అరటిపండే కదా అని లైట్ తీసుకుంటారేమో..  దీని లాభాలు తెలిస్తే షాకవుతారు..!

  ఎవరి ఇంటికైనా వెళ్లేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకూడదని అంటారు.  అందుకే చాలామంది పండ్లు తీసుకెళతారు. ఇలా తీసుకెళ్లే పండ్లలో అరటికే ప్రథమ స్థానం ఉంటుంది.  కేవలం ఇలా తీసుకెళ్లడమే కాదు.. ఏ పూజ అయినా, శుభకార్యం అయినా అరటిపండ్లకే ఓటేస్తారు.  రోజుకొక అరటిపండు తినాలని చాలామంది ట్రై చేస్తారు. దీని వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని చెబుతారు.  అరటిపండ్లు ధర కూడా చాలా తక్కువ. అయితే అరటిపండ్లు చవగ్గా లభిస్తాయని,  అందరికి అందుబాటులో ఉంటాయని చాలా  చులకనగా చూస్తారేమో.. కానీ అరటిపండ్లు తింటే కలిగే లాభాలు తెలిస్తే  షాకవుతారు. అరటి పండు చాలా చవకగా లభించే పండు. కానీ ఒక అరటిపండు తిన్నారంటే దాదాపు గంటకు పైగా ఆకలిని భరించవచ్చు. పైగా ఇందులో పోషకాలు శరీరానికి చాలా శక్తిని ఇస్తాయి. అందుకే వ్యాయామం చేసేవారు,  జిమ్ చేసేవారు అరటిపండును వ్యాయామానికి ముందు లేదా తరువాత తప్పకుండా తీసుకుంటారు. అరటిపండు లో పొటాషియం స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అధిక రక్తపోటు రోగులకు అరటిపండు ఎంతో మేలు చేస్తుంది. అరటిపండును చిన్న పెద్ద ఎవ్వరైనా తినగలుగుతారు.  వృద్దులకు, దంతాలు లేని వారికి కూడా అరటి ఎంచుకోదగిన పండు.  అరటిపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం సమస్య నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.  జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. నీరసంగా అనిపించినప్పుడు ఒక్క అరటిపండు తిన్నారంటే శరీరానికి తక్షణ  శక్తి లభిస్తుంది.  అరటిపండులో అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్ ఉంటాయి.  ఇవి శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయి. అలసటగా అనిపించినప్పుడు అరటిపండు తినడం ప్రయోజనకరంగా భావించడానికి ఇదే కారణం. అంతేకాదు..  అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా అరటిపండు తీసుకోమని చెబుతుంటారు.  అది కూడా శరీరానికి శక్తి లభించాలనే.. అరటిపండులో ఉండే పొటాషియం, మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇది గుండెపోటు,  స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది . నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడేవారు అరటిపండు తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందట. అరటిపండులో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.                                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

మోకాళ్లను సంవత్సరాల తరబడి సేఫ్‌గా ఉంచే సూపర్ టిప్స్ ఇవి..!

  వయసు పెరిగే కొద్దీ  ఎముకలు పెళుసుగా,  బలహీనంగా మారతాయి. అయితే అనుసరించే జీవనశైలి,  అలవాట్లు బలమైన ఎముకలకు,  శరీరం  సాఫీగా కదలడానికి దోహదం చేస్తాయి. చాలా మంది మోకాళ్ సమస్య వచ్చేవరకు మోకాళ్ల గురించి అస్సలు ఆలోచించరు. కానీ శరీర బరువును మోసేవి కాళ్లు. ఆ భారం ఎక్కువగా మోకాళ్ల మీద ఉంటుంది. అందుకే ఒక వయసు దాటగానే మోకాళ్లు నొప్పులు రావడం,  లేక ఇతర మోకాళ్ల సంబంధ సమస్యలు రావడం జరుగుతుంది.  అయితే మోకాళ్లను సంవత్సరాల తరబడి ఎలాంటి సమస్యలు చట్టు ముట్టకుండా ఉండేందుకు కొన్ని టిప్స్ పాటించాలి. ఇవన్నీ లైప్ స్టైల్ అలవాట్లలో భాగమే.. అవేంటో తెలుసుకుంటే.. బరువు.. కొంచెం అదనపు బరువు ఉన్నా అది  మోకాళ్లపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. ప్రతి అడుగుతో  శరీర బరువుకు నాలుగు రెట్లు ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం వల్ల ఈ ఒత్తిడి తగ్గుతుంది.  దీర్ఘకాలిక గాయం అయ్యే అవకాశాలు తగ్గుతాయి. మూవ్ మెంట్.. తరచుగా కదలికలు చేయడం వల్ల  మోకాళ్లను సరళంగా ఉంచుకోవచ్చు. అంతేకాదు  కీళ్ళు కూడా  మంచి స్థితిలో ఉంటాయి. నడక, ఈత, సైక్లింగ్ లేదా యోగా వంటి తక్కువ ప్రభావ వ్యాయామాలు మోకాళ్లకు సున్నితంగా  ఉంటాయి. మోకాళ్ల మీద ఒత్తిడి ఉండదు.  కానీ మోకాళ్లను  బలంగా మారుస్తాయి. కండరాల సపోర్ట్.. దృఢమైన కాళ్ళ కండరాలు, ముఖ్యంగా  హామ్ స్ట్రింగ్స్,  క్వాడ్స్,  మోకాళ్ల నుండి ఒత్తిడిని తగ్గిస్తాయి.  వ్యాయామ నియమావళిలో బాడీ వెయిట్ స్క్వాట్‌లు, లెగ్ రైజ్‌లను చేర్చడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.  ఇవన్నీ చేసేటప్పుడు గాయం కాకుండ ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాలి. మోకాళ్ల చుట్టూ ఉన్న కండరాలు బిగుతుగా ఉండటం వల్ల మోకాళ్ల నొప్పులు వస్తాయి. ప్రతిరోజూ స్ట్రెచింగ్స్, ముఖ్యంగా  తొడలు, పిక్కలు,  తుంటిని వదులుగా,  స్ట్రయిట్ గా   ఉంచుతుంది. వ్యాయామం తర్వాత లేదా  రోజు చివరిలో వేగవంతమైన స్ట్రెచింగ్ ను  డైలీ రొటీన్ లో భాగం చేసుకోవాలి. షూస్..  నడవడం లేదా వ్యాయామం చేయడం వంటివి చేసేటప్పుడు  మంచి ఆర్చ్ సపోర్ట్,  కుషనింగ్ ఉన్న బూట్లు ధరించాలి. బాగు్నాయి కదా అని పాత షూస్ ను వర్కౌట్స్ కు సరిపడకపోయినా వేసుకుంటే ఆ తరువాత నష్టాలు ఎదురుచూడాల్సి రావచ్చు. మరొక విషయం ఏమిటంటే.. ఎక్కువసేపు హీల్స్ ధరించకూడదు. ఫోజ్ మార్చుకోవాలి.. ఫోజ్ ను భంగిమ అని కూడా  అంటారు.  సరైన భంగిమ కాకుండా వ్యాయామం చేసేటప్పుడు ఇష్టం వచ్చినట్టు ఫోజ్ లు పెడుతుంటే అది   వీపును గాయపరచడమే కాకుండా,  మోకాలి అమరికను కూడా దెబ్బతీస్తుంది. నిటారుగా నిలబడాలి, నిటారుగా కూర్చోవాలి. అలాగే వ్యాయామం అయినా వాకింగ్ అయినా, యోగా అయినా వాటికి తగిన విధంగా శరీరాన్ని బ్యాలన్స్ చేయాలి. అలాగే  బరువులు ఎత్తేటప్పుడు కూడా ఫోజ్ చూసుకోవాలి.                        *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  

నో ఆయిల్ డైట్.. 30 రోజులు దీన్ని ఫాలో అయితే మ్యాజిక్కే..!

  భారతీయులు  ఆహార ప్రియులు. భారతదేశంలో ఉండే అన్ని వంటకాలు, అన్ని పదార్థాలు మరెక్కడా లభించవని కూడా చెప్పవచ్చు. అయితే భారతదేశంలో ఎక్కువ భాగం ఆహారం నూనె వినియోగం తోనే జరుగుతుంది. నూనె లేకుండా చాలా వంటకాలను అస్సలు తయారు చేయలేరు కూడా.  నూనె భారతీయ  వంటగదిలో ఒక ముఖ్యమైన భాగం. కానీ నూనెను ఎక్కువగా ఉపయోగిస్తే అది ఆరోగ్యానికి విషంగా మారుతుంది. ఆహారంలో ఎక్కువ నూనెను ఉపయోగిస్తే అది ఊబకాయం, గుండె జబ్బులు,  అనేక ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. నూనెలో ఉండే అధిక కేలరీలు శరీరానికి  అనేక విధాలుగా హాని కలిగిస్తాయి. అందుకే ఇప్పుడు  నూనె లేని ఆహారం అనే ట్రెండ్‌ని  చాలామంది అనుసరిస్తున్నారు. ఈ ట్రెండ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.  అసలు నో ఆయిల్ డైట్ అంటే ఏమిటి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి తెలుసుకుంటే.. నూనె లేని ఆహారం అంటే.. నో ఆయిల్ డైట్‌లో ఆహారంలో  నూనె పూర్తిగా తొలగించబడుతుంది. బదులుగా పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, డ్రై ఫ్రూట్స్,  విత్తనాలు వంటి తృణధాన్యాలు  సహజమైనవిగా  తింటారు. వీటిలో ఇప్పటికే కొంత సహజ కొవ్వు ఉంటుంది. అది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. నూనె లేని ఆహారం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఆహారం నుండి నూనెను పూర్తిగా తొలగించినప్పుడు బరువు తగ్గడం సులభం అవుతుంది. ఉడికించిన పప్పులు, కాల్చిన కూరగాయలు,  నూనె లేకుండా చేసిన వాటిని ఆహారంలో చేర్చడం వల్ల కొవ్వు వేగంగా కరుగుతుంది. శుద్ధి చేసిన నూనెలో ఒమేగా-6 కొవ్వులు అధికంగా ఉంటాయి.  దీన్ని  ఆహారం నుండి తొలగిస్తే, శరీరంలో మంట తగ్గుతుంది,  కొలెస్ట్రాల్,  రక్తపోటు నియంత్రణలో ఉంటాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నూనె లేని ఆహారం తీసుకోవడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఇది కడుపు, కాలేయం,  క్లోమంపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది గ్యాస్, ఆమ్లతత్వం,  అపానవాయువు వంటి సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది. ఆహారంలో నూనె వాడకపోవడం ద్వారా ముఖంపై మొటిమలు,  మచ్చలు తగ్గుతాయి. దీనితో పాటు శరీరం కూడా డీటాక్స్ అవుతుంది. ఇది ముఖంపై సహజమైన మెరుపును తెస్తుంది. నూనె పదార్థాలు తినకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.  ఇది తరచుగా ఆకలి, మానసిక స్థితిలో మార్పులు,  అతిగా తినే అలవాటును తగ్గిస్తుంది.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  

టైప్-1, టైప్-2 కాదు.. టైప్-5 డయాబెటిస్ గురించి తెలుసా?

