చలికాలంలో ఉసిరికాయలు తింటే ఇన్ని లాభాలా?

ఉసిరికాయలు భారతీయ ఆయుర్వేదంలో చాలా గొప్ప ఔషదం. త్రిఫలాలు అని పిలువబడే ఆయుర్వేద పండ్లలో ఉసిరి కాయ కూడా ఒకటి. చిన్నతనంలో వీటిని ఉప్పు, కారం అద్దుకుంటూ తింటూంటే ఎంతో మజాగా ఉండేది. ఇప్పుడు కూడా వీటిని చూస్తే పెద్దలు కూడా పిల్లలైపోయి నోట్లో లాలాజలం ఊరించుకుంటూ తింటుంటారు. ఒకప్పుడు సరదాగా తిన్న ఈ ఉసిరికాయలు గొప్ప ఔషదం అని తెలిశాక వీటిని దూరం పెట్టాలని ఎవరూ అనుకోరు. ముఖ్యంగా  ఉసిరికాయలను చలికాలంలో తింటే ఎన్ని లాభాలో తెలిస్తే  ఆశ్చర్యపోతారు. కార్తీక మాసంలో ఈ ఉసిరికాయలు లభ్యం కావడం మొదలవుతుంది.  సుమారు ఫిబ్రవరి నెల వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. ఈ కాలంలో వీటిని తినడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలేంటో తెలుసుకుంటే వీటిని మిస్ కాకుండా తినచ్చు. చలికాలంలో జీర్ణవ్యవస్థ చాలా నెమ్మదిస్తుంది. ఈ కారణంగా జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది.  ఉసిరి కాయలో ఉండే ఫైబర్ ప్రేగులను చురుగ్గా పనిచేసేలా  చేస్తుంది. ఇది మలబద్దకాన్ని దూరం చేస్తుంది. జీర్ణవ్యవస్థలో పేరుకున్న మలినాలను బయటకు పంపేస్తుంది. రోగనిరోధక శక్తి ఎంత బలంగా ఉంటే ఈ చలికాలంలో ఆరోగ్యం అంత బాగుంటుంది. లేదంటే చాలా సులువుగా ఇన్ఫెక్షన్లు సోకుతాయి. ఉసిరికాయలో ఉండే విటమిన్-సి, యాసిడ్ ఫాలిఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ సహా చాలా యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీరాడికల్స్ తో పోరాడతాయి. రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. వాతావరణం చల్లగా మారడం వల్ల శరీరంలో కూడా మార్పులు వస్తాయి. బద్దకంగా అనిపించడం, పనులు చేయడంలో అనాసక్తి, క్రమంగా వీటి ప్రభావం ఒత్తిడిగా మారుతుంది. ఈ సమస్యలన్నీ తగ్గించడంలో ఉసిరి పనిచేస్తుంది. ఉసిరిలో ఉండే గుణాలు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తి బాగుండాలంటే విటమిన్-సి చాలా అవసరం. ఉసిరికాయ విటమిన్-సి కి  పెట్టింది పేరు.  ఉసిరి రసం తీసుకుంటే ఇమ్యునిటీ పెరిగి అంటువ్యాధుల సమస్యలు తగ్గుతాయి.  తెల్లరక్తకణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.  సాధారణంగా సీజనల్ వారిగా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలను మంత్రించినట్టు మాయం చేస్తుంది. చలికాలంలో చర్మం, జుట్టు చాలా దారుణంగా దెబ్బతింటుంటాయి. వీటికి ఉసిరితో చెక్ పెట్టవచ్చు.  ఉసిరిలో ఉండే యంటీ ఆక్సిడెంట్ లక్షణాలు,  విటమిన్-సి  కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా మారుస్తాయి. తలలో చుండ్రు, కురుపులు, చర్మ సంబంధ సమస్యలు అన్నీ దూరం అవుతాయి.                                                       *నిశ్శబ్ద.

చలికాలంలో బరువు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి!

  శీతాకాలంలో జలుబు, దగ్గు, కీళ్లు పట్టేయడం, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, చర్మం పొడిబారడం వంటి సమస్యలు చాలామందిని వేధిస్తుంటాయి. అయితే ఈ కాలంలో చాలా మంది బరువు కూడా పెరుగుతారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంతకు ఈ కాలంలో బరువు పెరగడానికి అసలు కారణాలు ఏంటి? అది తెలుసుకుంటే మన శరీరంలో అనవసరంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించుకోవచ్చు. చలికాలంలో చల్లటి వాతావరణం కారణంగా ఉదయాన్నే లేచి వ్యాయామం చేయడానికి శరీరం సహకరించదు. దీంతో ఫిట్నెస్ రొటిన్ అదుపు తప్పి...శరీరంలో క్యాలరీలు కొవ్వుగా మారుతాయి. ఫలితంగా బరువు పెరుగుతారు. అయితే దీన్ని అధిగమించేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ముఖ్యమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ క్రమంలో మీ భాగస్వామి లేదాస స్నేహితుడిని ఫిట్నెస్ పార్టనర్ గా సెలక్ట్ చేసుకుని ఒకరికొకరు ప్రోత్సహించకుంటూ వ్యాయామం చేయండి. ఇదొక్కటే కాదు ఈ కాలంలో బరువు పెరగడానికి చాలా కారణాలే ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో చూద్దాం. ఎండ శరీరానికి తగలకపోయినా: వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వెచ్చదనం కోసం ఎండలో నిల్చుంటాం. ఈ క్రమంలో ఎండలో వ్యాయామాలు చేసేవారు కూడా ఉన్నారు. అయితే ఈ కాలంలో కొన్ని రోజులు పొగమంచు కారణంగా ఎండ ఉండదు. ఇలా  చలికాలంలో శరీరానికి ఎండ తగలకపోవడం వల్ల సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ సమస్య తలెత్తే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక రకమైన డిప్రెషన్ వంటిదేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా ఆహారపు అలవాట్లు, మోతాదుకు మించి ఆహారం తినడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ అలవాట్లు అంతిమంగా బరువు పెరిగేందుకు దోహదం చేస్తాయి కాబట్టి ఉదయం ఎండ లేకపోతే మధ్యాహ్నం పూట కాసేపు వీలు కుదుర్చుకుని ఎండలో ఉండటం మంచిది. అయితే ఈ క్రమంలో సూర్యకిరణాల కారణంగా చర్మ సమస్యలు తలెత్తకుండా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. హర్మోన్ల అసమతుల్యత: హర్మోన్ల అసమతుల్యత కారణంగా కూడా బరువు పెరుగుతారని మనకు తెలిసిందే. అయితే వాతావరణంలో మార్పులు వచ్చిన కొద్దీ హర్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది బరువు తగే ప్రక్రియను నెమ్మదిస్తుంది. ఆహారపు కోరికలను పెంచుతుంది. దీంతో బరువు పెరుగుతాం. అర్థరాత్రి ఆకలేస్తుంది? శీతాకాలంలో పగటి సమయం కంటే రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. ఈక్రమంలో డిన్నర్ తొందరగా చేయడం, రాత్రి ఎక్కువ సేపు మెలకువ ఉండటం, రాత్రుళ్లు తేలికపాటి ఆహారం తీసుకోవడం..ఇలా కారణాలతో అర్థరాత్రి ఆకలేస్తుంది. అలాంటప్పుడు చాలామంది బిస్కెట్లు, చిప్స్, పాప్ కార్న్, కుకీస్, చాక్లెట్స్ తింటుంటారు. ఈ అలవాటును కొనసాగి్స్తే బరువు పెరగడం ఖాయమంటున్నారు నిపుణులు. వీటికి బదులుగా పండు, పండ్ల రసాలు, నట్స్ , డ్రైఫ్రూట్స్ తినడం మంచిదని చెబుతున్నారు.

ఎప్పుడూ అలసటగా అనిపిస్తుంటుందా..అయితే ఇది తెలుసుకోండి!

అలసట.. చాలాసార్లు అలసట అనేది తీవ్రశారీరక శ్రమ చేసినప్పుడు కలుగుతూ ఉంటుంది. అలసట కారణంగా శరీరమంతా బలహీనంగా ఉంటుంది. ఏ పని మీద ఆసక్తి లేకపోవడం, ఏ పనులు  చేయాలన్నా చిరాగ్గా ఉండటం. బద్దకం వంటి సమస్యలు చుట్టుముడతాయి. చాలామంది అలసటగా ఉన్నవారిని బద్దకిష్టులు అంటూ  ఉంటారు. అయితే అది బద్దకం కాదు.. మనిషి శారీరక స్థితిలో మార్పు.  ముఖ్యంగా శరీరంలోపల హార్మోన్లు, అవయవాల పనితీరులో అసమతుల్యత ఏర్పడటం. దీన్ని గుర్తించి సరిచేసుకోవడానికి ప్రయత్నించాలి. అలసటకు కారణాలు.. అలసటకు ప్రధాన కారణం తప్పుడు ఆహారాలు తీసుకోవడం. ఆహారాల కారణంగా శరీరం ప్రభావితమవుతుంది. సరైన ఆహారాన్ని ఎక్కువరోజులపాటు తీసుకోకుండా దాని స్థానంలో తప్పుడు ఆహారం తీసుకుంటే అది శారీరక బలహీనత, రక్తహీనత వంటి సమస్యలకు కారణం అవుతుంది. దీన్ని పరిష్కరించాలంటే కింది నాలుగు రకాల ఆహారాలు తప్పకుండా తీసుకోవాలి. తృణధాన్యాలు.. దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండే వారి రహస్యం తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం. ఓ ఇరవై ముప్పై ఏళ్ళ కిందట అన్నీ ఆరోగ్యకరమైన పంటలే ఉండేవి. ప్యాక్డ్ ఫుడ్స్, నిల్వ ఆహారాలు వంటివి  అప్పుడు తక్కువ. చాలావరకు చిరుతిళ్ళు కూడా తృణధాన్యాలతోనే చేసేవారు. అందుకే నాటికాలం వారి ఆరోగ్యం బాగుంటుంది. వీటిలో ఫైబర్ ఎక్కువ మొత్తం ఉంటుంది. విటమిన్లు కూడా మెండుగా ఉంటాయి.  శుద్ది చేసిన పిండులు, శుద్ది చేసిన బియ్యం వంటి వాటిని తగ్గించి తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. బ్రౌన్ రైస్, పొట్టు తీయని గోధుమలు, రాగులు, జొన్నలు వంటివి వినియోగించాలి. రంగురంగుల పండ్లు.. పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివనే విషయం తెలిసిందే. పండ్లలో విటమిన్లు,ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఏజింగ్ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్లు పుష్కలంగా ఉంటాయి. పండ్లు రంగురంగులో ఉంటాయి. కంటికి ఇంపుగా కనిపించే ఈ పండ్లు ఆరోగ్యం చేకూరుస్తాయి. అలసటను మంత్రించినట్టు మాయం చేస్తాయి.                                                          *నిశ్శబ్ద.

