పడుకునేముందు బాదం నూనెను బొడ్డుకు అప్లై చేస్తే జరిగేది ఇదే..!

  భారతదేశం కళలకు పుట్టినిల్లు అని అంటారు. అంతేకాదు..  భారతదేశం ప్రాచీన సంపదకు కూడా నిలయం. ఇక్కడ కళల నుండి వైద్యం,  సంస్కృతి,  అలవాట్లు,  సంప్రదాయాలు, పద్దతులు.. ఇలా చాలా విషయాలలో భారతదేశం గొప్పదే.. ముఖ్యంగా భారతదేశ ఆయుర్వేదానికి ప్రపంచ వ్యాప్తంగా కూడా పేరు, గుర్తింపు ఉన్నాయి. అలాంటి వాటిలో నాభిలో నూనె వేయడం కూడా ఒకటి.  సాధారణంగా వాడుక భాషలో నాభిని బొడ్డు అని అంటారు. బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడు బొడ్డు నుండే తల్లి నుండి బిడ్డకు ఆహారం అందుతుంది. అందుకే బొడ్డుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.  ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు బొడ్డులో  బాదం నూనె వేస్తే షాకింగ్ ఫలితాలు ఉంటాయని అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. దీని గురించి తెలుసుకుంటే.. బాదం నూనెలో పోషకాలు.. బాదం నూనెలో విటమిన్-ఎ,  విటమిన్-ఇ,  ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, మెగ్నీషియం,  బయోటిన్ వంటి పోషకాలు ఉంటాయి. ప్రయోజనాలు.. బాదం నూనెను బొడ్డులో వేయడం వల్ల పనిభారం,  ఒత్తిడి,  కాలుష్యం మొదలైన వాటి కారణంగా చర్మం కోల్పోయిన గ్లోను తిరిగి తీసుకు వస్తుందట.  ఇది ఒత్తిడిని నియంత్రిస్తుందని,  బొడ్డు చుట్టూ ఉండే నాడీ వ్యవస్థను సక్రమం చేస్తుందని అంటారు. ముఖం వాడిపోయి కళా విహీనంగా ఉన్నవాళ్లు ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు బొడ్డులో కొన్ని చుక్కల బాదం నూనె వేస్తుంటే చర్మం కాంతివంతం అవుతుంది. రోజూ రాత్రి పడుకునేముందు బొడ్డులో బాదం నూనె కొన్ని చుక్కలు వేస్తుంటే జుట్టు రాలే సమస్య కూడా  తగ్గుతుందట.  ఇది నాడీ వ్యవస్థను సక్రియం చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది.  దీని వల్ల జుట్టు, చర్మానికి మేలు జరుగుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం బాదం నూనెలో బొడ్డులో వేస్తుంటే కడుపులో నొప్పి,  గ్యాస్,  అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.                                           *రూపశ్రీ.  

డయాబెటిస్ రోగులకు అలెర్డ్.. ప్రమాదాలు ముంచుకొస్తున్నాయ్..!

  డయాబెటిస్.. చ క్కెర వ్యాధిగా పేర్కొనే డయాబెటిస్ నేటికాలంలో చాలా సహజమైన జబ్బుల జాబితాలో చేరిపోయింది. ఒకప్పుడు పెద్ద వయసు వారిలో కనిపించే జబ్బులన్నీ ఇప్పుడు చిన్న వయసు వారిలో కనిపిస్తున్నాయి.   డయాబెటిస్ కూడా ఇప్పుడు చిన్న వయసులోనే అటాక్ ఇస్తోంది. అయితే డయాబెటిస్ రోగులు చాలా అలెర్ట్ గా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  వీరికి చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయట.  డయాబెటిస్ రోగుల గురించి చేసిన అధ్యయనంలో చాలా షాకింగ్ నిజాలు బయటపడినట్టు పరిశోధకులు చెబుతున్నారు.  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యలో టైప్-2 మధుమేహం ప్రధానమైనది. 2022లో ప్రపంచవ్యాప్తంగా 83 కోట్ల మందికి పైగా మధుమేహంతో బాధపడుతున్నవారు ఉన్నారు. 183 దేశాలలో 90% కంటే ఎక్కువ మధుమేహం కేసులు టైప్-2 మధుమేహంవే. మధుమేహం అనేది అంత లైట్ తీసుకోవాల్సిన వ్యాధి కాదు. ఇది తీవ్రమైన వ్యాధి. ఇది శరీరాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనిపై సకాలంలో శ్రద్ధ చూపకపోతే, మధుమేహం (బ్లడ్ షుగర్) సమస్య పెరుగుతూ ఉంటే అది కళ్ళు, మూత్రపిండాలు,  నరాలపై ప్రభావం చూపుతుంది. కుటుంబంలో ఇప్పటికే మధుమేహం ఉన్నవారుంటే ఈ వ్యాధి ప్రమాదం గురించి మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. డయాబెటిక్ రోగులలో విటమిన్ డి లోపం చాలా సాధారణం అని  ఇటీవల జరిగిన పరిశోధనలలోో వెల్లడైనట్టు పరిశోధకులు చెబుతున్నారు. విటమిన్-డి తరువాత మెగ్నీషియం లోపం ఉంటుందట. ఈ రెండు పోషకాలు మంచి ఆరోగ్యానికి చాలా  అవసరమైనవిగా పరిగణించబడతాయి.  మధుమేహంతో బాధపడుతున్న వారిలో 60 శాతం మందికి పైగా విటమిన్ డి లోపం ఉన్నట్లు పరిశోధనలో తేలింది. విటమిన్ డి ఎముకలను బలంగా ఉంచడానికి,  రోగనిరోధక శక్తిని పెంచడానికి అవసరం. ఇది కాకుండా మధుమేహంతో బాధపడుతున్న 42 శాతం మందిలో మెగ్నీషియం లోపం కనిపిస్తోందట. మెగ్నీషియం ఎముకలు, కండరాలు, నరాలను నిర్వహించడానికి,  రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి అవసరమైన ఒక ముఖ్యమైన ఖనిజం. పురుషుల కంటే మధుమేహం ఉన్న మహిళలకు సూక్ష్మపోషకాల లోపాల ప్రమాదం ఎక్కువగా ఉందని, ఇది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు.  మధుమేహం,  దాని వల్ల కలిగే అనేక సమస్యలను తగ్గించడంలో సూక్ష్మపోషకాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది గ్లూకోజ్ జీవక్రియ,  ఇన్సులిన్ సెన్సిటివిటీని నిర్వహించడంలో కూడా పాత్ర పోషిస్తుంది. విటమిన్ బి 12 లోపం ప్రపంచవ్యాప్తంగా 29 శాతం మధుమేహ రోగులను కూడా ప్రభావితం చేస్తుందని,  డయాబెటిస్ కోసం మందులు వాడే వారిలో ఇది మరింత ఎక్కువగా ఉందని తేలిందట. డయాబెటిస్ వల్ల ఎదురయ్యే ప్రమాదాలను డయాబెటిక్ రోగులందరూ అర్థం చేసుకుని తమ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పరిశోధకులు తెలిపారు.  వైద్య సలహాపై సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు. ఈ పోషకాలు లేకపోవడం వల్ల రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవడం కష్టమవుతుంది. విటమిన్ డి,  మెగ్నీషియం లోపం వల్ల ఏమి జరుగుతుంది? మధుమేహం సమస్య శరీరాన్ని లోపలి నుంచి బోలుగా మారుస్తుంది. ఎముకలను దెబ్బతీస్తుంది.  అలాంటి పరిస్థితుల్లో విటమిన్ డి లోపం వల్ల భవిష్యత్తులో ఎముకల నొప్పులు, కండరాల బలహీనత, ఆస్టియోపోరోసిస్ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు తెలిపారు. విటమిన్ డి లోపం శరీరంలో కాల్షియం శోషణకు ఆటంకం కలిగిస్తుంది. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ముఖ్యమైనది. మెగ్నీషియం లోపం టైప్ -2 డయాబెటిస్‌కు కారణం కావచ్చు.  ఇది డయాబెటిస్ లక్షణాలను పెంచే సమస్య కూడా. మెగ్నీషియం లోపం అధిక రక్తపోటు, బోలు ఎముకల వ్యాధి,  మూత్రపిండాల సమస్యలను పెంచుతుంది.                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

పిల్లలు ఎత్తు పెరగడం లేదా.. ఆహారంలో ఈ విటమిన్లు మిస్ అవుతున్నట్టే..!

  ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా సరే..  తల్లిదండ్రులు తమ పిల్లల సంరక్షణలో  ఏ చిన్న విషయాన్ని వదిలిపెట్టరు. చదువు దగ్గర్నుంచి తిండి వరకూ ప్రతి చిన్నా పెద్దా విషయాలు దగ్గరుండి చూసుకుంటారు. అయితే ఇంత జరిగినా కూడా పిల్లల ఎత్తు పెరగకపోతే ఆందోళన చెందే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. నిజానికి పిల్లలు శారీరకంగా ఎదుగుదల బాగుండాల్సిన వయసులో అలా లేకపోతే వారు తీసుకునే ఆహారంలో ఏదో లోపిస్తున్నట్టే లెక్క. పిల్లలు తగినంత ఎత్తు ఉండటం అనేది శరీర ఆకృతి అందంగా కనిపించడం కోసమే కాదు.. అది ఆరోగ్యానికి, ఫిట్ననెస్ కు కూడా సంబంధించిన విషయం. అయితే ఎత్తు తక్కువ అనే సమస్యతో బాధపడేవారు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. సాధారణంగా కొన్ని హార్మోన్ల లోపం ఈ సమస్యకు ప్రధాన కారణం.  ఏ విటమిన్ లోపం వల్ల పిల్లల ఎత్తు పెరగడం లేదో  తెలుసుకోవడం చాలా ముఖ్యం. గ్రోత్ హార్మోన్.. గ్రోత్ హార్మోన్ లోపం (GHD) తక్కువ ఎత్తుకు ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది మాత్రమే కాదు, విటమిన్ డి లోపానికి పిల్లల ఎత్తు తక్కువగా ఉండటానికి కూడా సంబంధం ఉంటుంది.  విటమిన్ డి ఎముకలను బలపరుస్తుంది. ఎముకల అభివృద్ధికి కూడా అవసరం. ఇలాంటి పరిస్థితిలోో శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే, అది నేరుగా ఎత్తును ప్రభావితం చేస్తుంది. పిల్లల ఎత్తు,  ఎముకల అభివృద్ధికి విటమిన్ డి ముఖ్యమైనది. 10 ml కంటే తక్కువ విటమిన్ లోపం సంవత్సరానికి 0.6 cm ఎత్తులో తక్కువ పెరుగుదలకు దారితీస్తుంది. విటమిన్-డి లోపం ఉంటే పిల్లలలో కింది లక్షణాలు ఉింటాయి. ఎముకల నొప్పి, త్వరగా అలసిపోవడం, జుట్టు రాలడం, నిద్రపోవడం, ఎప్పుడూ కోపంగా ఉండడం వంటి లక్షణాలు ఉంటాయి. పిల్లలో విటమిన్-డి లోపం అధిగమించాలంటే ప్రతి రోజూ ఉదయాన్నే నిద్రలేపాలి.  ఉదయం సమయంలో సూర్యుడి లేత కిరణాలలో పిల్లలను కొంత సమయం గడిపేలా ఎంకరేజ్ చేయాలి.  ఎన్ని సప్లిమెంట్లు తీసుకున్నా సహజంగా లభించే విటమిన్-డి శరీరాన్ని చాలా తొందరగా రికవర్ అయ్యేలా చేస్తుంది. అలాగే పాలు, గుడ్డులోని పసుపు భాగం తినాలి.  నారింజ వంటి సిట్రస్ పండ్లను తినాలి. ఇవన్నీ చేస్తే పిల్లలో ఎత్తు పెరుగుదల గమనించవచ్చు.                                    *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

ఎంత ట్రై చేసినా బరువు తగ్గడం లేదా.. ఇవే కారణాలు కావచ్చు..!

అధిక బరువు ఇప్పట్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య.  మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో సహా చాలా రకాల కారణాలు  బరువు మీద ప్రభావం చూపిస్తాయి.  ఆరోగ్యం మీద స్పృహ పెరుగుతున్న నేటికాలంలో అధిక బరువును వదిలించుకోవడానికి చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.  అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు  తగ్గడంలో ఫెయిల్  అవుతున్న వారే ఎక్కువ.  జిమ్ చేసినా, నడక, వ్యాయామం, డైటింగ్.. ఇలా ప్రతిదీ బరువు తగ్గడానికి చేసే ప్రయత్నమే.. వీటి వల్ల  ఫలితాలు రావడం లేదంటే దీని వెనుక ఇతర కారణాలు చాలా ఉంటాయి. కేలరీలు.. బరువు తగ్గడానికి ప్రయత్నం చేసేవారు ఆహారం తీసుకోవడం లో జాగ్రత్తగా ఉండాలని అనుకుంటారు. కానీ  రోజూ ఎన్ని కేలరీల ఆహారాన్ని తింటున్నారో అర్థం చేసుకోరు.   ఎన్ని కేలరీల ఆహారం తీసుకుంటున్నాం, ఎన్ని కేలరీలు శారీరక శ్రమ ద్వారా ఖర్చు చేయగలుగుతున్నాం అనే విషయం చాలా మంది తెలుసుకోరు.  ఇది బరువు  తగ్గకపోవడానికి కారణం అవుతుంది.  బరువు తగ్గాలి  అంటే శరీరంలోకి వెళ్లే కేలరీలకు తగినట్టు శారీరక శ్రమ ద్వారా ఖర్చు చేసే కేలరీలు కూడా ఎక్కువే ఉండాలి. నిద్ర.. నిద్ర సరిగా లేకపోతే శరీరంలో హార్మోన్ల అసమతుల్యత దెబ్బ తింటుంది.  ఇది ఆకలిని పెంచుతుంది.  బరువు తగ్గడాన్ని కష్టం చేస్తుంది.  అందుకే బరువు తగ్గడంలో మంచి ఫలితాలు రావాలి అంటే  మంచి నిద్ర  అవసరం. నీరు.. నీరు శరీరానికి  చాలా ముఖ్యమైనది.  ఇది జీవక్రియను పెంచుతుంది.  ఆకలిని తగ్గిస్తుంది.  రోజూ కనీసం 3 లీటర్లకు పైగా నీరు తీసుకోవడం తప్పనిసరి. లేకపతే బరువు తగ్గడం కష్టం అవుతుంది. ఒత్తిడి.. చాలామంది ఒత్తిడితో ఇబ్బంది పడుతూ ఉంటారు.  ఒత్తిడి అనేది మనిషి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది.  ఒత్తిడి వల్ల సరిగా నిద్ర పట్టకపోవడం,  ఆహారం ఎక్కువగా తినడం,  హార్మన్ల అసమతుల్యత, కోపం, చిరాకు, అసహనం వంటివి ఉంటాయి. ఇవన్నీ బరువు పెరగడానికి కారణం అవుతాయి. కార్డియో.. బరువు తగ్గడానికి చాలా మంది వ్యాయామాలు చేస్తారు.అయితే వ్యాయామంలో కార్డియో వ్యాయామాలు మాత్రమే చేస్తుంటారు.  కండరాలను బలంగా చేసే పనిపై దృష్టి పెట్టకపోతే జీవక్రియ వేగం మందగిస్తుంది.  దీని వల్ల కూడా బరువు తగ్గే అవకాశం ఉండదు. ప్రోటీన్.. ఆహారంలో ప్రోటీన్ తప్పనిసరిగా ఉండాలి.  ఇది కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది.  ఆకలిని తగ్గిస్తుంది.  జీవక్రియను కూడా పెంచుతుంది.  అందుకే ఆహారంలో ప్రోటీన్ తగ్గినా బరువు తగ్గడంలో ఫలితాలు కనిపించవు. ఫైబర్.. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండాలంటే ఫైబర్ తప్పనిసరిగా తీసుకోవాలి.  ఇది జీవక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది.  బరువు తగ్గడంలో సహాయపడుతుంది.  బరువు తగ్గాలని అనుకునేవారు ఫైబర్ ఆహారాన్ని బాగా తీసుకోవాలి. ఆరోగ్య సమస్యలు.. కొందరిలో ఆరోగ్య సమస్యలు కూడా బరువు పెరగడానికి కారణం అవుతాయి.  ముఖ్యంగా థైరాయిడ్,  పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ వంటి సమస్యలు,  ఏదైనా అనారోగ్య సమస్యతో మందులు వాడుతున్నవారు బరువు పెరుగుతారు.                                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  

శరీరంలో మెగ్నీషియం లోపిస్తే ఏం జరుగుతుందంటే..!

  శరీరానికి ప్రోటీన్లు, విటమిన్ల మాదిరిగానే ఖనిజాలు కూడా అవసరం అవుతాయి.  శరీరానికి చాలా అవసరమైన ఖనిజాలలో మెగ్నీషియం ముఖ్యమైనది.  మెగ్నీషియం లోపించడం వల్ల శరీరంలో కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి.  శరీరంలో మెగ్నీషియం లోపిస్తే దాన్ని హైపోమాగ్నేసిమియా  అని పిలుస్తారు.  ఇది చాలా రకాల ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.  శరీరంలో మెగ్నీషియం లోపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుంటే.. మెగ్నీషియం కండరాల సంకోచాలను నియంత్రిస్తుంది.  దీని లోపం కారణంగా కండరాల తిమ్మిరి,  బలహీనత తీవ్రమవుతాయి. ఇవి రూజువారి జీవనశైలిని చాలా ఇబ్బంది పెడతాయి. మెగ్నీషియం శరీరం శక్తివంతంగా ఉండటంలో సహాయపడుతుంది. కానీ  మెగ్నీషియం లోపిస్తే తీవ్రమైన అలసట,  నీరసం ఏర్పడతాయి.  చాలా బలహీనంగా అనిపిస్తుంది.  ఏ చిన్న పని పూర్తీ చేయడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. గుండె ఆరోగ్యం గా ఉండాలన్నా  మెగ్నీషియం తప్పనిసరిగా అవసరం.  ఇది గుండె స్పందనను, రక్తపోటును సక్రమంగా ఉండేలా చేస్తుంది. అదే మెగ్నీషియం లోపిస్తే హృదయ స్పందన  రేటు తారుమారు అవుతుంది.  రక్తపోటు కూడా అస్తవ్యస్తంగా మారుతుంది. ఒత్తిడి, మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే మెగ్నీషియం తప్పనిసరిగా అవసరం.  అదే మెగ్నీషియం లోపిస్తే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది.  అసహనం, కోపం, చిరాకు, ఒత్తిడి మొదలైన సమస్యలు పెరుగుతాయి. అంతేకాదు.. మెగ్నీషియం లోపం ఉన్నవారికి ఎముకలు చాలా బలహీనంగా ఉంటాయి.  బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. సరిగా నిద్రపట్టకపోవడం,  జీర్ణవ్యవస్థ దెబ్బతినడం వంటి సమస్యలు కూడా కలుగుతాయి.                                        *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  

పాలకూర ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా?

  ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఆకు కూరలలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆహారంలో ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని చెబుతారు. ఆకుకూరలలో పాలకూర చాలా ఆదరణ పొందింది. పాలకూరను కేవలం పప్పు గానే కాకుండా పనీర్ కూరలు,  పాలక్ చపాతీ, పాలకూర పులావ్.. పాలకూరను నాన్ వెజ్ తో కలిపి వండటం వంటి ప్రయోగాలు కూడా చేస్తుంటారు. పాలకూర ఆరోగ్యానికి చాలామంచిది.అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని పాలకూరను ఎక్కువగా తీసుకోవడం అస్సలు మంచిది కాదట. పాలకూర ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుంటే.. పాలకూరలో అధిక మొత్తంలో ఆక్సలేట్లు ఉంటాయి. దీని కారణంగా పాలకూరను అధికంగా తింటే కిడ్నీల రాళ్లు ఏర్పడే ప్రమాదం.  కొందరు పాలకూర తినడానికి సంకోచించేది కూడా ఈ కారణంతోనే. మరీ ముఖ్యంగా ఇప్పటికే రాళ్ల సమస్య ఉన్నా.. వంశంలో ఎవరికైనా రాళ్ల సమస్య ఉన్నా..  పాలకూర తినడం మానేయడం మంచిదని ఆహార నిపుణులు అంటున్నారు. గిన్నెడు పాలకూరను వండినా అది ఓ కప్పు అంత మాత్రమే అవుతుంది.  ఇది వేడికి చాలా మెత్తగా అయిపోతుంది.  అయితే పాలకూరను తినడం వల్ల కొందరిలో గ్యాస్, ఉబ్బరం,  అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. ఇది జీర్ణం కావడంలో ఇబ్బందిని కలిగిస్తుంది.  ఇప్పటికే జీర్ణ సంబంధ సమస్యలు, గ్యాస్ ,  ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారు పాలకూరను తినడం మంచిది కాదు. థైరాయిడ్ సమస్య ఉన్నవారికి  పాలకూర అస్సలు మంచిది కాదు.. పాలకూరలో గోయిట్రోజెన్లు ఉంటాయట.  ఇవి థైరాయిడ్ గ్రంథి పనితీరును దెబ్బతీస్తాయి. దీని కారణంగా థైరాయిడ్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.  అందుకే పాలకూరను  అతిగా తినకూడదు. పాలకూర తినడం వల్ల అలెర్జీ కూడా ఉంటుంది.  కొందరికి పాలకూర తినడం వల్ల శ్వాస తీసుకోవడంలో  ఇబ్బంది,  చర్మం పైన దురద, దద్దుర్లు రావడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి.  పాలకూరను ఎక్కువగా వినియోగించని వారు.. ఆకుకూరలంటే ఇష్టం ఉన్నవారు పాలకూరను ఎడాపెడా తినకూడదు. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...                                                   *రూపశ్రీ.

ఏ పోషకాలు లోపించడం వల్ల జుట్టు బాగా రాలిపోతుందో తెలుసా?

  జుట్టు రాలడం అనేది చాలా మంది ఎదుర్కునే సాధారణ సమస్య. అయితే అమ్మాయిలే దీనికి ఎక్కువ బాధితులుగా ఉంటారు. అలాగే జుట్టు రాలుతోందని ఆందోళన చెందేవారిలో కూడా అగ్రభాగం అమ్మాయిలే ఉంటారు. అయితే వాతావరణం,  కేశ  సంరక్షణ కోసం ఉపయోగించే ఉత్పత్తులు.. జీవనశైలి మొదలైనవి మాత్రమే కాకుండా  తీసుకునే ఆహారం కూడా జుట్టు రాలడానికి కారణం అవుతుంది.  ఆహారంలో కొన్ని పోషకాలు లోపిస్తే  జుట్టు బాగా రాలిపోతుందట.  ఇంతకీ ఆ పోషకాలు ఏంటో తెలుసుకుంటే.. ఐరన్.. ఐరన్ అనేది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది.  మహిళలు ఐరన్ బాగా తీసుకోవాలని చెబుతారు.  ఐరన్ లోపం ఉన్న మహిళలలో జుట్టు చాలా పలుచగా ఉంటుంది. అలాగే జుట్టు రాలిపోవడం,  జుట్టు రాగి రంగులో ఉండటం వంటి సమస్యలు కూడా ఉంటాయి. ఐరన్ లోపం ఉంటే జుట్టు మూలాలకు ఆక్సిజన్ సరఫరా సరిగా ఉండదు. అందుకే జుట్టు సమస్యలు వస్తాయి. జింక్.. జింక్ కూడా శరీరానికి చాలా అవసరమైన ఖనిజం.   ఇది శరీరంలో కణజాలాన్ని రిపేర్ చేయడానికి కణజాలం పెరుగుదలకు, కణజాలం ఆరోగ్యంగా ఉండటానికి చాలా సహాయపడుతుంది. జింక్ లోపిస్తే జుట్టు రాలిపోయే సమస్య ఎక్కువ ఉంటుంది. బయెటిన్.. బయోటిన్ జుట్టు పెరుగుదలకు చాలా ముఖ్యమైన పోషకం.  బయోటిన్ ఆధారిత షాంపూలు, సీరమ్ లు,  కండీషనర్లు మార్కెట్లో చాలా అందుబాటులో ఉంటాయి.  బయోటిన్ లోపిస్తే జుట్టు పెళుసుగా మారుతుంది.  తొందరగా విరిగిపోతుంది.  జుట్టు బాగా రాలిపోతుంది. ప్రోటీన్లు.. జుట్టు ఆరోగ్యానికి ప్రోటీన్లు కూడా చాలా ముఖ్యం.  జుట్టు కెరాటిన్ తో తయారు అవుతుంది. ఇది ఒక రకమైన ప్రోటీన్. ఇవి లోపిస్తే జుట్టు రాలే సమస్య పెరుగుతుంది.  తిరిగి జుట్టు పెరుగుదలలో ఎలాంటి మెరుగుదల కనిపించదు. విటమిన్-ఇ.. విటమిన్-ఇ అనేది గొప్ప యాంటీ ఆక్సిడెంట్. ఇది తలలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దీని లోపం వల్ల జుట్టు రాలుతుంది.  ఇప్పట్లో చాలా కేశ సంరక్షణ ఉత్పత్తులలో  విటమిన్-ఇ చేర్చబడి ఉంటుంది. అప్పటికి ఈ విటమిన్-ఇ అనేది జుట్టుకు ఎంత అవసరమో అర్థం చేసుకోవచ్చు. విటమిన్-డి.. విటమిన్-ఇ లాగానే విటమిన్-డికూడా జుట్టు పెరుగుదలకు చాలా ముఖ్యం.  ఇది వెంట్రుకల కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. అదే విటమిన్-డి లోపిస్తే కుదుళ్లు బలహీనపడతాయి.  జుట్టు రాలడానికి కారణం అవుతుంది. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...                                       *రూపశ్రీ.

సలాడ్ తినే అలవాటుందా? ఈ  అయితే ఈ నిజాలు తెలుసుకోండి..!