   నేటి బిజీ జీవితంలో ప్రజలు తమ ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నారు. ఆహారపు అలవాట్లు,  అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా  ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనితో పాటు మధుమేహం,  గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతోంది. మధుమేహం గురించి చెప్పాలంటే నేటి కాలంలో ఇది ఒక సాధారణ వ్యాధిగా మారింది. గతంలో ఈ వ్యాధి వృద్ధులలో కనిపించేది, కానీ ఇప్పుడు మధుమేహం చిన్నవారిని కూడా ప్రభావితం చేస్తోంది. సాధారణంగా చాలామందికి టైప్ 1, 2,  3 డయాబెటిస్ గురించి మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు టైప్ 5 డయాబెటిస్ కూడా  పెద్ద ముప్పుగా మారింది.  అధిక శాతం మందికి అసలు ఇన్ని టైప్ ల డయాబెటిస్ ఉంటుందని కూడా తెలియదు. అయితే టైప్-5 డయాబెటిస్ ఇతర రకాల డయాబెటిస్ కంటే చాలా ప్రమాదకరమైనది అంటున్నారు వైద్యులు. ఇతర రకాల డయాబెటిస్ లాగానే టైప్ 5 డయాబెటిస్ రాకముందే  శరీరంలో అనేక లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి.  ఈ లక్షణాలను గుర్తించినట్టైతే సకాలంలో చికిత్స పొందవచ్చు.  ఇంతకీ అవేంటో తెలుసుకుంటే.. టైప్-5 డయాబెటిస్ అంటే ఏమిటి?  బాల్యంలో పోషకాహారం లేకపోవడం వల్ల క్లోమం సరిగ్గా అభివృద్ధి చెందనప్పుడు టైప్ 5 డయాబెటిస్ వస్తుంది. దీని కారణంగా శరీరం తగినంత మొత్తంలో ఇన్సులిన్ (హార్మోన్) ఉత్పత్తి చేయలేకపోతుంది. దీనిని పోషకాహార లోపానికి సంబంధించిన డయాబెటిస్ మెల్లిటస్ (MRDM) అని కూడా అంటారు. ఇన్సులిన్ లేకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.  అంటే డయాబెటిస్ వస్తుంది. 30 ఏళ్లలోపు వారికి ఎక్కువ ప్రమాదం ఉంది. ఈ వ్యాధి సాధారణంగా 30 ఏళ్లలోపు వారిలో కనిపిస్తుంది. 2025 సంవత్సరంలో అంతర్జాతీయ డయాబెటిస్ సమాఖ్య దీనిని టైప్ 5  డయాబెటిస్‌గా అధికారికంగా ప్రకటించింది . ప్రపంచవ్యాప్తంగా 2 నుండి 2.5 కోట్ల మంది దీని బారిన పడవచ్చని అంచనా. పోషకాహార లోపం సాధారణంగా ఉన్న ప్రాంతాలలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ఆసియా,  ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో  వంటి దేశాలలో ఇది రావచ్చు.  దీనికి ఇంకా చికిత్స కనుగొనబడలేదు. టైప్ 5 డయాబెటిస్ లక్షణాలు? ఎక్కువ దాహం వేస్తున్నట్లు అనిపిస్తుంది తరచుగా మూత్రవిసర్జన తలనొప్పి మసక దృష్టి అలసిపోయినట్లు అనిపిస్తుంది  గాయం నెమ్మదిగా నయం కావడం. బరువు తగ్గడం  ఎముక పెరుగుదల నెమ్మదిగా ఉండటం లాలాజల గ్రంథుల విస్తరణ చర్మం,  జుట్టులో మార్పులు. టైప్ 5 డయాబెటిస్ రావడానికి కారణాలు ఏమిటి? బాల్యంలో లేదా గర్భధారణ సమయంలో ఎక్కువ కాలం పోషకాహారం లేకపోవడం వల్ల క్లోమం పూర్తిగా అభివృద్ధి చెందలేకపోతుందని వైద్యులు ఊహిస్తున్నారు. పోషకాలు లేకపోవడం శరీరంలోని అనేక భాగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇందులో క్లోమం కూడా ఉంటుంది.  రక్తంలో చక్కెరను అదుపులో  ఉంచడానికి అవసరమైన ఇన్సులిన్‌ను క్లోమం ఉత్పత్తి చేస్తుంది. టైప్ 5 డయాబెటిస్‌కు ప్రమాద కారకాలు? గుండె జబ్బులు మూత్రపిండాల నష్టం కంటి (రెటీనా) సమస్యలు నరాలకు నష్టం.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  

ఆరోగ్యం కోసం  డీటాక్స్ జ్యూసులు తీసుకుంటున్నారా? ఈ నిజాలు తెలుసా?

  శరీరాన్ని శుద్ది చేసే పానీయాలను డీటాక్స్ జ్యూసులు అని అంటుంటారు. ఈ  డీటాక్స్ జ్యూస్లు లేదా పానీయాలు ఫ్యాటీ లివర్ వ్యాధి లేదా దీర్ఘకాలిక కాలేయ వ్యాధి వంటి తీవ్రమైన కాలేయ సమస్యలను నయం చేయగలవని నమ్ముతారు.  ఈ కారణంగానే డిటాక్స్ పానీయాలకు చాలా ఆదరణ ఉంది. కొందరైతే రోజు మొత్తం డిటాక్స్ నీటినే తాగుతూ ఉంటారు.  సుమారు ఒకటి నుండి రెండు లీటర్ల డీటాక్స్ నీటిని లేదా పానీయాలను తీసుకోవడం వల్ల బరువు తగ్గడం, శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడం వంటివి జరుగుతాయని నమ్ముతారు. కానీ ఈ డిటాక్స్ జ్యూసుల గురించి దిమ్మతిరిగే నిజాలను వెలిబుచ్చుతున్నారు వైద్యులు.  దీని గురించి తెలుసుకుంటే.. డిటాక్స్ జ్యూస్లు  కాలేయ సంబంధిత సమస్యలను తొలగించడంలో లేదా నయం చేయడంలో పెద్దగా సహాయపడవట. బయట అమ్మే డిటాక్స్ జ్యూస్లు లేదా హెర్బల్ డ్రింక్స్  తయారీలో ఉపయోగించే పదార్థాలు,  వాటి కూర్పు గురించి స్పష్టమైన సమాచారం ఉండదు. ఈ ద్రవాలలో కాలేయానికి హానికరమైన భారీ లోహాలు లేదా ఇతర పదార్థాలు ఉండవచ్చు. అందువల్ల వీటిని తీసుకోవడం వల్ల ప్రయోజనాల కంటే కాలేయానికి ఎక్కువ హాని కలిగే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. డీటాక్స్ పానీయాలు కొవ్వు కాలేయ సమస్యలను పెంచుతాయి.. నిజానికి ఈ జ్యూస్లను తీసుకోవడం వల్ల ఇప్పటికే ఉన్న కాలేయ సమస్య మరింత దిగజారిపోతుందట. ఫ్యాటీ లివర్ వ్యాధి నుండి క్రానిక్ లివర్ డిసీజ్,  క్రానిక్ లివర్ డిసీజ్ నుండి ఎండ్-స్టేజ్ లివర్ డిసీజ్ మారవచ్చట. కాబట్టి ఈ జ్యూస్లను తీసుకోకుండా ఉండటం మంచిది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఏం తినాలి.. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి లేదా కాలేయ సమస్యలను నయం చేయడానికి  డీటాక్స్ జ్యూస్లను ఆశ్రయించే బదులు, ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులను అనుసరించడం మంచిదని ఆహార నిపుణులు అంటున్నారు. ఆరోగ్యకరమైన, పోషకమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం. ప్రాసెస్ చేసిన,  కొవ్వు పదార్థాలను అధికంగా తీసుకోవడాన్ని నివారించడం, తరచుగా బయట తినడాన్ని నిషేధించడం చేయాలి.  వీటికి బదులు  ఆరోగ్యకరమైన ఇంట్లో వండిన భోజనాన్ని ఎంచుకోవాలి. రెడ్ మీట్ లేదా ప్రాసెస్ చేసిన మాంసం మానేయాలి.  లేదా వీటిని  పరిమితం చేయాలి.  మాంసాహారం తినాలని ఉంటే   లీన్ మాంసాలను ఎంచుకోవడం ఉత్తమమట. ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి.. ధూమపానం,  అధికంగా  మద్యం సేవించడం వంటి అలవాట్లను నివారించడం కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, కాలేయాన్ని రక్షించడంలో చాలా సహాయపడుతుంది. దీనితో పాటు కాలేయ ఆరోగ్యానికి హాని కలిగించే మధుమేహం,  కొలెస్ట్రాల్ వంటి ప్రమాద కారకాలను నియంత్రించడం కూడా చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు, శారీరక వ్యాయామం,  ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ఈ ప్రమాద కారకాలను నియంత్రించడంలో ఉపయోగపడతాయి.  కాలేయానికి నిజమైన 'డిటాక్స్' అంటే శుభ్రమైన,  పోషకమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి, సకాలంలో వైద్య సలహా.  రోజువారీ ఎంపికలలో చిన్న మార్పులు కూడా దీర్ఘకాలంలో  కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చాలా సహాయపడతాయి. కాలేయ ఆరోగ్యం కోసం డీటాక్స్ జ్యూస్లపై ఆధారపడటానికి బదులుగా, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం మరింత ప్రభావవంతమైన,  సురక్షితమైన విధానం.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

రాత్రి 7-8 లోపు భోజనం చేసి చూడండి.. ఆరోగ్య పరంగా అద్భుతాలు జరుగుతాయి..!

