కావేరి జలాల కాక.. కర్ణాటక బంద్..
కర్ణాటక కావేరి జలాలు తమిళనాడుకు విడుదల చేయడంపై కర్ణాటక వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంకా కర్ణాటకలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనిలో భాగంగానే ఈరోజు కర్ణాటక రాష్ట వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. వేర్వేరు కన్నడ సంఘాలు, రైతు సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. ఆర్టీసీ బస్సు లు, ప్రైవేటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అంతేకాదు.. బంద్కు మద్దతుగా 30వేల ట్యాక్సీలు, 93వేల మ్యాక్సీ క్యాబ్లు, లక్షన్నర లారీలు కదల్లేదు. కన్నడ చలనచిత్ర పరిశ్రమ, మాల్స్ యజమానులు, విద్యాసంస్థలు, ఔషద దుకాణాల సంఘాలు, వ్యాపారుల సమాఖ్య, హోటళ్లు, పరిశ్రమల సంఘాలు, సమాఖ్యలు, 170కు పైగా కన్నడ సంఘాలు బంద్కు మద్దతు తెలిపాయి.