ఈమద్యకాలంలో చాలామంది ఓ ఆహారపు అలవాటును బాగా ఫాలో అవుతున్నారు. అదే సలాడ్. కొందరు పండ్లతో సలాడ్ తింటే.. మరికొందరు పచ్చిగా తినదగిన కూరగాయలతో సలాడ్ చేసుకుని తింటూంటారు. ఇది శరీరానికి ఆరోగ్యాన్ని, విటమిన్లను, పైబర్ ను సమృద్దిగా అందిస్తుందని.. బరువు నిర్వాహణలో తోడ్పడుతుందని చెబుతారు. అయితే సలాడ్ లు ఎప్పుడు తినాలి? ఏ సమయంలో తినాలి? ఎలా తింటే ఆరోగ్యం? ఎప్పుడు తినకూడదు? తెలుసుకుంటే.. సలాడ్ తింటే కలిగే ప్రయోజనాలు.. సలాడ్ లో చాలావరకు పచ్చికూరగాయలు ఉంటాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. మలబద్దకం సమస్య తగ్గిపోతుంది. చర్మం లోపలి కణాలు, శరీరానికి బయట కలిగే గాయలను తొందరగా తగ్గించడంలో సలాడ్లు తినడం సహాయపడుతుంది. దోసకాయ, బీట్ రూట్, పచ్చి ఉల్లిపాయ,నిమ్మకాయ, టమోటా మొదలైనవి పచ్చిగా తీసుకుంటే కాలేయ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. చలికాలంలో సలాడ్ తినడం గురించి చాలామంది సందిగ్ధంలో ఉంటారు. దీనికి కారణం పచ్చి కూరగాయలు తినడం వల్ల జలుబు, దగ్గు, తలనొప్పి వంటి సమస్యలు సులువుగా వస్తాయని. అయితే చలికాలంలో క్యారెట్, ముల్లంగి, క్యాబేజీ, ముల్లంగి రుచితో బీట్రూట్ ఆకారంలో ఉండే టర్నిప్ దుంపలు చలికాలపు సలాడ్ లో జోడించుకోవచ్చు. ఇవే కాకుండా పండ్లు కూడా తీసుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో నీటి కొరత ఉండదు. సలాడ్ తినడానికి సరైన సమయం.. చాలామంది సలాడ్ అంటే ఎక్కువగా కీరా, క్యారెట్, టమోటాలను తింటూంటారు. వీటిని కూడా భోజనంతో పాటు తింటూంటారు. ముఖ్యంగా బిరియానీలతో పచ్చి ఉల్లిపాయ, క్యారెట్, నిమ్మకాయ, టమోటా వంటివి ఇవ్వడం చూస్తుంటాం.   వీటిని ఉడికించిన ఆహారంతో పాటు తినడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. జీర్ణసమస్యలు ఎదురవుతాయి.  ఉడికించిన ఆహారంలో ఉష్టోగ్రత, ఆహారం గుణాలు, సలాడ్ లోని ఉష్టోగ్రత, వాటి గుణాలు రెండూ వేరు వేరు కాబట్టి ఇది జరుగుతుంది. అందుకే సలాడ్ లను ఎప్పుడూ ఆహారానికి అరగంట ముందు తీసుకోవాలి. లేదా ఉదయం కాస్త ఆకలిగా ఉన్నప్పుడు కూడా తీసుకోవచ్చు. ఆహారంతో ఎందుకు తినకూడదంటే.. ఆహారంతో పాటు సలాడ్లు తీసుకోకూడదు అనడానికి  మరిన్ని కారణాలు ఉన్నాయి. ఆహార స్థితిని బట్టి దాన్ని జీర్ణం చేయడానికి శరీరంలో కాలేయం ఎంజైమ్ లను విడుదల చేస్తుంది.  దీనివల్లే ఆహారం జీర్ణం అవుతుంది. కానీ సలాడ్లు ఆహారంతో తీసుకోవడం వల్ల కాలేయం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. మరొక కారణం ఏమిటంటే.. చల్లని ఆహారం, ఉడికించిన ఆహారం రెండూ కలిపి తింటే ఆయుర్వేదం ప్రకారం జఠరాగ్ని మందగిస్తుంది. జఠరాగ్ని అనేది ఆహారాన్ని జీర్ణం చేసే శక్తి. సలాడ్లు ఆహారంతో కలిపి తీసుకోవడం దీర్ఘకాలం కొనసాగితే జీర్ణశక్తి మందగిస్తుంది.                                          *నిశ్శబ్ద.

పసుపు ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఎక్కువగా వాడితే ఈ నష్టాలు తప్పవు..!

  పసుపు భారతీయ వంటింట్లో తప్పనిసరిగా ఉండే పదార్థం.  పసుపును వంటల నుండి వైద్యం వరకు చాలా రకాలుగా వాడతారు.  పసుపు గొప్ప ఔషద గుణాలు కలిగి ఉంటుందని ఆయుర్వేదం చెబుతోంది.  పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి.  అందుకే ఏదైనా దెబ్బ తగలగానే మొదట పసుపు పెడతారు. ఇది రక్తస్రావం ఎక్కువ జరగకుండా చేస్తుంది.  ఇక చర్మ సంరక్షణలో కూడా పసుపు వాడకం ఎక్కువే.. పచ్చి పసుపు, ఛాయ పసుపు.. కస్తూరి పసుపు .. ఇలా చాలా రకాలే ఉన్నాయి.   పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే పసుపు ఆరోగ్యానికి మంచిదే కానీ.. పసుపును ఎక్కువగా వాడితే  దాని వల్ల నష్టం కూడా తప్పదట.  ఇంతకీ వసుపు వల్ల  కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకుంటే.. పసుపు ఆరోగ్యానికి మంచిదే కానీ దాన్ని ఎక్కువగా వాడితే అది అతిసారం సమస్యకు కారణం అవుతుంది.  గ్యాస్, అపానవాయువు,  డయేరియా వంటి సమస్యలకు దారి తీస్తుంది. అందుకే పసుపును మితంగానే వాడాలి. రక్తం చాలా చిక్కగా ఉన్న వ్యక్తులు రక్తం పలుచ బడటానికి మందులు వాడుతుంటారు. ఇలాంటి వారు పసుపును చాలా జాగ్రత్తగా వాడాలి.  పసుపును అతిగా తీసుకోవడం వల్ల రక్తానికి సంబంధించిన సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. పసుపు వేడి స్వభావం కలిగి ఉంటుంది.  దీన్ని అధికంగా వాడితే ఇది శరీరంలో వేడిని పుట్టిస్తుంది.  ఫలితంగా చర్మం పైన దద్దుర్లు, మంట, దురద వంటివి కలిగిస్తుంది.  చర్మం లోపలి నుండి వాపులు కూడా కలిగిస్తుంది. అందుకే పసుపును అతిగా వాడకూడదు. పసుపును ఎక్కువగా వాడితే కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఉంటుందట.  కిడ్నీ స్టోన్స్ మాత్రమే కాకుండా తలనొప్పి సమస్య కూడా రావచ్చట.  అందుకే పసుపును అధికంగా తినకూడదు. పసుపు గర్బాశయ కండరాలను ఉత్తేజ పరుస్తుంది.  అందుకే గర్బిణీ స్త్రీలు పసుపును ఎక్కువగా తీసుకోకూడదు.  ఎక్కువగా తీసుకుంటే ప్రమాదం.                                    *రూపశ్రీ.

కంటి నుండి కిడ్నీల వరకు సమస్యలను పెంచే చిన్న పొరపాటు ఇది..!

  శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే సరైన జీవనశైలి, సమతుల  ఆహారాన్ని తీసుకోవడం తో పాటు  కొన్ని విషయాలలో ఎక్కువ శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. ఈకాలంలో మధుమేహం, రక్తపోటు సమస్యలు యువతలో కూడా  కనిపిస్తున్నాయి. ఇది చాలా మందిని  ఆందోళన కలిగిస్తోందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ రెండింటినీ అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. చాలామంది షుగర్ లెవల్ పెరగడం గురించి చాలా నిర్లక్ష్యంగా ఉంటారు.  చిన్న వయసే కదా ఏమవుతుందిలే.. మందులతో నియంత్రణ చేసుకోవచ్చులే అని నిర్లక్ష్యం చేస్తారు. అయితే  షుగర్ లెవెల్ పెరగడం అనే చిన్న పొరపాటు వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుంటే.. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యలలో మధుమేహం ఒకటి. ఒక అంచనా ప్రకారం 2024 సంవత్సరంలో భారతదేశంలో డయాబెటిస్‌తో బాధపడుతున్న వారి సంఖ్య 212 మిలియన్లు. అంటే 21 కోట్లకు పైగా భారతీయులు మధుమేహంతో బాధపడుతున్నారు. ఇది ప్రపంచంలోని మొత్తం రోగులలో 26%. అధిక చక్కెర స్థాయిలు  ఉండటం వల్ల శరీరం చాలా విధాలుగా నష్టపోతుంది.  మూత్రపిండాల నుండి కళ్ళు,  రోగనిరోధక శక్తి వరకు ప్రతిదానిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఆరోగ్య నిపుణులు ఏం చెప్పారంటే.. ఆరోగ్య నిపుణులు మధుమేహం తీవ్రమైన ఆరోగ్య సమస్య అని,  శరీరంలోని అనేక ఇతర అవయవాలకు కూడా తీవ్రమైన హానిని కలిగిస్తుందని చెబుతున్నారు.  రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్న సమస్యను హైపర్గ్లైసీమియా అంటారు. దీని బారిన పడిన వ్యక్తులు అంటు వ్యాధులు, కిడ్నీ వ్యాధి, చూపు మందగించడం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటారు. మధుమేహం సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి.  కొన్నిసార్లు రక్తంలో అధికంగా చక్కెర స్థాయిలు ఉండటం వల్ల ప్రాణాంతక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కళ్లు, కిడ్నీ.. హై బ్లడ్ షుగర్ సమస్య (హైపర్గ్లైసీమియా) కంటి రక్తనాళాలను దెబ్బతీయడం ప్రారంభిస్తుంది.  దీని కారణంగా  అస్పష్టమైన దృష్టి సమస్య రావచ్చు. ఇది మాత్రమే కాదు రక్తంలో చక్కెర స్థాయిలు  నియంత్రణలో కాకుండా  తరచుగా ఎక్కువగా ఉంటే, అది  కంటి చూపు పోవడానికి కూడా దారి తీస్తుంది. మధుమేహం వల్ల వచ్చే కంటి సమస్యలను డయాబెటిక్ రెటినోపతి అంటారు. అదేవిధంగా రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే అది మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. ఇది దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధికి దారితీస్తుంది. రక్తంలో అధిక చక్కెర మూత్రపిండాల రక్తనాళాలను దెబ్బతీస్తుంది,  అవి పాడైపోయే ప్రమాదం ఉంది.   గాయాలు.. మధుమేహ వ్యాధిగ్రస్తులలో గాయాలు చాలా సాధారణం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, హైపర్గ్లైసీమియా రోగనిరోధక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా గాయాలను నయం చేయడానికి శరీరం  ప్రతిస్పందన నెమ్మదిగా మారుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు రోజులలో మానాల్సిన గాయాలు మానడానికి కొన్ని నెలలు పట్టవచ్చు. ఇన్పెక్షన్.. హైపర్గ్లైసీమియా  కారణంగా, రోగులలో సంక్రమణ ప్రమాదం ఇతర వ్యక్తుల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి రోగులకు తీవ్రమైన మూత్రపిండ సమస్యలను కలిగించే మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. హైపర్గ్లైసీమియాకు కారణమయ్యే ఇన్ఫెక్షన్లు శరీరంలో ఒత్తిడి ప్రతిస్పందనకు దారితీస్తాయి, ఇది కార్టిసాల్,  అడ్రినలిన్ హార్మోన్ స్రావాన్ని పెంచుతుంది.                                 *రూపశ్రీ.