  మంచి ఆరోగ్యం కోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యమైనది. ఈ విషయాన్ని వైద్యులు చెప్పడమే కాకుండా ఆరోగ్యం మీద స్పుహ ఉన్న ప్రతి ఒక్కరూ అదే చెబుతారు.   ఏది తిన్నా అది  ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఆరోగ్య నిపుణులు తీసుకునే ఆహారం పోషకాలతో సమతుల్యంగా ఉండాలని చెబుతారు. అంతేకాదు.. తీసుకునే ఆహారమే కాకుండా ఆహారం తీసుకునే  సమయం  కూడా అంతే ముఖ్యమని చాలా మంది చెబుతారు. కానీ అధిక శాతం మంది తీసుకునే ఆహారం విషయంలో చూపించిన శ్రద్ద ఆహారం తీసుకునే సమయం విషయంలో అస్సలు చూపించరు. నేటి బిజీ లైఫ్ లో రోజంతా హడావిడిగా పనులు చేయడమే కాదు.. హడావిడిగా తినడం కూడా జరుగుతోంది. రాత్రి సమయంలో  కొన్నిసార్లు  9 గంటలకు, కొన్నిసార్లు 10 లేదా 11 గంటలకు తింటుంటారు.  తిన్న  వెంటనే నిద్రపోతారు. కానీ  రాత్రి 7 నుండి 8 గంటల మధ్య ఆహారం తీసుకుంటే ఆరోగ్య పరంగా అద్భుతాలు జరుగుతాయని అంటున్నారు వైద్యులు.  దీని గురించి తెలుసుకుంటే.. 7-8 మధ్య భోజనం ఎందుకంటే.. 7-8 గంటల మధ్య భోజనం చేయడం వల్ల  మొత్తం ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. త్వరగా భోజనం చేయడం వల్ల బరువు తగ్గడమే కాకుండా నిద్ర, గుండె, జీర్ణక్రియ,  చక్కెర నియంత్రణకు కూడా చాలా మంచిది.  త్వరగా భోజనం చేసేవారికి అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం 27% తక్కువగా ఉంటుందని,  అధిక కొలెస్ట్రాల్ వచ్చే ప్రమాదం 19% తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనితో పాటు, బరువు తగ్గడం, జీర్ణ ఆరోగ్యం,  నిద్ర నాణ్యతకు కూడా ఇది 7-8 మధ్య రాత్రి భోజనం చేయడం మంచిది.   రాత్రి 8 గంటల తర్వాత భోజనం చేయడం వల్ల షుగర్ సమస్య వచ్చే ప్రమాదం సాధారణం కంటే 20 శాతం ఎక్కువ ఉంటుందట. జీర్ణశక్తి.. త్వరగా భోజనం చేయడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే అది జీర్ణక్రియను చక్కగా ఉంచుతుంది. రాత్రి 8 గంటల ముందు భోజనం చేసినప్పుడు, శరీరం దానిని జీర్ణం చేసుకోవడానికి తగినంత సమయం తీసుకుంటుంది. ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి దాదాపు 2 నుండి 4 గంటలు పడుతుంది. ఆహారం తిన్న వెంటనే నిద్రపోతే జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది,  గ్యాస్, మలబద్ధకం, ఆమ్లత్వం వంటి సమస్యలు ఏర్పడతాయి. త్వరగా భోజనం చేయడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ (గుండెల్లో మంట) ప్రమాదం 50% తగ్గుతుంది. సూర్యాస్తమయం తర్వాత జీర్ణక్రియ మందగిస్తుందని ఆయుర్వేదం కూడా చెబుతోంది, కాబట్టి రాత్రిపూట తేలికగా,  త్వరగా తినాలి. నిద్ర.. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల శరీరం ఆహారాన్ని జీర్ణం చేసుకోవడంలో బిజీగా ఉండటం వల్ల విశ్రాంతి లభించదు. దీని ప్రభావం నిద్రపై కూడా కనిపిస్తుంది.  నిద్రపోవడానికి 2-3 గంటల ముందు తినడం వల్ల శరీరం ప్రశాంతంగా ఉంటుంది.  నిద్ర గాఢంగా పడుతుంది. 7-8 మధ్య రాత్రి భోజనం చేసేవారికి నిద్రలో గ్యాస్, గుండెల్లో మంట లేదా భారం తక్కువగా ఉంటుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. మంచి నిద్ర మానసిక,  శారీరక ఆరోగ్యానికి మంచిది. బరువు.. బరువు తగ్గాలనుకునేవారు ఆహారం మాత్రమే కాదు, తినే సమయం కూడా ముఖ్యమని తెలుసుకోవాలి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబేసిటీ (2013) ప్రకారం, సాయంత్రం 7 గంటలకు ముందు తినేవారిలో శరీరం కేలరీలను శక్తిగా మార్చగలదు కాబట్టి బరువు తగ్గడం వేగంగా ఉంటుంది. రాత్రి ఆలస్యంగా  భోజనం చేయడం వల్ల ఆహారం కొవ్వుగా నిల్వ చేయబడుతుంది. త్వరగా తినడం వల్ల జీవక్రియ చురుకుగా ఉంటుంది.  ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది. అలాగే రాత్రి భోజనం తర్వాత  శారీరక శ్రమ లేదా కాస్త వాకింగ్ చేయడానికి కూడా సమయం దొరుకుతుంది. ఇది కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. డయాబెటిక్ రోగులు సమయానికి రాత్రి భోజనం చేయడం  చాలా ముఖ్యం. ఆలస్యంగా భోజనం చేసేవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల శరీరం  సిర్కాడియన్ సైకిల్ కు భంగం కలుగుతుంది, ఇది హార్మోన్ల అసమతుల్యత ప్రమాదాన్ని పెంచుతుంది.                              *రూపశ్రీ.

ఆరోగ్యకరమైన కంటి చూపు కోసం 20-20-20 రూల్

  కళ్ళు మన శరీరంలో అతి ముఖ్యమైన,  సున్నితమైన భాగం. ప్రపంచాన్ని చూడటానికి, అర్థం చేసుకోవడానికి,  అనుభూతి చెందడానికి, అర్థం చేసుకోవడానికి కళ్లే ఆధారం. అయితే నేటి కాలంలో కంటి సమస్యలు పెరుగుతున్నాయి, వీటిలో కంటి చూపు మందగించడం, కంటి ఒత్తిడి, చికాకు, ఎరుపు వంటివి ఉన్నాయి. స్క్రీన్ సమయం పెరగడం వల్ల కూడా ఈ కంటి సమస్యలు వస్తున్నాయి. పెద్దల  నుండి పిల్లల  వరకు ప్రతిదానికీ డిజిటల్ పరికరాలు చాలా అవసరం అయ్యాయి. గంటల తరబడి వాటి ముందు గడపడం వల్ల కళ్ళపై చాలా ఒత్తిడి వస్తుంది,  కళ్ళు అలసిపోతాయి. వీటి వల్ల కంటి ఒత్తిడి, కంటి చూపు మందగించడం వంటి సమస్యలు వస్తాయి.  దీని నుండి ఉపశమనం కలగడానికి, కంటి చూపు మెరుగవ్వడానికి 20-20-20 టెక్నిక్ భలే సహాయపడుతుంది.  దీని ప్రయోజనాల గురించి తెలుసుకుంటే.. 20-20-20 టెక్నిక్.. స్క్రీన్ చూస్తున్నప్పుడు కంటి ఒత్తిడిని నివారించడానికి 20-20-20 నియమం ఒక గొప్ప మార్గం . ఈ నియమంలో   స్క్రీన్ నుండి 20 సెకన్ల విరామం తీసుకుంటారు.  ఇది కళ్ళకు విశ్రాంతిని ఇస్తుంది. ప్రతి 20 నిమిషాలకు కనీసం 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్న దేనినైనా చూడాలి. ఇది ఎక్కువసేపు డిజిటల్ స్క్రీన్‌లను చూడటం వల్ల కలిగే కంటి ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రయోజనాలు.. ప్రతిరోజూ 20-20-20 నియమాన్ని పాటించడం ద్వారా, కంటి ఒత్తిడిని తగ్గించుకోవచ్చు లేదా నిరోధించవచ్చు. దీనికి సంబంధించిన ఆధారాలు అనేక అధ్యయనాలలో కూడా కనుగొనబడ్డాయి. 20-20-20 నియమం కంప్యూటర్ విజన్ సిండ్రోమ్‌ను నివారించడానికి,  దీర్ఘకాలిక కంప్యూటర్ లేదా డిజిటల్ పరికర వినియోగం వల్ల కలిగే డిజిటల్ కంటి ఒత్తిడి ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడే సరళమైన,  ప్రభావవంతమైన టెక్నిక్. స్క్రీన్ ను చూస్తున్నప్పుడు ఇటువంటి చిన్న విరామాలు తీసుకోవడం వల్ల కంటి దృష్టి కేంద్రీకరించే కండరాలు సడలించబడతాయి. ఇది కంటి ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇతర మార్గాలు.. కంటి ఒత్తిడిని కొన్ని ఇతర మార్గాల ద్వారా కూడా తగ్గించవచ్చు.  స్క్రీన్ చూస్తున్నప్పుడు లైటింగ్ ను అడ్జెస్ట్ చేసుకోవాలి.  టీవీ, ఫోన్, ల్యాప్‌టాప్ చూడటం చాలా మసక వెలుతురు లేదా లైటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు   కంటి ఒత్తిడిని పెంచుతుంది.  కంప్యూటర్‌ను ఉపయోగించడం లేదా చదవడానికి వైద్యులు సూచించిన  అద్దాలు ధరించడం వల్ల కంటి ఒత్తిడి తగ్గుతుంది. పెద్దలు స్క్రీన్ సమయాన్ని కంట్రోల్ పెట్టుకుంటే పిల్లలకు కూడా దాన్ని అలవాటు చేయవచ్చు. తాము ఆచరిస్తూ పిల్లలకు చెప్పడం మంచిది.   ఎక్కువసేపు స్క్రీన్ వాడటం వల్ల కంటి ఒత్తిడి,  నొప్పి వస్తుంది. దీన్ని పై చిట్కా తో అధిగమించవచ్చు. కంటి సమస్యలు ఉన్నవారు  క్రమం తప్పకుండా కంటి వ్యాయామాలు చేయాలి.  ఇది కంటి ఒత్తిడిని తగ్గించగలదు.                                    *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