శీతాకాలంలో పసుపు పాలు తాగితే ఎన్ని బెనిఫిట్సో!

మన ఇంట్లో పెద్దవాళ్లు పసుపు పాలు  తాగమని సలహా ఇస్తుంటారు. ఎందుకంటే పసుపు పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి వినియోగం ఎన్నో తీవ్రమైన వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బయాటిక్, యాంటీ ఆక్సిడెంట్  వంటి అనేక లక్షణాలు ఉన్నాయి. ఇవి తీవ్రమైన వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. అంతేకాదు  రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తుంది. అందువల్ల శీతాకాలంలో పసుపుపాల వినియోగం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. పసుపు పాలు చలికాలంలో మీ శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా, అనేక వ్యాధుల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. పసుపు పాలు తాగడం వల్ల ఏయే వ్యాధులు నయమవుతాయో తెలుసుకుందాం. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి : చలికాలంలో పసుపు పాలు తీసుకోవడం వల్ల మన గుండె ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో..., ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షించడంలో సహాయపడుతుంది. అటువంటి పరిస్థితిలో, ప్రతిరోజూ పసుపు పాలు తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి:  పసుపు పాలు తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. వాస్తవానికి, పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించి బరువును తగ్గిస్తుంది. నొప్పి, వాపు నుండి ఉపశమనాన్ని అందిస్తుంది: పసుపు పాలు తీసుకోవడం వల్ల శీతాకాలంలో కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు..శరీరంలో ఎలాంటి నొప్పి,వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. జలుబు, దగ్గు నుండి ఉపశమనం: పసుపులో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో సహాయపడతాయి. అంతే కాదు, ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని కూడా తగ్గిస్తుంది. శీతాకాలంలో పసుపు పాలు తాగడం వల్ల దగ్గు,  జలుబు సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. జీర్ణవ్యవస్థ చక్కగా ఉంటుంది: పసుపు పాలు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుందని,  గ్యాస్,  ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అంతే కాదు, దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ సమస్య నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.  

ఈ డైట్ ఫాలో అయితే నెలలో 10 కిలోల బరువు తగ్గొచ్చు!

అందరూ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. నేటికాలంలో  చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. పెద్దా చిన్నా అనే తేడా లేకుండా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. యువత కూడా దీని బారిన పడుతున్నారు. 25ఏళ్లకు పొట్టతో ఇబ్బంది పడుతున్నారు. పెళ్లి చేసుకోవాలనుకునేవారు ఈ బరువు ఎలా తగ్గాలో అర్థం కాక రకరకాల డైట్ ఫాలో అవుతుంటారు. అయినా కూడా ఫలితం ఉండదు. అందంగా , ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటాము.  కానీ కొన్నిసార్లు మన శరీర ఆకృతి కారణంగా మనకు ఇష్టమైన దుస్తులను ధరించలేకపోతున్నాము. చెడు జీవనశైలి చర్మం, జుట్టును కూడా దెబ్బతీస్తుంది. బరువు తగ్గాలంటే ఈ డైట్ ఫాలో అవ్వాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం. కలబంద రసం: బరువు తగ్గడానికి ఉదయం 6:30 నుండి 7 గంటల మధ్య కలబంద రసం తాగండి. కలబంద ఆకులను కడిగి, జెల్ తొలగించి, జెల్,  1 గ్లాసు నీటిని మిక్సర్‌లో కలపండి. దీన్ని 4 నుంచి 5 రోజుల వరకు ఉపయోగించేందుకు సీసాలో నిల్వ చేయండి. త్రాగడానికి, ఒక గ్లాసులో మిశ్రమాన్ని కొద్ది మొత్తంలో తీసుకుని, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని జోడించి త్రాగాలి. దీనితో 5 నానబెట్టిన బాదంపప్పులను తినండి. అల్పాహారం కోసం చిక్‌పీస్, అన్నం: ఉదయం 8 నుండి 8:30 వరకు చిక్‌పీస్, అన్నం తినండి. దీనితో మీరు పాలు, చక్కెర,  బెల్లం లేకుండా ఒక కప్పు టోన్ లేదా డబుల్ టోన్ టీని త్రాగవచ్చు. ఈ రుచికరమైన అల్పాహారం ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్ల యొక్క అద్భుతమైన మూలం, ఇది రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. భోజనం కోసం అధిక ప్రోటీన్ సలాడ్: మధ్యాహ్నం 1, 2 గంటల మధ్య అధిక ప్రోటీన్ మొలకెత్తిన సలాడ్ తినండి. 1/4 కప్పు నానబెట్టిన నల్ల చిక్‌పీస్ తీసుకోండి. 1/4 కప్పు మొలకెత్తిన మొత్తం చిక్‌పీస్ తీసుకోండి. తరిగిన టొమాటో, ఉల్లిపాయ, దోసకాయ కూడా జోడించండి. ఉడికించిన బీన్స్ జోడించండి. కొన్ని పచ్చిమిర్చి, కొత్తిమీర వేయాలి. నల్ల ఉప్పు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, నిమ్మరసం కలపండి. రాత్రి భోజనం: సాయంత్రం 6:30 నుండి 7 గంటల మధ్య నెయ్యి, ధాన్యపు సూప్ త్రాగాలి. 1/4 కప్పు నానబెట్టిన పప్పు. నానబెట్టిన మసూర్ పప్పు 1/4 కప్పు తీసుకోండి. 3-4 వెల్లుల్లి రెబ్బలు, కొంత అల్లం జోడించండి. తరిగిన టమోటా జోడించండి. దానికి కాస్త ఉప్పు, పసుపు, నీళ్లు పోసి 3-4 విజిల్స్ వచ్చేవరకు విజిల్ వేయాలి. ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసి మళ్లీ మరిగించి త్రాగాలి. మీరు రుచికి నల్ల మిరియాల పొడి,  నిమ్మరసం జోడించవచ్చు. ఈ నియమాలు కూడా పాటించండి: ప్రతిరోజూ7 నుంచి 8గంటలు నిద్రించేలా చూడండి. రోజంతా 3 నుంచి 3.5 లీటర్ల నీరు తాగండి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. రాత్రి 7గంటలలోపు తినండి.  

ఈ లక్షణాలు కనిపిస్తే విటమిన్-డి లోపమున్నట్టే..

