చంద్రబాబుకు వెంకయ్య నాయుడు ఫోన్...

  కేంద్ర ప్రత్యేక ప్యాకేజీపై ఈరోజు ఉదయం నుండి కేంద్రమంత్రులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నేతలు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. అనంతరం.. కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ కూడా రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయి ప్రత్యేక ప్యాకేజీపై దీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. మధ్యాహ్నం లోపు ప్రత్యేక ప్యాకేజీపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈనేపథ్యంలోనే వెంకయ్యనాయుడు  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పోన్ చేసినట్టు తెలుస్తోంది. వెంటనే ఢిల్లీ రావాలని చంద్రబాబుని కోరారు. దీంతో చంద్రబాబు సమక్షంలోనే ప్రత్యేక ప్యాకేజీ గురించి ప్రకటన చేసే యోచనలో కేంద్రం ఉందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

అన్నా హజారే తిట్లు మాకు దీవెనలు.. ఆప్

  ఆప్ పార్టీపైన.. అప్ అధినేత ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పైన సామాజిక ఉద్యమవేత్త అన్నా హజారే విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ పై పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన వమ్ము చేశాడని అన్నా హజారే అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఆయన చేసిన విమర్శలపై స్పందించిన ఆప్ నేతలు.. ఆయన తిట్లు తమకు దీవెనలేనని అంటున్నార. ఈ సందర్భంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మాట్లాడుతూ.. ఆయన అభిప్రాయంలో నిజాయితీ ఉందని, తమను విమర్శిస్తున్నారంటే, అది ఆయనకు ఆమ్ ఆద్మీ పార్టీపై ఉన్న ప్రేమ, అప్యాయతేనని శివోడియా అన్నారు. పార్టీలో బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించే వారిపై వేగవంతమైన చర్యలను తీసుకుంటున్నామని చెప్పారు. తమ పార్టీని ఎవరు విమర్శించినా దాన్ని సద్విమర్శగా పరిగణించి తప్పు దిద్దుకునేందుకు యత్నిస్తామని ఆమ్ నేత కుమార్ విశ్వాస్ వెల్లడించారు.

అప్పుడే నిధులు విడుదల చేస్తాం..

  కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సుజనా చౌదరి, ఎంపీ రమేష్ ల భేటీ ముగిసింది. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక డెవలప్ మెంట్ ప్యాకేజీ ప్రకటిస్తామని చెప్పినట్టు సమాచారం. అంతేకాదు రాజధాని నిర్మాణానికి సంబంధించి పూర్తి బాధ్యత మేమే తీసుకుంటామని.. రాజధానికి ఇవ్వబోయే నిధులపై ఈరోజే స్పష్టత ఉండదు.. ప్రభుత్వ ముఖ్య కార్యలయాల డీపీఆర్ లను రాష్టం కేంద్రానికి సమర్సిస్తే అప్పుడు నిధులు విడుదల చేస్తామని.. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు సంబంధించిన బాధ్యత అంతా కూడా కేందం తీసుకుంటుంది రాజ్ నాథ్ సింగ్ టీడీపీ నేతలకు హామీ ఇచ్చారు.

ఆంధ్రావి తప్పుడు లెక్కలు-హరీశ్

నాబార్డుతో ఒప్పందం తెలంగాణకు ఎంతో మేలు చేస్తుందన్నారు ఆ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావ్. ఇవాళ ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులను కలిసిన అనంతరం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. నాబార్డు నిధులతో రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్లను పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 11 ప్రాజెక్ట్‌లతో పాటు, మొత్తం 99 ప్రాజెక్ట్‌లపై కేంద్రంతో ఒప్పందం చేసుకున్నామని ఆయన తెలిపారు. మొత్తం 11 ప్రాజెక్ట్‌లపై 7 వేల కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపామని ఆయన తెలిపారు. పోతిరెడ్డిపాడు నీటి వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని ఆయన ఆరోపించారు.