ఈ మూడు ఆహారాలు తింటే చాలు.. బాడీ స్టామినా అదే పెరుగుద్ది..!

  శరీరాన్ని కాపాడటంలో స్టామినాది చాలా ముఖ్యమైన పాత్ర.  ఇది శరీరాన్ని తొందరగా అలసిపోకుండా చేయడంలో,  పెద్ద పెద్ద పనులను సునాయాసంగా చేయడంలో, ఏదైనా శారీరక ఇబ్బంది ఏర్పడినా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.  కానీ స్టామినా తక్కువ ఉంటే  శరీరం తొందరగా అలసిపోతుంది.  బాగా నీరసంగా అనిపిస్తుంది. ఎప్పుడూ శరీరానికి ఏదో జబ్బు పడ్డట్టు ఉంటుంది.  అయితే స్టామినాను పెంచుకోవడం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది.  కేవలం మూడు ఆహారాలు తింటూ ఉంటే చాలు.. శరీర స్టామినా ఊహించని విధంగా పెరుగుతుందట. ఇంతకీ ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. బాదం.. బాదం పప్పు స్టామినా పెరగడానికి బాగా సహాయపడుతుందట.  బాదం  పప్పులో ప్రోటీన్, విటమిన్-ఇ,  ఐరన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి అమితమైన బలాన్ని ఇవ్వడమే కాకుండా శరీరం బరువు పెరగకుండా చేస్తుంది.  మెదడుకు పదును పెడుతుంది.  ఎముకలను బలోపేతం చేస్తుంది.   అరటిపండ్లు.. అరటిపండ్లలో విటమిన్లు సమృద్దిగా ఉంటాయి.  ఇందులో  ఫైబర్,  పొటాషియం ఉంటాయి.  ఇవి శరీరానికి శక్తిని ఇస్తాయి.  రోజూ ఒక అరటిపండు అయినా తింటూ ఉంటే బాడీ స్టామినా అనూహ్యంగా పెరుగుతుంది.  వ్యాయామం చేసేవారు,  ఫిట్ నెస్ ను తమ దినచర్యలో ఉంచుకునేవారు అరటిపండ్లు తప్పనిసరిగా తింటారు.  అరటిపండ్లు డోపమైన అనే హార్మోన్ ను ప్రోత్సహిస్తాయి.  ఇది అలసటను, పనిచేసేటప్పుడు నీరసం రాకుండా చేస్తుంది. ఆకుపచ్చ ఆకుకూరలు.. ఆకుకూరలను  ప్రతిరోజూ తీసుకునేవారి శరీర స్టామినా మెరుగ్గా ఉంటుంది. ఇది శరీరానికి శక్తి పెంచడంలో బాగా సహాయపడుతుంది. ఆకుకూరలలో విటమిన్-ఎ, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా పాలకూర,  మెంతికూర,  మునగ ఆకు,  బచ్చలికూర ఆహారంలో తీసుకోవడమే కాకుండా.. ఆకుకూరల జ్యూస్ కూడా తీసుకోవచ్చు.                                               *రూపశ్రీ.  

ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్.. ఈ ఆహారాలు తింటే పొట్ట కొవ్వు ఐస్ లా కరుగుతుంది..!

  బరువు తగ్గడానికి ఏమి తినాలి, వేగంగా బరువు తగ్గడానికి ఏమి తినాలి, పొట్ట కొవ్వు తగ్గడానికి ఉదయాన్నే ఏమి తినాలి, వేగంగా బరువు తగ్గడానికి ఏ ఆహారం సహాయపడుతుంది? ఇప్పట్లో చాలా మంది నెట్టింట్లో  సెర్చ్ చేస్తున్న విషయం  ఇది.  దీనికి తగ్గట్టే ఈ కాలంలో చాలా మంది బానడంత పొట్టతోనూ,  అధికబరువు తోనూ ఇబ్బంది పడుతున్నారు. ఊబకాయం  అందాన్ని పాడు చేయడమే కాకుండా క్యాన్సర్,  మధుమేహం నుండి గుండెపోటు వరకు అనేక   ప్రాణాంతక వ్యాధుల వైపు ప్రజలను నెట్టివేస్తుంది. ముఖ్యంగా చాలా మంది పొట్ట, నడుము చుట్టూ కొవ్వు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చాలా సార్లు, ఆరోగ్యకరమైన ఆహారం మైంటెన్ చేసినా  జిమ్‌కి వెళ్లినా ఈ పొట్ట కొవ్వు మాత్రం తగ్గదు.  పొట్ట తగ్గాలంటే తక్కువ కేలరీలు కలిగిన ఆహారం తినాలి. ఇవి పొట్టను తగ్గిస్తాయి.  ఈ ఆహారాల లిస్ట్ తెలుసుకుంటే.. దోసకాయ.. దోసకాయలో కేలరీలు తక్కువ,  ఫైబర్ అధికంగా ఉండటం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది. 104 గ్రాముల దోసకాయలో 16 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులోని ఫైబర్ ప్రేగు కదలికలకు సహాయపడుతుంది.  ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దోసకాయలు ఎక్కువగా నీరుతో నిండి ఉంటాయి., ఇది ఆకలిని తగ్గిస్తుంది. ఇందులో  చక్కెర ఉండదు కాబట్టి ఇ బరువు పెరుగుతామనే ప్రశ్నే ఉండదు. పార్స్లీ.. పార్స్లీ ఆకులు ఫైబర్,  పోషకాలకు మంచి మూలం.  కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి ఇది గొప్ప ఆహారంగా సహాయపడుతుంది. పార్స్లీలో ఉండే పీచు ఎక్కువ సేపు  కడుపు నిండుగా ఉండేందుకు సహాయపడుతుంది. పార్స్లీలో 95% నీరు ఉంటుంది. కాబట్టి ఇది హైడ్రేటెడ్‌గా ఉండటానికి  సహాయపడుతుంది. పుచ్చకాయ.. పుచ్చకాయ బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఎందుకంటే ఇందులో ఎక్కువగా నీరు ఉంటుంది.   విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పుచ్చకాయ గింజలు ఫైబర్, ప్రోటీన్,  ఆరోగ్యకరమైన కొవ్వుల  మంచి మూలం. పుచ్చకాయలో 90% నీరు ఉంటుంది. కాబట్టి ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. పుచ్చకాయలో విటమిన్ ఎ,  సి అధికంగా ఉంటాయి, ఇది  జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. పుచ్చకాయ గింజల్లో ఫైబర్, ప్రొటీన్లు, విటమిన్లు,  మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి  కడుపు నిండుగా ఉండేందుకు,  ఆకలిని తగ్గించడంలో సహాయపడతాయి. గుమ్మడికాయ.. గుమ్మడికాయ తక్కువ కేలరీల కూరగాయ. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో ఫైబర్,  నీరు అధికంగా ఉంటాయి. ఇది  కడుపు నిండుగా అనిపించేలా,  తక్కువ తినడానికి సహాయపడుతుంది. పాస్తా లేదా బియ్యం వంటి అధిక కేలరీల పదార్థాలకు ప్రత్యామ్నాయంగా కూడా దీనిని ఉపయోగించవచ్చు. ఇది 100 గ్రాములకు దాదాపు 17 కేలరీలు కలిగి ఉంటుంది. ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను నెమ్మది చేస్తుంది.  ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. బ్రోకలీ.. బ్రోకలీ బరువు తగ్గడానికి మంచి ఎంపిక. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి.  ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్,  యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో,   జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. బ్రోకలీలో విటమిన్ ఎ, సి,  కె అలాగే ఫోలేట్,  పొటాషియం ఉంటాయి. బ్రోకలీలో ఉండే సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనం ఆకలిని అణిచివేసేందుకు,  రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. పైన పేర్కొన్న ఆహారాలే  కాకుండా టొమాటోలు, పుట్టగొడుగులు, పాలకూర, క్యాబేజీ, బ్లాక్ కాఫీ వంటివి ఆహారంలో చేర్చుకుంటే మంచిది. బ్లాక్ కాఫీలో కెఫిన్ ఉంటుంది. ఇది అధిక ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే అధిక కెఫీన్ మంచిది కాదు.                                    *రూపశ్రీ.

చలికాలంలో ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే ఈ అయిదు రకాల సూప్ లు ట్రై చేయండి..!