విటమిన్-డి సూర్యరశ్మి నుండి లభించే ముఖ్యమైన విటమిన్. ఇది శరీరంలో కాల్షియం, ఫాస్పేట్ సరైన స్టాయిలో ఉండేలా చేస్తుంది. విటమిన్-సి మాత్రమే కాకుండా విటమిన్-డి కూడా రోగనిరోధక శక్తి బలంగా ఉండేలా చేస్తుంది.  కానీ ఈ చలికాలంలో సూర్యుని వెలుగు సరిగా లేకపోవడం వల్ల చాలామందిలో  విటమిన్-డి  లోపం ఏర్పడుతుంది.  సాధారణంగా విటమిన్స్ లోపాన్ని చాలామంది గుర్తించలేరు. కానీ వివిధ రకాల అసౌకర్యాలు మాత్రం ఎదుర్కొంటూ ఉంటారు. విటమిన్-డి లోపాన్ని గుర్తించడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. వాటిని గమనించుకుని  విటమిన్ లోపాన్ని భర్తీ చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండచ్చు. విటమిన్-డి లోపం లక్షణాలు..  మూడ్ స్వింగ్స్.. డిప్రెషన్.. విటమిన్-డి లోపం ఉంటే గనుక మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ వంటి సమస్యలు మెండుగా ఉంటాయి. ఎప్పుడూ ఇంట్లో ఉండేవారికి, ఉదయం నుండి రాత్రి వరకు గదులలోనే నుండి పనిచేసుకునేవారికి ఈ సమస్యలు అధికంగా ఉంటుంటాయి. ఈ విటమిన్-డి లోపం శరీరంలో హార్మోన్లను కూడా ప్రభావితం చేస్తుంది. ఫలితంగా మానసిక సమస్యలకు కారణమవుతుంది. విటమిన్-డి లోపం వల్ల సెరోటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కాదు. ఈ హార్మోన్ తగినంత ఉత్పత్తి కాకపోతే అది మానసిక కల్లోలానికి, నిరాశ, నీరసం వంటి సమస్యలకు కారణం అవుతుంది. జుట్టు రాలడం.. చాలామంది ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నా జుట్టు ఎందుకు రాలుతోందని తికమకపడుతుంటారు. అయితే విటమిన్-డి లోపం కూడా జుట్టు రాలడానికి కారణం అవుతుంది. విటమిన్-డి  లోపం వల్ల చాలామందిలో అలోపేసియా అరేటా వ్యాధి ప్రమాదం పెరుగుతుంది. ఇగి తల, శరీరం మీద వెంట్రుకలను ప్రభావితం చేసే వ్యాధి. తలమీద వెంట్రుకలు వేగంగా రాలిపోయి బట్టతల రావడానికి ఈ వ్యాధే  కారణం. విటమిన్-డి లోపిస్తే జుట్టు బలహీనంగా, సున్నితంగా మారిపోయి బాగా రాలిపోతుంది. ఎముకల నొప్పి.. ఎముకలకు కాల్షియమే ప్రధాన వనరు అనే విషయం తెలిసిందే. అయితే విటమిన్-డి లోపం కూడా ఎముకల నొప్పికి ప్రధాన కారణమవుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కాల్షియం నిల్వచేయడంలో, ఎముకలను బలంగా ఉంచడంలో విటమిన్-డి ఖచ్చితంగా అవసరం.  విటమిన్-డి లోపిస్తే ఎముకలకు కాల్షియం అందకుండా పోతుంది. ఫలితంగా ఎముకలు, కండరాల నొప్పి, ఎముకల బలహీనత వంటి సమస్యలు వస్తాయి. చలికాలంలో ఎముకల సమస్యలు వేధిస్తుంటే దాన్ని విటమిన్-డి లోపంగా గుర్తించాలి. చర్మం పొడిబారడం.. విటమిన్-డి లోపం ఉంటే చర్మం పొడిబారుతుంది. చాలామందికి పొడిచర్మంతో పాటు దద్దుర్లు, మంటలు కనిపిస్తాయి. మరికొందరికి చర్మం ఎర్రగా మారి కొన్నిసార్లు రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది. కొసమెరుపు ఏంటంటే విటమిన్-డి భర్తీ అయ్యే వరకు ఈ సమస్యలు పదే పదే వేధిస్తూనే ఉంటాయి. తామర, సొరియాసిస్.. విటమిన్-డి లోపం చర్మ ఆరోగ్య విషయంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. పైన చెప్పుకున్నట్టు చర్మం పొడిబారడం, దద్దుర్లు, మంటలు వంటి సమస్యలతో పాటు తామర, సొరియాసిస్ వంటి చర్మ సంబంధ రుగ్మతలకు కూడా కారణం అవుతుంది.  తామర ఉంటే శరీరంలో ఏదైనా భాగంలో కాసింత పెద్దగా వృత్తాకారంలో ఎరుపురంగులో దద్దుర్లు రావడంతో మొదలై అది కస్తా తీవ్రరూపం దాల్చి కురుపులా మారుతుంది. పై లక్షణాలు ఎవరిలో అయినా కనిపిస్తే.. అవి ధీర్ఘకాలం కొనసాగితే అవన్నీ విటమిన్-డి లోపం లక్షణాలని గుర్తించి లోపాన్ని భర్తీ చేసుకోవాలి.                                                  *నిశ్శబ్ద

శీతాకాలంలో   ఏ నువ్వులు మంచివి? నల్లవా లేక తెల్లవ

శీతాకాలం ఉష్ణోగ్రతలలో చాలా మార్పు తెలుస్తుంది. ఇది శరీరాల మీద ప్రభావం చూపిస్తుంది. శీతాకాలంలో నువ్వులు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. నువ్వులు వేడి స్వభావం కలిగి ఉంటాయి. వీటిని శీతాకాలంలో తినడం వల్ల శరీరంలో వేడి పుట్టి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చలికాలపు అనారోగ్యాలను ఎదుర్కొనే విధంగా శరీరాన్ని ధృడంగా ఉంచుతాయి. నువ్వులలో రెండు రకాలున్నాయనే విషయం అందరికీ తెలిసిందే.. ఈ  రెండూ ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ  రెండింటిలో ఒకటి ఎక్కువ ఆరోగ్యప్రయోజనాలను, మరొకటి తక్కువ ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. నలుపు, తెలుపు  నువ్వులలో ఏవి ఆరోగ్యానికి ఎక్కువ మంచివి? వేటి వల్ల ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి? పూర్తీగా తెలుసుకుంటే.. ఏవి మంచివి? నలుపు, తెలుపు నువ్వులు రెండూ ఆరోగ్యానికి మంచివే.  అయినప్పటికీ తెల్లనువ్వుల కంటే నల్ల నువ్వులలో ఎక్కువ పోషకాలు ఉంటాయి.  వీటిలో అధిక మొత్తంలో కాల్షియం ఉంటుంది. కాబట్టి శీతాకాలంలో నల్ల నువ్వుల లడ్డూలు లేదా నువ్వుల చిక్కీలు తినడం మంచిది. వీటిని రోజూ తినడం వల్ల ఎముకల ఆరోగ్యం బలపడుతుంది. నల్ల నువ్వులు వగరుగా, క్రంచీగా ఉంటాయి. అయితే తెల్ల నువ్వులు మెత్తగా, తీపిగా తేలికపాటి రుచి కలిగి ఉంటాయి. నల్ల నువ్వులలో పోషకాలు ఎక్కువ ఎందుకంటే.. తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. నల్లనువ్వులలో ఒమెగా-3 ప్యాటీ యాసిడ్ లు తెల్లనువ్వులలో కంటే ఎక్కువ. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.  నల్ల నువ్వులలో ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, ఇనుము, రాగి, మెగ్నీషియం,  పాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా తెల్లనువ్వుల కంటే  పుష్కలంగా ఉంటాయి. వీటన్నింటికి కారణం నల్ల నువ్వుల మీద పొట్టు తీయకపోవడమే.  నల్లనువ్వులను పొట్టు తీసే క్రమంలో పోషకాలు లాస్ అవుతాయి. శీతాకాలంలో ప్రాముఖ్యత ఎందుకంటే.. శీతాకాలంలో నల్ల నువ్వులు తినమని చెబుతారు. ఎందుకంటే పైన చెప్పుకున్నట్టు వీటిలో వేడి గుణం ఉంటుంది. వీటని రోజూ ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది. వేడి శరీరం ఉన్నవారు డైలీ అరటీస్పూన్ వేయించిన నల్లనువ్వులను, ఇతర శరీర తత్వం ఉన్నవారు టేబుల్ స్పూన్ నల్లనువ్వులను తీసుకోవచ్చు. లేదంటే లడ్డూ చేసుకుని అయినా తినవచ్చు. సలాడ్ లలోనూ, వంటకాల్లోనూ ఉపయోగించవచ్చు. వీటిలో పైబర్, ఐరన్, ఫాస్పరస్, కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల వీటిని డైలీ ఆహారంలో తీసుకుంటే ఐరన్ లోపం, కాల్షియం లోపం ఏర్పడదు. మలబద్దకం సమస్య పరిష్కారమవుతుంది. రక్తపోటు మెరుగవుతుంది. రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.  అయితే నువ్వులు  వేడి చేస్తాయి కాబట్టి నీరు కూడా బాగా తాగితే వేడి సమస్య వేధించదు.                                                         *నిశ్శబ్ద.

ఎండుద్రాక్ష నానబెట్టి తినమని చెప్పేది ఇందుకే!

ఎండుద్రాక్ష సాధారణంగా పాయసం, స్వీట్ల తయారీలో ఉపయోగిస్తారు. కొన్నిచోట్ల వంటకాలలోనూ, స్పైసీ స్నాక్స్ లో కూడా వీటిని జత చేస్తుంటారు. అయితే ఎండుద్రాక్షను నానబెట్టి తినమని అమ్మమ్మల మొదలు అమ్మలు కూడా చెబుతూనే ఉంటారు. ముఖ్యంగా మహిళలు ఎండుద్రాక్ష నానబెట్టుకుని తినడం వల్ల చాలా ఆరోగ్యమని అంటారు.  ఎండుద్రాక్షను నానబెట్టి ప్రతిరోజూ తింటే  కలిగే అద్భుత ఫలితాలు ఇవే.. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.. రాత్రంతా నీటిలో నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం   గుండెకు చాలా మంచిది.  నానబెట్టన ఎండు ద్రాక్ష  శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి  మంచి కొలెస్ట్రాల్ ను  ప్రోత్సహిస్తుంది . ఇది  ధమనులలో ఏర్పడే  ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వీటిని తినడం వల్ల ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి ఇది స్ట్రోక్,  గుండె జబ్బుల నుండి  రక్షించడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.. యాంటీ ఆక్సిడెంట్లు  శరీరంలో ఫ్రీ రాడికల్స్ డ్యామేజీని తగ్గిస్తాయి. ఎండుద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని నీటిలో నానబెట్టి తినడం వల్ల అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు త్వరగా విడుదలవుతాయి. యాంటీ-ఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుండి  రక్షించడంలో సహాయపడతాయి. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.. ఎండు ద్రాక్ష  బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఎండుద్రాక్ష తినడం వల్ల  చాలా శక్తి లభిస్తుంది, దీని వల్ల  పదే పదే ఆకలి అనిపించదు.   ఆహారం ఎక్కువగా తినాలనే  కోరికలు కూడా తగ్గుతాయి. ఆహారం నియంత్రణ కారణంగా  బరువు పెరిగే అవకాశాలు తగ్గుతాయి.  తద్వారా  బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. రక్తపోటును నిర్వహిస్తుంది.. ఎండుద్రాక్షలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది రక్త నాళాలు గట్టిపడకుండా నిరోధిస్తుంది. దీని కారణంగా రక్తపోటు ఎక్కువగా ఉండదు. ఒకవేళ రక్తపోటు ఎక్కవగా ఉంటే దాని ప్రభావం తగ్గిస్తుంది.  అంతేకాకుండా ఇందులో పొటాషియం కూడా ఉంటుంది, ఇది అధిక రక్తపోటును కూడా నివారిస్తుంది. కాబట్టి రాత్రంతా నీటిలో నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల  రక్తపోటు అదుపులో ఉంటుంది. జీర్ణక్రియకు ప్రయోజనకరం.. ఆహారం జీర్ణం కావడానికి,  మలబద్ధకం నుండి ఉపశమనం పొందడానికి ఫైబర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎండుద్రాక్షలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల  పేగు ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ప్రేగులలో ఆహారాన్ని తరలించడంలో సహాయపడుతుంది, ఇది ఉబ్బరం,  మలబద్ధకాన్ని నివారిస్తుంది. కాలేయానికి మంచిది.. బయోఫ్లావనాయిడ్స్ ఎండుద్రాక్షలో ఉంటాయి. ఇవి  రక్తం,  కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడతాయి . యాంటీ-ఆక్సిడెంట్లు  కూడా ఎండుద్రాక్షలో పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కాలేయానికి మేలు చేస్తాయి. శరీరం నుండి విషాన్ని తొలగించడానికి ఆరోగ్యకరమైన కాలేయాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం. అందువల్ల ప్రతిరోజూ రాత్రిపూట ఎండుద్రాక్షలను నీటిలో నానబెట్టి తినడం  కాలేయానికి ప్రయోజనకరంగా ఉంటుంది.                                                     *నిశ్శబ్ద.

