు. అయితే నిశ్చలమైన జీవనశైలి నుండి మాత్రం తప్పక బయటపడాలి. ఒకే రకమైన జీవనశైలి ఉంటే శరీరానికి తగినంత మార్పు లభించదు. కాబట్టి తేలికపాటి వ్యాయామాలు చేస్తూ గుండెను, ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవాలి.                                                       *నిశ్శబ్ద.

ముక్కు దిబ్బడా..? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి.!

చలికాలంలో దగ్గు, జలుబుతో బాధపడటం సర్వసాధారణం. అయినప్పటికీ, దగ్గు, జలుబు చాలా సమస్యలను కలిగిస్తుంది. జలుబు కారణంగా ముక్కు మూసుకుపోతే.. శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. మూసుకుపోతే సరిగ్గా నిద్రపట్టదు. ఏ పనిపైనా ద్యాస ఉండదు. అయితే ఈ 5 ఇంటి నివారణలను అనుసరించడం ద్వారా ముక్కు దిబ్బడ నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు. అవేంటో చూద్దాం. వేడి నీటి ఆవిరి: జలుబు కారణంగా ముక్కు పూర్తిగా మూసుకుపోయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే, వేడి నీటిని ఆవిరి పట్టడం వల్ల వెంటనే ఉపశమనం పొందుతుంది. దీని కోసం, ఒక పాత్రలో నీటిని వేడి చేసి, మీ ముఖాన్ని దానిపై ఉంచండి.  ఆవిరిని పీల్చుకోండి. తలను కొంత గుడ్డతో కప్పండి. మీకు కావాలంటే, మీరు నీటిలో కొద్దిగా విక్స్ కూడా జోడించవచ్చు. ఇది మూసుకుపోయిన ముక్కు నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. కొబ్బరి నూనె వాడకం: ముక్కు పూర్తిగా మూసుకుపోయినట్లయితే, మీరు కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. ఒక చుక్క కొబ్బరి నూనెను మీ వేలికి తీసుకుని, ముక్కులోపలికి రాసుకుంటే వెంటనే ముక్కు తెరుచుకుంటుంది. ముక్కులో కొబ్బరి నూనెను అప్లై చేసిన తర్వాత, లోతైన శ్వాస తీసుకోండి. కొబ్బరి నూనె కాకుండా, మీరు బాదం నూనెను కూడా ఉపయోగించవచ్చు. కర్పూరం: కర్పూరం వాసన బ్లాక్ అయిన ముక్కును తెరవడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ముక్కు పూర్తిగా మూసుకుపోయినట్లయితే కర్పూరం వాసన ముక్కు తెరుచుకుంటుంది. కొబ్బరినూనెలో కర్పూరం కలిపి వాసన చూడొచ్చు. లవంగాల వాసన మూసుకుపోయిన ముక్కును క్లియర్ చేయడంలో కూడా సహాయపడుతుంది. ఈ వ్యాయామం ముక్కును తెరవడంలో సహాయపడుతుంది: మూసిపోయిన ముక్కు నుండి ఉపశమనం పొందడానికి మీరు కూడా ఈ చిన్న వ్యాయామం నుండి ప్రయోజనం పొందవచ్చు. ఇందుకోసం ముందుగా తలను వెనుకకు వంచి ముక్కును మూసుకుని కొద్దిసేపు శ్వాసను ఆపివేయాలి. తరువాత, మీ ముక్కు తెరిచి శ్వాస తీసుకోండి. ఇలా చేయడం వల్ల ముక్కు తెరుచుకుంటుంది. మీరు దీన్ని రెండు మూడు సార్లు చేయవచ్చు. మీ ముక్కును గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి: గోరువెచ్చని నీటితో శుభ్రం చేయడం ద్వారా మీ మూసుకుపోయిన ముక్కును కూడా తెరవవచ్చు. దీని కోసం, ముందుగా తలను వెనుకకు వంచి, డ్రాపర్ సహాయంతో కొన్ని చుక్కల గోరువెచ్చని నీటిని ముక్కులో వేయండి. కొంత సమయం తరువాత, మీ తలను నిఠారుగా చేసి, నీటిని తీసివేయండి. ఇది ముక్కు తెరవడానికి సహాయపడుతుంది.  

చలికాలంలో వచ్చే జలుబు, గొంతు నొప్పికి ఇవి దివ్యౌషధం..!

కొందరికి తరచుగా జలుబు, ఫ్లూ, దగ్గు వస్తుంటాయి. ఈ సందర్భంలో గొంతు నొప్పి సాధారణం. ఇది వివిధ ఇన్ఫెక్షన్ల వల్ల సంభవించవచ్చు.  చలికాలం వస్తే ఇది మామూలేనని పలువురు వాపోతున్నారు. కొందరు వ్యక్తులు గొంతు నొప్పితో వాపును కూడా అనుభవిస్తారు. అయితే గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు అనేక హోం రెమెడీస్ ఉన్నాయి. మన పెద్దలు కూడా వీటి గురించి చెబుతుంటారు. చలికాలంలో వేధించే గొంతునొప్పి, జలుబుకు సంబంధించిన హోం రెమెడీస్ గురించి ఇప్పుడు చూద్దాం. తేనె: తేనె చాలా సంవత్సరాలుగా సాంప్రదాయ ఔషధం యొక్క సహజ రూపంగా ఉపయోగిస్తున్నారు. ఇది వివిధ ఆరోగ్య సమస్యలకు ఆయుర్వేద ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నందున ఇది మన శరీరంలో మంటను తగ్గించడంలో గొప్పగా పనిచేస్తుంది. ఇది కాకుండా, ఇది వెంటనే గొంతు నొప్పి తగ్గిస్తుంది. ఉప్పు నీటితో గార్గ్లింగ్: గోరువెచ్చని ఉప్పు నీరు మీ స్క్రాచీ గొంతు, జలుబు వల్ల వచ్చే గొంతు నొప్పికి ఉత్తమ ఔషధంగా కనిపిస్తుంది. ఇది గొంతులోని బ్యాక్టీరియాను తొలగిస్తుంది. నొప్పిని కూడా తగ్గిస్తుంది. దీని కోసం, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పు వేసి, బాగా మిక్స్ చేసి రెండు నిమిషాలు పుక్కిలించాలి. చమోమిలే టీ తాగడం: ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, ఇతర ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి గొంతు నొప్పికి నివారణగా పనిచేస్తాయి. మీరు తాగే చమోమిలే టీలో కొంచెం తేనె కలుపుకుంటే మరింత మేలు జరుగుతుంది. ఇది కెఫిన్ కలిగి ఉండదు కాబట్టి, ఇది కడుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది. వేడి నిమ్మరసం తాగడం: చలికాలంలో మీ గొంతు నొప్పికి గోరువెచ్చని నిమ్మరసం దివ్యౌషధంగా పనిచేస్తుంది. శరీర బరువును తగ్గించడమే కాకుండా అనేక చర్మ సమస్యలకు ఇది ఔషధంగా పని చేస్తుంది. చలికాలపు లక్షణాలను తొలగించడమే కాకుండా, యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ వైరల్ లక్షణాల వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, గొంతులో ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.