  చలికాలం శరీరాన్ని చాలా ఇబ్బంది పెడుతుంది.  సాధారణ రోజుల్లో తీసుకునే ఆహారం స్థానంలో చాలా మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా చలికాలంలో వేడిగా ఉన్న ఆహారాలు కానీ పానీయాలు కానీ తీసుకోవాలని అనిపిస్తుంది. అయితే వేడిగా ఉన్న లిక్విడ్ ఆహారాలు తీసుకునే విషయంలో కాఫీ, టీ వంటి డ్రింక్స్  ఏ మొదటి స్థానంలో ఉంటాయి. కానీ చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే సూపులు బెస్ట్ ఆప్షన్. ఇవి ఒకవైపు శరీరానికి ఓదార్పును ఇస్తూ.. మరొకవైపు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.  ఫలితంగా చలికాలంలో ఇన్ఫెక్షన్లు,  అనారోగ్యం చేయడం, సీజన్ సమస్యల నుండి ఊరట లభిస్తుంది.  ఇంతకీ శరీరానికి అంతగా మేలు చేసే సూపులు ఏంటో.. వాటిలో ఉండే పోషకాలు ఏంటో తెలుసుకుంటే.. పాలకూర, బఠానీ సూప్.. పాలకూర ఐరన్ కంటెంట్ కు ప్రసిద్ధి చెందింది.  రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడేవారు పాలకూర సమృద్దిగా తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతారు. ఇకపోతే పాలకూర,  బఠానీ సూప్ లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.  చలికాలంలో శరీరానికి తగినంత ఐరన్ లభించడంతో శరీరంలో రోగనిరోధక శక్తి కూడా బాగా లభిస్తుంది. బ్రోకలీ సూప్.. బ్రోకలీ, క్యాప్సికం రెండింటి లోనూ విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బ్రోకలీ సూప్ ను తీసుకోవడం వల్ల శరీరానికి కావలసినంత విటమిన్-సి అందుతుంది. బీన్ సూప్.. బీన్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. బీన్స్ లో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్లు కూడా ఉంటాయి.  బీన్స్ తో తయారు చేసిన సూప్ ను చలికాలంలో తీసుకోవడం వల్ల శరీరంలో నొప్పులు కూడా తగ్గుతాయి. మెంతి కూర సూప్.. మెంతి కూర చేదు గురించి చాలా మంది కంప్లైంట్ చేస్తారేమో.. కానీ మెంతికూరతో సూప్ చేసుకోవచ్చు.  లేత మెంతికూర ను సూప్ గా తయారు చేసుకుని తాగితే బోలెడు లాభాలు ఉంటాయి.  మెంతికూరలో ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. ఇది డయాబెటిక్ రోగులకు కూడా చాలా సహాయపడుతుంది.                                      *రూపశ్రీ.  

పిల్లలకు ఈ ప్రదేశాలలో తగిలే గాయాలను నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదమూ తెలుసా?

  పిల్లలు ఒక్క చోట కుదురుగా ఉండరు. వాళ్లకు కాస్త నడక వచ్చిందంటే చాలు.. ఉరుకులు, పరుగులు పెడుతుంటారు. తమ తల్లిదండ్రులను, పెద్దలను కూడా పరుగులు పెట్టిస్తారు. అయితే కాళ్లు, చేతుల ప్రాంతాలలో కలిగే గాయాలు, దెబ్బలు మందు రాస్తే లేదా కాస్త విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతాయి. కానీ పిల్లల హడావిడి ఆటల్లో వారికి  చాలా సార్లు తలకు దెబ్బలు తగులుతూ ఉంటాయి.  నిజానికి ఇలా తలకు దెబ్బలు తగిలినప్పుడు నొప్పి కలుగుతుంది.  పిల్లలు నొప్పికి ఏడిస్తే బుజ్జగించడం,  దెబ్బ తగిలిన ప్రాంతంలో  రుద్దడం వంచివి చేయడం వల్ల నొప్పి  తగ్గేలా చేస్తారు.  గాయాలు అయ్యి చర్మం  దెబ్బ తిన్నప్పుడు లేదా రక్తం కారడం వంటివి జరిగినప్పుడు తప్ప వైద్యులను సంప్రదించడం జరగడం లేదు.  అయితే  పిల్లలకు పదే పదే తలకు దెబ్బ తగలడం అంత తేలికగా తీసుకోవాల్సి విషయం కాదని చిన్న పిల్లల వైద్యులు చెబుతున్నారు. చిన్న పిల్లలకు ఏదైనా గాయాలు తగిలినప్పుడు  చాలా వరకు ఇంటి చిట్కాలతో నయం చెయ్యాలని చూస్తారు. పిల్లలకు కోతలు,  కాలిన గాయాలు జరిగితే వాటిని అస్సలు తేలికగా తీసుకోకూడదు. చాలామంది పేస్ట్ రాయడం,  కొబ్బరినూనె రాయడం, బర్నల్ వంటి ఆయింట్మెంట్లు రాయడం,  పసుపు పెట్టడం వంటివి చేస్తారు. కానీ చిన్న పిల్లల విషయంలో ఇవి చేయకూడదు. వారిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లడం మంచిది. పిల్లలకు తగిలే గాయాలు, వారికి అయ్యే కోతలు వంటివి కొన్నిసార్లు పైపైన కాకుండా లోతుగా జరిగి ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో డాక్టర్లు ఇచ్చే వైద్యమే సరైనది. తల గాయాలు.. పిల్లల గురించి ఎంత జాగ్రత్త తీసుకున్నా సరే.. పదే పదే దెబ్బలు తగిలించుకుంటూనే ఉంటారు. చాలా వరకు తలకు దెబ్బలు తగులుతాయి కానీ ఎలాంటి నష్టం బయటకు కనిపించదు.  కానీ ఇలాంటి దెబ్బలు ఎక్కువగా తగులుతూ ఉంటే మెదడుకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది.   ముఖ్యంగా ఇన్పెక్షన్  సమస్యలు ఎక్కువగా ఉంటాయి. పిల్లలకు గాయాలు, దెబ్బలు తగిలితే మొదట గాయాలు క్లీన్ చేయడానికి శుభ్రమైన నీరు, డెట్టాల్ లేదా మెడికేషన్ వైప్ వంటివాటితో శుభ్రం చేయాలి. వైద్యులు సూచించిన మందులను ముందు జాగ్రత్తగా ఫస్ట్ ఎయిడ్ లో భాగంగా వాడాలి.  తరువాత వైద్యుడిని సంప్రదించాలి.  తగిలిన ప్రాంతం నల్లగా లేదా నీలం రంగులో కనిపిస్తే లోపలి ప్రాంతంలో రక్తం గడ్డ  కట్టిందని అర్థం.  వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పిల్లలకు తగిలే దెబ్బల విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.                                      *రూపశ్రీ.  

ఎన్ని నీళ్లు తాగినా మళ్లీ మళ్లీ దాహం వేస్తోందా?   కారణం ఇదే కావచ్చు..!

  దాహం వేసినప్పుడు నీళ్లు తాగడం చాలా సాధారణం.  అయితే కొందరికి ఎప్పుడూ దాహంగా అనిపిస్తూ ఉంటుంది. ఎన్ని సార్లు, ఎన్ని నీళ్లు తాగినా సరే.. దాహం తీరదు. ఈ పరిస్థితి ఏంటో అర్థం కాక చాలామంది గందరగోళానికి గురవుతూ ఉంటారు. శరీరంలో వేడి ఎక్కువ అవ్వడం వల్ల ఇలా జరుగుతుందని సమాధానం చెప్పుకుని కొందరు ఈ సమస్యను లైట్ తీసుకుంటారు.  కానీ విపరీతమైన దాహం అనేది కొన్ని వ్యాధులకు సూచన అని,   ఈ సమస్య వల్ల వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు.   ఇంతకీ ఎప్పుడూ దాహంగా అనిపించడం సమస్య అవుతుందా? దీని వెనుక కారణాలు ఏంటి? ఇవి ఏ జబ్బులు కలిగిస్తాయి? తెలుసుకుంటే.. వేసవికాలంలో దాహం వేయడం సహజం.  అయితే దాహం వేసినప్పుడు నీరు తాగితే దాహం తీరుతుంది. కానీ కాలంతో సంబంధం లేకుండా కొందరికి పదే పదే దాహం వేస్తూ ఉంటుంది. ఇలా తరచుగా దాహం వేయడం అనేది శరీరం ఎక్కువగా డీహైడ్రేట్ అవుతూందనడానికి సూచన. మధుమేహం.. కొందరికి పదే పదే దాహం వేస్తూ ఉంటుంది.  చాలామందికి తెలియదు కానీ ఇది మధుమేహానికి సూచన.  ఎప్పుడూ గొంతు పొడిబారడం,  దాహం వేయడం అనేవి  రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల జరుగుతాయట.  రక్తంలో అదనపు చక్కెరను తొలగించడానికి మూత్రపిండాలు చాలా కష్టపడాల్సి వస్తుంది.  ఈ కారణంగా శరీరం నుండి ద్రవం ఎక్కువగా చెమట,  మూత్రం రూపంలో బయటకు వెళ్లిపోతుంది.  దీని వల్ల పదే పదే దాహం వేస్తుంది.   రక్తహీనత.. శరీరంలో తగినంత రక్తం లేకపోతే దాన్ని రక్తహీనత అంటారు. ఎర్ర రక్తకణాలు శరీరంలో తగినంత  ఉత్పత్తి చేయబడవు.  శరీరంలో రక్తం తక్కువగా ఉంటే శరీరం డీహైడ్రేట్ కు గురికావడం,  పదే పదే దాహం వేయడం జరుగుతుంది.  పొడి గొంతు సమస్య కూడా పెరుగుతుంది. జీర్ణక్రియ.. వేయించిన ఆహారాలు,  నూనెలో డీప్ ప్రై చేసిన ఆహారాలు,  తీపి పదార్థాలు మొదలైనవి తిన్నప్పుడల్లా జీర్ణక్రియ పై ఎక్కువ ప్రభావం పడుతుంది. దీని వల్ల కడుపులో ఇబ్బంది ఏర్పడుతుంది.   ఇదే పదే పదే దాహం వేయడానికి కారణం అవుతుంది.                                   *రూపశ్రీ.  