వీటిని పచ్చిగా తింటే ఆసుపత్రి పాలవ్వడం పక్కా..!

 తాజాకూరగాయలు,  పండ్లు మనకు ముఖ్యమైనవి. కానీ కొన్నింటిని పచ్చిగా తినే ముందు, మీరు మీ ఆరోగ్య పరిస్థితిపై కూడా శ్రద్ధ వహించాలి. గ్యాస్, అసిడిటీ, కాలేయ వ్యాధి లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ కారణంగా వెంటనే అనారోగ్యానికి గురైన వ్యక్తులు పచ్చిగా తినకూడదు.  అయితే ఆరోగ్యకరమైన వ్యక్తి కూడా పచ్చిగా తినకుండా ఉండవలసిన కొన్ని పచ్చి పదార్థాల గురించి తెలుసుకుందాం. మనలో చాలా మంది కొన్ని పదార్థాలను పచ్చిగా తింటారు, ఎందుకంటే ఇది ఎక్కువ విటమిన్లు, ఖనిజాలు, యు రఫ్‌గేజ్‌ని అందిస్తుంది. శరీరం దాని నుండి ప్రయోజనం పొందుతుంది, కానీ ఇది ఎల్లప్పుడూ సరైనది కాదు. కొన్ని కూరగాయలలో సహజమైన టాక్సిన్స్,  జీర్ణం కావడం కష్టతరమైన చక్కెరలు ఉంటాయి, ఇవి గ్యాస్ట్రోనామికల్ వ్యాధుల నుండి ఫుడ్ పాయిజనింగ్ వరకు అన్నింటినీ కలిగిస్తాయి. మీరు కూరగాయలు,  పండ్ల క్లీనర్‌లో ఆహారాన్ని కడిగినప్పటికీ, ఇది పండ్లు,  కూరగాయలపై పురుగుమందులు,  కలుషితాలను తొలగిస్తుంది, అవి పచ్చిగా తినడానికి అనుకూలమైనవి కావు. బంగాళాదుంప: పచ్చి బంగాళాదుంపలు చెడు రుచిని మాత్రమే కాకుండా జీర్ణ సమస్యలను కూడా కలిగిస్తాయి. పచ్చి బంగాళాదుంప పిండి ఉబ్బరం,  గ్యాస్‌కు కారణమవుతుంది. ఏ రకమైన గ్యాస్ట్రోనమికల్ సమస్యను నివారించడానికి, బంగాళాదుంపలను తినడానికి ముందు కాల్చడం, వేయించడం లేదా ఉడకబెట్టడం మంచిది. ఆకు కూరలు: క్యాబేజీ కుటుంబానికి చెందిన కాలీఫ్లవర్, బ్రస్సెల్స్, బ్రోకలీ, మొలకలు వంటి కూరగాయలను ఎప్పుడూ పచ్చిగా తినకూడదు. ఈ కూరగాయలలో చక్కెర ఉంటుంది, ఇది జీర్ణం కావడం కష్టం. ఈ కూరగాయలను పచ్చిగా తినడం వల్ల అనేక గ్యాస్ట్రోనమికల్ సమస్యలు వస్తాయి. పుట్టగొడుగులు: పచ్చి పుట్టగొడుగులను తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం పెరుగుతుంది. అలాగే దీన్ని ఉడికించి తింటే మరిన్ని పోషకాలు లభిస్తాయి. పచ్చి పుట్టగొడుగుల కంటే కాల్చిన లేదా కాల్చిన పుట్టగొడుగులలో ఎక్కువ పొటాషియం ఉంటుంది. మీకు ఇష్టమైన ఆహారానికి ఆరోగ్యకరమైన రుచిని అందించడానికి మీరు పాస్తా లేదా పిజ్జాలో వేయించిన పుట్టగొడుగులను జోడించవచ్చు. మాంసం: పచ్చి లేదా ఉడకని మాంసం, చికెన్,  టర్కీ తినడం చాలా ప్రమాదకరం. చాలా పచ్చి చికెన్‌లో క్యాంపిలోబాక్టర్ ఉంటుంది. ఇది సాల్మోనెల్లా, క్లోస్ట్రిడియం పెర్ఫ్రింజెన్స్,  ఇతర బ్యాక్టీరియాను కూడా కలిగి ఉండవచ్చు, ఇది తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. ఎర్రటి కిడ్నీ బీన్స్: పచ్చి లేదా తక్కువగా ఉడికించిన బీన్స్‌లో పెద్ద మొత్తంలో టాక్సిన్, గ్లైకోప్రొటీన్ లెక్టిన్ ఉంటాయి, ఇది తిన్న కొన్ని గంటల్లోనే వికారం, వాంతులు,  విరేచనాలు వంటి సమస్యలను కలిగిస్తుంది. లక్షణాల తీవ్రత కూడా తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది.    

కార్తీకమాసంలో పొరపాటున కూడా ఈ ఆహారాలు తినకండి..

ఋతుచక్రాన్ని అనుసరించి కాలం మారుతుంది. ప్రకృతిలో కూడా మార్పు వస్తుంది. దేవీనవరాత్రులతో శరత్కకాలం మొదలవుతుంది కాబట్టి కార్తీకమాసంలో చలి ఉంటుంది.  ఈ మాసంలో కొన్ని ఆహారాలు తినకూడదని  శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే వీటని చాదస్తం అని, మూఢనమ్మకాలు అని కొందరు తేలికగా కొట్టిపడేస్తారు. కానీ ఆయుర్వేదం కార్తీక మాసంలో అస్సలు తినకూడని పదార్థాలేవో శాస్త్రీయ ఆధారాలతో సహా చెప్పింది. వీటిని వాతావరణ మార్పుల ఆధారంగా నిర్ణయించినట్టు ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కార్తీకమాసంలో అస్సలు తినకూడని ఆహారాలేంటో తెలుసుకుంటే..   మాంసాహారానికి దూరం ఉండాలి.. శ్రావణ మాసం, కార్తీకం, మాఘమాసం ఇలా పుణ్యప్రదమైన మాసాలు రాగానే మాంసాహారం తినకూడదు అనే నియమాలు పాటిస్తారు చాలా మంది. అయితే నేటికాలంలో హిందూ విశ్వాసాలను హేళన చేసేవారు తింటే ఏమవుతుంది? అని వితండవాదం చేస్తారు. ఆయుర్వేదం ఆహారాన్ని వివిధరకాలుగా  పేర్కొంది. వాటిలో మాంసాహారం తినడాన్ని భూత ఆహారం అని అంటారు. పుణ్యం సంపాదించుకోవాల్సిన కాలంలో భూత ఆహారం తినడం మహా పాపం అని పురాణం చెబితే.. శాస్త్రప్రకారం మాత్రం ఈ మాసంలో జంతువులలో పునరుత్పత్తి ప్రక్రియ జరుగుతుంది.  ఇలాంటి సమయంలో జంతువులను వధించి వాటి మాంసాన్ని తింటే వాటి పునరుత్పత్తి ప్రక్రియకు  నష్టం కలిగించినట్టే కాకుండా వాటి మాంసాన్ని తింటే బోలెడు రోగాలు కూడా వచ్చే ఆవకాశం ఉంటుంది.  ఈ మాసంలో జీర్ణవ్యవస్థ కాస్త నెమ్మదిగా ఉంటుంది. మాంసాహారం తింటే ఈ జీర్ణవ్యవస్థ మరింత బలహీనపడుతుంది. అందుకే కార్తీకమాసంలో మాంసాహారం అస్సలు తినకూడదు. చల్లనీరు తాగకూడదు.. కొందరికి చల్లనీరు తాగడం అలవాటు అయిపోయి ఉంటుంది. కానీ ఈకాలంలో పొరపాటున కూడా చల్లనీరు తాగకూడదని ఆయుర్వేదం చెబుతోంది. చల్లనీరు, చల్లని పదార్థాలు తీసుకోవడం వల్ల తొందరగా జలుబు, దగ్గు, శ్వాససంబంధ సమస్యలు వస్తాయి. మరీ ముఖ్యంగా ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలున్నవారు చల్లని పదార్థాల జోలికి అస్సలు వెళ్లకూడదు. చల్లనివాతావరణంలో ఎక్కువ సేపు ఉండటం కూడా మంచిది కాదు. ఈ పప్పులు అస్సలు వద్దు.. వంటలలో ఎక్కువగా ఉపయోగించే పప్పు ధాన్యాలలో కందిపప్పు, శనగపప్పు ముఖ్యమైనవి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో వీటిని ఎక్కువ వాడుతుంటారు. కానీ కార్తీకమాసంలో ఈ రెండు పప్పు ధాన్యాలు అస్సలు వాడకపోవడం మంచిది. ఇవి సహజంగానే వాతగుణం ఎక్కువగా కలిగి ఉంటాయి. ఇవి జీర్ణసంబంధ సమస్యలు, కడుపుకు సంబంధించిన అనారోగ్యాలు కలిగిస్తాయి. కాకరకాయ  వద్దే వద్దు.. కాకరకాయ మధుమేహం ఉన్నవారికి చాలా మంచిది. మాములుగా కూడా కాకరకాయను తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే కాకరకాయను కార్తీకమాసంలో నిషేధించమని  ఆయుర్వేదం చెబుతోంది. కార్తీకమాసంలో కాకరకాయలు తొందరగా పండిపోతాయి.   కాకర గింజల్లో ఉండే బ్యాక్టీరియా ఈ కాలంలో చాలా అభివృద్ది చెందుతుంది. వీటిని తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ కావడంతో పాటు అనేక ఇతర సమస్యలు కూడా ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే పొరపాటున కూడా కార్తీకమాసంలో కాకరకాయ తినొద్దని అంటున్నారు.                                         *నిశ్శబ్ద.