కేసీఆర్‌కు రేవంత్ బహిరంగ లేఖ

తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. జిల్లాల ఏర్పాటు కొందరికి నచ్చుతుండగా మరికొందరికి నచ్చడం లేదు. గద్వాలను జిల్లాగా ప్రకటించాలంటూ మాజీ మంత్రి డీకే అరుణ ఆందోళన ఉధృతం చేయగా కేసీఆర్ సర్కార్ పట్టించుకున్న పాపాన లేదు. సరిగ్గా ఇలాంటి సమయంలో టీటీడీపీ నేత తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసి కలకలం సృష్టించారు. రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాతే కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఆయ ప్రాంతాల అభిప్రాయాల మేరకే కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని, జనగామ జిల్లాపై సీఎం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు అఖిలపక్షం చేసిన సూచనలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయొద్దని అన్నారు. రేవంత్ లేఖ జిల్లాల ఏర్పాటును వ్యతిరేకిస్తున్న వారికి ఒక ఆయుధంగా మారే అవకాశం ఉండటంతో కేసీఆర్ సర్కార్‌కు కాస్త ఇబ్బందిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈరోజు ముగిసిన భూమన విచారణ..రేపు మళ్లీ..

  తుని ఘటనలో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సీఐడీ విచారణలో పాల్గొన్న సంగతి తెలిసిందే. దాదాపు ఐదారుగంటల పాటు  భూమన కరుణాకర్ రెడ్డి విచారణలో పాల్గొన్నారు. ఈరోజు విచారణ ముగియగా రేపు మళ్లీ విచారణలో పాల్గొనాలని సీఐడీ ఆదేశించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనంలో తప్పుడు ప్రచారం చేసేందుకు నన్ను పిలిచారు.. టీడీపీ ప్రభుత్వ కుట్ర ప్రకారమే నన్ను విచారణకు పిలిచారు అని అన్నారు. అంతేకాదు చంద్రబాబు రూథర్ ఫర్డ్ లాంటివాడు.. రూథర్ ఫర్డ్ గిరిజనులను ఏరిపారేసినట్టు..చంద్రబాబు కాపులను ఏరిపారేస్తున్నాడు అని ఆరోపించారు. చంద్రబాబు బెదిరింపులకు వెనక్కి తగ్గేది లేదు..మా పార్టీ ముద్రగడకు పూర్తి మద్దతు తెలుపుతుంది అని వ్యాఖ్యానించారు.

కారు స్టీరింగ్ కాదు... దోశ పెనం..

  సాధారణంగా కారు నడపడానికి మనం స్టీరింగ్ వాడతం. కానీ ఇక్కడ ఏ వ్యక్తి మాత్రం దోశ పెనం వాడుతున్నాడు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం.. అసలు సంగతేంటంటే.. ఆస్టేలియాలో ఓ వ్యక్తి నడుపుతున్న కారుకు స్టీరింగ్ ప్లేస్లో దోశ పెనం ఉంది. ఇది చూసిన ఓ వ్యక్తి పోలీసులకి సమాచారం అందించడంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి నడుపుతున్న కారు అత్యంత ఖరీదైన మజ్దా సెడాన్ కారు. అయితే కారు స్టీరింగ్ ఉండాల్సిన స్థానంలో దోశ పెనం ఉండటం చూసి అందరూ షాకయ్యారు. ఇదేంటిలా ఉంది అని అతనిని ప్రశ్నించి కారు రిజిస్ట్రేషన్ పేపర్లు అడుగగా లేవని సమాధానం చెప్పాడు. ఇన్సూరెన్స్ పేపర్లు అడిగినా కూడా లేవని చెప్పడంతో అతనిపై కేసు నమోదు చేసి, ఆ కారును స్వాధీనం చేసుకున్నారు.