డిప్రెషన్ కు భలే చక్కని మందు.. వాకింగ్..!

నేటి బిజీ లైఫ్‌లో డిప్రెషన్ అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. చాలా మంది ప్రజలు ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.  డిప్రెషన్ కు ఒక నిర్ణీత ఔషధం అంటూ ఏమీ లేకపోవడం చాలామంది దీన్నుండి బయటపడక పోవడానికి కారణం అవుతోంది. డిప్రెషన్ రావడం ఎంత సులువో దాన్నుండి బయట పడటం అంత కష్టం అనే విషయం చాలామందికి తెలుసు.   అయితే డిప్రెషన్ లక్షణాలను తగ్గించడానికి ఒక సులభమైన మరియు ప్రభావవంతమైన మార్గాన్ని వైద్యులు సిఫారసు చేస్తున్నారు.  ఒక పరిశోధనలో బయటపడిన ఈ విషయం రోజువారీ వాకింగ్ డిప్రెషన్ చక్కని ఔషధంలా పనిచేస్తుందట.  రోజూ వాకింగ్ చేయడం వల్ల డిప్రెషన్ (వాకింగ్ హెల్త్ బెనిఫిట్స్) తగ్గించడంలో చాలా సహాయపడుతుందని ఈ అధ్యయనం వెల్లడించింది. దీని గురించి మరింత లోతుగా తెలుసుకుంటే.. ప్రతిరోజూ వాకింగ్ చేస్తున్నప్పుడు స్టెప్ కౌంట్ ను క్రమంగా  కొద్ది మొత్తంలో పెంచడం వల్ల డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో చాలా వరకు సహాయపడుతుంది. రోజువారీ నడక  మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నడిచినప్పుడు స్ట్రెస్ హార్మోన్ చాలా వరకు తగ్గుతుంది.  శరీరం చురుకుగా ఉంటుంది.  వాకింగ్ చెయ్యాలి అనుకునే వారు దాన్నొక భారంగా కాకుండా చక్కని ఔషధం తీసుకుంటున్నాం అనే ఆలోచనతో మొదలుపెడితే డిప్రెషన్ ను అధిగమించడం చాలా సులువని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజుకు ఎన్ని అడుగులు.. సాధారణంగా వాకింగ్ గోల్ పెట్టుకునే వారు రోజుకు ఇన్ని అడుగుల చెప్పున నడుస్తుంటారు.  కొందరు కిలోమీటర్ల చెప్పున కౌంట్ వేసుకుంటారు.  ఇప్పట్లో అందుబాటులో ఉన్న సాంకేతికత ఆధారంగా  ఈ స్టెప్ కౌంట్ అనేది ప్రతి ఫోన్ లో ట్రాక్ చేయవచ్చు. దీని వల్ల ఆరోగ్యానికి చాలా బెనిఫిట్ కూడా. రోజుకు ఆరువేల అడుగులతో మొదలు పెట్టి క్రమంగా స్టెప్ కౌంట్ ను పెంచుతూ వెళ్లాలి. గూగుల్ ఫిట్ వంటి హెల్త్ ట్రాకింగ్ యాప్స్ లో  వాకింగ్ చేసే వ్యవథి.. వేగాన్ని బట్టి హార్ట్ పాయింట్స్ కూడా వస్తాయి. ఇవి గుండె ఆరోగ్య పరిరక్షణకు సహాయపడతాయి. స్టెప్ కౌంట్ ను మొదలుపెట్టిన తరువాత క్రమంగా పెంచుకుంటూ 10 వేల  అడుగులకు చేరుకోవాలి. ఇది డిప్రెషన్ స్థాయిని క్రమంగా తగ్గిస్తుంది. వాకింగ్ వల్ల డిప్రెషన్ తగ్గుతుందని మరీ ఎక్కువగా నడవడం అయితే మంచిది కాదు.. 10వేల అడుగులకు మించి వాకింగ్ చేసినా మరీ అంత ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుకంటే ఈ దశలో శరీరం చాలా అలసిపోతుంది.   కేవలం వాకింగ్ మాత్రమే కాకుండా  యోగా, వెయిట్ ట్రైనింగ్, ఏరోబిక్స్, స్విమ్మింగ్ మొదలైనవి కూడా మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, డిప్రెషన్ స్థాయిలను తగ్గించడానికి  ఎంతగానో తోడ్పడతాయి.                                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

పసుపు కొమ్ము ఆరోగ్య రహస్యం!

  పసుపులో ఉన్న ఔషద గుణాలు మరిదేనిలోను లేవని అంటున్నారు యు నాని వైద్యులు హైదరాబాద్ కు చెందిన ప్రముఖ యునాని వైద్య నిపుణురాలు డాక్టర్ ఎస్ జి వి సత్య తెలుగు వన్ హెల్త్ తో మాట్లాడుతూ పసుపు లోనే కాదు పసుపు చెట్టు ఆకుల లోను ఔషద గుణాలు ఉన్నాయని అంటున్నారు సత్య. సహజంగా అందరికి తెలిసింది పసుపు కేవలం కూరలలోనే వాడతారని, లేదా సంప్రదాయంగా  పసుపు ను పూజా కార్య క్రమాలలో వాడతారు. సంప్రదాయ పద్దతిలో జరిగే  పెళ్లి లోను పసుపుదే కీలక పాత్ర,సహజంగా గ్రా మీణ ప్రాంతాలలో చిన్న పాటి గాయం అయితే రక్త శ్రావం ఆగడానికి ముందుగా వాడేది పసుపే అని అంటారు యునాని వైద్యురాలుఅక్కడ పసుపు యాంటి బాయిటిక్  గా పనిచేస్తుందని అన్నారు.   ఎస్ జి వి సత్య. ముఖ్యంగా పసుపు మొక్క నుండి తీసిన పసుపు కొమ్ము ను ఆరగ దీసి పెట్టుకుంటే దద్దుర్లు వాపులు  తగ్గుతాయి. పసుపు ఆకును డికాక్షిన్  తో స్నానం చేస్తే దద్దుర్లు తగ్గుతాయి. పసుపును డ వేడి వేడి పాలలో వేసి తీసుకుంటే జలుబు దగ్గు తగ్గుముఖం పడుతుంది. పసుపు ఆకుల రసాన్ని  డికాక్షిన్ రూపం లో తీసుకుంటే శరీరం లో ఇన్ఫెక్షన్ లు తగ్గుతాయి. ఇక సాంప్రదాయానికి వస్తే వివాహానికి సంబంధించి పెళ్లి కూతురు,పెళ్లి కొడుకు కి సంబంధించి చేసే మంగళ స్నానాలలో పసుపు వాడడం అనావాయితిగా వస్తుంది. పసుపు కాళ్ళకు రాసుకుంటే  యాంటీ బాయిటిక్ గా పనిచేస్తుంది. కాళ్ళ పగుళ్ళు ఉన్న వారికి పసుపు రాసుకుంటే పగుళ్ళు తగ్గుతాయి.  ఇక ముఖం పై పసుపు రాసుకుంటే ముఖం పై వచ్చే ముడతలు తగ్గి ముఖం లో  గ్లౌ వస్తుంది.అలాగీ మీ ముఖం మరింత సౌందర్యం కావాలంటే తేనె, పసుపు ఆకు రసం కలిపిన  లేపనాన్ని కలిపి రాస్తే ముఖం మరింత కాంతి వంతంగా మెరుస్తుందని యునాని హెల్త్ క్లినిక్  కు చెందిన డాక్టర్ ఎస్ జి వి సత్య తెలుగు వన్ హెల్త్ కు తెలిపారు. పసుపు ఆకు ఇమ్యునిటీ  బూస్టర్ గా పని చేస్తుంది.పసుపు ఆకు డికాక్షిన్ ను క్యాన్సర్ వచ్చిన రోగులకు వారానికి ఒక సారి ఇస్తే  నీరసం తగ్గి కొంచం కోలుకుంటారని డాక్టర్ ఎస్ జి వి సత్య వివరించారు. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

 జామకాయ మధ్యలో విత్తనాలు తినకుండా పడేస్తుంటారా ? దిమ్మ తిరిగే నిజాలివి..!