ఆహారంలో ఇదొక్కటి లోపించడం వల్లే ఇరవై ఏళ్ళకే ముసలోళ్ళుగా కనబడుతున్నారు

మనిషిని బట్టి వయసు అంచనా వేస్తుంటారు చాలామంది.  ఈ అంచనాలో కొన్ని సార్లు నిండా 20ఏళ్ళు కూడా లేనివారు ఆంటీలు, అంకుల్స్ అనే ట్యాగ్ లోకి వెళతారు. చిన్న వయసులోనే ఇలా పిలవడం వల్ల మనసులో భోరుమని కుమిలిపోయేవారు చాలామంది ఉన్నారు. నేను ఆంటీలా కనబడుతున్నానా అని ముఖం మీద అనేసేవారు కూడా ఉన్నారు. అయితే ఇది ఎదుటివారి తప్పూ కాదూ, మీ వయసు తప్పూ కాదు. అక్కడున్న తప్పల్లా శరీర చర్మంలో వచ్చిన మార్పే. చిన్నవయసులో చర్మం ముడుతలు పడటం, బలహీనంగా మారటం, శరీరం కూడా వయసు మించినట్టు కనబడటం జరుగుతుంది. ఈ కారణం వల్లే అన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్య ఏర్పడటానికి శరీరంలో తీసుకునే ఆహారంలో ఒకే ఒకటి లోపించడం కారణమని ఆహార నిపుణులు చెబుతున్నారు. చిన్నవయసులోనే శరీరం ముసలిగా  మారకూడదంటే అవసరైన  పోషకం ఏంటి?  అది ఏ ఆహారాలలో లభిస్తుంది? పూర్తీగా తెలుసుకుంటే.. సాదారణంగా వయసు పెరిగేకొద్ది శరీరం ముసలిగా మారుతుంది. చర్మం యవ్వనంగా ఉండటానికి కారణమయ్యే కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోవడమే దీనికి ప్రధాన కారణం. చిన్నవయసులోనే కొల్లాజెన్ సరిగా ఉత్పత్తి కాకపోతే చిన్నవసులోనే ముసలివాళ్లుగా కనబడతారు. చిన్నవయసులో వృద్దాప్య సమస్యను అధిగమించాలంటే కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించే ఆహారాలను సమృద్దిగా తీసుకోవాలి.  కింది ఆహారాలు తీసుకుంటే శరీరానికి కొల్లాజెన్ సమృద్దిగా అందుతుంది. పైపెచ్చు ఇవి అందుబాటులో ఉండేవే. అవేంటో తెలుసుకుంటే.. టమోటా.. చర్మం వృద్దాప్యంలోకి జారుతుందనడానికి మొదటి సూచన ముఖంలోనే కనిపిస్తుంది. ముఖం మీది చర్మం ముడతలు పడుతూ ఉంటే వెంటనే టమోటా వినియోగం పెంచాలి. టమోటాలు తినడం వల్ల లైకోపీన్, కొల్లాజెన్ కంటెంట్ శరీరంలో పెరుగుతాయి.  ఇది ఒకరకమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఆకుపచ్చని కూరగాయలు.. కొల్లాజెన్ లోపాన్ని అధిగమించడానికి మాంసాహారులు, శాఖాహారులు కూడా తినగలిగే ఆహారం ఆకుపచ్చని కూరగాయలు. ఆకుపచ్చని కూరగాయలను సహజంగానే ఆరోగ్యానికి ఎంతో మంచివని అంటారు.  ఆకుకూరలలో పాలకూర, బ్రోకలి, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉన్న కూరగాయలు తీసుకోవడం వల్ల కొల్లాజెన్ పొందడం సులువు. అరటిపండు.. బాగా ఆకలిగా ఉన్నప్పుడు భోజనం ఏమీ లేకపోయినా రెండు అరటిపండ్లు తిని గంటకు పైగా ఆకలిని అధిగమించవచ్చు. అరటిపండు కడుపునింపడంతో పాటు శరీరానికి ఆరోగ్యం చేకూరుస్తుంది. అయితే అరటిపండు తింటే వృద్దాప్యాన్ని కూడా జయించవచ్చు. అరటిపండులో కొల్లాజెన్ ఉంటుంది. ప్రతిరోజూ అరటిపండు తింటే కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది వృద్దాప్యాన్ని ఆమడదూరంలో ఉంచుతుంది. పై మూడు రకాల పండ్లు, కూరగాయలను ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే కేవలం నెలరోజులలోపే ముడుతలు పడిన చర్మం యవ్వనంగా మారడం గమనిస్తారు. ఈ ఆహారాలు రోజువారి లైఫ్ స్టైల్ లో భాగం చేసుకుంటే యాబై ఏళ్ళు దాటినా యవ్వనంగా యూత్ లా కనిపిస్తారు.                                                   *నిశ్శబ్ద.

సపోటా తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలా?

తియ్యగా ఉండే సపోటా పండును తినేందుకు అందరూ ఇష్టపడుతుంటారు. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న సపోటలో అధిక క్యాలరీలు ఉంటాయి. దీనినే నోస్ బెర్రీ అని కూడా పిలుస్తారు. దీంట్లో ఉండే గుజ్జు తేలికగా జీర్ణం అవుతుంది. పిల్లలకు జ్యూస్, మిల్క్ షేక్ చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. రుచి మాత్రమే కాదు దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. మరి వాటి గురించి చూద్దాం. మలబద్ధకం నుండి ఉపశమనం: సపోటా పండులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. తద్వారా పేగు భాగాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడేందుకు ఇది పనిచేస్తుంది.పేగు భాగంలో మనం తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది. ఇది మీకు సులభంగా ప్రేగు కదలికను కలిగి ఉండటానికి, మలబద్ధకం సమస్య నుండి బయటపడటానికి సహాయపడుతుంది. శోథ నిరోధక లక్షణాలు: సపోటా పండ్లలో టానిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరానికి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది.అందువలన ఇది మన జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. ప్రకోప ప్రేగు సిండ్రోమ్, గ్యాస్ట్రిక్ సమస్యను తొలగిస్తుంది. మంట,నొప్పి నుండి ఉపశమనం కూడా సపోటా పండుతో సాధ్యమవుతుంది. చర్మం, జుట్టుకు : సపోటా పండ్ల రసం మన చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడంతో పాటు జుట్టును బాగా ఎదిగేలా  చేస్తుంది. చాలా మందికి జుట్టు రాలే సమస్యను సరిచేస్తుంది. సపోటా పండులో ఉండే మంచి యాంటీ ఆక్సిడెంట్లు శిరోజాలను, చర్మాన్ని రక్షిస్తాయి. ఇవి ఫ్రీ రాడికల్ ఎలిమెంట్స్‌పై ప్రభావం చూపుతాయి  చర్మంపై,  మరియు గీతల రూపాన్ని కూడా తగ్గిస్తాయి. రక్తపోటు నిర్వహణ: సపోటా పండులో ఉండే మెగ్నీషియం రక్తపోటును తగ్గిస్తుంది. అదనంగా, ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. ఇది మన శరీరంలో రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. ఆరోగ్యవంతమైన శరీరం మనల్ని మన సొంతం చేస్తుంది. క్యాన్సర్ నుండి రక్షణ: సపోటా పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది వివిధ రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. అంతే కాకుండా సపోటా పండులో విటమిన్ ఎ,  విటమిన్ బి కూడా లభిస్తాయి, ఇది మన చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది.  ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్‌ను నివారిస్తుంది. ఆరోగ్యకరమైన ఎముకలు: ఇందులో కాల్షియం, ఫాస్పరస్‌తో పాటు ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎందుకంటే సపోటా పండులో ఉండే ఈ మూలకాలు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా ఎముకలు బలహీనపడకుండా నిరోధిస్తాయి.  