కొత్త జిల్లాలపై కేసీఆర్... దసరా నుండి కొత్త జిల్లాలు

  తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై బాగానే కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే కొత్త జిల్లాలకు సంబంధించిన పటం కూడా బయటకు వచ్చింది. అంతేనా కొత్త జిల్లాల ఏర్పాటుపై వచ్చే అభ్యంతరాలను తెలుసుకోవడానికి సీఎం కేసీఆర్ నెలరోజుల పాటు గడువు కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు మరోసారి కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో అన్ని జిల్లాల‌ కలెక్టర్లతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ప‌రిపాల‌న విభాగాలు ఉండాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 75 మండ‌లాల ఏర్పాటుకు డిమాండ్లు వ‌చ్చాయని, వాటిల్లో 45 మండ‌లాల‌ను నోటిఫై చేసిన‌ట్లు పేర్కొన్నారు. దసరా నుండి కొత్త జిల్లాలు ప్రారంభమవ్వాలని.. ఆతరువాత జిల్లాల్లోని రెవెన్యూ, పోలీసు శాఖల ప‌ని కూడా ప్రారంభం కావాలని కేసీఆర్ సూచించారు. రెవెన్యూ, పోలీసు మిన‌హా మిగిలిన శాఖల ఆఫీసులు, అధికారుల నియామకం ఆ తర్వాత చేపట్టాలని పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలు, అధికారుల నివేదిక ఆధారంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటు కావాలని సూచించారు.

ఆప్ కు కోలుకోలేని దెబ్బ.. మూకుమ్మడి రాజీనామా..

ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. పంజాబ్ లో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 80 శాతం మంది ఆప్ నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇంతమంది రాజీనామా చేసి ఏ పార్టీలోకి చేరుతున్నారనే కదా డౌట్.. ఇంకేం పార్టీ బీజేపీకి రాజీనామా చేసి కొత్త పార్టీ పెట్టిన నవజ్యోత్ సింగ్ పార్టీలోకి చేరేందుకే ఆప్ పార్టీని వీడినట్టు తెలుస్తోంది. బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన సిద్దూ ఆతరువాత ఆప్ పార్టీలోకి చేరుతారని వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి. అయితే వాటన్నింటికీ తెర దించుతూ సిద్దూ ఇంకా ఇతర నేతలు కలిసి కొత్త పార్టీ ఏర్పాటు చేశారు.  'ఆవాజ్ ఇ పంజాబ్'లో పేరుతో ఏర్పాటు చేసిన ఈ పార్టీ ఈనెల 9 వ తేదీన ప్రారంభం కానుంది. ఆరోజే వీరంతా ఈ కొత్తపార్టీలోకి చేరుతారు అన్న వాదన వినిపిస్తోంది. అంతేకాదు ఈ సందర్బంగా అమృతసర్ ఇన్ చార్జ్ గురిందర్ సింగ్ బజ్వా మాట్లాడుతూ.. ఇంకా చాలా మంది ఆప్ లో కొనసాగుతున్న వారు.. తమ వెనుక రానున్నారని తెలిపారు. మొత్తానికి సిద్దూ పార్టీ..ఆప్ పార్టీకి భారీ షాకే ఇచ్చింది.