  జామకాయను పేదవాడి యాపిల్ అంటారు. యాపిల్ పండులో ఉండే పోషకాలకు సమానమైన పోషకాలు ఉండటం వల్ల,  యాపిల్ పండు కంటే తక్కువ ధరలో దొరకడం వల్ల జామకాయను పేదవాడి యాపిల్ అంటారు. జామపండు పోషకాల నిధి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే జామపండు మధ్యలో విత్తనాల భాగం అంటే చాలామందికి నచ్చదు.   ఈ విత్తనాల భాగాన్ని తొలగించి కండ భాగాన్ని తింటుంటారు.  అయితే జామపండులో నిజమైన బలం దాని మధ్యలో ఉంటుందట. పరిశోధకులు దాని విత్తనాలపై పరిశోధన చేసి ఇందులో చాలా  శక్తి ఉంటుందని స్పష్టం చేశారు.  దీని  గురించి తెలుసుకుంటే.. జామ గింజలు ఎందుకు పారేస్తారు? కిడ్నీలో రాళ్లు వస్తాయనే భయంతో చాలా మంది జామ గింజలను పారేస్తుంటారు. కానీ జామ విత్తనాల గురించి చేసిన పరిశోధనలు చాలా షాకింగ్ ఫలితాలను వెల్లడించాయి. ప్రయోజనాలు.. జామ గింజలు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్,  రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. అంతే కాకుండా మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ప్రమాదకరమని నిరూపించే ALT,  AST ఎంజైమ్‌ల స్థాయిలు కూడా తగ్గుతాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల క్యాన్సర్ రాకుండా ఉంటుంది . జామ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. క్యాన్సర్ కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడానికి ఇవి పనిచేస్తాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు  వృద్ధాప్య సంకేతాలను నిరోధించడంలో సహాయపడతాయి. అంటే జామ పండ్లను బాగా తినేవారికి వృద్దాప్యం తొందరగా రాదు. జామ గింజల్లో కాల్షియం, జింక్, కాపర్ , ఫాస్పరస్ ఉంటాయి. ఈ పోషకాలన్నీ ఎముకలకు చాలా అవసరం. లేకపోతే బలహీనత మొదలవుతుంది. ఇది తీవ్రంగా మారితే  బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. . ఈ వ్యాధిలో ఎముకలు చాలా బలహీనంగా మారతాయి, సులభంగా విరిగిపోతాయి. జామపండు మొత్తం ఫైబర్‌తో నిండి ఉంటుంది. ఇది రెండు రకాల ఫైబర్‌లను అందిస్తుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. సరైన జీర్ణక్రియ ఉంటే  ఎసిడిటీ, గ్యాస్, మలబద్ధకం, పైల్స్ మొదలైన సమస్యల ప్రమాదం దానికదే తగ్గుతుంది. ఈ లాభాలతో  పాటు శరీరానికి ప్రోటీన్ కూడా లభిస్తుంది. విత్తనాలను ఇలా కూడా.. జామ విత్తనాలను నేరుగా జామ పండుతో తినడం ఇష్టం లేకపోతే..  జామ విత్తనాలను పండు నుండి వేరు చేయాలి.  వీటిని ఎండబెట్టాలి.  తరువాత వీటిని దోరగా వేయించి నిల్వచేసుకోవాలి.  వీటిని అప్పుడప్పుడు తినవచ్చు. అంతే కాకుండా ఈ విత్తనాలను స్పైసీ పౌడర్ లా కూడా తయారుచేసుకుని తీసుకోవచ్చు.                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

ఒత్తిడి, ఆందోళన నుండి బయటపడాలంటే.. ఈ మూడు మార్పులు చేసుకుంటే చాలు..!

  నేటి బిజీ జీవితంలో మానసిక ఒత్తిడి దాదాపు ప్రతి వ్యక్తి లైఫ్ లో  భాగంగా మారింది. పని ఒత్తిడి, సామాజిక అంచనాలు, సంబంధాల సమస్యలు,  భవిష్యత్తు గురించి అసంతృప్తి.. మొదలైనవన్నీ  మానసిక ఆరోగ్యంపై నిరంతరం ప్రభావం చూపుతున్నాయి. ఒత్తిడి మరియు ఆందోళన మీ మనస్సుపై ప్రతికూల ప్రభావాన్ని చూపడమే కాకుండా, నిద్ర లేకపోవడం, జీర్ణ సమస్యలు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ,   అలసట వంటి  శారీరక ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతాయి.  దినచర్యలో కొన్ని చిన్న,  సులభమైన మార్పులు చేయడం ద్వారా  ఒత్తిడి,  ఆందోళన నుండి బయటపడవచ్చని మానసిక ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మానసికంగా ఆరోగ్యంగా ఉండి మెరుగైన జీవితాన్ని గడపడానికి సహాయపడే మూడు మార్పుల గురించి తెలుసుకుంటే.. వ్యాయామం, శారీరక శ్రమ.. ఒత్తిడిని తగ్గించడానికి మొదటి సులభమైన మార్పు క్రమం తప్పకుండా వ్యాయామం. ప్రతిరోజూ 20-30 నిమిషాలు వేగంగా నడవడం, యోగా లేదా స్ట్రెచింగ్  వల్ల ఒత్తిడి తగ్గుతుంది. వ్యాయామం ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అనులోమ-విలోమ వంటి  ప్రాణాయామం,  ధ్యానం మనస్సును ప్రశాంతపరుస్తాయి. ఇంట్లో తేలికపాటి ఏరోబిక్స్ లేదా డాన్స్  కూడా ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. సమతుల ఆహారం,  హైడ్రేషన్.. సమతుల్య ఆహారాన్ని స్వీకరించడం వల్ల కూడా ఒత్తిడి, ఆందోళన కంట్రోల్ లో ఉంచవచ్చు. చేపలు, వాల్‌నట్‌లు,  అవిసె గింజలు వంటి ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారాలు మెదడు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. విటమిన్ బి,  మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు, ఆకుపచ్చ కూరగాయలు, అరటిపండ్లు,  బాదం వంటివి ఒత్తిడిని తగ్గిస్తాయి. చక్కెర,  కెఫిన్ అధికంగా తీసుకోవడం ఆందోళనను పెంచుతుంది. కాబట్టి వాటిని తీసుకోవడం పరిమితం చేయాలి. ప్రతిరోజూ 2-3 లీటర్ల నీరు త్రాగడం వల్ల డీహైడ్రేషన్ నివారించవచ్చు.  ఇది ఒత్తిడిని నియంత్రిస్తుంది. మైండ్ఫుల్నెస్.. ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవడానికి మూడవ మార్పు  మైండ్‌ఫుల్‌నెస్ సాధన చేయడం,  బాగా నిద్రపోవడం. 5-10 నిమిషాల లోతైన శ్వాస పద్ధతులు వంటి మైండ్‌ఫుల్‌నెస్ ధ్యానం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. నీలి కాంతి నిద్రకు అంతరాయం కలిగిస్తుంది కాబట్టి, నిద్రవేళకు ముందు స్క్రీన్ సమయాన్ని (మొబైల్, టీవీ) తగ్గించాలి. ప్రతిరోజూ 7-8 గంటల గాఢ నిద్ర ఒత్తిడిని తగ్గిస్తుంది.  మెదడును రీఛార్జ్ చేస్తుంది. నిద్రవేళకు ముందు గోరువెచ్చని నీరు త్రాగడం లేదా పుస్తకం చదవడం నిద్రను మెరుగుపరుస్తుంది.                                   *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..

కాఫీ లవర్స్ కోసమే ఈ వార్త.. కాఫీ తాగిన 30 నిమిషాలలో శరీరంలో జరిగేది ఇదే..!

  కాఫీ.. భారతీయులు ఎక్కువగా తీసుకునే పానీయాలలో ఒకటి.  భారతదేశంలోని ప్రతి ఇంట్లో.. కాఫీ లేదా టీ.. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా తాగుతూ ఉంటారు.  అయితే చాలామంది కాఫీ వైపు మొగ్గు చూపుతారు. కాఫీ సువాసనే మనిషికి పెద్ద బూస్టింగ్ ఇస్తుంది. ప్రపంచంలోనే ఆదరణ ఉన్న పానీయాలలో కాఫీ ఒకటి. కాఫీ ఆరోగ్యానికి మంచిదే అని అంటూ ఉంటారు.  పరిమిత మోతాదులో కాఫీ తీసుకుంటే అది ఆరోగ్యానికి చేసే మేలు ఎక్కువే.. ఇది పరిమితంగా తీసుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి కూడా. అయితే ఇటీవల కాఫీ మీద జరిగిన పరిశోదనలలో చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. అసలు కాఫీ తాగిన తరువాత 30 నిమిషాలలోపు శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే.. మెదుడు ప్రభావితం అవుతుంది.. కాఫీ తాగిన 30 నిమిషాల్లోనే అది  మెదడును ప్రభావితం చేస్తుందట.   కాఫీ తాగిన వారిని  మరింత అప్రమత్తంగా,  చురుగ్గా ఉండేలా చేస్తుంది. నిజానికి కాఫీలో ఉండే కెఫిన్  జ్ఞాపకశక్తి పనితీరును,  దృష్టిని మెరుగుపరిచే ఉద్దీపన . బాత్‌రూమ్ కు వెళ్లాలని అనిపిస్తుంది.. చెప్పుకోవడానికి కాస్త తమాషాగా,  చెప్పడానికి సిగ్గుగానూ అనిపిస్తుందేమో.. కానీ కాఫీ తాగిన తరువాత 30 నిమిషాలలోపు బాత్రూమ్ కు వెళ్ళాలి అనిపిస్తుందట. కాఫీ తాగడం వల్ల మలబద్ధకం సమయంలో  ప్రేగులలో కార్యకలాపాలు పెరుగుతాయి. ఇది బాత్రూమ్ కు వెళ్లేలా చేస్తుందట. రక్తప్రసరణ.. కాఫీ  గుండెలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది గుండెను మరింత బలపరుస్తుంది. ఇది ఏ రకమైన మంటనైనా తగ్గిస్తుంది. అందుకే కాఫీ గుండె ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. కాఫీ వీరు తాగకూడదు.. కాఫీని పరిమితమైన మోతాదులో తాగడం ఆరోగ్యానికి మంచిదే.. అయితే అందరికీ కాఫీ తాగడం మంచిదని చెప్పలేం. ముఖ్యంగా ఆందోళన, రక్తపోటు, మద్యపానం అలవాటు ఉన్నవారు కాఫీ తాగడం మంచిది కాదట.                                     *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..