చలికాలంలో కుంకుమ పువ్వు పాలు తాగితే కలిగే బెనిఫిట్స్ తెలుసా?

  వాతావరణాన్ని బట్టి ఆహారపు అలవాట్లు మారతాయి.  వేసవిలో చల్లగా ఏమైనా తాగాలని అనుకుంటాం. అదే చలికాలం వచ్చే సరికి ఆహారపు అలవాట్ల ఎంపిక నుండి ఆహారం ఉండే స్థితి వరకు అన్నీ మారతాయి.  ముఖ్యంగా చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే పానీయాలు,  ఆహారాలు తీసుకోవాలని అనుకుంటారు. అలాగే రోగనిరోధక శక్తి పెంచే ఆహారాలు తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి కోవకు చెందినదే కుంకుమ పువ్వు పాలు.  చలికాలంలో చాలామంది కుంకుమ పువ్వు జోడించిన పాలు తాగాలని అనుకుంటారు.  కుంకుమ పువ్వు పాలు తాగితే కలిగే బెనిపిట్స్ ఏంటంటే.. కుంకుమ పువ్వు ఖరీదైన మసాలా దినుసు.  అయినా సరే కొన్ని సందర్భాలలో కుంకుమ పువ్వును తప్పక వాడతారు. కుంకుమ పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.  జలుబు,  దగ్గు వంటి వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే సెరోటోనిన్ హార్మోన్ పాత్ర చాలా ముఖ్యం.  కుంకుమ పువ్వు సెరోటోనిన్ హార్మోన్ ను ప్రోత్సహిస్తుంది.  అందుకే కుంకుమ పువ్వు పాలు తాగితే ఒత్తిడి తగ్గుతుంది.  గర్భవతులు కుంకుమ పువ్వును పాలలో కలుపుకుని తాగాలనే నిబంధన పెట్టినది కూడా వారిలో గర్భధారణ కారణంగా ఏర్పడే ఒత్తిడి నియంత్రణలో ఉండాలనే. కుంకుమ పువ్వును పాలలో కలుపుకుని తాగేటప్పుడు చాలా కొద్ది పరిమాణమే ఉపయోగిస్తారు.  కేవలం కొన్ని కుంకుమ పువ్వు రేకలను ఉపయోగిస్తారు.  కానీ ఇది చాలా శక్తివంతమైనది.  ఇది జీర్ణశక్తిని బలపరుస్తుంది.  అజీర్ణం,  మలబద్దకం వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. కుంకుమ పువ్వులో యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.  ఇవి చర్మం కాంతివంతంగా, యవ్వనంగా మార్చడంలో సహాయపడతాయి. రోజూ కుంకుమపువ్వు పాలు తాగుతుంటే వయసు పెరిగినా అందం తగ్గదు. కుంకుమ పువ్వులో కాల్షియం ఉంటుంది. అలాగే పాలలో కూడా కాల్షియం ఉంటుంది.  ఇది ఎముకలను బలపరుస్తుంది.  బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యలను నివారిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కుంకుమ పువ్వు ప్రభావవంతంగా పనిచేస్తుంది.  కుంకుమ పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు మేలు చేస్తాయి. అలాగే కుంకుమ పువ్వులో కంటికి మేలు చేసే విటమిన్-ఎ కూడా ఉంటుంది. మహిళలు పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి, కడుపులో కండరాల తిమ్మిరి వంటి సమస్యలతో  ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ నొప్పిని, తిమ్మిరిని తగ్గించడంలో కూడా  కుంకుమ పువ్వు పాలు సహాయపడతాయి. కుంకుమ పువ్వు పాలు నిద్ర బాగా పట్టడంలో సహాయపడతాయి.  చలికాలంలో ప్రతిరోజూ కుంకుమ పువ్వు పాలు తాగడం వల్ల  పైన చెప్పుకున్న ప్రయోజనాలు అన్నీ చేకూరతాయి.                                              *రూపశ్రీ.  

వేయించిన శనగలు తింటే ఇన్ని లాభాలు ఉంటాయని తెలుసా?

    శనగలు భారతీయులు ఆహారంలో బాగా ఉపయోగించే పప్పు ధాన్యం.  బస్సు ప్రయాణాలలో,  పార్కుల దగ్గర, సినిమా సెంటర్ల దగ్గర, స్కూళ్ల దగ్గర వేయించిన శనగలు తింటూ ఎంజాయ్ చేసేవారు బోలెడు మంది ఉంటారు. ఈ వేయించిన శనగలు పది, ఇరవై ఏళ్ల కిందట మంచి టైం పాస్ చిరుతిండి. ఇప్పుడు అవే శనగలు పోషకాహార జాబితాలో ఉంది. కాల్చిన శనగలను తినడం వల్ల ఆరోగ్యం చాలా బావుంటుందని అంటున్నారు.  ఇంతకీ ఈ కాల్చిన శనగలను తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుంటే.. పోషకాలు.. వేయించిన శనగలలో ప్రోటీన్,  ఫైబర్,  కాల్షియం,  మెగ్నీషియం,  ఫాస్పరస్,  ఐరన్,  కార్బోహైడ్రేట్లు, ఫోలేట్,  యాంటీ ఆక్సిడెంట్లు మొదలైన పోషకాలు ఉంటాయి.  చలికాలంలో వేయించిన శనగలు తినడం వల్ల ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి. శనగలను సాధారణ కాలంలోనే కాకుండా చలికాలంలో కూడా నిక్షేపంగా తినవచ్చు. ఎముకలు బలంగా ఉండాలంటే   వేయించిన శనగలను తీసుకవడం మంచిది.  శనగలలో ఉండే కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం వేయించిన శనగలలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది.  విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్బుతంగా సహాయపడుతుంది. అందుకే ప్రతి రోజూ వేయించిన శనగలు తింటూ ఉంటే రోగనిరోధ శక్తి కూడా బలపడుతుంది. శరీరానికి మంచి శక్తి లభించాలంటే వేయించిన శనగలు తినడం మంచి మార్గం.  సాధారణంగా పచ్చి శనగలను కూర చేసుకుంటారు. కానీ వాటిని రోజూ వండుకోలేం. అదే వేయించిన శనగలు అయితే రోజూ కొన్ని తినవచ్చు.  వేయించిన శనగలలో కార్బోహేడ్రేట్లు, ప్రోటీన్,  ఐరన్ పుష్కలంగా ఉంటాయి.  ఇవన్నీ శరీరానికి అమితమైన శక్తిని ఇస్తాయి. వేయించిన శనగలు తింటే శక్తి లభించడం,  రోగనిరోధక శక్తి పెరగడం, ఎముకలు బలంగా మారడం మాత్రమే కాదు.. మధుమేహ రోగులకు చాలా మంచిది.   వేయించిన శనగలను స్నాక్స్ గా తీసుకుంటే  రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. బరువు  తగ్గాలని అనుకునే వారు చిరుతిండిగా వేయించిన శనగలు తీసుకుంటే మేలని ఆహార నిపుణులు చెబుతున్నారు.  పైగా ఇప్పట్లో ప్రతి ముగ్గురు వ్యక్తులలో ఒకరు అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.  వేయించిన శనగలలో కేలరీలు చాలా తక్కువ.  పైగా ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ఇస్తుంది.   చలికాలంలో జీర్ణసమస్యలు వస్తుంటాయి.  ఇలాంటి సమయంలో  ఆహారం జీర్ణం కాకపోవడం,  మలబద్దకం,  గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు ఒక దాని వెంట ఒకటి వస్తాయి.  వీటికి చెక్ పెట్టాలంటే వేయించిన శనగలు చాలా మంచి ఆప్షన్. ఎందుకంటే వేయించిన శనగలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.                                        *రూపశ్రీ.

ఒత్తిడిని తగ్గించే ఈ నూనెల గురించి తెలుసా..?