ఇందుకే రోజులో ఒక్కసారైనా బెల్లం ముక్క తినాల్సిందే..!!

పంచదారతో పోలిస్తే బెల్లం ఆరోగ్యకరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బెల్లంలో సహజసిద్ధమైన ఖనిజాలు,  విటమిన్లు ఉంటాయి. కాబట్టి శుద్ధి చేసిన చక్కెరతో పోలిస్తే బెల్లం చాలా మంచిది. అంతేకాకుండా, మన శరీరానికి అవసరమైన ఐరన్, కాల్షియం,  పొటాషియం కూడా ఇందులో ఉన్నాయి. వీటన్నింటి వల్ల బెల్లం మన శరీరానికి మరింత శక్తిని అందిస్తుంది. రోజూ క్రమం తప్పకుండా బెల్లం తీసుకోవడం వల్ల శరీరానికి మంచి కేలరీలు, కార్బోహైడ్రేట్లు అందుతాయి. అనేక కారణాల వల్ల రోజుకు ఒక్కసారైనా బెల్లం హెల్త్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు పెరుగుతాయి: బెల్లంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  ఇవి మన శరీరంలోని ఫ్రీ రాడికల్ ఎలిమెంట్స్‌తో పోరాడుతాయి.  క్యాన్సర్,  గుండె సమస్యల వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి మనలను రక్షిస్తాయి. జీర్ణవ్యవస్థకు మంచిది: మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావాలి కాబట్టి దానికి బెల్లం లాంటి మరో ఆహారం కావాలి. ఎందుకంటే ఇలాంటి ఆహారాలు మన శరీరంలోని అజీర్ణం, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను నివారిస్తాయి. ఇది మన జీర్ణశక్తిని పెంచుతుంది. కాలేయాన్ని శుభ్రపరుస్తుంది: బెల్లం ఒక ప్రధాన సహజ డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది.  కాబట్టి ఇది మన శరీరం నుండి విషాన్ని సులభంగా తొలగిస్తుంది. దీని వల్ల మన కాలేయ భాగం మునుపటి కంటే మెరుగ్గా పనిచేయడం ప్రారంభిస్తుంది. కాలేయం వల్ల మన శరీరంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. శక్తిని పెంచుతుంది: కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్న బెల్లం తీసుకోవడం వల్ల మన శరీరంలో శక్తిని పెంచి, మనల్ని ఎల్లప్పుడూ ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. అలసట, అనిపించే వారు బెల్లం తినడం అలవాటు చేసుకోవాలి. ఋతు నొప్పి ఉపశమనం: బెల్లంలో ఐరన్,  పొటాషియం అధికంగా ఉండటం వల్ల మన శరీరంలో రక్తప్రసరణను నిర్వహించి, బహిష్టు నొప్పి, తిమ్మిరి నుండి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి పీరియడ్స్ సమయంలో బెల్లం తీసుకోవడం వల్ల మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది: బెల్లంలో అవసరమైన మినరల్స్, విటమిన్లు ఉండటం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లకు ఔషధంలా మారుతుంది. దీని వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు దరిచేరవు. బెల్లం తినే విధానం: మీరు బెల్లాన్ని అనేక రకాలుగా ఆస్వాదించవచ్చు. మీరు నీటిలో బెల్లం కలుపుకొని తినవచ్చు లేదా మీ రోజువారీ టీ-కాఫీలో చక్కెరకు బదులుగా బెల్లం త్రాగవచ్చు. మీరు తయారుచేసే వివిధ తీపి వంటకాలకు బెల్లం జోడించవచ్చు.  మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

ఒంట్లో కొవ్వును ఐస్ లా కరిగించే ఫిట్నెస్ రూల్..

  కొవ్వును కొలెస్ట్రాల్ అని కూడా పిలుస్తారు. శరీరంలో రెండు రకాల కొవ్వులు ఉంటాయి. అవి ఆరోగ్యకరమైన కొవ్వులు, చెడు కొవ్వులు. ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె జబ్బులను తగ్గించడంతో పాటు మెదడు పనితీరు, హార్మోన్ ఉత్పత్తి, కణాల పెరుగుదల.. ఇలా చాలా విధులు నిర్వర్తిస్తాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా తగ్గిపోతాయి. కొలెస్ట్రాల్ కు, అధిక బరువుకు చాలా దగ్గరి సంబంధం ఉంటుంది.  అధిక బరువు తగ్గాలన్నా, కొలెస్ట్రాల్ ఐస్ లా కరిగిపోవాలన్నా ఒక శక్తివంతమైన ఫిట్నెస్ రూల్ ఫాలో అవుతున్నారు చాలామంది. ఆ ఫిట్నెస్ రూలే 30-30-30.. అసలు 30-30-30 అంటే ఏంటి? బరువు తగ్గడంలో దీని ప్రాముఖ్యత ఏంటి? ఇది ఎంతవరకు బరువు తగ్గించడంలో శక్తివంతంగా పనిచేస్తుంది? పూర్తీగా తెలుసుకుంటే.. అధికబరువుకు ప్రధాన కారణం జీవనశైలి సరిగా లేకపోవడం. ఈ జీవన శైలిని సింపుల్ రూల్ తో ఒకదారిలోకి పెట్టవచ్చు. దీనికి 30-30-30 రూల్ పేరు పెట్టారు. వ్యాయామం, ఆహారం, ప్రశాంతంగా తినడం. కేవలం ఈ మూడు ప్రధానంగా సాగే ఈ రూల్ గురించి తెలుసుకుంటే.. 30 గ్రాముల ప్రోటీన్ తినాలి.. ప్రోటీన్ అనేది బరువు తగ్గడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ 30గ్రాముల ప్రోటీన్ ఆహారంలో ఉండేలా చూసుకుంటే అది శరీర అవసరాలకే కాకుండా బరువు తగ్గడానికి కూడా బాగా సహాయపడుతుంది. ఈ 30 అనే మార్క్ కు ఉన్న మరొక అర్థం ఏమిటంటే  రోజూ తీసుకునే ఆహారంలో 30శాతం కేలరీలు తగ్గించాలని. కేలరీలు తగ్గిస్తే సహజంగానే బరువు పెరగరు. ఇక 30గ్రాముల ప్రోటీన్ తీసుకోవడం వల్ల శరీరం బలహీనంగా మారకుండా ఉంటుంది. ప్రోటీన్ కండరాలకు ఎంతో అవసరమైనది కాబట్టి 30గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి, 30శాతం కేలరీలు తగ్గించుకోవాలి. వ్యాయామం.. వ్యాయామం చేసేవారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. వారు స్వతహాగా అన్ని పనులలో చురుగ్గా పాల్గొంటార. ఫిట్నెస్ రూల్ ప్రకారం రోజులో 30నిమిషాలపాటు వ్యాయామం చేయడం వల్ల శరీరంలో కొవ్వు కరిగించడం సులువు అవుతుంది. ఈ వ్యాయామంలో వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, గేమ్స్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మొదలైనవి  ప్రభావవంతంగా ఉంటాయి. ప్రశాంతంగా తినడం.. ప్రశాంతంగా తినడాన్ని ఇప్పట్లో మైండ్ పుల్ ఈటింగ్ అని అంటున్నారు. తినే ఆహారం మీద ద్యాస పెట్టడమే మైండ్ పుల్ పద్దతి. ఇప్పట్లో చాలామంది ఉద్యోగాలు, చదువుల హడావిడిలో వేగంగా తినేయడం చేస్తుంటారు. మరికొందరు భోజనం చేస్తున్నప్పుడు కూడా టీవి, మొబైల్ చూస్తూ  తింటారు.  దీనివల్ల కడుపు అయితే నిండుతుంది కానీ ఆహారంలోని శక్తి శరీరానికి సంపూర్ణంగా అందదు. మనం తినే ఆహారం చాలా శక్తివంతమైనదని, అది అమృత సమానమైనదని భావిస్తూ ఆహారాన్ని చేత్తో కలుపుకుని ఆహారం మీద ఎంతో ఇష్టంతో తినాలి. ఇలా కొన్ని రోజులు చేసిన తరువాత మునుపు ఆహారం తీసుకున్నప్పటికి, తరువాత మైండ్ ఫుల్ గా తిన్నప్పటికి గల తేడాను స్పష్టంగా చూడగలుగుతారు. ఆహారంలో నిఘూడమైన ఉంటుంది. దాన్ని పొందగలగాలి.  ధ్యానం చేస్తున్నప్పుడు, దేవుడిని పూజిస్తున్నప్పుడు ఎంత భక్తితో ఉంటామో ఆహారం దగ్గరా అంతే భక్తితో ఉండాలి. ఆహారాన్ని ఇలా ఫీలవుతూ తినడానికి 30నిమిషాల సమయాన్ని కేటాయించాలి. కేవలం పై మూడు ఫాలో అయితే కొన్ని రోజులలోనే బరువు తగ్గడం స్పష్టంగా గమనించగలుగుతారు.                                                   *నిశ్శబ్ద