దీపావళిలో ఎక్కువగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు ఇవే..

  దీపావళి దేశం యావత్తు సంతోషంగా జరుపుకునే పండుగ. ఈ పండుగ సమయంలో పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తుంటారు. ఒకప్పటికంటే ఇప్పుడు బాణసంచా కూడా అప్డేట్ అయ్యాయి. కేవలం బాణసంచా మాత్రమే కాదు,  ప్రతి ఇంట్లో స్వీట్లు, పిండివంటలు ఘుమఘుమలాడిపోతాయి. ఒకవైపు పటాసుల మోత, మరొకవైపు వంటల పరిమళాలు  మనసును నిలువనీయవు. అయితే ఈ పండుగ కారణంగా  బరువు పెరగడం, రక్తపోటు, మధుమేహం ఉన్నవారిలో చక్కెర స్థాయిలు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. వీటి నియంత్రణ ఎవరి చేతుల్లో వారిదే. కాబట్టి వీటి గురించి పెద్దగా భయపడాల్సిన పనిలేదు. కానీ పటాసుల పొగ కారణంగా కళ్లు, శ్వాసక్రియ మొదలైన వాటికి పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉంటుంది. దీపావళి సందర్భంగా కళ్ళు, శ్వాస క్రియ  విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలేమిటో తెలుసుకుంటే..  బాణసంచా కాల్చేటప్పుడు వాటి నుండి వెలువడే స్పార్క్స్ లేదా పొగ నుండి  కళ్లను రక్షించుకోవడానికి రక్షిత గాగుల్స్ ధరించడం చాలా ముఖ్యం . ఈ సాధారణ   గాగుల్స్  ఎగిరే నిప్పురవ్వలు, బాణసంచా తాలుకూ అవశేషాలు,  బాణసంచాలో ఉపయోగించే రసాయనాల నుండి  కళ్ళను రక్షిస్తాయి. అందుకే దీపావళి సమయంలో గాగుల్స్  ధరించడం వల్ల ఇలాంటి సమస్యలను చాలా వరకు నివారించవచ్చు.  బాణసంచా కాల్చేటప్పుడు సేప్ గా ఉండాలంటే  నిర్ణీత  దూరం పాటించడం అవసరం. పేలుడు సంభవించే  బాణసంచా, నిప్పురవ్వలు ఎగజిమ్మే చిచ్చుబుడ్లు, కాకరవొత్తులు, పటాసులు  కంటికి గాయం కలిగించే ప్రకాశవంతమైన కాంతిని,  మంటలను ఎగజిమ్ముతాయి. ఇలాంటి వాటిని  ఉపయోగించేటప్పుడు  వాటిని దూరం నుండి వెలిగించాలి. బాణసంచాలో గన్‌పౌడర్‌తోపాటు అనేక రకాల రసాయనాలు ఉంటాయి.  వాటిని తాకిన తర్వాత పొరపాటున కూడా ఆ చేతులతో కళ్లను తాకరాదు.  కళ్లకు తగిలితే తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల, బాణాసంచా తాకడం లేదా కాల్చిన తర్వాత,  ముఖం లేదా కళ్లను తాకడానికి ముందు  చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. చేతులకు అంటిన పటాసుల తాలూకు  అవశేష రసాయనాలు కంటి చికాకు కలిగించవచ్చు. పటాసులు కాల్చేటప్పుడు కంటి సంరక్షణే కాదు ప్రాణానికి ముఖ్యమైన శ్వాసక్రియ పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ పొగను వెలువరిచే బాణసంచాకు దూరంగా ఉండాలి. అలాంటివి కాలుస్తున్నప్పుడు వీలైనంత దూరం వెళ్ళాలి.  పటాసులు కాల్చేటప్పుడు మరచిపోకుండా  మాస్క్ పెట్టుకోవాలి.  ఆస్తమా, శ్వాస సంబంధ సమస్యలు ఇదివరకే ఉన్నవారు  ఇన్ హెలర్ ను వెంట ఉంచుకోవాలి.  పటాసులు కాల్చేటప్పుడు పెద్ద మొత్తంలో ఒకేసారి పటాసులు పేల్చకుండా గ్యాప్ తీసుకోవాలి. పోటీ పెట్టుకుని అందరూ ఒకేసారి కాల్చడాన్ని నివారించాలి. ఇంకొక విషయం ఏమిటంటే ఇప్పట్లో ఏ పని చేస్తున్నా దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుని సంబంరపడాలని అనుకునేవారు చాలా ఎక్కువ. పటాసులు కాలుస్తూ వీడియోలు, సెల్పీలు తీసుకుంటూ పటాసులను నిర్లక్ష్యం చేయకూడదు. పరిసరాల మీద స్పృహ ఉండాలి.  చిన్నపిల్లలతో పటాసులు కాల్పించేటప్పుడు పెద్దలు దగ్గరే ఉండాలి.                                                      *నిశ్శబ్ద.

దీపావళికి ఈ షుగర్ ఫ్రీ స్వీట్స్ తినండి.

దీపావళికి షుగర్ మిఠాయిలు తినకుండా ఇంట్లోనే ఈ షుగర్ ఫ్రీ స్వీట్‌లను తయారు చేసి ఆరోగ్యంగా ఉండండి. ఖర్జూర లడ్డూలు: ఖర్జూరం సహజ స్వీటెనర్. డ్రై ఫ్రూట్స్,  నెయ్యితో తయారు చేసిన ఈ లడ్డూలు షుగర్ పేషంట్లు మంచి ఎంపిక. మధుమేహ వ్యాధిగ్రస్తులు, బరువు తగ్గాలనుకునే వారు దీనిని తినవచ్చు. ఫ్రూట్ చాట్: వివిధ తాజా పండ్లు, చాట్ మసాలాతో చేసిన ఫ్రూట్ చాట్ ఒక సంతోషకరమైన ఎంపిక. చక్కెర అవసరాన్ని తొలగిస్తుంది. ఈ డెజర్ట్ డయాబెటిస్ ఫ్రెండ్లీ మాత్రమే కాదు, బరువు చూసేవారికి కూడా గొప్ప ఎంపిక. బాదం పాలతో తక్కువ కార్బ్ పాయాసం: దీపావళి సమయంలో పాయసం ఒక ప్రసిద్ధ తీపి వంటకం. అధిక కేలరీల ఆహారాలను ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలతో భర్తీ చేయండి. కేలరీలను తగ్గించడానికి సాధారణ పాలకు బదులుగా బాదం పాలను ఉపయోగించండి. డ్రై ఫ్రూట్‌లను జోడించడం వల్ల డెజర్ట్ యొక్క పోషక విలువను పెంచుతుంది. షుగర్ ఫ్రీ గులాబ్ జామూన్: చక్కెర స్థానంలో ఖర్జూరం వంటి సహజమైన స్వీటెనర్‌లతో గులాబ్ జామూన్‌ను ఆరోగ్యకరమైన రీతిలో తయారు చేసుకోవచ్చు. ఫైబర్,  అవసరమైన పోషకాలతో సమృద్ధిగా ఉన్న దీనిని మధుమేహ వ్యాధిగ్రస్తులు, బరువు తగ్గించే ఆహారంలో ఉన్నవారు తినవచ్చు. గోధుమ బెల్లం కేక్: గోధుమ పిండి, బెల్లంతో తయారు చేసిన కేక్ షుగర్ పేషంట్లకు మేలు చేస్తుంది.  ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికతో సహజ స్వీటెనర్. రక్తంలో చక్కెర స్థాయిలు, కేలరీల తీసుకోవడం నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారికి ఇది చాలా మంచిది.  