 నిద్రపోతున్నప్పుడు కాళ్లలో సిరలు పట్టేస్తున్నాయా? ఇదే కారణం..!

  చాలా మంది రాత్రి నిద్రపోతున్నప్పుడు కాళ్ళ సిరలు అకస్మాత్తుగా ఉబ్బుతాయి. నరాలు ఉబ్బి చాలా నొప్పిని కలిగిస్తాయి.  నిద్రకు కూడా భంగం కలిగిస్తాయి. ఇది కొన్నిసార్లు జరగడం సాధారణం.  కానీ ఇది చాలా ఎక్కువగా   జరుగుతుంటే అది విటమిన్ లోపం  సంకేతం కావచ్చని అంటున్నారు ఆహార నిపుణులు. ఏ విటమిన్ లోపం వల్ల సిరలు ఉబ్బుతాయో.. ఇది ఎందుకు జరుగుతుందో.. విటమిన్ల ప్రధాన పాత్ర ఏంటో.. తెలుసుకుంటే.. విటమిన్ల పాత్ర.. శరీర అభివృద్ధికి విటమిన్లు చాలా ముఖ్యమైనవి. విటమిన్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా నరాలు,  గుండె పనితీరుకు కూడా చాలా ముఖ్యమైనవి. విటమిన్ లోపం నరాలపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. విటమిన్ సి లోపం.. విటమిన్ బి12 తో పాటు, విటమిన్ సి లోపం వల్ల కూడా వెరికోస్ వెయిన్స్ వస్తాయి. నిజానికి విటమిన్ సి లోపం వల్ల రక్త కణాలు బలహీనపడతాయి. దీనివల్ల వెరికోస్ వెయిన్స్ వస్తాయి. విటమిన్ సి లోపాన్ని అధిగమించడానికి నారింజ, నిమ్మ, జామ వంటి సిట్రస్ పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. ఇంటి చికిత్సలు.. ఐస్ కంప్రెస్.. నిద్రలో నరాలు ఉబ్బడం, పట్టేసినట్టు అవ్వడం,  నొప్పి కలిగించడాన్ని వెరికోస్ వెయిన్ అంటారు.  ఈ వెరికోస్ వెయిన్  నుండి తక్షణ ఉపశమనం పొందడానికి  కొన్ని ఇంటి నివారణలను ప్రయత్నించవచ్చు. వెరికోస్ వెయిన్ వచ్చినప్పుడు తీవ్రమైన నొప్పి ఉంటుంది. అలాంటి సందర్భంలో ఆ భాగానికి ఐస్ కంప్రెస్ వేయవచ్చు. 3 నుండి 5 నిమిషాలు కంప్రెస్ వేయడం వల్ల  తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఆయిల్ మసాజ్..  అకస్మాత్తుగా నరాల నొప్పి వస్తే ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి అమ్మమ్మలు సూచించిన  ది బెస్ట్ ఇంటి నివారణను ఆయిల్ మసాజ్. నరాల నొప్పి వచ్చినప్పుడు గోరువెచ్చని నూనెతో మసాజ్ చేయవచ్చు. తేలికపాటి చేతులతో మసాజ్ చేయడం వల్ల  తక్షణ ఉపశమనం లభిస్తుంది.                        *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..

విటమిన్-సి,డి  మాత్రమే కాదు.. రోగనిరోధక శక్తి బలంగా ఉండాలంటే ఈ పోషకాలు కూడా ముఖ్యం..!

  రోగనిరోధక వ్యవస్థను శరీరానికి కవచం అని పిలుస్తారు. ఇది అనేక రకాల అంటు వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. అందుకే కరోనా సమయంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే చర్యలను అందరూ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి ఈ దిశలో నిరంతరం ప్రయత్నించడం చాలా ముఖ్యం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనికోసం ఆహారం,  జీవనశైలిని సరిగ్గా ఉంచుకోవడం  చాలా ముఖ్యమైనది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో  విటమిన్-సి,  డి చాలా ముఖ్యమైనవి. ఈ విటమిన్లు ఆహారాలను బాగా తీసుకుంటే రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటుందని అంటారు. అయితే..  రోగనిరోధక వ్యవస్థకు ఈ రెండు మాత్రమే సరిపోవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వ్యాధుల నుండి శరీరాన్ని కాపాడే రోగనిరోధక వ్యవస్థను  ఎలా బలోపేతం చేయవచ్చో తెలుసుకుంటే.. విటమిన్ సి-డి  ప్రయోజనాలు.. విటమిన్ సి అనేది బయోసింథటిక్, జన్యు నియంత్రణ ఎంజైమ్‌లకు అవసరమైన శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది తెల్ల రక్త కణాలు వ్యాధికారక క్రిములతో పోరాడటానికి సహాయపడుతుంది. అదేవిధంగా, విటమిన్ (డి3) రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని పరిశోధకులు అంటున్నారు. ఉదయం 10-15 నిమిషాలు ఎండలో ఉండటం ద్వారా లేదా విటమిన్-డి  అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా తగినంత మొత్తంలో విటమిన్ డి పొందవచ్చని,  రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని నిపుణులు అంటున్నారు. విటమిన్ ఇ కూడా అవసరం.. విటమిన్లు సి,  డి లాగానే, విటమిన్ ఇ కూడా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్.  ఇది శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఈ ముఖ్యమైన విటమిన్  శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పనితీరులో ముఖ్యమైన 200 జీవరసాయన ప్రతిచర్యలలో భాగం. జుట్టు,  కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ ఇ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆహారం ద్వారా దీనిని తీసుకునేలా చూసుకోవాలి. ప్రోటీన్ కూడా ముఖ్యం.. ప్రోటీన్.. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో పాత్ర పోషిస్తున్న అమైనో ఆమ్లాలతో రూపొందించబడింది. ఈ సమ్మేళనాలు  రోగనిరోధక వ్యవస్థ కీలకమైన T కణాలు, B కణాలు,  సూక్ష్మక్రిములతో పోరాడే ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. ప్రోటీన్ లేని వ్యక్తులు బలహీనమైన కండరాలను కలిగి ఉండటమే కాకుండా ఇతరుల కంటే అంటు వ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆహారంలో జింక్ ఉందా? బలమైన రోగనిరోధక వ్యవస్థకు జింక్ కూడా చాలా అవసరం. ఇది ఇన్ఫెక్షన్‌తో పోరాడే తెల్ల రక్త కణాలలో ఒక ముఖ్యమైన భాగం. జింక్ లోపం తరచుగా  ఫ్లూ, జలుబు,  ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లకు గురి చేస్తుంది. ముఖ్యంగా వృద్ధులు జింక్ సప్లిమెంట్లను తీసుకోవాలని సలహా ఇస్తారు. జింక్‌ను ఆహారం ద్వారా సులభంగా పొందవచ్చు.                     *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..

ప్రోటీన్ ఆహారం ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?

శరీరానికి అవసరమైన పోషకాలలో ప్రోటీన్ చాలా ముఖ్యమైనది.  అది శరీర నిర్మాణం అయినా లేదా బరువు తగ్గడం అయినా ప్రతి ఒక్కరూ అధిక ప్రోటీన్ ఆహారం వైపు ఆకర్షితులవుతున్నారు. కానీ ఎక్కువ ప్రోటీన్ అందరికీ ప్రయోజనకరంగా ఉండకపోవచ్చని మీకు తెలుసా? వాస్తవానికి అధిక ప్రోటీన్ ఆహారం  ధోరణి పెరిగినంతగా, దానితో వల్ల ఏర్పడే   దుష్ప్రభావాలు  ప్రమాదాల గురించి పెద్దగా చర్చ కనిపించదు.  అధిక ప్రోటీన్ ఆహారం అంటే  ఒక రోజులో తీసుకునే కేలరీలలో 25% నుండి 35% ప్రోటీన్ నుండి వస్తుంది. ఇందులో గుడ్లు, చికెన్, చేపలు, జున్ను, పప్పులు, ప్రోటీన్ పౌడర్ మొదలైనవి ఉంటాయి. దీని వల్ల  కార్బోహైడ్రేట్ల పరిమాణం తగ్గుతుంది. కానీ అది అందరికీ ప్రయోజనకరంగా ఉండదని అంటున్నారు ఆహార నిపుణులు.  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. శరీరానికి ప్రోటీన్ చాలా అవసరమని పోషకాహార నిపుణులు అంటున్నారు. కానీ అధిక ప్రోటీన్ తీసుకోవడం అనేక ఆరోగ్య సమస్యలకు హానికరం. కండరాలను నిర్మించడానికి,  ఎముకలు, దంతాలను బలోపేతం చేయడానికి ప్రోటీన్ చాలా అవసరం, కానీ కొన్ని వ్యాధులలో అధిక ప్రోటీన్ ఆహారం తీసుకోకూడదు. యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే.. యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారికి అధిక ప్రోటీన్ ఆహారం యూరిక్ యాసిడ్ స్థాయిని మరింత పెంచుతుంది. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. అందువల్ల ఊక పిండి, మొక్కజొన్న, బేకరీ ఆహార పదార్థాలను తినడం మానుకోవాలి. దీనితో పాటు, మినపప్పు, మాంసం, చేపలు, బీన్స్, మునగకాయ, పాలకూర, బఠానీలు, పుట్టగొడుగులు, బీట్‌రూట్, గుమ్మడికాయ గింజలు తినకూడదు. వైద్యుడి సలహా మేరకు  తక్కువ ప్రోటీన్ ఆహారం తీసుకోవచ్చు. కిడ్నీ సమస్యలు.. అధిక ప్రోటీన్ ఆహారం మూత్రపిండాలను కష్టతరం చేస్తుంది. ఇది కిడ్నీ సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో ఇది ప్రమాదం.  దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే వారి ఆహారంలో ఏవైనా మార్పులు చేసుకోవాలి.  వైద్యుడిని సంప్రదించిన తర్వాత  చిక్కుళ్ళు, గింజలు,  విత్తనాలు, తృణధాన్యాలు,  సోయా వంటి మొక్కల ఆధారిత ప్రోటీన్లను తీసుకోవచ్చు. ఎక్కువ ప్రోటీన్ తినడం వల్ల బరువు పెరగడ,  జీర్ణ సమస్యలు, మూత్రపిండాల ఒత్తిడి,  శరీరం డీహైడ్రేషన్ కు లోనుకావడం జరుగుతుంది. అందువల్ల,  ఆహారాన్ని మార్చుకునే ముందు, వైద్యుడిని సంప్రదించాలి. అధిక ప్రోటీన్ ఆహారం చాలా మంచిది అని అనుకుంటారు.. కానీ  ప్రతి శరీరానికి,  ప్రతి పరిస్థితికి ఇది సరైనది కాదు. బరువు తగ్గడానికి లేదా కండరాలను నిర్మించడానికి,  అధిక ప్రోటీన్ ఆహారం తీసుకోవాలనుకుంటే, ఖచ్చితంగా డైటీషియన్ లేదా వైద్యుడిని సంప్రదించాలి. అన్నింటికంటే బెస్ట్ ఏదంటే..  సమతుల్య ఆహారం.  దీనిలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, కొవ్వు, ఫైబర్,  సూక్ష్మపోషకాలు అన్నీ సరైన మొత్తంలో ఉంటాయి.                            *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..