ఈ ఐదు రకాల నూనెల గురించి పూర్తీ తెలుసుకోకుండా వంటల్లో అస్సలు వాడకూడదు!

చాలా రకాల వంటలలో నూనె వినియోగం తప్పనిసరి. అస్సలు నూనె ఉపయోగించకుండా చేసే వంటల రుచి బాగుండదనే మాట వాస్తవం. నూనె వినియోగానికి బాగా అలవాటు పడిపోవడం వల్ల అలా అనిపిస్తుంది. వంట చేయడానికి  వినియోగించే నూనెలలో చాలా రకాలు ఉన్నాయి. వీటిలో కొన్ని నూనెలు ఆరోగ్యానికి మంచివి కావని, మరికొన్ని ఆరోగ్యానికి చాలా మంచివని చెబుతుంటారు. అయితే అందరూ ఆరోగ్యానికి చాలా మంచివని అనుకునే అయిదు రకాల నూనెలతో వంట చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని తేలింది. డైటింగ్ చేసేవారు, ఆరోగ్యం మీద స్పృహ ఉన్నవారు ఉపయోగించే కొన్ని రకాల నూనెలు కూడా వంటల్లో వినియోగించడం మంచిది కాదని తేలింది. ఆ నూనెలేంటంటే.. ఆవనూనె.. ఆవనూనె వంటల తయారీలో ఆరోగ్యకరమైనదిగా  పరిగణిస్తారు.  అయితే ఈ నూనెను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఇందులో  ఒమేగా-3,  ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటుంది.  కల్తీ లేని ఆవనూనె మాత్రమే వంటకు ఉత్తమమైనది. లేని పక్షంలో మంచి ఫలితాల కంటే కలిగే నష్టాలే ఎక్కువ. సోయాబీన్ నూనె.. సోయాబీన్ నూనెలో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ చాలా పుష్కలంగా ఉంటాయి. దీని కారణంగా శరీరంలో ఒమేగా -6,  ఒమేగా -3 నిష్పత్తి అసమతుల్యమవుతుంది. దీని వల్ల శరీరంలో వాపు, కీళ్లనొప్పులు,  కొన్ని రకాల క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం ఉంది. సోయాబీన్ నూనెను రోజూ వంటల్లో వినియోగించడం  వల్ల ఊబకాయం,  మధుమేహం తొందరగా వస్తుంది. మొక్కజొన్న నూనె.. వెజిటబుల్  నూనె మాదిరి మొక్కజొన్న నూనెలో కూడా ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు అధిక స్థాయిలో ఉంటాయి. ఆహారంలో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్‌లు అధికంగా ఉంటే వాపుకు కారణమవుతుంది. దీన్ని తీసుకుంటే   100% కొవ్వులు శరీరంలో చేరతాయి.  ఇకపోతే ఈ నూనెలో ప్రోటీన్ లేదా కార్బోహైడ్రేట్లు ఏమీ ఉండవు. మొక్కజొన్న నూనె వంట విషయంలో ఆరోగ్యకరమైన ఎంపిక కాదు. ఆలివ్ నూనె.. ఆలివ్ నూనె ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. సలాడ్‌లు,  ఆహారంలో నూనెను జోడించడం విషయానికి వస్తే ఆలివ్ నూనె అత్యంత ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది. అయితే  ఈ నూనె వేడెక్కే ఉష్టోగ్రత ఇతర నూనెల కంటే తక్కువగా ఉంటుంది, అంటే ఇది అధిక మంట మీద  వంట చేయడానికి తగినది కాదు. ఆలివ్ నూనెను ఎప్పుడూ పైపైన వాడాలే తప్ప నేరుగా మంటమీద వేడి చేసి ఆహారాన్ని వండకూడదు. అలా వండితే  దాని పోషకాలు చెడిపోతాయి, అలాంటి  నూనె శరీరానికి హానికరం అవుతుంది. పామాయిల్.. ఒకప్పుడు పామాయిల్ చాలా విరివిగా వాడేవారు. ఈ పామాయిల్ లో  సంతృప్త కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. వీటిని అధికంగా తీసుకుంటే గుండె జబ్బులు వస్తాయి. ఈ నూనెను ఎక్కువగా స్నానపు సబ్బు తయారీలో ఉపయోగిస్తారు . ఇది చాలా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కరుగుతుంది, అందుకే దీనిని రెస్టారెంట్లలో లేదా టాఫీ చాక్లెట్ మొదలైన వాటి తయారీలో ఉపయోగిస్తారు, తద్వారా ఇది నోటిలోకి వెళ్ళిన వెంటనే కరిగిపోతుంది. ఆరోగ్యం బాగుండాలంటే పైన చెప్పిన నూనెలను ఆహారం వండటానికి అస్సలు వినియోగించకూడదు. దీనికి బదులుగా కొబ్బరి నూనె, అవకాడో నూనె, నువ్వుల నూనె వంటి ఆరోగ్యకరమైన నూనెలు వినియోగించవచ్చు. అయితే ఆహారం తయారీలో నూనెల వినియోగం పరిమితంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండటం సాధ్యమవుతుంది.                                        *నిశ్శబ్ద.

తులసి గురించి ఆయుర్వేదంలో ఉన్న షాకింగ్ చిట్కాలు!!