గ్రీన్ టీ బరువు తగ్గడానికే కాదు..ఈ సమస్యలకు చెక్ పెడుతుంది!

 బరువు తగ్గడానికి చాలా మంది గ్రీన్ టీ తాగుతుంటారు. అయితే గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యానికి కూడా అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ బి5, పాలీఫినాల్, మాంగనీస్, పొటాషియం, కాపర్, ఐరన్, ఆక్సిడెంట్లు వంటి పోషకాలు గ్రీన్ టీలో లభిస్తాయి.  ఇది మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే, ఒక రోజులో గ్రీన్ టీ ఎంత తాగాలి అనే ప్రశ్న కూడా ప్రజల మదిలో మెదులుతోంది.  కాబట్టి రోజుకు ఎంత గ్రీన్ టీ తాగాలో ఇప్పుడు చూద్దాం. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి: మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే.. మీరు వెంటనే అనారోగ్యానికి గురైనట్లయితే, ఖచ్చితంగా గ్రీన్ టీని తాగండి. గ్రీన్ టీ మీ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. దీనివల్ల మీరు సులభంగా ఏ వ్యాధి బారిన పడరు. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ పాలీఫెనాల్స్ శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచడానికి పని చేస్తాయి. బరువు కోల్పోతారు: గ్రీన్ టీలో పాలీఫెనాల్ ఉంటుంది, ఇది శరీర జీవక్రియను బలపరుస్తుంది. ఇందులో కొవ్వు, పిండి పదార్థాలు ఉండవు. ఇప్పటికే ఏర్పడిన కొవ్వును తగ్గించడానికి గ్రీన్ టీ పని చేయదు కానీ కొవ్వు ఏర్పడకుండా నిరోధించడానికి ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తాయి: గ్రీన్ టీలో ఉండే పాలీఫెనాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తుంది. మీరు చాలా ఒత్తిడికి లోనవుతున్నట్లయితే, మీరు ఈ టీని తీసుకోవాలి. రోజూ గ్రీన్ టీ తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడితో పాటు శారీరక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. బీపీకి, గుండెకు మేలు చేస్తుంది: గ్రీన్ టీ చెడు కొలెస్ట్రాల్‌ను అదుపు చేయడంతోపాటు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది.దీనిని రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా మీ బీపీని తగ్గించుకోవచ్చు. అలాగే హార్ట్ స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది. రోజుకు ఎన్నిసార్లు తాగాలి : మీకు ఎలాంటి వ్యాధి లేకుంటే, మీరు రోజుకు 2 నుండి 3 కప్పుల గ్రీన్ టీని తీసుకోవచ్చు. కానీ మీరు డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడుతున్నట్లయితే, మీరు గ్రీన్ టీని తీసుకునే ముందు ఒకసారి మీ వైద్యుడిని సంప్రదించాలి.  

జ్ఞాపకశక్తికి సూపర్ ఫుడ్స్.. ఇవి తిన్నారంటే బ్రెయిన్ పవర్ మాములుగా ఉండదు..

ఆహారమే ఆరోగ్యం అనే మాట చాలాసార్లు వినే ఉంటారు. అయితే శరీరంలో ఒక్కో అవయవానికి ఒక్కో రకమైన పోషకాలు, విటమిన్లు అవసరం అవుతాయి. ఆయా విటమిన్లు తీసుకుంటేనే ఆయా భాగాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. శరీరంలో ప్రతి అవయం పనితీరు మెదడు మీదనే ఆధారపడి ఉంటుంది. మెదడు సరిగా పనిచేయకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మెదడు పనితీరు మందగిస్తే జ్ఞాపకశక్తి తగ్గుతుంది. చాలావరకు జ్ఞాపకశక్తి తగ్గడం అనేది వయసు పైబడిన వారిలోనే కనిపిస్తుంది. కానీ కొందరిలో మాత్రం చిన్నవయసులోనే జ్ఞాపకశక్తి లోపిస్తుంటుంది. కానీ మెదడుకు శక్తిని ఇచ్చే ఆహారాలు కొన్ని ఉన్నాయి. వాటిని తింటే బ్రెయిన్ సూపర్ ఫాస్ట్ గా పనిచేస్తుంది. తృణధాన్యాలు.. శనగలు, ఓట్స్, పెసలు, మిల్లెట్స్ మొదలైన తృణధాన్యాలు  తీసుకోవాలి.  వీటిలో ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇవి మెదడుకు మేలు చేస్తాయి. వీటిలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. చేపలు.. సాల్మన్, సార్డినెస్ లేదా ట్యూనా వంటి  చేపలను వారానికి ఒకసారి తినాలి. వీటిలో అధిక మొత్తంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది విటమిన్ డి,  ఇతర ఖనిజాలను భర్తీ చేస్తాయి.  ఇది  మెదడుకు అలాగే మొత్తం ఆరోగ్యానికి మంచిది. బీన్స్.. బీన్స్, కాయధాన్యాలు,  సోయాబీన్స్ మెదడుకు  కావల్సిన  ఆహారంలో ప్రముఖమైనవి.  ఎందుకంటే అవి అధిక మొత్తంలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు,  ఖనిజాలను కలిగి ఉంటాయి. వారానికి కనీసం నాలుగు సార్లు వాటిని తినాలి. చికెన్ మెడిటరేనియన్,  DASH డైట్‌లతో రూపొందించబడిన మైండ్ డైట్‌ని అనుసరిస్తుంటే వారానికి రెండుసార్లు చికెన్ తినమని సలహా ఇస్తారు. చికెన్ లో  అధిక ప్రోటీన్, విటమిన్లు,  ఖనిజాల  ఉంటాయి. పచ్చని ఆకుకూరలు.. పచ్చని ఆకు కూరలు ప్రతి వారం 6 సార్లు కంటే ఎక్కువగా తినడం మెదడుకు అలాగే  ఆరోగ్యానికి రెండింటికీ మేలు చేస్తుంది. ఇందులో బచ్చలికూర, బ్రోకలీ, పాలకర, ఆకుకూరలు, పొట్లకాయ,  మెంతులు మొదలైన కూరగాయలు ప్రముఖమైనవి. బెర్రీలు బెర్రీలు కొన్నిప్రాంతాలలో మాత్రమే లభ్యమవుతాయి. పైగా ఇవి ఖరీదైనవి. కానీ వారానికి రెండుసార్లు బెర్రీలు తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్,  బ్లాక్బెర్రీస్ వంటి బెర్రీలు  మెదడు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఇందులో ఉండే ప్రత్యేక యాంటీ ఆక్సిడెంట్లు మెదడు సామర్థ్యాన్ని పెంచుతాయి. గింజలు  గింజలను తీసుకోవడం  మెదడు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.   ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు  యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక రకాల పోషకాలను కలిగి ఉంటాయి. వారానికి 5 లేదా అంతకంటే ఎక్కువ సార్లు నట్స్ తినాలి. వీటి వినియోగం మెదడును చాలా షార్ప్ గా మారుస్తుంది.                                                     *నిశ్శబ్ద.

ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు గొంతు నొప్పి, వాపు, కఫం అన్ని మటాష్!

  చలికాలం వచ్చిందంటే చాలారకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వాటిలో ఎక్కువగా  గొంతు, ముక్కు, చెవి సమస్యలే అధికం. ఈ మూడు ఒకదానికొకటి అనుబంధంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా గొంతుకు సంబంధించిన సమస్యలు చాలావరకు చాలా ఇబ్బంది పెడతాయి. తినాలన్నా, తాగాలన్నా, మాట్లాడాలన్నా చెప్పలేనంత ఇబ్బంది ఉంటుంది.  గొంతు నొప్పి, గొంతు పట్టేయడం, గొంతులో పేరుకుపోయిన కఫం మొదలైన సమస్యలనను ఇంటివద్దే సింపుల్ చిట్కాలతో తగ్గించేసుకోవచ్చు. చాలా తొందరగా రిలీఫ్ ఇచ్చే ఈ చిట్కాల గురించి తెలుసుకుంటే.. హెర్బల్ టీ.. గొంతు నొప్పి ఇబ్బంది పెడుతుంటే దానికి హెర్బల్ టీ చక్కని ఉపశమనాన్ని ఇస్తుంది.  ఇందుకోసం చమోమిలే టీ, అల్లం, పిప్పరమెంటు, అతిమధురం వేర్లు వంటి పదార్థాలలో హెర్బల్ టీ చేసుకుని తాగాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గొంతుకు చురుకుదనాన్ని ఇస్తాయి. గొంతువాపు, నొప్పి తగ్గిస్తాయి. గోరు వెచ్చని తేనె, నిమ్మరసం.. గోరువెచ్చని తేనె, నిమ్మరసం గొంతునొప్పి తగ్గించడంలో ఇతర గొంతు సమస్యలు తగ్గించడంలో సహాయపడతాయి. సహజంగానే గొంతునొప్పికి తేనె దివ్యౌషదంగా పనిచేస్తుంది. తేనె సహజ యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. గొంతు ఇన్పెక్షన్లను నయం చేస్తుంది. తేనెతో పాటు ఉపయోగించే నిమ్మకాయలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది  ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. ఆహారం.. గొంతు నొప్పి ఉన్నప్పుడు ఆహారం తినాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఇలాంటి సమయాలలో ఘనాహారం జోలికి వెళ్లకపోవడమే మంచిది. గంజి, జావ వంటి ఆహారాలు గొంతు నొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడతాయి. పనిలో పనిగా ఆకలి కూడా తీరుస్తాయి. బెస్ట్ ఆప్షన్.. గొంతునొప్పి వేధిస్తున్నప్పడు దానికి బెస్ట్ ఆప్షన్ గా సూప్ పనిచేస్తుంది. ఇది ఇమ్యునిటీని పెంచడంలోనూ, గొంతునొప్పి తగ్గించడంలోనూ, శరీరానికి శక్తిని ఇవ్వడంలోనూ, గొంతులో కఫాన్ని తగ్గించడంలోనూ సహాయపడుతుంది. సూప్ తయారీలో ఉపయోగించే మిరియాలు, వెల్లుల్లి, అల్లం వంటివి నొప్పి, మంట తగ్గించడంలోనూ, ఇమ్యూనిటీ పెంచడంలోనూ సహాయపడతాయి. చికెన్ సూప్ లేదా వెజిటబుల్ వంటివి తాగడం వల్ల దగ్గు లాంటి సమస్యలు కూడా మంత్రించినట్టు మాయం అవుతాయి. గోల్డెన్ మిల్క్.. పసుపు పాలను అందరూ గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారు. పేరుకు తగ్గట్టే ఈ పాలు బంగారంలాంటి ఆరోగ్యాన్ని చేకూర్చుతాయి. పసుపు పాలలో యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇమ్యునిటీ తక్కువగా ఉన్నవారు పసుపు పాలను తాగుతూంటే రోగనిరోధక శక్తి బలపడుతుంది. పసుపు పాలలో చిటికెడు పసుపు, కొద్దిగా నల్ల మిరియాల పొడి, తేనె కలిపి తాగితే అద్భుతమైన ఫలితం ఉంటుంది.                                                           *నిశ్శబ్ద.