జియో సిమ్.. ఆదిలోనే కష్టాలు

  అతి తక్కువ ధరకే సిమ్.. దాదాపు మూడు నెలల వరకూ ఉచితంగా కాల్స్, డేటా ప్యాక్ ఇలాంటి అఫర్స్ ఇస్తే యువత అసలు ఆగుతుందా. ఆ సిమ్ ఎక్కడ దొరుకుతుందా అని..ఎంత కష్టమైన సరే దానిని సాధిస్తారు. అలాంటి ఆఫర్లతోనే రిలయన్స్ సంస్థ 'రిలయన్స్ జియో' పేరుతో సిమ్ ను తీసుకొచ్చింది. రిలయన్స్ వార్షికోత్సవం సందర్బంగా ప్రకటించిన ఈ సిమ్ దెబ్బకు 'ఎయిర్ టెల్', 'ఐడియా' నెట్ వర్క్ లు సైతం బెంబేలెత్తిపోయాయి. ఇక దాంతో 'జియో' కనుక బయటకి వస్తే ఆ నెట్ వర్క్ ల పని అయిపోయినట్టే అనుకున్నారు. కానీ ఆదిలోనే సిమ్ కు కష్టాలొచ్చిపడ్డాయి. వినాయక చవితి సందర్బంగా జియో సేవలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. దీంతో వేలాది మంది సిమ్ ల కోసం వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాదు  దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సిమ్ కార్డుల కొరత, కష్టపడి సిమ్ తీసుకున్నప్పటికీ, సాంకేతిక కారణాలతో యాక్టివేట్ కాకపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. అంతేనా సిమ్ కార్డులు అందని వారికి టోకెన్లు ఇచ్చి 15 వ తేదీ నాటికి ఇస్తామని నచ్చజెప్పుతున్నారు.   సిమ్ దొరకని వారి పరిస్థితి ఇలా ఉంటే కష్టపడి దొరికిన వారి పరిస్థితి మరోలా ఉంది. వాటిని యాక్టివేట్ చేయించుకునేందుకు ఒక్కసారిగా వెల్లువెత్తడంతో డిజిటల్ వెరిఫికేషన్ నెట్ వర్క్ సైతం స్తంభించిపోయినట్టు తెలుస్తోంది. ఢిల్లీ వంటి కొన్ని ప్రాంతాల్లో జియో సిమ్ ను రూ. 300 నుంచి రూ. 1000కి విక్రయిస్తున్నట్టు కూడా వార్తలు వెలువడ్డాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల్లోనూ సిమ్ ల కొరత కనిపిస్తోంది. మొత్తానికి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు.. ఇప్పుడే ఇన్ని కష్టాలు పడుతుంటే ముందు ముందు ఇంకెన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో 'జియో'..

రెండు వేల మంచాలతో రాహుల్ గాంధీ సభ...

  యూపీ ఎన్నికలకు పార్టీలన్నీ ఇప్పటికే కసరత్తు చేసేస్తున్నాయి. వచ్చే ఏడాది జరిగే ఈ ఎన్నికల్లో గెలవడానికి నేతలు చాలా వినూత్నంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా తమ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. సీఎం అభ్యర్దిగా షీలా దీక్షిత్ ను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రచారం కూడా వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దాదాపు నెల రోజుల పాటు 223 అసెంబ్లీ నియోజకవర్గాల్లో (ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం నియోజకవర్గాలు 403) రాహుల్‌ పర్యటించనున్నారు. అంతేగాక, యాత్రలో భాగంగా ప్రతి గ్రామంలోనూ పాదయాత్ర చేసి ఇంటింటికి వెళ్లి రైతులతో ముచ్చటిస్తారు. వారి నుంచి డిమాండ్లు సేకరిస్తారు. ముందు దేవరియా జిల్లా రుద్రాపూర్‌లో రైతులతో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.  ‘ఖాట్‌సభ’ పేరుతో నిర్వహించే ఈ సభలో రైతులు తీరిగ్గా కూర్చోవడానికి ఏకంగా 2వేల మంచాలను ఏర్పాటుచేశారు. మొత్తానికి రైతులకు కష్టం కలిగించకుండా మంచాలు బాగానే ఏర్పాటు చేశారు కానీ.. రాహుల్ ప్రసంగానికి కునుకువేసే రైతులకు మంచాలు బాగానే పనికొచ్చేలా ఉన్నాయి.

ఆపని చేసింది నా పీఏనే.. సందీప్ కుమార్

ఆప్ మాజీ మంత్రి సందీప్ కుమార్ అశ్లీల వీడియోలు లీకైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. ఈకేసు విచారణలో భాగంగా ఇప్పటికే ఓ మహిళ సందీప్ కుమార్ పై ఫిర్యాదు చేసింది. తాను ఓ విషయంలో మంత్రిగారికి ఫిర్యాదు చేయడానికి వచ్చానని... అప్పుడు తను తాగే డ్రింక్ లో మంత్రిగారు మత్తు పదార్ధం కలిపారని.. ఆతరువాత ఏం జరిగిందో తెలియదని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఆయన్ను పోలీసులు మూడు రోజులు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ విచారణలో మరో కొత్త అంశం చోటుచేసుకుంది. అదేంటంటే.. యువతులతో తాను అశ్లీల భంగిమల్లో ఉన్న సీడీలను తయారు చేసింది తన వ్యక్తిగత కార్యదర్శి ప్రవీణ్ కుమారే అని.. ప్రవీణ్ కుమార్ తనను కూడా  బ్లాక్ మెయిల్ చేశాడని విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ సీడీలను ప్రవీణ్ పలువురికి పంచాడని తెలిపాడు. మరి ఈ కేసు ఇంకెంత దూరం వెళుతుందో చూడాలి.