మనసును చురుగ్గా,  శరీరం దృఢంగా ఉంచే ప్రత్యేక ప్రాణాయామం ఇది..!

  నేటి బిజీ జీవితంలో ఒత్తిడి, ఆందోళన,   రోజువారీ అలవాట్లు సక్రమంగా లేకపోవడం వంటివి  శరీరం,  మనస్సుపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి. అటువంటి పరిస్థితిలో  యోగా,  ప్రాణాయామంతో  రోజును ప్రారంభిస్తే, మనం ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండగలం. ప్రాణాయామంలో 'ఉజ్జయి ప్రాణాయామం' చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది మనసును చురుగ్గా ఉంచుతూ శరీరాన్ని దృఢంగా మారుస్తుంది. అయితే అసలు ఈ ప్రాణాయామానికి ఉజ్జయిని ప్రాణాయామం అని పేరు ఎలా వచ్చింది? దీని వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? తెలుసుకుంటే.. దీనికి ఆ పేరు ఎలా వచ్చింది? ఉజ్జయి ప్రాణాయామంలో 'ఉజ్జయి' అంటే 'విజయవంతుడు' లేదా 'విజయం సాధించేవాడు' అని అర్థం. ఈ పదం 'ఉద్' మరియు 'జి' అనే సంస్కృత పదాలతో రూపొందించబడింది. ఇక్కడ 'ఉద్' అంటే లేవడం లేదా బంధనం నుండి విముక్తి పొందడం, అలాగే 'జి' అంటే విజయం సాధించడం. ఇక 'ప్రాణాయామం' అంటే 'నియంత్రిత శ్వాస సాధన'. ఈ ప్రాణాయామం మనలో విశ్వాసాన్ని,  బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది. కాబట్టి దీనిని 'విజయవంతమైన శ్వాస' అని కూడా పిలుస్తారు. మెదడుకు మంచిది.. ఉజ్జయి ప్రాణాయామం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మీరు గొంతు నుండి మృదువైన శబ్దంతో నెమ్మదిగా శ్వాస తీసుకున్నప్పుడు  దృష్టి స్వయంచాలకంగా శ్వాసపై దృష్టి పెట్టడం ప్రారంభిస్తుంది. ఇది మనస్సు అటు ఇటు కదిలిపోకుండా, చలించకుండా  ఉంచుతుంది.   ఆలోచించే,  అర్థం చేసుకునే శక్తిని పెంచుతుంది. అంతేకాదు.. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.  గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి కడుపు సమస్యలు ఉంటే ఉజ్జయి ప్రాణాయామం చాలా బాగా  సహాయపడుతుంది.  లోతుగా శ్వాస తీసుకున్నప్పుడు, ఉదర అవయవాలపై కొంచెం ఒత్తిడి ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీని వల్ల  కడుపు తేలికగా అనిపిస్తుంది. గుండె ఆరోగ్యం.. ఉజ్జయి ప్రాణాయామం గుండె ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు శ్వాస వేగం తగ్గుతుంది. దీని కారణంగా గుండెపై ఎక్కువ ఒత్తిడి ఉండదు. ఇది హృదయ స్పందనను సాధారణంగా ఉంచుతుంది,  రక్తపోటును స్థిరీకరిస్తుంది. అధిక రక్తపోటు లేదా ఒత్తిడి ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ   గుండె జబ్బు ఉంటే ఈ వ్యాయామం చేసే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఊపిరితిత్తులు.. సాధారణంగా ప్రాణాయామం అంటే ఊపిరితిత్తులను బలంగా మారుస్తుంది.  ఇది గొంతు,  ఊపిరితిత్తులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్రాణాయామం గొంతులో చిక్కుకున్న శ్లేష్మాన్ని తొలగిస్తుంది. నెమ్మదిగా పీల్చడం,  నిశ్వాసించడం ఊపిరితిత్తులను బలపరుస్తుంది,  శ్వాసను సులభతరం చేస్తుంది. ఇది అలెర్జీలు, జలుబు,  శ్వాస సమస్యలకు సహాయపడుతుంది. దీనితో పాటు, ఉజ్జయి ప్రాణాయామం ఒత్తిడిని తగ్గిస్తుంది,  మంచి నిద్రను ఇస్తుంది.  ఎందుకంటే దీనిని సాధన చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.  అలసట కూడా తొలగిపోతుంది, దీని కారణంగా రాత్రి త్వరగా నిద్ర వస్తుంది.  ఉదయం ఉత్సాహంగా నిద్రలేవచ్చు. శక్తినిచ్చే ఆసనం.. ఈ ప్రాణాయామం శరీరం లోపల వేడిని ఉత్పత్తి చేస్తుంది,  శక్తిని పెంచుతుంది.  రోజంతా అలసిపోయినట్లు లేదా సోమరితనంగా అనిపిస్తే ఈ ప్రాణాయామం శరీరాన్ని చురుగ్గా మారుస్తుంది. అందుకే దీనిని 'విజయవంతమైన శ్వాస' అని పిలుస్తారు, ఎందుకంటే ఇది ఆత్మవిశ్వాసం,  అంతర్గత బలాన్ని పెంచుతుంది. ఈ ప్రాణాయామం ఎలా చేయాలి? ఉజ్జయి ప్రాణాయామం చేయడానికి, ముందుగా ప్రశాంతమైన,  సౌకర్యవంతమైన ప్రదేశంలో కూర్చోవాలి. కళ్ళు మూసుకుని శరీరమంతా రిలాక్స్ గా వదులుగా  ఉంచాలి. ఇప్పుడు ముక్కు ద్వారా నెమ్మదిగా గాలి పీల్చుకోవాలి.  గొంతు నుండి తేలికపాటి 'ఘర్' శబ్దాన్ని కూడా చేయాలి. అది చాలా నెమ్మదిగా ఉండాలి. తరువాత ముక్కు నుండి నెమ్మదిగా గాలిని అదే విధంగా వదలండి. ఈ మొత్తం సాధన సమయంలో పూర్తి దృష్టి  శ్వాసపై ఉండాలి. తద్వారా మనస్సు చలించకుండా ప్రాణాయామం మీదే దృష్టి నిలుపవచ్చు. ప్రారంభంలో దీన్ని ఐదు నిమిషాలు చేయాలి. సాధన బలంగా మారినప్పుడు క్రమంగా సమయాన్ని పెంచుకోవచ్చు.                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..

మీకు థైరాయిడ్ ఉందా? జాగ్రత్త ఈ కూరగాయలు తినకూడదు..!