 చర్మవ్యాధుల్ని  పోగొట్టడంలో  తులసి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. తామర మొదలైన చర్మ వ్యాధులకు తులసి ఆకులను నూరి, నిమ్మపండు రసం కలిపి పైన రాస్తారు. క్రిములను సైతం తులసి సంహరిస్తుంది. ఎక్కిళ్ళు, ఆయాసం, దగ్గు మొదలైన శ్వాసకోశ సంబంధ వ్యాధులు నయమవుతాయి. నిమోనియా, మలబద్ధకాలకు తులసి మంచి ఔషధం. మలేరియా జ్వరానికి తులసీ దళాల కషాయం బాగా పనిచేస్తుంది. ఎండు తులసి ఆకులను నీళ్ళలో (10 తులాల నీళ్ళకు ఒక తులం ఆకు వంతున) వేసి మరిగించి, ఆ కషాయాన్ని రొమ్ము పడిసెం మొదలైనవాటికి వాడతారు. చెవిపోటు వస్తే తులసి ఆకు రసాన్ని చెవిలో పిండితే తగ్గిపోతుంది. మానకుండా ప్రతి రోజూ రెండు పూటలా తులసీ దళాలను సేవించడం వల్ల రక్తపోటు, క్యాన్సర్, కడుపులో పుండు మొదలైనవి రావు. అలాగే ప్రతి రోజూ ఉదయం తులసి ఆకును నలిపి, ఒక తులం రసం తీసి తాగుతుంటే జీర్ణజ్వరాలు, విరేచనాలు మొదలైనవి తొలగిపోతాయి. పిల్లలకు కడుపుశూల వస్తే, తులసి ఆకు రసంలో కొద్దిగా అల్లపు రసాన్ని కలిపి తాగిస్తారు. ఒక తులం తులసి రసంలో పావు తులం నల్ల మిరియాల రసం కలిపి తాగిస్తే, జలుబుతో కూడిన జ్వరం, విడవకుండా వస్తున్న జ్వరం కూడా తగ్గిపోతాయి. అలాగే, అప్పటికప్పుడు తాజాగా తీసిన తులసి రసాన్ని తాగిస్తే వాంతులు కట్టేస్తాయి. పేగుల్లో ఉండే క్రిములు నశిస్తాయి. వాంతులు, విరేచనాలు అవుతుంటే, పిల్లలకు తులసి గింజలను ఆవు పాలతో నూరి తాగిస్తారు. శరీరంలో వేడిని పెంచే గుణం తులసికి ఉంది. అందుకే, అవసాన దశలో శరీరం చల్లబడుతున్నప్పుడు గొంతులో తులసీ రసం (తీర్థం) పోస్తారు. తులసి ఆకుల్ని వాసన చూస్తే జలుబు పోతుంది. తులసీ  రసాన్ని కళ్ళల్లో వేస్తే చూపు బలపడుతుంది. కళ్ళల్లో నీళ్ళు కారడం ఆగుతుంది. చెవిలో పోస్తే చెవుడు పోతుంది. ఆకును నమిలి చెవిలో పెడితే, చెవి పోటు తగ్గుతుంది. సూర్యోదయం కన్నా ముందే ఆకులు నమిలి, దంతాలకు రుద్దితే పంటి నొప్పి రాదు. తులసి ఆకుల్ని నూరి, వేడి నీటితో కలిపి పుక్కిలించినా, నమిలినా నోరు పొక్కడం మానుతుంది. ఇక, తులసి గింజల్ని తాంబూలంతో సేవిస్తే, గొంతు వాపు పోతుంది. దీని ఆకు రసంతో తేనె కలిపి ఇస్తే, గట్టిగా ఉండే శ్లేష్మం పల్చబడి బయట పడుతుంది. అలాగే, దగ్గు, రొమ్ము పడిసెం మొదలైనవి కలిగినప్పుడు తులసి రసంలో తేనె, అల్లపు రసం, నీరుల్లి రసం కలిపి ఇస్తే, కఫం తెగి పడుతుంది. తులసి ఎండుటాకును నూరి, నస్యం చేస్తే ఉబ్బసం తగ్గుతుంది. తులసి రసాన్ని తేనెతో కలిపి ఇస్తే, ఆకలి కలుగుతుంది. అన్నకోశానికి శక్తి నిస్తుంది. జీర్ణశక్తిని కలిగిస్తుంది. వాంతులు ఆగుతాయి. తులసి ఆకుల రసాన్ని, శొంఠి పొడి కలిపి ఇస్తే చలి జ్వరం పోతుంది. జలుబు చేసిన వాళ్ళు రోజుకు మూడు, నాలుగు సార్లు తులసి ఆకులు కొన్ని తీసుకొని, బాగా నమిలి మింగాలి. లేదంటే, మరుగుతున్న నీటిలో ఆ ఆకులు వేసి కొద్దిసేపు ఉంచి, వడపోసి, అందులో కాస్త పంచదార, రెండింతల పాలు పోసి, కాఫీ లాగా తాగాలి. దీని వల్ల రొంప తగ్గి, జ్వరం రాదని వైద్యులు చెబుతుంటారు. ఇలా గృహ కృత్యాలలో, సామాన్య వ్యాధులకు అన్నిటికీ తులసి దివ్యౌషధం. ప్రాణదాయక, ప్రాణరక్షక శక్తులు తులసిలో ఉండడంతో జగద్రక్షకుడైన విష్ణుమూర్తికి ఇది ప్రియమైనదని హిందువులు నిశ్చయించారు.                                          *నిశ్శబ్ద.

మీరు పని చేసే ప్రదేశం లో సరిగ్గా కూర్చుంటున్నారా ?