మీకూ  శ్వాస సమస్యలున్నాయా? దీపావళి సీజన్ లో ఈ జాగ్రత్తలు  పాటించండి!

  దీపావళి అంటే చిన్నా పెద్ద అందరికీ చాలా ఇష్టం.  ఈ పండుగ రోజున పెద్దలు కూడా చిన్నపిల్లలలై తమ పిల్లలతో కలసిపోతారు. ఒకప్పుడు దీపావళి అంటే ఇల్లంతా దీపాలు పెట్టడం, కాసిన్ని టపాసులు పేల్చడం జరిగేది. కానీ ఇప్పుడు మాత్రం అలా లేదు. కేవలం దీపావళి మాత్రమే కాదు శుభకార్యాలు, జాతరలు, ఉత్సవాలు, సినిమా రిలీజ్ ఫంక్షన్లు, రాజకీయనాయకుల రాక, సినీతారల రాక ఇలా చాలా సందర్బాలలో  బాణసంచా పెద్ద ఎత్తున కాలుస్తారు. కాలం గడిచే కొద్దీ వాహనాల రద్దీ ఎక్కువ కావడం, వాయు కాలుష్యం పెరుగుతూ వస్తోంది. దీనికారణంగా గతంతో పోలిస్తే శ్వాస సంబంధ సమస్యలు కూడా ఎక్కువ అయ్యాయి. ఇక దేశం అంతా పెద్ద ఎత్తున జరుపుకునే దీపావళి నాడు బాణసంచా చాలా ఎక్కువగానే కాలుస్తారు. ఈ సమయంలో ఆరోగ్యపరంగా అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తెలుసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. శ్వాస సంబంధ సమస్యల ముప్పు.. ఇప్పటికే ఆస్తమా, ఊపిరితిత్తుల బలహీనత, ఇతర శ్వాస సంబంధ సమస్యలు ఉంటే దీపావళి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  బాణసంచా కాల్చినప్పుడు వెలువడే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, చిన్న రేణువులతో కూడిన అనేక హానికరమైన వాయువులను విడుదల చేస్తాయి. ఇవి గాలిని కలుషితం చేస్తాయి. ఇవి శ్వాసకోశ  వ్యవస్థ ద్వారా శరీరంలోకి ప్రవేశించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే శ్వాస సంబంధ సమస్యలున్నవారు  చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పొగకు దూరం ఉండాలి. ముందు చూపు.. ఆస్తమా, శ్వాస కోశ సమస్యలున్నప్పుడు  చాలామంది ఇన్ హేలర్ ఉపయోగిస్తుంటారు. బాణసంచా పొగ, వాతావరణ కాలుష్యం మొదలైనవి ఎక్కువగా ఉండే ఈ సమయంలో బయట ఉన్నప్పుడు, అందరిలో సందడిగా ఉన్నప్పుడు ఉన్నట్టుండి సమస్యలు ఎదురయ్యే అవకాసశం  ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా  ఇన్ హేలర్ ను వెంట ఉంచుకోవాలి.  శ్వాస సమస్యలు ఏర్పడినప్పుడు ఇన్ హేలర్ లు చాలా గొప్పగా సహాయపడతాయి. మాస్క్.. కరోనా వచ్చినప్పటి నుండి మాస్క్ వినియోగం పెరిగింది. ఆ మాస్క్ లు అంటువ్యాధుల నుండే కాదు విపరీతమైన వాయు కాలుష్యం నుండి కూడా కాపాడుతాయి. దీపావళి బాణసంచా ప్రభావం నుండి రక్షణ కావాలి అంటే మాస్క్ ధరించడం చాలా మంచిది. ఇది శ్వాసకోశ సమస్యలు తలెత్తకుండా నిరోధిస్తుంది. బయటకు వెళ్లొద్దు.. ఆస్తమా, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు బాధిస్తుంటే దీపావళి బాణసంచా కాల్చే సమయంలో అసలు బయటకు వెళ్లకుండా ఉండటం ఎంతో మేలు. ఇంట్లో కూడా గాలి వెలుతురు బాగా ఉండేలానూ, గాలి కాలుష్యం అరికట్టడానికి ఎయిర్ ప్యూరిపైయర్లు, గాలి కాలుష్యాన్ని అరికట్టే ఇండోర్ మొక్కలు వంటివి  పెంచుకోవాలి. దీనివల్ల సమస్యను అరికట్టచ్చు.  ఒక వేళ బయటకు తప్పనిసరిగా వెళ్లాల్సివస్తే మాస్క్ తో వెళ్లాలి, అలాగే వెంట ఇన్ హేలర్ ఉంచుకోవాలి.                               *నిశ్శబ్ద.

ధరచూసి భయపడతాం కానీ కివిని రెగ్యులర్ గా తింటే కలిగే లాభాలివే!

ప్రతిరోజూ ఆహారంలో పండ్లు తీసుకోవడం చాలా మంచిదని దీనివల్ల ఆరోగ్యానికి ఢోకా ఉండదని అంటారు. అయితే పండ్లలో కొన్ని ఖరీదైనవి ఉంటాయి, మరికొన్ని తక్కువ ధరకే లభ్యమయ్యేవి ఉంటాయి. ధర విషయం పక్కన పెడితే ప్రతి పండుకూ దాని ప్రత్యేకత ఉంటుంది. చాలా మంది కివి పేరు చెబితే అధిక ధర అంటూ బ్యాక్ స్టెప్ వేస్తుంటారు. కానీ ధర అయినా సరే కివి పండును ఆహారంలో భాగం చేసుకుంటూ మాత్రం హాస్పిలట్స్ లో పోసే వందలు, వేల ఖర్చు ఈజీగా తగ్గినట్టేనట.  కివి పండును ఆహారంలో భాగంగా తీసుకుంటే  రోగనిరోధక వ్యవస్థ బలపడటంతో పాటు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.  తక్కువ కేలరీలతో, ఫైబర్ పుష్కలంగా ఉండే కివి పండులో డైజెస్టివ్ ఎంజైమ్ లు అయిన వియమిన్-సి ఉంటుంది. ఇది బరువు తగ్గడం నుండి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. కివి పండు రెగ్యులర్ గా ఆహారంలో భాగం చేసుకుంటే కలిగే ప్రయోజనాలు ఇవే.. రోగనిరోధక శక్తి.. కివి పండులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. రోజూవారీ వ్యక్తికి కావలసిన విటమిన్-సి లో 80శాతం వరకు  కివి పండు నుండే పొందవచ్చు.  విటమిన్-సి శరీరంలో గొప్ప యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.  ఆక్సీకరణ నష్టం నుండి కణాలను రక్షిస్తుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థను ఏర్పరిచి అంటు వ్యాధుల  ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పొటాషియం మెండు.. గుండె, మూత్రపిండాలు, కండరాలు, నరాలు  సక్రమంగా పనిచేయాలంటే పొటాషియం చాలా అవసరం. ఒక కివి పండులో సుమారు 215మిగ్రా ల పొటాషియం ఉంటుంది.  కివిని తీసుకోవడం వల్ల శరీరానికి కావలసింత పొటాషియం లభిస్తుంది.  ఇది  అధిక రక్తపోటు, స్ట్రోక్, గుండె సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది.  అంతే కాదు మూత్రపిండాల్లో రాళ్లు, బోలు ఎముకల వ్యాధి నుండి కాపాడుతుంది. రక్తం గడ్డకట్టే పనికి చెక్..  సాధారణంగా దిగువ సిరల్లో రక్తం గడ్డ కట్టే సమస్య ఏర్పడుతుంది.  ఇది మెదడులో రక్తప్రసరణకు అంతరాయం కలిగిస్తుంది.  గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాలకు కూడా దారితీస్తుంది.  కివి రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గించడం ద్వారా రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది.  కివి పండ్లలో ఆహారంలో తీసుకుంటూ ఉంటే రక్తంలో కొవ్వు కరిగిపోయి  గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్ట్రోక్ సమస్యను కూడా తగ్గిస్తుంది. జీర్ణఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. కివిలో కరిగే ఫైబర్స్, కరగని పైబర్స్ రెండూ ఉంటాయి. ఇందులో మూడు వంతులు కరిగే ఫైబర్, రెండు వంతుల కరగని పైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంతో పాటు గుండె, జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కివిలో ఉండే ఫైబర్ మొత్తం శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుంది.                                                           *నిశ్శబ్ద.