మన మెడలోని థైరాయిడ్ గ్రంథి ఒక చిన్న అవయవం.  కానీ ఇది చాలా ముఖ్యమైన అవయవం. ఇది మన శరీర జీవక్రియ, శక్తి స్థాయిలు,  శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. థైరాయిడ్ సరిగ్గా పనిచేయనప్పుడు చాలా సమస్యలు మొదలవుతాయి.  ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్లు తక్కువగా ఉత్పత్తి అయ్యే హైపోథైరాయిడిజంలో సమస్యలు ఎక్కువ.  మందులతో పాటు, థైరాయిడ్ రోగులకు సరైన ఆహారం కూడా చాలా ముఖ్యం. సాధారణంగా ఆరోగ్యకరమైనవి అనుకునే కొన్ని  కూరగాయలు థైరాయిడ్ సమస్యలను పెంచుతాయి. థైరాయిడ్ రోగులు ఏ కూరగాయలను తినకూడదు ? తెలుసుకుంటే.. క్యాబైజీ కుటుంబానికి చెందిన కూరగాయలు.. థైరాయిడ్ రోగులు కొన్ని కూరగాయల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వీటిని గోయిట్రోజెనిక్ అంటారు. ఇవి థైరాయిడ్ గ్రంథి అయోడిన్‌ను గ్రహించే సామర్థ్యాన్ని అడ్డుకునే సమ్మేళనాలు. థైరాయిడ్ హార్మోన్లను తయారు చేయడానికి అయోడిన్ చాలా ముఖ్యమైనది. ఇందులో ప్రధానంగా క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ,  బ్రస్సెల్స్ మొలకలు వంటి క్రూసిఫెరస్ కూరగాయలు ఉంటాయి. ఈ కూరగాయలలో గ్లూకోసినోలేట్స్ అనే పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరంలోని థైరాయిడ్ పనితీరుకు అంతరాయం కలిగిస్తాయి. పచ్చగా వద్దు.. పైన చెప్పుకున్న  కూరగాయలలో పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, థైరాయిడ్ రోగులు వాటిని పచ్చిగా తినకూడదు. పచ్చిగా ఉన్నప్పుడు వాటికి అధిక గైట్రోజెనిక్ లక్షణాలు ఉంటాయి.  వాటిని ఉడికించి తినేటప్పుడు ఈ సమ్మేళనాల ప్రభావం గణనీయంగా తగ్గుతుంది. కాబట్టి  థైరాయిడ్  ఉన్నవారు ఈ కూరగాయలను తినాలనుకుంటే, వాటిని ఎల్లప్పుడూ బాగా ఉడికించి,  పరిమిత పరిమాణంలో తినాలి.  వాటిని రసం రూపంలో లేదా పెద్ద పరిమాణంలో పచ్చిగా తీసుకోవడం మానుకోవాలి.  ఎందుకంటే ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. నిపుణుల సలహా.. పైన పేర్కొన్న కూరగాయలతో పాటు, సోయా ఉత్పత్తులు కూడా గైట్రోజెనిక్ కావచ్చని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. కాబట్టి థైరాయిడ్ రోగులు వాటిని మితంగా తీసుకోవాలి. ముఖ్యంగా  ప్రాసెస్ చేసిన ఆహారాలు,  గ్లూటెన్ వినియోగం కూడా కొంతమంది థైరాయిడ్ రోగులకు, ముఖ్యంగా హషిమోటోస్ థైరాయిడిటిస్ ఉన్నవారికి సమస్యాత్మకంగా ఉంటుంది. ఆహారం మాత్రమే థైరాయిడ్‌ను నయం చేయదని, అది మందులతో పాటు మాత్రమే సహాయపడుతుందని అర్థం చేసుకోవడం ముఖ్యం.  థైరాయిడ్ ఉన్నవారు ఎల్లప్పుడు వైద్యుడిని లేదా డైటీషియన్ ను కలిసిన తరువాత మాత్రమే ఆహారం తీసుకునే విషయంలో నిర్ణయం తీసుకోవడం మంచిది.  ఏదైనా కూరగాయలను పూర్తిగా ఆపడం లేదా  స్వంతంగా ఏదైనా పెద్ద ఆహార మార్పులు చేయడం చేయకూడదు. ఎందుకంటే ఇది ఇతర పోషకాల లోపానికి దారితీస్తుంది.                                 *రూపశ్రీ.  

ప్రతిరోజూ లెమన్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే..!

  భారతదేశంలో టీ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. ఉదయాన్నే పనులు చురుగ్గా మొదలుపెట్టాలన్నా, సాయంత్రం అలసట నుండి బయటపడాలన్నా టీ ఉండాల్సిందే.. అయితే రోజూ తాగే టీలో పాలు కలపడకుండా అందులో కాస్త నిమ్మరసం జోడిస్తే చాలా షాకింగ్ రిజల్ట్ ఉంటాయని అంటున్నారు వైద్యులు,  ఆహార నిపుణులు. దీన్నే లెమన్ టీ అంటారు.  రోజూ ఒక కప్పు లెమన్ టీ తాగడం మొదలుపెడితే  ఒకటి,  రెండు కాదు అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చట. ఇంతకూ లెమన్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుంటే.. రోగనిరోధక శక్తి..  హైడ్రేషన్.. లెమన్ టీ  అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇది  రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. నిమ్మకాయ విటమిన్ సి కి అద్భుతమైన మూలం. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి,  శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడానికి అవసరం. లెమన్ టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు,  ఫ్లూ వంటి సాధారణ వ్యాధుల నుండి  రక్షించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు, లెమన్ టీ సహజ నిర్విషీకరణ కారకంగా పనిచేస్తుంది. ఇది శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో, కాలేయం,  మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో,  శరీరాన్ని లోపలి నుండి శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియ, బరువు.. ఎక్కువగా  జీర్ణ సమస్యలు ఎదుర్కునేవారు లెమన్ టీ తీసుకుంటే చాలా మంచిది. లెమన్  టీ జీర్ణ సమస్యలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నిమ్మకాయలో ఉండే ఆమ్ల లక్షణాలు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఆహారాన్ని జీర్ణం చేయడాన్ని సులభతరం చేస్తాయి. ఇది ఉబ్బరం, గ్యాస్,  అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కేవలం జీర్ణ సమస్యలకు మాత్రమే కాదు.. లెమన్ టీ బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.  నిమ్మకాయ జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని లెమన్ టీ తాగడం వల్ల శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును కాల్చే ప్రక్రియ వేగవంతం అవుతుంది.  కడుపు నిండిన  ఫీలింగ్ ఇస్తుంది. దీని వల్ల  అనవసరమైన ఆకలిని కూడా నియంత్రించవచ్చు. చర్మం.. లెమన్  టీ  అంతర్గత ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. విటమిన్ సి,  యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని అకాల వృద్ధాప్యం,  ముడతలకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయి. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం క్లియర్ గా , ప్రకాశవంతంగా,  ఆరోగ్యంగా కనిపిస్తుంది. మొటిమలు, మచ్చలు..  మొటిమలు,  మచ్చలను తగ్గించడంలో కూడా లెమన్ టీ సహాయపడుతుంది.   ఒత్తిడి,  ఆందోళనను తగ్గించడంలో సహాయపడే  ప్రభావాన్ని కలిగి ఉంటుంది. నిమ్మకాయ వాసన,  వేడిగా ఉండే లెమన్  టీ శరీరానికి రిలాక్స్ ఇస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. గుండె ఆరోగ్యం.. లెమన్ టీలో లభించే పాలీఫెనాల్స్,  యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి  మేలు చేస్తాయి. అవి రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో, రక్తపోటును నియంత్రించడంలో,  చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి, గుండె జబ్బులు,  స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతేకాదు.. నిమ్మకాయలో నోటి ఆరోగ్యానికి ప్రయోజనకరమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది నోటిలో బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడం ద్వారా దుర్వాసనను తగ్గించడానికి,  చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అయితే రోజుకు 2 నుండి 3 కప్పుల కంటే ఎక్కువ లెమన్ టీ తాగకూడదు.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..

పరాఠాలు అంటే ఇష్టమా? దయచేసి స్టఫింగ్ కు ఇవి మాత్రం వాడకండి..!

   భారతీయులకు పరాఠాలు, రోటీలు అంటే చాలా ఇష్టం. చాలా ఇళ్ళలో  పూరీలు,  స్టఫ్డ్ చేసిన పరాఠాలు  చాలా సాధారణం. బంగాళాదుంపలు, పనీర్, జున్ను, మాంసం.. ఇట్లా చాలా పదార్థాలు పరాఠాల స్టఫింగ్ లో వాడతారు. పరాఠా రుచి ఇనుమడించడం కోసం చాలా రకాలుగా పరాఠాలు చేస్తుంటారు.  కానీ ఇట్లా పరాఠాలు చేయడం అన్ని విదాలుగా ఆరోగ్యకరమైనది కాదని అంటున్నారు ఆహార నిపుణులు. కొన్ని రకాల పదార్థాలు స్టఫ్ చేసి పరాఠాలు తయారు చేసుకుని తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం చాలా పెరుగుతుందట. అలాగే ఊబకాయం కూడా సందేహం లేకుండా వస్తుంది అంటున్నారు. ఇంతకీ పరాఠాలలో స్టఫ్ చేయకూడని పదార్థాలు ఏమిటో తెలుసుకుంటే.. ప్రాసెస్డ్ చీజ్ లేదా మయోనైస్.. ఈ రోజుల్లో చీజ్ పరాఠాలు లేదా మాయో స్టఫ్డ్ రోల్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే ఈ ప్రాసెస్ చేసిన వస్తువులలో సంతృప్త కొవ్వులు,  రసాయన ప్రజర్వేటివ్స్  ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.  ఊబకాయం,  గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. సరిగ్గా ఉడికించని మాంసం లేదా కీమా..  పూర్తిగా ఉడికించకుండా ముక్కలు చేసిన మాంసం లేదా మటన్‌తో నింపితే అది ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని పెంచుతుంది. సరిగ్గా ఉడికించని మాంసం బ్యాక్టీరియాతో నిండి ఉంటుంది.  గ్యాస్, వాంతులు, విరేచనాలు వంటి కడుపు సమస్యలను కలిగిస్తుంది.  ఎక్కువ నూనెతో సుగంధ ద్రవ్యాలు.. బంగాళాదుంపలు, ఉల్లిపాయలు లేదా ఏదైనా కూరటానికి ఎక్కువ నూనె,  సుగంధ ద్రవ్యాలు జోడించిన పదార్థాలు స్టప్ చేస్తే  అది  కడుపు  జీర్ణ శక్తిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల మలబద్ధకం, ఆమ్లతత్వం,  గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. మిగిలిన కూరలు లేదా కూరగాయలు.. చాలా మంది మిగిలిపోయిన కూరగాయలను పరాఠాలలో ఉపయోగిస్తారు, కానీ ఏమైనా కాస్త పాడైన  కూరగాయలు శరీరంలో విషాన్ని కలిగిస్తాయి. ఫుడ్ ఇన్ఫెక్షన్ లకు  దారితీస్తాయి. అధిక ఉప్పు లేదా ఊరగాయ.. కొంతమంది  ఊరగాయ లేదా ఎక్కువ ఉప్పు జోడించడం ద్వారా పరాఠా రుచిని పెంచాలని కోరుకుంటారు. కానీ ఊరగాయలో ఉండే అధిక ఉప్పు కంటెంట్ కడుపులో చికాకు, ఆమ్లతత్వం,  అధిక రక్తపోటు వస్తుంది. అధిక ఉప్పు గుండె జబ్బులు,  మూత్రపిండాల సమస్యలను పెంచుతుంది.                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..