అలా సరిగా కూర్చోనట్లయితే అష్టా వక్ర భంగిమలలో మీరు కూర్చుంటే వెన్ను నొప్పి, మెడ నొప్పికి ఆహ్వానం పలికినట్లే అని అంటున్నారు నిపుణులు.ఈ మధ్య కాలం లో స్మార్ట్ ఫోన్ వినియోగం ల్యాప్ టాప్ వినియోగిస్తూ దీర్ఘకాలం పాటు కూర్చుంటున్నారా బెడ్ పై పడుకునే టప్పుడు బెడ్ సరిగ్గా ఉందా ?సరైన భంగిమలో పడుకుంటు న్నారా ?అలా కానట్లయితే మీ చేతి వేళ్ళు ముంజేయి, మెడ, వెన్ను పూస లోని జాయింట్స్ అరిగి పోతాయి. ఆస్టియో ఆర్తరైటిస్ వంటి వ్యాధులు బారిన పడతారు. మీరు దీర్ఘ కాలం పాటు వాడకం లేదా కూర్చునే భంగిమ పడుకునే భంగిమ లో ఏమాత్రం తేడా ఉన్నా సరిగ్గా లేకపోయినా మీవేళ్ళు ముంజేయి, మెడ, వెన్ను పూసా అరిగి పోతుంది.4౦ సంవత్సరాలు పై బడిన వారిలో వచ్చే ఆస్టియో ఆర్తరైటిస్ వల్ల కీళ్ళు,జాయింత్స్ లో అరుగుదల కనిపించించింది.ఈ సమస్య ఇప్పుడు 2౦ సం వచ్చరాల వాళ్ళలో అరుగుదల కనిపిస్తుంది. దాదాపు దగ్గర ఫగ్గర 1౦ నుండి 15%సమస్యలు  15౦ మంది రోగులలో రోమటాలజీ విభాగం లైఫ్ స్టైల్ డిజార్దర్ గా  పేర్కొన్నారు.ఇటీవల కాలం లో వెన్ను నోప్పితో బాధపడుతున్నారన్న పలురోగులను హెచ్ ఓ డి ప్రొఫే సర్ ఉమాకుమార్ అవుట్ పేషంట్ బ్లాక్ లో చూస్తున్నప్పుడు వచ్చిన పలు సమస్యసలను ప్రస్తావించారు. ఒక కేజీ బరువు పెరిగినా ఒత్తిడి పెరిగి కీళ్ళు పిరుదల పై నుండి ౩ నుండి 6 రెట్లు నొప్పులు పెరుగుతాయి.మెడను వంచడం 15 డిగ్రీ ల యాంగిల్ లో ఉంటె స్మార్ట్ ఫోన్ మాట్లాడం వల్ల 11 కే జీల బరువు పెరిగి మెడ వెన్ను నొప్పికి దారితీస్తుందని నిపుణులు పేర్కొన్నారు.ఎవరైతే ఎక్కువగా ౩౦ డిగ్రీల యాంగిల్ లో కింది భాగం లో స్మార్ట్ ఫోన్ లో చూస్తారో 18 కే జి ల ఒత్తిడి పెరిగి వెన్ను మెడ నొప్పి కి సంబందించిన సమస్యలు వస్తాయి.మీ మెడను కిందికి వంచే బదులు ఫోన్ ల్యాబ్ టేబ్ పైన పెట్టుకోవాలని దీని వల్ల కంటిని కాపాడవచ్చునని డాక్టర్ కుమార్ అన్నారు.ఎప్పుడైతే భుజాలు మెడ ముందుకు వంగు తాయో ముందు భాగం లో ఉన్న కండరాలు గట్టి పడి వెనుక వైపు భాగం లో ఉన్న నరాలు కండరాలు బలహీన పడతాయి ఈ కారణంగా ఒక పక్కన కండరాలు బలహీన పది కండరాల మధ్య సమతౌల్యం లోపించి దీనివల్ల స్పోండి లైటిస్ స్పొండోలసిస్ వంటి సమస్యలు వస్తాయని డాక్టర్ కుమార్ వివరించారు. ఆర్తరైటిస్ కు అవుట్ పెషంట్ గా వస్తున్నారని అంకి లోజింగ్ స్పాం డి లైటిస్ రోమటైద్ ఆర్తరైటిస్ వంటి సమస్యలతో వస్తున్నట్లు గుర్తించామన్నారు.జీవన శైలి విధానాల వల్ల సమస్యలతో బాధపడుతున్నారని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ గా డాక్టర్ కుమార్ పేర్కొన్నారు.ఇలాంటి రోగులకు  ఆక్యుపేషనల్ తెరఫీ ని సూచించి నట్లు తెలిపారు అదీ వారు కూర్చునే భంగిమజీవన శైలి విధానం లో మార్పులు చేస్తే కొంత మేర సమస్యనుండి బయట పడవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.ఈ సందర్భంగా ఒక కేసు విషయాన్ని ప్రస్తావించారు.ఇతను 2౩ సంవత్చరాల పురుషుడు  అతను ఎక్జి క్యుటివ్ గా పనిచేస్తున్నారు కాల్ సెంటర్ లో పనిచేసే ఉద్యోగని తెలిపారు అతను వెన్ను నొప్పి తో బాధపడుతున్నాడని ఓపి డిలో నమోదు చేసినట్లు తెలిపారు. ఆ వ్యక్తి చేతి వేళ్ళు స్పర్స లేకుండా పోయాయని. నాలుక పై భాగం సైతం తిమ్మిరిగా స్పర్స కోల్పోయారని నిర్ధారించారు.పూర్తి పరీక్షలు నిర్వహించిన తరువాత అతని కూర్చునే భంగిమలో పడుకునే భంగిమలో తప్పు ఉందని మొబైల్ ఫోన్ కీబోర్ద్ ఎక్కువ సేపు వినియోగిస్తున్నాడని చాలా ఫోన్స్ మాట్లాడాల్సి ఉంటుందని అప్పుడు మొబైల్ ఫోన్ 6 నెలల పాటు జీవనశైలి లో మార్పులు చేయాలని  సూచించామని అన్నారు. అయితే అతనికి యాంకిలో జింగ్ స్పోండి లైటిస్ గా నిర్ధారించారు.అందుకు ప్రజలు వారి వారి పని చేసే ప్రదేశాలలో వారు కూర్చ్గునే భంగిమ నిటారుగా గుర్తించడం వాటిని వారు నియంత్రించుకోవాలి వారికి అత్యధికంగా నొప్పి వచ్చినప్పుడు మార్చుకునే ప్రాయత్నం చేయాలి అందుకోసం ఆర్గనామిక్ సెట్ అప్ చేసుకోవాలి.మోచేయి 9౦%టేబుల్ ల్యాబ్ టాబ్ టేబుల్ పై ఉండే విధంగా మానీటర్ మీకీబోఅర్డ్ కింది భాగం లో ఉండాలి 2౦ నిమిషాల తరువాత 2౦ సెకండ్లు విరామం అవసరం సుదీర్ఘంగా పనిచేయకుండా విరామం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు కూర్చ్గున్నవద్దె కదలకుండా పనిచేస్తే సమస్యలు తప్పవని నిపుణులు పేర్కొన్నారు. 

అలారంతో నిద్రలేచే అలవాటుందా? అయితే వెంటనే మానేయడం మంచిది!

