యూరీ ఘటనపై రాజ్నాథ్ అత్యున్నత సమీక్ష..
జమ్మూకశ్మీర్ యూరిలోని భారతసైన్యం క్యాంప్పై ముష్కరులు దాడికి తెగబడి 17 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనను భారత ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. జాతీయ భద్రత, సరిహద్దుల్లో చోరబాటు తదితర అంశాలపై ఇవాళ అత్యున్నత స్థాయి సమీక్ష జరగనుంది. ఈ సమీక్షకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశానికి అన్ని రక్షణ విభాగాల ప్రతినిధులు, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్తో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో,రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అధ్యక్షులు, హోం, రక్షణ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు పాల్గొననున్నారు. వీరితో పాటుగా బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ డీజీలకు కేంద్రం నుంచి ఆహ్వానం అందింది.