వెంకయ్య ఉపరాష్ట్రపతి పదవి కోసమే..
posted on Sep 9, 2016 @ 1:11PM
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని పాపం ఎన్డీయేదే అని.. ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటి ఎన్డీయే సర్కారు తుంగలో తొక్కుతోందని ఆరోపించారు. వెంకయ్యనాయుడు సీనియర్ సీనియర్ మంత్రి తరహాలో మాట్లాడలేదు.. ఉపరాష్ట్రపతి పదవి కోసమే వెంకయ్య ఇదంతా చేస్తున్నారు.. 14వ ఆర్ధిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పలేదు.. కాంగ్రెస్ పై విమర్శలు మానుకొని ఏపీకి న్యాయం చేయాలి అని అన్నారు. తాము చెప్పింది ఒకటైతే, ఇప్పుడు జరుగుతున్నది మరొకటని, దీనివల్ల విడిపోయిన రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. అరుణ్ జైట్లీ ప్రకటించిన ప్యాకేజీలో ఏమీ లేదని, రాష్ట్రానికి వచ్చేదేంటో తనకు తెలియడం లేదని.. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల రూ.60వేల కోట్ల నష్టం జరుగుతుందని మండిపడ్డారు. అంతేకాదు పోలవరం ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించడం సరికాదు. ఒకవేళ అప్పగిస్తే చట్ట సవరణ అవసరమని చెప్పారు.