ఉదయాన్నే లేచి ఇంటిపనులు చేసుకోవడం కోసం కొందరు మహిళలు, ఉదయాన్నే లేచి జిమ్ కో,  వాకింగ్ కో వెళ్లాలని కొందరు, చదువుకోవాలని కొందరు ఇలా ఎంతోమంది ఉదయం సమయంలో తొందరగా నిద్ర లేవడానికి అలారం సహాయం తీసుకుంటున్నారు. అయితే ఇలా అలారం సహాయంతో నిద్రలేస్తామని, పనులన్నీ చక్కగా చేసుకుంటామని, చక్కగా చదువుకుంటామని గొప్పగా చెప్పుకునేవారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇలా అలారం సహాయంతో నిద్రలేవడం అనేది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదనే చేదు వార్త ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్న అంశం. అసలు అలారం సహాయంతో నిద్రలేవడం ఎందుకు మంచిది కాదు? దీనివల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏమిటి?  ఈ విషయాల గురించి పూర్తీగా తెలుసుకుంటే ఇకమీదట ఎప్పుడూ అలారం పెట్టుకుని నిద్రలేవడానికి ప్రయత్నించరు. ఒకప్పుడు పిల్లలు పరీక్ష సమయాల్లో ఉదయమే లేచి చదువుకోవాలంటే అలారం ఉపయోగించేవారు. ఆ తరువాత మొబైల్ లోనే అలారం అందుబాటులోకి వచ్చాక నిద్రపోయే ముందు పక్కనే పెట్టుకుని పడుకునే మొబైల్ అలారం సహాయంతో నిద్రలేస్తుంటారు. కానీ చాలామంది అలారం మోత  మోగగానే మొదట్లోనే లేవరు. అది ఒకటికి పదిసార్లు మోగితే కానీ నిద్రలేవరు.  అసలు సమస్య ఎక్కడుందంటే.. ఉదయాన్నే నిద్రలేవడానికి ఉపయోగింటే అలారం సౌండ్ ఆరోగ్యం మొత్తాన్ని చెడగొట్టేస్తుంది. రాత్రంతా విశ్రాంతి తీసుకున్న శరీరం ఉదయాన్నే పెద్ద శబ్దాలతో మేల్కొనడం అంటే అది రక్తపోటు, గుండె సమస్యలకు కోరి దారి ఇస్తున్నట్టేనట.  రాత్రంతా నిశ్చల స్థితిలో పడుకుని ఉండటం వల్ల శరీరంలో రక్తం చిక్కగా ఉంటుంది. అలారం శబ్దం కారణంగా మేల్కోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ చురుగ్గా జరగదు. శరీరం సాధారణంగా మేల్కొన్నప్పుడు శరీరంలో రక్తం చురుగ్గా ప్రసారమవుతుంది. నిద్రమత్తులో, గాఢంగా ఉన్నప్పుడు  అలారం శబ్ధం ద్వారా మేల్కోవడం అంటే జ్ఞాపకశక్తి, మెదడు సామర్థ్యాన్ని క్రమంగా తగ్గిస్తుంది. అలారం ద్వారా మేల్కోవడం అడ్రినలిన్ పై ప్రభావం చూపిస్తుంది.  కాబట్టి అలారం ద్వారా నిద్ర నుండి మేల్కొనే అలవాటు ఉన్నవారు దీన్ని మానేయడం ఉత్తమం. అలారం అలవాటు ఎలా మానాలంటే.. అలారం ద్వారా లేవడం రోజులో భాగమైపోయినవారు దీన్ని మానుకుని సాధారణంగా నిద్రలేవడానికి కాస్త కష్టంగా అనిపిస్తుంది. కానీ ఈ అలవాటు మానడం వల్ల దీర్ఘకాల అనారోగ్యాలు నివారించవచ్చు. అలారం వరుసపెట్టి అరుస్తున్నా నిద్రమత్తుతో లేవకుండా బద్దకంగా అలాగే పడుకునే అలవాటు మానుకోవాలి. ఒకటి లేదా రెండు సార్లు అలారం మోగగానే దాన్ని కట్టేయాలి. ఇది క్రమంగా సాధారణంగా లేచే సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తుంది. బిగ్గరగా భయపెట్టేలానూ, పెద్ద పెద్ద శబ్దాలతో కూడిన అలారం ను ఉపయోగించడం మానుకోవాలి. సన్న శబ్దంతో పేస్ ఫుల్ గా ఉండే అలారం వాడితే ప్రభావం తక్కువగా ఉంటుంది. ఇంట్లో సూర్యకాంతి నేరుగా ముఖం మీద పడేలాగా నిద్రపోయే ప్రాంతాన్ని సెట్ చేసుకోవాలి. దీనివల్ల ఏ అలారం అక్కర్లేకుండా నిద్రలేవవచ్చు. ప్రతిరోజూ ఒకేసమయంలో నిద్రపోవడం, నిద్రలేవడం చేస్తుంటే ఉదయం సమయంలో అలారం అక్కర్లేకుండానే దానికదే మెలకువ వస్తుంది. ప్రతి రోజూ 7నుండి 8గంటలపాటు నిద్రపోవాలి. ఆరోగ్యకరమైన నిద్ర ఉన్నప్పుడు మేల్కోవడం కూడా సులువుగానే జరుగుతుంది. అదే నిద్ర తక్కువైతే మేల్కోవడం కష్టం.                               *నిశ్శబ్ద.  

చలికాలంలో చాలామందిని ఇబ్బంది పెట్టే అతిపెద్ద సమస్య ఇదే..

ఇప్పటిదాకా ఎండలు ఏమాత్రం తగ్గకుండా వేసవిని తలపిస్తున్నా శరత్కాల ప్రభావం వల్ల క్రమంగా చలి పెరుగుతుంది. సాధారణంగానే అక్టోబర్ నెలలో వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటాయి. క్రమంగా ఉదయం, సాయంత్రం సమయాలలో చలి ఎక్కువ అవుతుంది. ఈ సీజన్ లో ఇన్ఫ్లూయెంజా వంటి వైరల్ లు పెరగడంతో పాటు మైగ్రేన్ సమస్య కూడా పెరిగే ప్రమాదం ఉంది. మైగ్రేన్ అనేది మొండి తలనొప్పి. ఇది వచ్చిందంటే బాధితులను చాలా దారుణంగా హింసిస్తుంది. అసలు మైగ్రేన్ కు చలికి ఉన్న సమస్య ఏంటి? చలికాలంలో దీనికి చెక్ పెట్టడానికి ఏం చెయ్యాలి? పూర్తీగా తెలుసుకుంటే.. మైగ్రేన్ సమస్య ఉన్నవారు చలికాలంలో ఈ సమస్యను మరింత ఎక్కువగా ఎదుర్కొంటారు. ఈ సీజన్ లో గాలి పొడిగా ఉండటం, విపరీతమైన చలి కారణంగా మైగ్రేన్ వస్తుంది. సూర్యరశ్మి తగినంత లేకపోయినా మైగ్రేన్ వస్తుంది. సూర్యరశ్మి లేకపోవడం వల్ల మెదడులో సెరోటోనిన్ వంటి రసాయనాల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది తలనొప్పి, మెగ్రేన్ వంటి సమస్యలు పెంచుతుంది.  సూర్యరశ్మి లేకపోవడం వల్ల సిర్కాడియన్ రిథమ్ కు అంతరాయం కలుగుతుంది. ఇది అంతర్గత నిద్ర గడియారం. ఇది అసమతుల్యతకు గురికావడం వల్ల నిద్రలేమి, తద్వారా తలనొప్పి, మైగ్రేన్ కు దారితీస్తుంది. కేవలం సూర్యరశ్మి మాత్రమే కాకుండా ధూమపానం, మద్యపానం, కెఫిన్ పానీయాలు తీసుకోవడం, అధికంగా వెలుగు కలిగిన, మెరుస్తున్న లైట్లముందు, ఘాడత కలిగిన వాసనల మధ్య ఉండటం కూడా మైగ్రేన్ కు కారణం అవుతాయి. మైగ్రేన్ ఎలా నివారించాలంటే.. చలి భరించలేని వారు, చాలా సున్నితమైనవారు మైగ్రేన్ బారిన తొందరగా పడతారు. శీతాకాలంలో వీరు మైగ్రేన్ బారిన పడే అవకాశం ఎక్కువ.  మైగ్రేన్ ను నివారించడానికి చలికి లోనుకాకుండా ఉండటం ముఖ్యం. వ్యాయామం శరీరంలో వేడి పుట్టిస్తుంది. కాబట్టి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామం సెరటోనిన్ స్థాయిలను పెంచుతుంది. అలాగే చలికాలపు జాగ్రత్తలు బాగా తీసుకోవాలి. వేడి నీరు, వేడి ఆహారం, వెచ్చని వాతావరణం, ఆరోగ్యాన్ని కాపాడతాయి. మైగ్రేన్ ను దూరంగా ఉంచుతాయి.                                                *నిశ్శబ్ద. 

80రోగాలను నయం చేయగల అరటిపండు అందరికీ సేఫ్ కాదు..