  ఒత్తిడి చాలామందిని వేధించే సమస్య. ఇప్పటికాలం బిజీ జీవితాలలో ఒత్తిడి లేదు అంటే ఆశ్చర్యపోవాలి కానీ.. ఒత్తిడి ఉందంటే పెద్దగా వింతగా ఫీలవ్వాల్సింది ఏమీ లేదు. అయితే ఒత్తిడి సమస్య ఉంది కదా అని అందరూ అలాగే ఉండిపోరు.. ఒత్తిడిని నిర్లక్ష్యం చేస్తే అది తీవ్ర సమస్యకు దారితీస్తుందని వైద్యులు చెబుతూనే ఉన్నారు.  అందుకే ఒత్తిడి తగ్గించుకోవడానికి  వైద్యులను కలవడం నుండి,  జీవనశైలి,  ఆహారపు అలవాట్లు మార్చుకోవడం వరకు చాలా పాటిస్తారు.  ఈ కోవకు చెందినదే ఒత్తిడి తగ్గించే నూనెలు వాడటం.  కొన్ని రకాల నూనెలు ఒత్తిడిని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి.  అదేలా అంటే.. ఒత్తిడిని తగ్గించడంలో అరోమాథెరపీ చాలా బాగా పనిచేస్తుంది.  కొన్ని రకాల వాసనలు మనసుకు, మెదకుడు చాలా గొప్ప ఓదార్పును ఇస్తాయి.  ఇవి ఒత్తిడి హార్మోన్లను నియంత్రించడం,  తగ్గించడం ద్వారా ఒత్తిడిని తగ్గించడంలో పనిచేస్తాయి. అలాంటి నూనెలు ఏనో తెలుసుకుంటే.. లావెండర్ ఆయిల్.. లావెండ్ ఆయిల్ ను చాలా రకాలుగా ఉపయోగిస్తారు.  సోపులు,  పెర్ఫ్యూమ్, ఎయిర్ ఫ్రెషనర్లు, వివిధ రకాల క్రీములు మొదలైనవాటిలో ఉపయోగిస్తారు. లావెండర్ ఆయిల్ ను డిఫ్యూజర్ లో ఉంచవచ్చు లేదా చర్మానికి అప్లై చేయవచ్చు.  లేదంటే ఇంట్లోనే ఒక దీపం వెలిగించి దాని పైన ఒక చిన్న కప్ లో నీరు పోసి అందులో లావెండర్ ఆయిల్ ను కొన్ని చుక్కలు వేయవచ్చు. ఇది గది మొత్తాన్ని కూడా చాలా సువాసనా భరితంగా మార్చేస్తుంది. ఫలితంగా ఒత్తిడి తగ్గుతుంది. శాండల్ ఆయిల్.. శాండల్ ఆయిల్ లేదా గంధపు నూనె చాలా మంచి సువాసన కలిగి ఉంటుంది. ధ్యానం చేసేటప్పుడు, నిద్రపోయేముందు ఈ నూనెను  వాడితే చాలా మంచి ఫలితం ఉంటుంది.  ఇది మానసకి ఒత్తిడిని చాలా బాగా తగ్గిస్తుంది. రోమరిన్ ఆయిల్.. రోమరిన్ ఆయిల్ అనేది ఒత్తిడిని తగ్గించడంలో మాత్రమే కాకుండా మానసిక అలసటను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.  దీని సువాసన మానసికోల్లాసాన్ని ఇస్తుంది. పిప్పరమెంట్ ఆయిల్.. పిప్పరమెంట్ చాలా రకాల ఆహారాలు,  ప్రోడక్ట్ లలో చూస్తుంటాం. ఇందులో ఉండే మెంథాల్ ఫ్లేవర్ కూలింగ్ ఎఫెక్ట్ కలిగి ఉంటుంది.  పిప్పరమెంట్ ఆయిల్ వాసన తలనొప్పి, మానసిక అలసట,  మైగ్రేషన్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇది మానసకి శక్తి స్థాయిలను పెంచుతుంది. జాస్మిన్ ఆయిల్.. జాస్మిన్ ఆయిల్ లేదా మల్లెపూల నూనె చాలా సువాసన కలిగి ఉంటుంది.  ఈ నూనె జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.  ఏకాగ్రత పెంచడంలో సహాయపడుతుంది.  మానసిక ఒత్తిడిని చాలా సులువుగా తగ్గిస్తుంది. ఆరెంజ్ ఆయిల్.. ఆరెంజ్ ఆయిల్ ఒత్తిడిని తగ్గించడంతో పాటు మానసిక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. మానసిక అలసటను తగ్గిస్తుంది. యూకలిప్టస్ ఆయిల్.. యూకలిప్టస్ ఆయిల్ లేదా నీలగిరి తైలం చాలా మంచి సువాసన కలిగి ఉంటుంది. ఇందులో చాలా ఔషద గుణాలు ఉంటాయి.  ఈ నూనె జలుబు, దగ్గు, శ్వాస సంబంధ ఔషదాల తయారీలో ఉపయోగించబడుతుంది.   ఈ నూనెను వినియోగించి  ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.                                           *రూపశ్రీ.  

 శీతాకాలంలో కాలేయాన్నిఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు..!

  కాలేయం శరీరంలోని ముఖ్యమైన అవయవం. ఇది టాక్సిన్స్‌ను తొలగించి, రక్తాన్ని శుద్ధి చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది. వాతావరణ పరిస్థితిని బట్టి కాలేయాన్ని శుద్ది చేసుకోవడం,  కాలేయ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవడం చేయాలి. వేసవి కాలంలో కాలేయాన్ని శుద్ది  చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి.  అయితే శీతాకాలంలో కాలేయాన్ని శుద్ది చేసుకోవడం గురించి చాలామందికి తెలియదు. శీతాకాలంలో కాలేయాన్ని శుద్ది చేసుకోవాలంటే ఈ కింది టిప్స్ పాటించాలి. పసుపు, అల్లం, నిమ్మకాయ.. శీతాకాలంలో పసుపు, అల్లం,  నిమ్మ వంటి సహజ పదార్థాలు శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సమర్థవంతంగా పని చేస్తాయి. పసుపులో యాంటీఆక్సిడెంట్ గుణాలు అలాగే కర్కుమిన్ అనే మూలకం ఉంటుంది.  ఇది కాలేయ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. అల్లం జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది,  కాలేయానికి మేలు చేస్తుంది. అంతే కాకుండా, నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.  ఇది శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.  ఈ మూడింటి మిశ్రమాన్ని తీసుకోవచ్చు లేదా  ఎంపిక ప్రకారం వివిధ రూపాల్లో తినవచ్చు. వాటిని గోరువెచ్చని నీటితో కూడా తీసుకోవచ్చు. ఇది కాలేయానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సిట్రస్ పండ్లు.. శీతాకాలంలో నారింజ, నిమ్మకాయలు,  ద్రాక్షపండ్లు వంటి తాజా సిట్రస్ పండ్లు కాలేయాన్ని శుద్ది  చేయడంలో సహాయపడతాయి. సిట్రస్ పండ్లలో సహజ ఆమ్లాలు ఉంటాయి. ఇవి కాలేయం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడతాయి. పండ్లను నేరుగా తినవచ్చు   లేదా జ్యూస్  తయారు చేసి త్రాగవచ్చు. పండ్లు తీసుకోవడం వల్ల  కాలేయంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.  రోగనిరోధక వ్యవస్థను కూడా బలపరుస్తుంది. గోరువెచ్చని నీరు.. చలికాలంలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. చల్లని వాతావరణంలో చాలాశాతం మంది తక్కువ నీరు తాగుతారు. అందువల్ల శరీరం డీహైడ్రేషన్ కు లోనవుతుంది.  అందుకే వేడి లేదా గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. ఇది కాలేయాన్ని శుభ్రపరచడంలో..  శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.  ఉదయాన్నే ఒక గ్లాసు వేడి నీటిని త్రాగడం లేదా  రోజంతా గోరువెచ్చని నీటిని తాగడం చేయవచ్చు. వేడి నీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది,  కాలేయాన్ని క్లీన్  చేయడంలో కూడా సహాయపడుతుంది. పండ్లు, కూరగాయలు.. బచ్చలికూర, ఆవాల ఆకు, ముల్లంగి ఆకులు,  క్యారెట్లు వంటి ఆకు కూరలు శీతాకాలంలో కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ కూరగాయలలో ఫైబర్, విటమిన్లు,  ఖనిజాలు ఉంటాయి, ఇవి శరీరానికి తాజాదనాన్ని అందిస్తాయి.  కాలేయం సక్రమంగా పనిచేస్తాయడంలో సహాయపడతాయి. అంతే కాకుండా బీట్‌రూట్, గుమ్మడికాయ,  బ్రకోలీ వంటి కూరగాయలు కూడా కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి. ఈ పండ్లు,  కూరగాయలలో ఉండే పోషకాలు కాలేయ పనితీరును మెరుగుపరస్తాయి. ఫిజికల్ యాక్టివిటీ.. చలికాలపు సీజన్ లో ఆరోగ్యంగా ఉండాలంటే లివర్ డిటాక్సిఫికేషన్ తో పాటు ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చాలా ముఖ్యం. వ్యాయామం,  యోగా చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.  కాలేయం నుండి టాక్సిన్స్ బయటకు వెళ్లడానికి సహాయపడుతుంది.  చలికాలంలో  దినచర్యలో తేలికపాటి యోగా లేదా ఇతర శారీరక కార్యకలాపాలను చేర్చుకోవచ్చు. మంచి మార్గాలు.. చలికాలంలో కాలేయం శుద్ది చేసుకోవాలంటే.. ఆకు కూరలు, బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటి అనేక కూరగాయలుతో పాటు యాపిల్స్, ద్రాక్ష,  సిట్రస్ పండ్లను తినడం మంచి మార్గం.  వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవోకాడో,  నట్స్ ద్వారా  ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చుకోవచ్చు. ప్రాసెస్ చేసిన ఆహారాలు కాలేయంపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తాయి కాబట్టి వీటిని తగ్గించాలి, వీలైతే మానేయాలి.  ఆహారంలో పసుపు,  అల్లం చేర్చాలి.  ఎందుకంటే అవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. రోజంతా పుష్కలంగా నీరు త్రాగాలి.  నీటిలో  డిటాక్స్ గుణాలు పెరగడానికి  నిమ్మకాయ ముక్కలను జోడించాలి.                                        *రూపశ్రీ.