యూపీ ఎన్నికలు.. స్మార్ట్‌ఫోన్‌ ఆఫర్...

  ఎన్నికలు వస్తున్నాయంటే చాలు రాజకీయ నేతలు ప్రజలను ఎలా ప్రసన్నం చేయాలో అని వ్యూహాలు పన్నుతుంటారు. తమ తమ మేనిఫెస్టోలో కొత్త కొత్త హామీలను చేర్చుతారు.  ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల పథకాలను ప్రవేశపెడతారు. ఇప్పుడు యూపీ ప్రభుత్వం కూడా అలాంటి పథకమే ఒకటి తెరపైకి తీసుకొచ్చింది. ‘సమాజ్‌వాది స్మార్ట్‌ఫోన్‌ యోజన’ పథకాన్ని. ఇదేం పథకం అనుకుంటున్నారా.. అదేంటంటే.. ఈపథకం ద్వారా  అధునాతన ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్లను అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వం యూపీ ప్రజలకు అందించనున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా... ప్రజలు ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి తెలుసుకుంటారట. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కోసం..ఉత్తరప్రదేశ్‌లో నివసిస్తూ 18 సంవత్సరాలు నిండిన ఎవరైన ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబం ఆదాయం సంవత్సరానికి రెండు లక్షల రూపాయల లోపు ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడే ఇచ్చేయరు. వచ్చే ఏడాది యూపీ ఎన్నికలు రెండో భాగంలో పంపిణీ చేస్తారంట. అప్పటికీ ఎన్నికలు కూడా ముగిసిపోతాయి. ఈలోపు గెలిచేదెవరో.. ఓడేదెవరో.. కానీ ప్రజలను తమవైపు తిప్పుకోవడానికి మంచి ప్లాన్ వేశారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..

ముందు తిట్లు... తరువాత పశ్చాత్తాపం

  ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రొడ్రిగో డుటెర్టీ ముందు ఆవేశంగా అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు ఒబామాపై నోరుపారేసుకున్నాడు. ఆ తరువాత తాను చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాప పడుతున్నట్టు వ్యాఖ్యానించాడు. ఇంతకీ ఎందుకు తిట్టాడు.. ఎందుకు పశ్చాత్తాప పడ్డాడు అనేకదా డౌట్.. అసలు సంగతేంటంటే.. డ్రగ్స్‌ మాఫియాపై కఠినంగా వ్యవహరించడమేగాక, ఆ వ్యాపారాన్ని అంతమొందించేందుకు పలు సందర్భాల్లో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. దీంతో ఆయన ఇటీవలే ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఈ నేపథ్యంలో ఆయన డ్రగ్స్ మాఫియాపై మాట్లాడుతూ.. ఒబామాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసభ్య పదజాలంలో నిందించారు. ట్వీస్ట్ ఏంటంటే.. అది కూడా ఒబామాతో సమావేశానికి ఒక రోజు ముందు. ఇంకేముంది జరగాల్సింది జరిగిపోయింది. ఆయనతో భేటీని ఒబామా రద్దు చేసేశారు. అంతేకాదు నిజం తెలుసుకోవాలని తన సన్నిహిత అధికారులకు తెలిపారు. ఇక అంతా అయిపోయిన తరువాత కళ్లు తెరచిన రొడ్రిగో..  మీడియా ప్రశ్నలతో ఒత్తిడికి గురై ఆ వ్యాఖ్యలు చేశారని.. నుచిత వ్యాఖ్యలపై రొడ్రిగో పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్టు ఫిలిప్పీన్స్‌ అధికారులు తెలిపారు.