అరటి చాలా  శక్తివంతమైన పండు. దీన్ని తినడం వల్ల శరీరానికి ప్రాణశక్తి లభిస్తుంది. ఆకలిగా ఉన్నప్పుడు ఓ అరటిపండు తింటే చాలాసేపటి వరకు ఆకలి బాధ దూరంగా ఉంటుంది. ఇది మెత్తగా ఉండటం వల్ల చిన్న పిల్లల నుండి వృద్దుల వరకు ప్రతి ఒక్కరూ తినదగిన పండు. జీర్ణం కావడానికి సులువుగానే ఉంటుంది. ఎక్కువసేపు ఆకలిని అదుపులో ఉంచుతుంది. కండరబలాన్ని, పోషకాలను ఇస్తుంది. వర్కౌట్ తర్వాత అరటిపండు తినడం ఫిట్నెస్ ఫాలో అయ్యేవారికి తప్పనిసరి. పైపెచ్చు అరటిపండు మిగిలిన పండ్లతో పోలిస్తే ధర తక్కువే. కాబట్టి అందరూ కొనుక్కుని తినగలుగుతారు. కానీ  అరటిపండు అందరికీ మంచిది కాదు. ఆయుర్వేదంలో అరటిపండు కొంతమందికి ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. అరటిపండు తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో? దీన్ని ఎవరు తినకూడదో  తెలుసుకుంటే.. పోషకాలు.. అరటిపండు తినడం వల్ల  విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, మాంగనీస్, విటమిన్ బి6తో పాటు గ్లూటాతియోన్, ఫినాలిక్స్, డెల్ఫిడినిన్, రుటిన్, నారింగిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. 80వ్యాధులకు చికిత్స చేయగలదు.. పోషకాహార నిపుణులు అరటిపండులో ఉన్న గొప్పదానాన్ని చెబుతూ ఇది 80రకాల వ్యాధులకు చికిత్స చేయగలదని పేర్కొన్నారు. అరటి పండు వాత పిత్త దోషాన్ని సమతుల్యం చేస్తుంది. వాతం క్షీణించడం వల్ల దాదాపు 80 రకాల వ్యాధులు వస్తాయని ఆయుర్వేదంలో చెప్పబడింది. ఇది పొడిబారడం, ముడతలు పడటం, ఎముకలలో అంతరం, మలబద్ధకం, చేదు రుచి మొదలైన అనేక సమస్యలు ఇందులో ఉన్నాయి. వీటన్నింటికి అరటిపండు చికిత్స చేయగలుగుతుంది. అరటిపండు ఎవరు తినాలంటే.. ఆయుర్వేదం ప్రకారం అరటిపండు  చల్లని గుణం కలిగి ఉంటుంది. ఇది  జీర్ణం కావడానికి బరువుగా ఉంటుంది.   ఇది లూబ్రికేషన్‌గా పనిచేస్తుంది. శరీరం ఎండిపోయి, ఎప్పుడూ అలసిపోయినట్టు, బాగా నిద్రపోనట్టు, శరీరంలో ఎప్పుడూ మంటగా ఉన్నట్టు అనిపించేవారు, చాలా దాహంతో ఉన్నవారు,  ఎక్కువ  కోపంగా ఉన్నవారు అరటిపండును తినాలి. దీనివల్ల ఆ కోపస్వభావం, అతిదాహం వంటి సమస్యలు అణిచివేయబడతాయి. ఎవరు తినకూడదంటే.. అరటిపండు కఫ దోషాన్ని పెంచుతుంది. కాబట్టి అధిక కఫ శరీర తత్వం గలవారు దీనిని తినకూడదు. పెరిగిన కఫం కారణంగా జీర్ణాశయంలో  అగ్నితత్వం  బలహీనంగా ఉంటే అరటి పండు దానిని మరింత నెమ్మదిస్తుంది. అధిక కొవ్వు, దగ్గు,  జలుబు ఉన్నవారు, ఆస్తమా రోగులు దీనిని తినకూడదు. ఒకవేళ తినాలని అనిపిస్తే  చాలా ఆలోచించి దీని పర్యావసానాలు ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉంటేనే తినాలి.                                              *నిశ్శబ్ద

సహజంగా శరీరంలో విషపదార్థాలను తొలగించుకోవడానికి అద్బుతమైన ఆహారాలు..

ప్రతి రోజూ స్నానం చేస్తాం, శరీరం  ఆరోగ్యంగా కనిపించేలా చూసుకుంటాం. దుస్తుల దగ్గర నుండి శరీరం మీద ఎక్కడైనా మురికి పేరుకుందా లేదా అని గమనించి జాగ్రత్తలు తీసుకుంటాం. ఇలా బాహ్య శుభ్రతకు ఇచ్చిన ప్రాముఖ్యత, దాని మదీ తీసుకున్న శ్రద్ద అంతర్గత శుభ్రత గురించి చాలామందికి ఉండదు. కానీ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అంతర్గత శుభ్రతే ముఖ్యం. ఇప్పుడున్న ఆహార కాలుష్యం, జీవనశైలి, వాతావారణ మార్పులు ఇలా ప్రతి ఒక్కటి శరీర అంతర్గత ఆరోగ్యాన్ని ప్రభావం  చేస్తుంది. కొన్ని అద్బుతమైన ఆహారాలు తీసుకోవడం వల్ల లోపలి శరీరం శుద్ది అవుతుంది. టాక్సిన్ లు తొలగిపోతాయి. అవేంటో తెలుసుకుంటే.. బీట్‌రూట్‌లో చాలా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.   ఆరోగ్యానికి చాలా  మేలు చేస్తాయి. ఇది కాలేయానికి కూడా చాలా మంచిది.  ఇది నేచురల్ బ్లడ్ క్లెన్సర్‌గా  పనిచేస్తుంది. ఇందులో నైట్రిక్ యాసిడ్ ఉంటుంది ఇది రక్తంలోని విషాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ప్రతి రోజూ బీట్రూట్ జ్యూస్ తాగినా లేదా రోజులో కనీసం కొన్ని బీట్ రూట్ ముక్కలు తిన్నా రక్తాన్ని శుద్ది చేస్తుంది. కేవలం రెండు వారాల నుండి నెలలోపే ఇందులో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల చాలా ఏళ్లుగా దీనిని ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉండే కర్కుమిన్ కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది. ఇది ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి శరరీరాన్ని  రక్షిస్తుంది. అందువల్ల, ఆహారంలో పసుపును చేర్చుకోవచ్చు, గోల్డ్ మిల్క్ పేరుతో పిలుచుకునే పసుపు పాలు తాగడం లేదా వేడి నీటిలో చిటికెడు పసుపు వేసుకుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది గొప్ప రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది.  జీర్ణక్రియకు  చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి, ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. దీన్ని నీటిలో కలిపి కూడా తాగవచ్చు. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది. కొత్తిమీర  ఆహారానికి రుచిని, సువాసనను ఇవ్వడానికి మాత్రమే కాదు, శరీరంలో  కొలెస్ట్రాల్ నియంత్రించడంలోనూ,  జీర్ణక్రియను మెరుగుపరచడంలోనూ  ఉపయోగకరంగా ఉంటుంది. దీనితో పాటు, ఇది  శరీరంలో ఉండే ఎక్కువ మొత్తం టాక్సిన్ లను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. అందువల్ల, దీన్ని తినడం వల్ల  శరీరం డిటాక్సిఫై అవుతుంది. వెల్లుల్లిలో అధిక సల్ఫర్ కంటెంట్ ఉంటుంది.  ఇది టాక్సిన్స్ తొలగించడంలో కాలేయానికి సహాయపడుతుంది. దీనితో పాటు జుట్టుకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందువల్ల ఆహారంలో వెల్లుల్లిని చేర్చడం ద్వారా  శరీరాన్ని డిటాక్స్ చేయవచ్చు.