సైలెంట్ గా ఉన్నా ఇన్ని లాభాలా? రోజూ గంటసేపు మౌనంగా ఉంటే..

ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ బిజీ బిజీ గా గడిపేవారు ఇప్పట్లో చాలామంది ఉన్నారు.  నిమిషం తీరిక లేకుండా ఉంటారంటూ నలుగురూ ఇలాంటి వాళ్లను తెగ పొగిడేస్తుంటారు. ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా చక్కని ప్లానింగ్ తో ఉంటామంటూ ఇలాంటి వారు తమని తాము చూసుకుని సంతోష పడుతుంటారు. మరికొందరు ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు. వీరికి వాగుడూకాయ్ అనే బిరుదు కూడా ఇచ్చేసి ఉంటారు చుట్టూ ఉన్నవారు.  కానీ రోజులో కనీసం ఒక్క గంటసేపు సైలెంట్ గా ఉండమని వైద్యులు చెబుతున్నారు. సైలెంట్ గా అంటే ఏ పని చేయకుండా అని కాదు,  పనులు మాత్రమే కాకుండా అస్సలు వాగకుండా  మౌనంగా ఉండటం. ఈ వేగవంతమైన కాలంలో ప్రతి రోజూ గంట సేపు మౌనంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి బోలెడు లాభాలున్నాయట. ఇలా  సైలెంట్ గా ఉండటం వల్ల కలిగే 6 పెద్ద ప్రయోజనాలు ఏంటో పూర్తీగా తెలుసుకుంటే.. రోజులో ఉన్న 24గంటల్లో 1 గంటసేపు ఖచ్చితంగా మౌనాన్ని పాటిస్తూ ఉంటే మానసిక రుగ్మతలు అన్నీ మంత్రించినట్టు మాయమైపోతాయట. శరీరంలో ఒత్తిడి హార్మోన్లు త్కకువగా ఉత్పత్తి కావడానికి సైలెంట్ గా ఉండే ఈ గంట సమయం చాలా సహాయం చేస్తుంది. ఫలితంగా మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఇదే మానసిక సమస్యలు మెల్లగా తగ్గేలా చేస్తుంది. ఎవ్వరితోనూ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండేవారు సహజంగానే తమ గురించి తాము ఆలోచించుకోగలుగుతారు. సెల్ఫ్ చెక్, సెల్ప్ టాక్ అనేది భావోద్వేగాలతో అనుసంధానం కావడం, తప్పొప్పులను బేరీజు వేసుకోవడం, జీవితంలో ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయం తీసుకోవడం.  సరైన దారిలో ప్రయాణించడానికి  తోడ్పడుతుంది. ప్రస్తుతకాలంలో చాలామంది నిద్ర విషయంలో చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు.  పక్క మీదకు వాలినా నిద్రరాకపోవడం,  కలత నిద్ర, నిద్ర మధ్యలో పదే పదే మెలకువ రావడం వంటి సమస్యలన్నీ కేవలం రోజులో గంట సేపు మౌనంగా ఉండటం వల్ల పరిష్కారమవుతాయి.  గంట సేపు మౌనంగా ఉండటం వల్ల కలిగే మానసికంగా కలిగే మార్పులు మంచి నిద్రను ప్రేరేపిస్తాయి. ఫలితంగా రాత్రి సమయంలో ఎలాంటి ఆటంకం లేకుండా చక్కగా నిద్రపోతారు. చిన్న వయసులోనే రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు.  కానీ రోజూ గంట సేపు మౌనంగా ఉంటే ఎంత రక్తపోటు అయినా మంత్రించినట్టు అదుపులోకి వస్తుంది.  అధిక రక్తపోటు వల్ల సహజంగానే గుండెపోటు, పక్షవాతం  వంటి ప్రమాదాలు ఎదురవుతాయి. ప్రతిరోడూ గంటసేపు మౌనంగా ఉంటూ ఉంటే ఈ ప్రమాదాలన్నీ అస్సలు దరిచేరవు. తక్కువగా మాట్లాడటం వల్ల శరీరంలో ఒత్తిడి తగ్గుతుంది. ఇది నిద్రను మెరుగుపరుస్తుంది. ఈ రెండూ శరీరంలో రోగనిరోధక శక్తిని మరింత మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తి బలంగా ఉంటే ఎలాంటి అనారోగ్యంతో అయినా పోరాడగలిగే సామర్థ్యం శరీరానికి ఉంటుంది. కాబట్టి రోజులో గంటసేపు మౌనంగా ఉంటే రోగనిరోధక శక్తిని పెంచుకున్నట్టే. ఎప్పుడూ లొడలొడా వాగుతుండేవారి మాటలకు అడ్డూ అదుపు ఉండదు. పరిస్థితులు, సందర్బాలతో ప్రమేయం లేకుండా నోటి మాటలు అలా వచ్చేస్తుంటాయి. కొన్ని సార్లు ఎదుటివారి పరిస్థితిని కూడా ఆలోచించకుండా మాట్లాడేస్తారు చాలామంది. కానీ ప్రతిరోజూ గంట సేపు మౌనంగా ఉండటం వల్ల మాటను అదుపులో పెట్టుకోగలుగుతారు. మాట్లాడే ముందు ఆచి తూచి మాట్లాడగలుగుతారు. ఇతరులను ఆకట్టుకునేలా మాట్లాడటం, ఎదుటివారు చెప్పేది పూర్తీగా వినే ఓపిక, దానికి సరైన సమాధానం ఇచ్చే నేర్పు అన్నీ అలవడుతాయి.  కేవలం రోజులో ఒక్క గంటసేపు మౌనంగా  ఉండటం వల్ల పైన చెప్పుకున్న లాభాలు కలిగి జీవితాన్నే మార్చేస్తాయి.                                                 *నిశ్శబ్ద. 

రక్తంలో యూరిక్ యాసిడ్ పెంచే ఆహారాలు ఇవే..వీటికి దూరంగా ఉండండి!

మన శరీరంలో అన్నీ సరిగ్గా ఉంటే మన ఆరోగ్యం చాలా కాలం పాటు ఉంటుంది. ఇది చిన్న పొరపాటు అయినప్పటికీ, దాని ప్రభావాలు మన శరీరంపై వివిధ మార్గాల్లో ప్రతికూలంగా ఉంటాయి.మనకు అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. ముఖ్యంగా మనం తిన్న తర్వాత మన శరీరంలోని వ్యర్థాలు సక్రమంగా బయటకు వెళ్లకపోతే దాని వల్ల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. దీనికి సంబంధించి యూరిక్ యాసిడ్ అనే విష పదార్థం మన శరీరంలో ఎప్పుడూ పెరగకూడదు. అయితే దీన్ని మరింత పెంచే కొన్ని ఆహారాలు ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం. అవయవాల మాంసం: జంతువుల మూత్రపిండాలు, కాలేయం మొదలైనవి దీనికి ఉదాహరణ. వీటిలో ప్యూరిన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని తినడం వల్ల సహజంగా మీ రక్తంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. వీటిని మితంగా తీసుకోవడం మంచిది. ఎరుపు మాంసం: ఉదాహరణకు, మేక, ఆవు, గేదెలకు సంబంధించిన మాంసంలో కూడా అధిక ప్యూరిన్ కంటెంట్ ఉంటుంది.దీన్ని తీసుకోవడం వల్ల మీ రక్తంలో యూరిక్ యాసిడ్ అకస్మాత్తుగా పెరుగుతుంది. అంతే కాకుండా రెడ్ మీట్ గుండె ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని చెబుతున్నారు. సీఫుడ్స్: పీత గింజలతో సహా అనేక ఇతర జలచరాలలో ప్యూరిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది మీ రక్త ప్రసరణ సజావుగా జరగడానికి అనుమతించదు. ఇది మీ రక్తప్రవాహంలో యూరిక్ యాసిడ్ పెరగడానికి కూడా కారణమవుతుంది. ప్రాసెస్ చేసిన మాంసాలు: ఏదైనా ప్రాసెస్ చేసిన ఆహారాలు ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన మాంసాలలో యూరిక్ యాసిడ్ పెంచే గుణాలు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు తాజా మాంసం తినడానికి ప్రయత్నించండి. మద్యం వినియోగం: మీరు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు, అది మీ శరీరం మరింత యూరిక్ యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది శరీరం విసర్జించకుండా కూడా నిరోధిస్తుంది. బీరు, ఇతర మద్యపానమే ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. కానీ రెడ్ వైన్ వినియోగంతో అలా జరగదని తెలిసిన వారి వాదన. కెఫిన్ పానీయాలు: కొన్ని పరిశోధనల ప్రకారం కాఫీ ఎక్కువగా తాగే వారి రక్తంలో యూరిక్ యాసిడ్ కూడా పెరుగుతుందని తెలిసింది. కేవలం కాఫీ మాత్రమే కాదు, ఏ కెఫిన్ ఉన్న పానీయానికైనా ఈ సామర్థ్యం ఉందని నిపుణులు చెబుతున్నారు. కానీ అది వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది.