నవరాత్రి సమయంలో గర్భవతులు ఏం చేయాలి..ఏం చేయకూడదు!

నవరాత్రి సమయంలో గర్భవతులు ఏం చేయాలి..ఏం చేయకూడదు!     నవరాత్రి భక్తితో జరుపుకునే తొమ్మిది రోజుల పండుగ.  సాధారణంగా మహిళలు నవరాత్రులను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ప్రతి రోజూ అమ్మవారి ఆరాధన, నైవేద్యం, ఉపవాసాలతో గడుస్తూ ఉంటుంది. అయితే సాధారణ మహిళలు అయితే ఇలా ఉపవాసాలు ఉంటూ అమ్మవారిని ఆరాధిస్తారు.  కానీ గర్భవతులు మాత్రం ఇంలాటి విషయాలలో చాలా శ్రద్ద తీసుకోవాలి. కడుపులో ఒక బిడ్డ పెరుగుతున్న సమయంలో ఉపవాసాల విషయంలో నిర్లక్ష్యం చేయడం,  వైద్యుల సలహా లేకుండా ఉపవాసాలు ఉండటం చేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది తల్లికి,  కడుపులో బిడ్డకు కూడా చాలా ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది.  నవరాత్రుల సందర్భంలో గర్భవతులు చేయాల్సినది ఏంటి? చేయకూడనిది ఏంటి? తెలుసుకుంటే.. ఉపవాసానికి ఉండాలంటే.. గర్భిణీ స్త్రీలు నవరాత్రి సమయంలో ఉపవాసం ఉండాలని అనుకుంటే మొదట  వైద్యుడిని సంప్రదించాలి. గర్భవతులు రోజంతా ఉపవాసం ఉండటం మంచిది కాదు.  ఒకవేళ ఉండాలని అనుకుంటే.. అది కూడా ఎలాంటి సమస్యలు లేకుండా చాలా ఆరోగ్యంగా ఉండేవారు అయితే   రోజంతా ఉపవాసం ఉండే బదులు పండ్లు, పాలు వంటి తేలికపాటి ఆహారాలు తినండి . పోషకాలు.. ఉపవాసం ఉన్నప్పుడు  ఆహారంలో తగినంత పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్, కాల్షియం , ఐరన్,  ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి. వీటిని ఎట్టి పరిస్థితులలో తగ్గించడం లేదా అసలు తీసుకోకుండా ఉండటం లాంటివి చేయకూడదు. పండ్లు, గింజలు, పాలు, పెరుగు, జున్ను తినాలి. శారీరక శ్రమ.. నవరాత్రి సమయంలో  సాధారణంగా ఇంటి పనులు, వంట పనులు, నైవేద్యాల తయారీ, దేవుడి అలంకరణ, పూజ వంటివి ఉంటాయి. ఇంకా పెద్ద పట్టణాలలో అయితే ప్రత్యేక ఈవెంట్లు కూడా ఏర్పాటు చేస్తుంటారు.  అయితే  గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో తేలికపాటి పనులు మాత్రమే చేయాలి. ఇక రెండవ,  మూడవ త్రైమాసికంలో వీటిని నివారించాలి . పూజలలో జాగ్రత్తలు.. సాధారణంగా పూజల సమయంలో ఎక్కువ సేపు కూర్చోవడం లేదా ఎక్కువ సేపు నిలబడటం వంటివి ఉంటాయి. కానీ వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  అలాగే పూజల పేరుతో ఎక్కువగా అలసిపోకూడదు. అలాగే దేవతా ఊరేగింపులు,  సమూహ పూజలు వంటివి చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్రాంతి,  నిద్ర.. గర్భధారణ సమయంలో నిద్ర చాలా ముఖ్యం . నవరాత్రి ఉత్సవాల్లో  నిద్ర విషయంలో రాజీ పడకూడదు. రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోవాలి.  అలాగే  పగటిపూట కొంత విశ్రాంతి తీసుకోవాలి. అలసట అనిపిస్తే కాస్త విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరి. నిర్లక్ష్యం వద్దు.. నవరాత్రుల సమయంలో ఏదైనా ఇబ్బందికరంగా అనిపించినా సమస్యగా ఉన్నట్టు అనిపించినా అవన్నీ పండుగ హడావిడిలో వచ్చాయి, తర్వాత తగ్గిపోతాయి  అనే నిర్లక్ష్యంతో ఉండకూడదు. వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.                                   *రూపశ్రీ.

మెనోపాజ్ సమయంలో మహిళల్లో గుండెపోటు ప్రమాదం.. నిజమేనా..!

మెనోపాజ్ సమయంలో మహిళల్లో గుండెపోటు ప్రమాదం.. నిజమేనా..! ప్రతి మహిళ జీవితంలో మెనోపాజ్ అనేది  ఒక ముఖ్యమైన దశ. అప్పటి వరకు ఎదుర్కొన్న ఋతుచక్రం మెల్లగా నెమ్మదించి ఆగిపోతుంది.  ఇది శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా మార్పులను తెస్తుంది. ఈ సమయంలో,శరీరంలో హార్మోన్ల హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇవి ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఈ కారణంగానే ఈ సమయంలో మహిళల్లో గుండెపోటు ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుందని గైనకాలజిస్ట్ లు అంటున్నారు. ఇది నిజమేనా? ఒకవేళ నిజం అయితే దీనికి పరిష్కారం ఏమిటి? తెలుసుకుంటే.. మెనోపాజ్ తర్వాత  గుండెపోటు ప్రమాదం ఎందుకు? మెనోపాజ్ తర్వాత మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయి వేగంగా తగ్గుతుంది. ఈ హార్మోన్ గుండెను సురక్షితంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈస్ట్రోజెన్ లేకపోవడం వల్ల  కొలెస్ట్రాల్,  రక్తపోటు పెరుగుతుంది. ఇది ధమనులలో అడ్డంకులు ఏర్పడే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది . 45 నుండి 55 సంవత్సరాల వయస్సు గల మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువ. ఇవన్నీ గుండెపోటు లక్షణాలే.. చాలా సార్లు మహిళలు గుండెపోటు  ప్రారంభ లక్షణాలను సాధారణ అలసట లేదా బలహీనతగా భావించి లైట్ తీసుకుంటారు. ఛాతీ లేదా ఎడమ చేతిలో నొప్పి ఉండటం,  శ్వాస ఆడకపోవడం, ఆకస్మిక చెమట, తలతిరగటం.. మొదలైన సంకేతాలన్నీ గుండెపోటును సూచిస్తాయి. జాగ్రత్తలు.. మెనోపాజ్ తర్వాత ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం  ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చు . ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.  ఆహారంలో తాజా పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు,  ఆరోగ్యకరమైన కొవ్వులు చేర్చాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.  ప్రతిరోజూ 30 నిమిషాలు నడక , యోగా లేదా తేలికపాటి వ్యాయామం చేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. మెనోపాజ్  సమయంలో ఒత్తిడి పెరుగుతుంది.  కాబట్టి ధ్యానం,  ప్రాణాయామం చేయాలి. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి.  రక్తపోటు , కొలెస్ట్రాల్,  చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయించుకోవాలి. ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.. తగినంత నిద్ర పోవాలి.  రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం ఆలస్యంగా లేవడం నివారించాలి. శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి.  ఇప్పటికే డయాబెటిస్ లేదా రక్తపోటు ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి.                                 *రూపశ్రీ.

గర్భధారణ సమయంలో ఎంతో ముఖ్యమైన విటమిన్ ఇదే..!

గర్భధారణ సమయంలో ఎంతో ముఖ్యమైన విటమిన్ ఇదే..! గర్భధారణ సమయంలో గర్భవతుల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన విటమిన్ లలో బయోటిన్ ఒకటి.  విటమిన్ బి 7 అని కూడా పిలువబడే బయోటిన్ నీటిలో కరిగే బి-కాంప్లెక్స్ విటమిన్. ఇది గర్భధారణ సమయంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది పిండం అభివృద్ధికి మద్దతు ఇస్తుంది,  శక్తి ఉత్పత్తిని పెంచుతుంది, జీవక్రియకు సహాయపడుతుంది,  ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు,  గోళ్ళ కు సహాయపడుతుంది. అయితే  గర్భధారణ సమయంలో బయోటిన్ లోపం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బయోటిన్ అధికంగా ఉండే ఆహారాన్ని ప్రినేటల్ డైట్లో చేర్చడం వల్ల తల్లి,  పిండం ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. అసలు బయోటిన్ గర్భవతులకు ఎందుకంత ముఖ్యం? బయోటిన్ అధికంగా ఉండే ఆహారాలు ఏవి? తెలుసకుంటే.. గర్భం దాల్చినప్పుడు  శరీరానికి  పోషకాల అవసరం పెరుగుతుంది.   బయోటిన్ కూడా ఇందులో ఒక భాగం. ఇది పిండం అభివృద్ధికి మద్దతు ఇస్తుంది, ఆహారాన్ని శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది.  సెల్యులార్ పెరుగుదలకు అవసరమైన ఎంజైమ్లను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తక్కువ బయోటిన్  ఉంటే పిల్లలకు  పుట్టుకతో  లోపాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందువల్ల బయోటిన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం గర్భవతులకు చాలా ముఖ్యం. గుడ్డు పచ్చసొన.. గుడ్డు పచ్చసొనలో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. కేవలం ఒక ఉడికించిన గుడ్డు పచ్చసొన మంచి మొత్తంలో బయోటిన్ ను అందిస్తుంది. గర్భధారణ సమయంలో సాల్మొనెల్లా ప్రమాదాన్ని నివారించడానికి గుడ్లు పూర్తిగా ఉడికించి తినాలి.  గింజలు, విత్తనాలు.. బాదం, వాల్ నట్స్, పొద్దుతిరుగుడు విత్తనాలు,  వేరుశెనగలో బయోటిన్ మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన కొవ్వులు,  ప్రోటీన్ కూడా ఉంటాయి. చిరుతిండిగా చిన్న గుప్పెడు విత్తనాలు తీసుకుంటే బయోటిన్  అందుతుంది. చిలకడదుంపలు.. విటమిన్లు, ఫైబర్,  యాంటీఆక్సిడెంట్లు చిలకడదుంపలలో పుష్కలంగా ఉంటాయి.  వీటిలో విటమిన్-ఎ కంటెంట్ కూడా మెరుగ్గా ఉంటుంది.  ఇది పిండం కంటి ఆరోగ్యానికి,  చర్మ అభివృద్ధికి కూడా మద్దతు ఇస్తుంది.  అరటిపండ్లు.. అరటిపండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది,  బయోటిన్ మితంగా ఉంటుంది. అరటిపండు మంచి శక్తిని ఇస్తుంది.  మొదటి త్రైమాసికంలో అనారోగ్యం లేదా వికారంతో ఇబ్బంది పడేటప్పుడు ఇవి బాగా  సహాయపడతాయి. పాలకూర.. పాలకూరలో గర్భధారణకు అవసరమైన ఐరన్, ఫోలేట్,  పుష్కలంగా ఉంటాయి. తే  తృణధాన్యాలు.. గోధుమలు, వోట్స్,  బ్రౌన్ రైస్ లలో ఫైబర్, ఐరన్,  బి-కాంప్లెక్స్ విటమిన్లతో పాటు మితమైన స్థాయి బయోటిన్ కలిగి ఉంటుంది.  పాల ఉత్పత్తులు.. పాలు, పెరుగు,  జున్నులలో  కాల్షియం,  ప్రోటీన్ మాత్రమే కాకుండా బయోటిన్  కూడా ఉంటుంది. ఇవి గర్భవతులకు మంచివి.                                *రూపశ్రీ.

నెలసరి సమయంలో పొట్ట సంబంధిత సమస్యలకు.. ప్రేగు ఆరోగ్యం ఇలా చెక్ పెట్టవచ్చు..!

నెలసరి సమయంలో పొట్ట సంబంధిత సమస్యలకు.. ప్రేగు ఆరోగ్యం ఇలా చెక్ పెట్టవచ్చు..! సాధారణ రోజుల కంటే.. నెలసరి సమయంలో మహిళలు  చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కుంటారు.  వాటిలో పొట్ట సంబంధ సమస్యలు ఎక్కువ.  హార్మోన్ల మార్పుల వల్ల ప్రోస్టాగ్లాండిన్లు,  ప్రొజెస్టెరాన్ స్థాయిలలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి.  వీటి వల్ల నెలసరి సమయంలో పొట్ట సంబంధ సమస్యలు వస్తాయి.   ఈ హార్మోన్లు జీర్ణక్రియ,  ప్రేగు కదలికలను ప్రభావితం చేస్తాయి. ఇది విరేచనాలు, మలబద్ధకం, ఉబ్బరం లేదా పొత్తికడుపు తిమ్మిరి వంటి లక్షణాలకు దారితీస్తుంది. అయితే నెలసరి సమయంలో ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.  అవేంటో తెలుసుకుంటే.. హైడ్రేటెడ్ గా ఉండాలి.. నీరు పుష్కలంగా త్రాగడం వల్ల మలబద్ధకం నివారించవచ్చు. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది. ఇది అదనపు సోడియంను బయటకు పంపడం ద్వారా ప్రేగు కదలికలు ఆరోగ్యంగా ఉండేలా చేసి  ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది.   ఫైబర్ ఆహారాలు.. ఓట్స్, తృణధాన్యాలు, పండ్లు,  కూరగాయలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు  ప్రేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడతాయి. కరిగే ఫైబర్ అదనపు నీటిని పీల్చుకోవడం ద్వారా విరేచనాలను తగ్గిస్తుంది. కరగని ఫైబర్ మలబద్ధకం రాకుండా చేస్తుంది. కెఫిన్,  చక్కెర పానీయాలు.. కెఫీన్ ప్రేగులను ఎక్కువగా ప్రేరేపిస్తుంది. విరేచనాలను మరింత తీవ్రతరం చేస్తుంది, చక్కెర పానీయాలు ఉబ్బరాన్ని, గ్యాస్ ను పెంచుతాయి.   పాల ఉత్పత్తులు.. కొంతమందికి  పీరియడ్స్ సమయంలో  లాక్టోస్ అసహనం పెరుగుతుంది. పాలు తాగిన తరువాత  గ్యాస్ లేదా ఉబ్బరం వంటి సమస్యలు ఎదురవుతుంటే..పాలు, పాల ఉత్పత్తులు మానేయాలి.  ప్రోబయోటిక్స్.. పెరుగు, కేఫీర్ లేదా పులియబెట్టిన కూరగాయలు వంటి ఆహారాలు ఆరోగ్యకరమైన గట్ బాక్టీరియాకు మద్దతు ఇస్తాయి, ఇవి జీర్ణక్రియను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి యాక్టీవ్.. నడక లేదా యోగా వంటివి జీర్ణక్రియను ప్రేరేపిస్తాయి.  ఉబ్బరాన్ని,  మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. ఇది మొత్తం నెలసరి నొప్పి,  మానసిక స్థితి నియంత్రణకు కూడా సహాయపడుతుంది. ఆహారం.. భారీ భోజనం కాకుండా తేలికైన భోజనం కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకోవాలి. ఇది  జీర్ణవ్యవస్థను బాగా తట్టుకోవడానికి సహాయపడుతుంది.  ఉబ్బరం లేదా  ప్రేగు ఇబ్బందులను తగ్గిస్తుంది. ఇవి తినొద్దు.. జిడ్డు,  కారంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇవి కడుపులో చికాకు కలిగించి జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి, విరేచనాలు లేదా కడుపు తిమ్మిరి వచ్చే అవకాశాలను పెంచుతాయి.  పీరియడ్స్ సమయంలో సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి.  హీటింగ్ ప్యాడ్.. వేడి కాపడం  లేదా హీటింగ్ ప్యాడ్ తిమ్మిరి నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా  పేగు కండరాలను సడలించి, ప్రేగు కదలికలను , పొట్ట  అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.                *రూపశ్రీ.

ప్రసవం తరువాత మహిళల్లో ఎదురయ్యే కీళ్ళ నొప్పులకు అధ్బుతమైన పరిష్కారాలు!!

ప్రసవం తరువాత మహిళల్లో ఎదురయ్యే కీళ్ళ నొప్పులకు అధ్బుతమైన పరిష్కారాలు! మహిళలకు ప్రసవం చాలా గొప్ప వరం.   అమ్మతనాన్ని మహిళలు ఎంతగానో అనుభూతి చెందుతారు. అయితే ప్రసవం తరువాత మహిళలు ఎదుర్కొనే సమస్యలు వేరు ఉంటాయి. ఇవి శారీరక సమస్యలు కావచ్చు, మానసిక సమస్యలు కావచ్చు. ప్రసవ సమయంలో మహిళలు బరువు పెరగడం, బిడ్డను కూడా మోయడం వల్ల మహిళల శరీర బరువు కీళ్లు, ఎముకల మీద చాలా ఎక్కు వ పడుతుంది. ఇక ప్రసవ సమయంలో కూడా ఈ కీళ్లు ఒత్తిడికి లోనవుతాయి. ఈ కీళ్ళ నొప్పులను భరించడం కష్టం. ఇందుకోసం మెడిసిన్స్  వాడక్కర్లేదు. ఇంట్లోనే సులువుగా ప్రసవానంతర కీళ్ళ నొప్పులు తొలగించుకోవచ్చు. అందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే.. మెంతులు మహిళల్లో ప్రసావానంతర కీళ్ల నొప్పులు తగ్గడంలో సహాయపడుతుంది. ఇందుకోసం మెంతులను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ మెంతి గింజలను తిని, నీటిని తాగాలి. మెంతికూరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఈ నొప్పులను దూరం చేయడంలో సహాయపడాయి. మెంతులు మాత్రమే కాకుండా ప్రసవానంతర కీళ్ల నొప్పులు తగ్గించుకోవడానికి పాటించవలసిన మరొక అధ్బుతమైన చిట్కా పసుపు. పసుపు గొప్ప యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. ప్రసవం తరువాత మహిళలు కీళ్ళ నొప్పులు మాత్రమే కాదు శరీరంలో ఎక్కడైనా వాపు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నా పసుపు ప్రయోజనకరంగా పనిచేస్తుంది.  ప్రతి రోజు పాలలో కాసింత పసుపు కలిపి తాగుతూండాలి. ఇది మాత్రమే కాకుండా కీళ్లు, ఇతర ప్రాంతాల్లో నొప్పి, వాపు ఉన్నచోట పసుపు ముద్దను పూయవచ్చు. ఇది నొప్పులు, మంట, వాపు తగ్గడంలో సహాయపడుతుంది. గర్బం మోయడం, ప్రసవం కారణంగా మహిళల శరీరం చాలా మార్పులకు, ఒత్తిడికి లోనై ఉంటుంది. ఈ కారణంగా మహిళలు బాగా అలసిపోయి ఉంటారు. మహిళలకు వీలైనంత విశ్రాంతి అవసరం అవుతుంది. అంతేకానీ ప్రసవం తరువాత  రోజుల వ్యవధిలోనే ఎక్కువ పనులు చేయడం చేయకూడదు. ప్రతిరోజు వీలైనంత విశ్రాంతి, మార్పులకు లోనైన శరీరానికి తేలికపాటి వ్యాయామం అవసరం. అయితే వ్యాయామం విషయంలో వైద్యులను సంప్రదించిన తరువాతే మొదలుపెట్టాలి. ప్రపంచదేశాలు ఇష్టంగా తాగే డ్రింక్స్ లో కాఫీ ప్రథమ స్థానంలో ఉంటుంది. కప్పుల కొద్ది కాఫీ సిప్ చేస్తూ పనులు చక్కబెట్టేవారు ఎందరో. కానీ ప్రసవం తరువాత మహిళలు కాఫీ తాగడం మానుకోవాలి. కాఫీ తాగడం వల్ల ప్రసవానంతరం కలిగే కీళ్ళ నొప్పులు పెరుగుతాయి. పైన చెప్పుకున్నవన్నీ ప్రసవం తరువాత మహిళలు పాటిస్తే ప్రసవానంతరం ఎదురయ్యే కీళ్ళ నొప్పులు ఎక్కవరోజులు ఇబ్బంది పెట్టకుండా చాలా తొందరగా తగ్గిపోతాయి.                                                       *నిశ్శబ్ద.  

ఈ ఒక్క సమస్య మహిళలలో గర్భస్రావానికి కారణం అవుతుంది..!

ఈ ఒక్క సమస్య మహిళలలో గర్భస్రావానికి కారణం అవుతుంది..!   ప్రతి జబ్బు మనిషికి ఏదో ఒక అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. వాటిలో కొన్ని తక్కువ ప్రమాదం కలిగి ఉంటే.. మరికొన్ని ఎక్కువ ప్రమాదం కలిగి ఉంటాయి.  ఇంకా ఈ వ్యాధులు కూడా మగవారికి వేరుగానూ,  ఆడవారికి వేరుగానూ కొన్ని ఉంటాయి. అయితే.. మహిళలలో వచ్చే ఒకే ఒక సమస్య మహిళలలో గర్భస్రావానికి కారణం అవుతుంది. ఇంతకీ ఆ సమస్య ఏమిటి? ఇదెలా గర్భస్రావాలకు కారణం అవుతుంది తెలుసుకుంటే.. థైరాయిడ్ లోపం (హైపోథైరాయిడిజం). ఇది మహిళల పీరియడ్స్‌ను ఇబ్బంది పెట్టడమే కాకుండా గర్భధారణకు కూడా ఆటంకం కలిగిస్తుంది. థైరాయిడ్ కారణంగానే 10 మందిలో కనీసం  నలుగురికి  గర్భస్రావాలు జరుగుతాయని, ముఖ్యంగా మొదటి మూడు నెలల్లోనే జరుగుతాయని గైనకాలజిస్టులు చెబుతున్నారు. థైరాయిడ్ లోపం ఉంటే గర్భస్రావం అయ్యే అవకాశాలు పెరుగుతాయని గైనకాలజిస్ట్ లు  చెబుతున్నారు. సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. కొంతమందిలో ఈ సమస్యను సకాలంలో నిర్వహించకపోతే.. ఇది పదేపదే గర్భస్రావాలు అయ్యే ప్రమాదాన్ని పెంచుతుందని  గైనకాలజిస్ట్ లు అంటున్నారు . అదే సమయంలో ఇది దీర్ఘకాలికంగా సంతానోత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుంది. దీన్ని  హైపోథైరాయిడిజం అని అంటారు, అంటే థైరాయిడ్ లోపం. థైరాయిడ్ లోపం ఉన్నవారికి ఆకలి వేయకపోవడం అనే లక్షణం ఉంటుంది. దీన్ని బట్టి ఈ సమస్య మీద అనుమానించి వైద్యుల దగ్గరకు వెళ్ళి పరీక్షలు చేయింటుకోవచ్చు. ఆకలి వేయకపోయినా, ఆహారం ఎక్కువ తినకపోయినా వీరు బరువు పెరుగుతూ ఉంటారు. నెలసరి ఆలస్యం.. థైరాయిడ్ లోపం వల్ల పీరియడ్స్ రాకపోవడం లేదా సకాలంలో రాకపోవడం జరుగుతుంది.  రెండు నుండి మూడు నెలలకు ఒకసారి  పీరియడ్స్ వస్తాయి. అదే సమయంలో కొంతమంది గర్భం దాల్చలేరు. మహిళలు  గర్భవతి అయినప్పటికీ, బిడ్డ హృదయ స్పందన రాదు,  హృదయ స్పందన వచ్చినప్పటికీ, మొదటి మూడు నెలల్లో రక్తస్రావం కారణంగా గర్భస్రావం అయ్యే అవకాశాలు చాలా పెరుగుతాయి . ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే మహిళలు చేయాల్సిన పని ఇదీ..  మహిళలు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తుంటే, ముందుగా  థైరాయిడ్ హార్మోన్‌ను తనిఖీ చేసుకోవాలి. అలాగే  ఈ హార్మోన్ లోపం ఉంటే దాన్ని సరిచేసుకోవడానికి వైద్యుల సహాయంతో  సప్లిమెంట్లను తీసుకోవాలి. తద్వారా  గర్భస్రావం జరగకుండా ఆపవచ్చు.                           *రూపశ్రీ.

గర్భవతులను డేంజర్ జోన్ లోకి తోసేసే ఇంట్రాహెపాటిక్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసా..

గర్భవతులను డేంజర్ జోన్ లోకి తోసేసే ఇంట్రాహెపాటిక్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసా..    గర్భం దాల్చడం,  బిడ్డను మోయడం,  బిడ్డకు జన్మనివ్వడం, మాతృత్వాన్ని ఆస్వాదించడం.. ఇవన్నీ ఒక మహిళ తన జీవితంలో కోరుకునే అత్యంత విలువైన విషయాలు. అయితే గర్భం విషయంలో నేటి కాలంలో చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. మహిళలకు పెద్ద సవాళ్లు విసురుతున్నాయి.  వాటిలో ఇంట్రాహెపాటిక్ ప్రెగ్నెన్సీ చాలా డేంజర్ అంటున్నారు వైద్యులు.  అసలు ఇంట్రాహెపాటిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి?   ఇది గర్భవతులను డేంజర్ జోన్ లోకి నెట్టివేస్తుంది ఎందుకు?  తెలుసుకుంటే.. ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు  పిండం సాధారణంగా గర్భాశయంలోనే అభివృద్ధి చెందుతుంది. కానీ గర్భిణీ స్త్రీ  పిండం ఆమె గర్భాశయంలో కాకుండా ఆమె కాలేయంలో పెరగడం గురించి ఎప్పుడైవా విన్నారా?  గర్భాశయంలో పెరగాల్సిన పిండం కాలేయంలో పెరగడాన్ని ఒక్కసారి ఊహించుకోండి.. చాలా భయానకంగా అనిపిస్తుంది కదా.. . ఇది వినడానికి  ఆశ్చర్యంగా అనిపించినా ఇలాంటి షాకింగ్ కేసు ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ లే వెలుగులోకి వచ్చింది  . అక్కడ ఒక మహిళ కాలేయంలో  పిండాన్ని వైద్యులు కనుగొన్నారుప. ఇది చాలా అరుదైన,  ప్రమాదకరమైన పరిస్థితి.  దీన్ని  ' ఇంట్రా హెపాటిక్ ప్రెగ్నెన్సీ ' అంటారు . ఇందులో,పిండం గర్భాశయంలో కాకుండా కాలేయంలో అభివృద్ధి చెందడం ప్రారంభిస్తుంది . దీనివల్ల కాలేయం చీలిపోయే ప్రమాదం ఉంటుంది.   తద్వారా  తల్లి చనిపోవచ్చు కూడా అని వైద్యులు అంటున్నారు. సాధారణంగా గర్భధారణ సమయంలో పిండం తల్లి గర్భాశయం లోపల పెరుగుతుంది. కానీ కొన్ని కారణాల వల్ల కొన్నిసార్లు పిండం ఫెలోపియన్ ట్యూబ్, ఉదర కుహరం , అండాశయం లేదా కాలేయం వంటి ఇతర అవయవాలలో కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ పరిస్థితిని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు.  పిండం కాలేయంలో ఏర్పడినప్పుడు దానిని ప్రత్యేకంగా ఇంట్రాహెపాటిక్ ప్రెగ్నెన్సీ అంటారు. కారణమేంటి..? మహిళలలో ఫెలోపియన్ ట్యూబ్  పగిలిపోవడం లేదా పిండం తప్పు దిశలో సెట్ కావడం ఈ సమస్యకు కారణం కావచ్చు. పిండం ఉదర కుహరంలోకి పడి రక్త ప్రవాహాన్ని అందించే అవయవానికి అతుక్కుపోతుంది.   కాలేయం రక్తంతో కూడిన అవయవం కాబట్టి పిండం అక్కడ అభివృద్ధి చెందగలదు. అదనంగా IVF లేదా ఇతర సంతానోత్పత్తి పద్ధతులను ఉపయోగించే స్త్రీలు, ఫెలోపియన్ ట్యూబ్‌లపై ఇన్ఫెక్షన్ లేదా శస్త్రచికిత్స హిస్టరీ కలిగి ఉంటారు.లేదా గతంలో శస్త్రచికిత్స లేదా ఉదరానికి గాయం అయిన స్త్రీలు ఇంట్రాహెపాటిక్ గర్భధారణకు ఎక్కువ ప్రమాదం కలిగి ఉంటారు. లక్షణాలు.. ఈ గర్భధారణ లక్షణాలు పొట్ట  కుడి ఎగువ భాగంలో తీవ్రమైన నొప్పి, అసాధారణ రక్తస్రావం, వాంతులు, వికారం, తలతిరుగుతున్నట్లు లేదా మూర్ఛపోవడం. కాలేయం చుట్టూ వాపు లేదా ఒత్తిడి అనుభూతి కూడా ఈ పరిస్థితికి సంకేతం కావచ్చు. ఈ లక్షణాలు ప్రారంభ దశలో సాధారణ గర్భధారణ లక్షణాల నుండి భిన్నంగా ఉంటాయి.  కాబట్టి గుర్తింపు కష్టం కావచ్చు. నష్టాలు.. ఈ  గర్భధారణలో అత్యంత తీవ్రమైన ప్రమాదం కాలేయం చీలిపోవడం. ఎందుకంటే ఇది రక్తంతో నిండిన ముఖ్యమైన అవయవం. గర్భంలో పిండం పరిమాణం పెరిగినప్పుడు, అది కాలేయంపై ఒత్తిడి తెస్తుంది. ఈ పరిస్థితిని గుర్తించి సకాలంలో చికిత్స చేయకపోతే కాలేయం చీలిపోవచ్చు. ఇది భారీ అంతర్గత రక్తస్రావం కలిగిస్తుంది,  తల్లి మరణానికి కూడా దారితీస్తుంది. ట్మీట్మెంట్.. ఇంట్రాహెపాటిక్ గర్భధారణను పూర్తి కాలంలో చికిత్స చేయలేము. ఇది నిర్ధారించబడిన వెంటనే వైద్యులు మందులు లేదా శస్త్రచికిత్స ద్వారా పిండాన్ని తొలగించే ప్రక్రియను ప్రారంభిస్తారు. సమస్య సీరియస్ గా ఉన్నప్పడు పాక్షిక కాలేయ శస్త్రచికిత్స కూడా అవసరం కావచ్చు. సకాలంలో చికిత్స మాత్రమే స్త్రీ ప్రాణాలను కాపాడుతుంది. దీని గురించి మహిళలు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.                                   *రూపశ్రీ.

మీకు జుట్టు రాలే సమస్య వేధిస్తోంటే అసలు కారణం ఇదే కావ్చచు!

మీకు జుట్టు రాలే సమస్య వేధిస్తోంటే అసలు కారణం ఇదే కావ్చచు!      ఇప్పటికాలంలో అమ్మాయిలు జుట్టు రాలడమనే సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సరైన కారణాన్ని తెలుసుకోకుండా కనిపించిన మార్గమల్లా ఫాలో అవ్వడంతో కేవలం జుట్టు రాలే సమస్య కాస్తా జుట్టు పలుచగా, సున్నితంగా మారిపోవడానికి, జీవం కోల్పోవడానికి కారణం అవుతుంది. అయితే దీనికి అసలు కారణం.. కారణానికి తగిన పరిష్కారం తెలుసుకుంటే.. శరీరంలో కొన్ని విటమిన్లు మరియు మినరల్స్ లోపించడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి సమస్యల్లో ఒకటి జుట్టు రాలడం. ఈ రోజుల్లో చాలా మంది జుట్టు రాలడం గురించి ఫిర్యాదు చేస్తున్నారు. రోజురోజుకూ తమ జుట్టు పల్చబడి పొడిబారడంతోపాటు చిట్లిపోతుందని కూడా కొందరు ఫిర్యాదు చేస్తున్నారు. పరిష్కారాలను వెతుక్కుంటూ చాలామంది బ్యూటీ ప్రొడక్ట్స్, షాంపూల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ, కొన్నిసార్లు, శరీరంలో ఇదొక్కటి తగినంత మొత్తంలో లేకపోవడం వల్ల జుట్టురాలిపోవడం జరుగుతుంది. మీ గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం నుండి శరీరంలో వివిధ రకాల విధులను సజావుగా నిర్వహించడం వరకు సహాయపడేది ఇదే.. ఇంత ప్రముఖ పాత్ర పోషించే పదార్థమే ఒమేగా-3 ఫ్యాట్స్..   జుట్టు రాలే సమస్య బాగా  ఎదుర్కొంటుంటే లేదా మీ జుట్టు పలుచబడటం లేదా పొడిగా,  పెళుసుగా ఉన్నట్లు అనిపిస్తే, ఒమేగా-3 తీసుకోవడం గురించి ఆలోచించాల్సిందే.. ఒమేగా-3 కొవ్వులు చర్మంలో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి, అవి  జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. జుట్టు చక్కగా.. అందంగా, మందంగా లేకపోతే  ఒమేగా-3 శరీరానికి తగిన మోదాదులో అందడం లేదని అర్థం. ఇలాంటి  పరిస్థితిలో  తప్పనిసరిగా తినవలసిన ఆహారాలను ఆరోగ్య నిపుణులు సూచించారు.  నెయ్యి, ఆలివ్ నూనె, బాదం, వాల్‌నట్‌లు, అవిసె గింజలు,  చియా విత్తనాలు ఒమేగా-3 పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు. ఇవి మాత్రమే కాకుండా.. ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం జుట్టు రాలడాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. మొత్తం జుట్టు నాణ్యతను పెంచుతుంది. ఒమేగా-3 అధికంగా ఉండే ఆహారాలు కాకుండా, మీ జుట్టుకు మంచి చేసే ఇతర ఆహారాలు.. గుడ్లు, బచ్చలికూర,  గింజలు, నల్ల శనగలు,  అవకాడోలు మరియు ఆకుపచ్చ ఆకు కూరలు మొదలయినవి.                                                                                                              ◆ నిశ్శబ్ద

కూర్చోవడం వల్ల వచ్చే కష్టాలు

కూర్చోవడం వల్ల వచ్చే కష్టాలు 1. కుర్చీలోంచి కదలకుండా ఓ అరగంట కుర్చున్నారో...అనారోగ్యాలు మిమ్మల్ని చుట్టుముడతాయి, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. నిజానికి స్థిరంగా కూర్చోటమన్నది మానవులకు సరిపడదుట. అలా కదలకుండా కూర్చున్నప్పుడు మన శరీరంలోని ఎల్.పి.ఎల్ పనితీరు మందగిస్తుదట. ఎల్.పి.ల్ పనితీరు మందగిస్తే నష్టం ఏంటి అంటారా! ఈ ఎల్.పి.ఎల్ వ్యాక్యూమ్ క్లీనర్ లా పనిచేస్తూ, రక్తంలోని చెడు కొలస్ట్రాల్ ను పీల్చుకుని కండరాల రూపంలోకి మారుస్తుంది, సో కదలకుండా కూర్చున్నపుడు ఈ ప్రక్రియ అంతా మందగిస్తుంది. దీంతో రక్తంలో కొవ్వు పెరిగిపోయి చివరికది పొట్ట, తదితర భాగాలలో నిల్వ ఉండిపోతుంది. అందుకే ఎక్కువ సేపు అలా కూర్చుని ఉద్యోగాలు చేసేవారికి పొట్ట త్వరగా వచ్చేది. 2). సహజంగానే ఆడవారికి పిల్లలు పుట్టాకా కాస్త నడుము, పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోతుంది. అదే పనిగా కూర్చుని ఉద్యోగాలు చేసే వారి గురించి ఇక చెప్పేదిముంది. అవునూ ఇంతకీ పొట్ట దగ్గర కొవ్వు పేరుకుంటే ఏమన్నా ఇబ్బందా అన్న డౌట్ వస్తోంది కదా! ఖచ్చితంగా దాని వలన ఇబ్బందే. పొట్ట భాగంలో పేరుకునే కొవ్వు చాలా ప్రమాదకరమైనదిట. ఇది రక్తంలో కొవ్వు శాతాన్ని పెంచే హార్మోన్లను సైతం ఉత్పత్తి చేస్తుంది కాబట్టి. రక్తనాళాలు పూడుకు పోవటం, స్థూలకాయం అధికరక్తపోటు, మధుమేహం వంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం వుందని హేచ్చరిస్తున్నారు పరిశోదకులు. 3) చాలా సేపు కదలకుండా కూర్చుంటే ఆరోగ్యనికి మంచిది కాదు. కండరాలు క్రమేపి బిగుసుకుపోవటం, వెన్నుముక, భుజాలు, తుంటి సమస్యలు రావటం వంటి ప్రమాదాలు పొంచి వుంటాయట. అదేపనిగా ఒకేచోట కదలకుండా కూచునేవాళ్ళకి రోజు మొత్తం మీద ఒకేచోట  మూడుగంటలని మించి కూర్చోకూడదు. అదీ తప్పని సరైతే తప్ప. వీలునప్పుడు ప్రతీ అరగంటకి ఓసారి లేచి అటుఇటు కాసేపు తిరగటం మంచిది. లేదంటే ఇట్టే అనారోగ్యాల బారిన పడే ప్రమాదం వుందని తేల్చిచెప్పారు అమెరికన్ పరిశోధకులు. ఇందుకుగాను సుమారు 1.20 లక్షల మందిని పరిశీలించారు. వారి జీవనశైలి, ఎంతసేపు ఒకేచోట కూర్చుంటున్నారు వంటి విషయాలని పరిశీలించారు. విశ్రాంతి సమయంలోనైన రోజుకి 3 గంటలకి పైగ కదలకుండా కూర్చునే వాళ్ళలో గండె జబ్బులు వంటివి రావటం గమనించారట. ఎట్టి పరిస్తితిలో ఒకే చోట ఎక్కువ సేపు కూర్చో వలసి వస్తే మాత్రం మధ్య మధ్యలో లేచి అటు ఇటు తిరగటం మంచిది. 4) మన అలవాట్లే మనల్ని కొన్ని అనారోగ్యాలకి దగ్గర చేస్తున్నాయి అంటున్నారు నిపుణులు. ఇందాక చెప్పుకున్నట్టు ఒకేచోట కూర్చోవటం కొన్ని అనారోగ్యాలకి దగ్గర చేస్తే కంప్యూటర్ దగ్గర అదే పనిగా ఎక్కువసేపు  గడిపితే మరో ప్రమాదం పొంచి వుంది. ఈ మధ్య మహిళలు కూడా కంప్యూటర్ని ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఎక్కువసేపు కంప్యూటర్ దగ్గర ఉండే ఆడవారికి ముఖం మడతలు పడటం, కళ్ళు జీవాన్ని కోల్పోవడం, వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం వుందటున్నారు నిపుణులు. తీవ్రమైన రేడియేషన్ కారణంగా కంటి కింద వలయాలు రావటంతో పాటు చర్మ సాగి ముడతలు పదే ప్రమాదం కూడా ఉందట. ఆ పరిస్థితులు రాకుండా ఉండాలంటే కంప్యూటర్ ముందు ఎక్కువ సేపు ఉండవలసి వచ్చినపుడు మధ్య మధ్యలో చిన్నపాటి విరామాలు తీసుకోవటం తప్పని సరట. -రమ

నడుమునొప్పికి అధిక కారణాలు ఇవే… పరిష్కారాలు కూడా...

నడుమునొప్పికి అధిక కారణాలు ఇవే… పరిష్కారాలు కూడా... చాలామంది మహిళలలో తరచుగా వినిపించే ఫిర్యాదు నడుమునొప్పి. నడుమునొప్పి అనేది ఒకప్పుడు పెద్ద వయసు వారికి మాత్రమే వాచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు వయసుతో సంబంధం లేకుండా నడుమునొప్పి వచ్చేస్తోంది. నడుమునొప్పి నివారణ కోసం ఎన్నో రకాల మందులు, పెయిన్ రిలీఫ్ జెల్, పెయిన్ రిలీఫ్ క్రీమ్ లు వాడుతుంటారు. అయితే అసలు నడుము నొప్పి ఎందుకు వస్తుంది అని కారణం తెలుసుకుంటే దీన్ని నివరించుకోవడం అందరి చేతుల్లోనే ఉంది. మరి నడుము నొప్పి ఎలా వస్తుంది దానికి కారణం ఏమిటి వంటి వివరాలు తెలుసుకుంటే… నడుమునొప్పి ఎలా వస్తుంది?ఎందుకు వస్తుంది? నడుము  అనేది శరీరానికి మధ్యభాగంలో ఉన్న అవయవం. కడుపు పై భాగం నుండి ఉన్న బరువు మొత్తం నడుము మీద పడుతూ ఉంటుంది. ఏదైనా పని చేసేటప్పుడు లేదా సాధారణంగా అలవాటు ప్రకారము వంగినప్పుడు నడుము భాగం వంచుతూ ఉంటాం. ఫలితంగా నడుము భాగం ప్రభావానికి గురవుతుంది. నడుము వంచిన భంగిమ లేదా నడుము మీద బరువు పడే ప్రాంతాన్ని బట్టి నడుము ప్రాంతం ఒత్తిడికి లోనయ్యి నొప్పి వస్తుంది. ఒకే వైపు బరువు పడటం, ఒకే వైపు వంగి కూర్చోవడం, ఒకే వైపు బరువులు ఎత్తడం, నడవడంలో కూడా ఒకేవైపు బెండ్ కావడం వంటివి జరిగినప్పుడు నడుము ప్రభావానికి గురయ్యి నొప్పి వస్తుంది. ఈ నడుము నొప్పి వచ్చే కొన్ని కారణాల, వాటి నివారణకు మార్గాలు ఉన్నాయి… కూర్చునేటప్పుడు:- కూర్చునేటప్పుడు   వీపును నిటారుగా ఉంచి కూర్చోవాలి. దీనివల్ల శరీరం సమాంతరంగా ఉండి బరువు ఒకే ప్రాంతంలో పడకుండా ఉంటుంది. నడుము నొప్పి రాకుండా ఉండటం కోసం మాత్రమే కాకుండా నడుమునొప్పి వచ్చినప్పుడు కూడా వీలైనంతవరకు ఇలా కూర్చోవడం అలవాటు చేసుకుంటే నడుమునొప్పి తగ్గిపోతుంది.  చాలామంది బరువులు ఎత్తుతూ ఉన్నపుడు కాళ్ళను నిటారుగా ఉంచుతారు. ఇలా ఎత్తేటప్పుడు నడుము మీద చాలా ఒత్తిడి పడుతుంది. నడుము భాగంలో కండరాలు, ఎముకలు బిగుసుకున్నట్టు అవుతాయి. అయితే ఇలా బరువు ఎత్తేటప్పుడు ఏమాత్రం బ్యాలెన్స్ కాస్త తప్పిన అది నడుము మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది.   కాబట్టి బరువులు ఎత్తేటపుడు కాళ్ళను 'మోకాళ్ళవద్ద వంచి, బరువులు ఎత్తాలి.  ఇకపోతే నిలబడినప్పుడు కూడా పద్దతిగా నిలబడాలి. కొండస్రు నిలబడినప్పుడు బరువు మొత్తం ఒక కాలు మీద వేసి నిలబడటం, లేదా ఒకవైపుకు వంగి నడుము ఒకవైపు భాగం మీద బరువు వేయడం, ఒకవైపు మాత్రమే నడుము వంచి ఎక్కువ సేపు ఉండటం వంటివి చేస్తుంటారు. దీనివల్ల నడుమునొప్పి చాలా తొందశరగా వస్తుంది. కాబట్టి నిలబడినట్టు అటు ఇటు బెండ్ అవ్వకుండా నిటారుగా నిలబాడ్స్ట్స్మ్ ఎంతో ముఖ్యం. పడుకునే సమయంలో కూడా భంగిమ ఎంతో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒకవైపుకు తిరిగి పడుకోవడం లేదా పడుకున్న తీరు ఏదైనా శరీరం అస్తవ్యస్తంగా కాకుండా కాస్త నిటారుగా ఉండటం ముఖ్యం. లేకపోతే శరీరం అస్తవ్యస్తంగా ఉన్నట్టు నిద్రపోతే నడుము భాగంలో కండరాలు పట్టేస్తాయి.  పొట్ట కింద భాగంలో ఉండే అబ్డామినల్ కండరాలు ఎఫెక్ట్ అవుతాయి. ఒకవేళ ఎలాగంటే అలా పడుకునే అలవాటు ఉన్నవాళ్లకు నడుము నొప్పి రాకూడదు అంటే ఒక మంచి చిట్కా ఉంది. పడుకునేటప్పుడు మోకాళ్ళ కింద దిండు పెట్టుకుంటే పడుకునే విధానం కాస్త మెరుగ్గా ఉంటుంది. ఫలితంగా నడుము ఒత్తిడికి గురి కాదు. కుర్చీలో కూర్చున్నప్పుడు నిటారుగా కూర్చోవాలి. అంతే కానీ ఒకవైపుకు అనుకుని మూలకు కూర్చోకూడదు. అలాగే కుర్చీ నుండి లేచేతప్పుడు ఒకేసారి పైకి లేవకుండా  ఒక కాలిని ముందుకు, మరొక కాలిని వెనక్కు పెట్టి లేవడానికి ప్రయత్నించాలి. ఇలా చేస్తే నడుమునొప్పి రాదు.  ఆడవారిలో ఈమధ్య బాగా విస్తృతం అయిపోయిన అలవాటు హై హీల్స్ వేసుకోవడం. ఇలా హైహీల్స్ వేసుకొంటే నడుమునొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.  చాలామంది  ఆడవారు ఇతరులతో మాట్లాడేటప్పుడు రెండు కాళ్ళను ఇంటూ ఆకారంలో ఉంచి మాట్లాడుతూ ఉంటారు. దీనివల్ల నడుమునొప్పి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి.  కాబట్టి ఈ అలవాటు ఉంటే మానుకోవడం మంచిది. పైన చెప్పుకున్న కొన్ని చిట్కాలు గమనిస్తే మహిళలు తమకు తెలియకుండా నడుము నొప్పిన బారిన ఎలా పడుతున్నారో కూడా అర్థమవుతుంది. వాటికి సూచించిన జాగ్రత్తలు తీసుకుంటే నడుము నొప్పికి చెప్పచ్చు బై బై..                                      ◆నిశ్శబ్ద.

బరువు తగ్గి మళ్ళీ పెరుగుతున్నారా...అయితే మీరు చేస్తున్న పొరపాట్లు ఇవే..

బరువు తగ్గి మళ్ళీ పెరుగుతున్నారా...అయితే మీరు చేస్తున్న పొరపాట్లు ఇవే..   బరువు తగ్గడం అనేది అతి పెద్ద కష్టాలలో ఒకటి అని మీరు అంగీకరిస్తారు. ఒక పరిశోధన అంచనా ప్రకారం బరువు తగ్గిన వారిలో 80% మంది ఒక సంవత్సరంలోపు బరువును తిరిగి పొందుతారు.  ఎప్పుడైనా బరువు తగ్గి మళ్ళీ  దాన్ని తిరిగి పొందినట్లయితే ఈ సమస్య గురించి  అంతో ఇంతో అనుభవం ఉండి ఉంటుంది. దీర్ఘకాల బరువు తగ్గడంలో 20% మంది వ్యక్తులు మాత్రమే విజయవంతమయ్యారని పరిశోధనలో తేలింది. బరువు తగ్గేవారు తమ బరువును ఎక్కువ కాలం ఎలా మెయింటైన్ చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి అది పెద్ద విషయం కాదు. కానీ అక్కడున్న పొరపాటల్లా తగ్గిన బరువు పెరగకుండా ఏం చెయ్యాలన్నదే.  కొన్ని సులభమైన మార్గాలను అనుసరించడం ద్వారా తగ్గిన  బరువును అలాగే మైంటైన్ చేయవచ్చు.  అవేంటో తెలుసుకుంటే.. మొదటిది, చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే,  ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం. తద్వారా  బరువును తగ్గించుకోవడం. బరువు తగ్గాలనే ఆలోచనతో ఆకలి వేస్తున్నా దాన్ని అణిచిపెట్టుకోవడం చాలా పెద్ద తప్పు.  అలా చేయడం వల్ల  శరీరంలో బలహీనత ఏర్పడుతుంది. కాబ్టటి  ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునంటూ బరువు తగ్గితే అది  దీర్ఘకాలం నిలిచి ఉంటుంది. బరువు తగ్గగానే ఇక సమస్య ఏమీ లేదులే అనుకుని నచ్చినట్టు తినడం చాలామంది చేసే తప్పు. మరీ ముఖ్యంగా బయటి ఆహారాలు, బేకరీ ఫుడ్స్ వంటివి రెచ్చిపోయి తింటుంటారు. కానీ ఇలా బరువు తగ్గడం మళ్ళీ ఇలాంటి ఆహారాలు తినడం శరీర వ్యవస్థను దారుణంగా దెబ్బతీస్తుంది. ముందున్న బరువు కంటే రెండింతల బరువు పెరిగే అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే ఆహారం ద్వారా హార్మోన్లు అసమతుల్యానికి గురవుతాయి. బరువు తగ్గిన తరువాత మళ్ళీ పెరగకుండా ఉండాలంటే దానికి మంచి మార్గం బరువును ట్రాక్ చేయడం. ఇంట్లో ఒక వెయిట్ మిషన్ ఉంచుకోవాలి. ప్రతివారం బరువును చెక్ చేసుకోవాలి. దీన్ని బట్టి బరువు పెరుగుతూ ఉంటే ఆహారం నుండి విహారం వరకు ఏయే మార్పులు చేసుకోవాలో తమకు తాము అర్థం చేసుకోగలుగుతారు. చాలామంది బరువు తగ్గడానికి వ్యాయామంతో పాటు డైటింగ్ కూడా ఫాలో అయి ఉంటారు. ఇలా ఫాలో అయిన డైటింగ్ ను బరువు తగ్గగానే ఆపేయడం మంచిది కాదు. అప్పుడప్పుడు చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు కానీ పూర్తీగా ఆ డైటింగ్ ను వదిలేయడం అంటే తిరిగి బరువు పెరగడానికి మార్గం ఫిక్స్ చేసుకుంటున్నట్టు.  బరువు తగ్గామనే సంతోషంలో అధిక కేలరీలు కలిగిన ఆహారాన్ని ఇష్టానుసారం తినడం మంచిది కాదు. స్వీట్లు, నూనె పదార్థాలు, శుద్దిచేసిన ఆహారం, ప్యాక్డ్ ఫుడ్స్ మొదలైనవాటికి చాలా దూరం ఉండాలి. పైన చెప్పుకున్న టిప్స్ ఫాలో అయితే బరువు  తగ్గిన తరువాత పొరపాటున కూడా మళ్లీ పెరగడం అనే సమస్య ఉండదు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం   అప్పటివరకు కష్టపడి తగ్గిన బరువు అంతా కొండలా మళ్ళీ పెరగడం మొదలవుతుంది.                                                                     *నిశ్శబ్ద.  

గర్భధారణ సమయంలో ప్రయాణం చేస్తున్నారా...ఈ తప్పు చేస్తే చాలా డేంజర్..!

గర్భధారణ సమయంలో ప్రయాణం చేస్తున్నారా...ఈ తప్పు చేస్తే చాలా డేంజర్..! గర్భధారణ సమయంలో మహిళలు ప్రతి అడుగు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో గర్భవతులు ఏదైనా టూర్ లేదా ఏదైనా ప్రయాణం చేయవలసి వస్తే వారు తీసుకునే జాగ్రత్తల చిట్టా  మరింత పెరుగుతుంది.  ఎందుకంటే ప్రయాణంలో వాతావరణంలో మార్పు, మార్గంలో అలసట, తినడం,  త్రాగడంలో సమస్యలు.  లేదా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఇబ్బందులు.  ఇవన్నీ గర్భవతులను,  వారి కడుపులో పెరుగుతున్న  బిడ్డ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అందువల్ల ఈ సమయంలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. తద్వారా  హాయిగా ప్రయాణించడమే కాకుండా, గర్భవతుల ఆరోగ్యం, కడుపులో బిడ్డ ఆరోగ్యం కూడా పూర్తిగా సురక్షితంగా ఉంటుంది.  గర్భిణీ స్త్రీలు టూర్ లేదా ఏదైనా ప్రయాణం కు వెళ్లే ముందు ఏ విషయాలను గుర్తుంచుకోవాలో తెలుసుకుంటే.. గర్భవతులు టూర్ లేదా ప్రయాణం కు వెళ్ళేముందు ఆరోగ్యాన్ని తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యమట. ముఖ్యంగా గర్భవతులకు  ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి ఉంటే లేదా  క్రమం తప్పకుండా మందులు తీసుకుంటుంటే హెల్త్ చెకప్ అనేది చాలా ముఖ్యం.  ముఖ్యమైన మందులు, ప్రథమ చికిత్స కిట్, శానిటైజర్,  మాస్క్ ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలి. ఇప్పటికే వైద్యుల దగ్గర చెకప్ తీసుకుని ఉంటే వైద్యుల సూచించిన   మందులను వెంట ఉంచుకోవాలి.  లేకుంటే ప్రయాణంలో పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం,  తల్లి,  పిల్లల ఆరోగ్యం ప్రమాదంలో పడవచ్చు. ప్రయాణ సమయంలో గర్భిణీ స్త్రీలు తమ ఆహారం పట్ల శ్రద్ధ వహించాలని వైద్యులు చెబుతున్నారు.  అపరిశుభ్రమైన ఆహారం,  కలుషిత నీటిని నివారించాలి. శుభ్రమైన నీటిని మాత్రమే త్రాగాలి.   తాజా, వేడి ఆహారాన్ని తినాలి. ప్రయాణించేటప్పుడు బయటి ఆహారం తినడం వల్ల సమస్యలు ప్రమాదాలు పెరుగుతాయి. ఇంటి ఆహారాన్ని లేదా శుభ్రమైన ఆహారాన్ని తీసుకునేలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు ప్రయాణిస్తున్నప్పుడు తగినంత నిద్ర పొందడం చాలా ముఖ్యం అని వైద్యులు అంటున్నారు . అలసట,  నిద్ర లేకపోవడం వల్ల రోగనిరోధక శక్తి బలహీనం అవుతుంది. నిద్ర లేకపోవడం వల్ల  ప్రయాణాన్ని పూర్తిగా ఆస్వాదించలేరు, మెదడులోని అలసట కారణంగా  శక్తి తగ్గుతుంది. గర్భవతులు ప్రయాణాన్ని వాతావరణానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి. ఉదాహరణకు.. ప్రస్తుతం వేడిగా ఉంటే..  బట్టలు, సన్‌స్క్రీన్ లేదా గొడుగు,  ఇతర అవసరమైన వస్తువులను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి. ఎందుకంటే  ఒక టూర్ కు వెళ్ళినప్పుడు ఆ ప్రదేశం  వాతావరణ పరిస్థితులకు,   వెళ్లాల్సిన ప్రదేశం యొక్క వాతావరణ పరిస్థితులకు చాలా తేడా ఉంటుంది. కాబట్టి  ముందుగానే వాతావరణానికి అనుగుణంగా సిద్ధం కావాలి. గర్భిణీ స్త్రీలు ప్రయాణించేటప్పుడు ఒత్తిడి లేకుండా ఉండాలి.  మానసిక ఒత్తిడి కూడా  ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి  ప్రయాణంలో ఉంటే, ఒత్తిడికి దూరంగా ఉండి ఆ ప్రయాణాన్ని ఆస్వాదించాలి.                              *రూపశ్రీ.    

చర్మం ముడతలు, తెల్ల జుట్టుకు ఈ హార్మోన్ల లోపమే కారణమట..!

చర్మం ముడతలు,తెల్ల జుట్టుకు ఈ హార్మోన్ల లోపమే కారణమట..!   చర్మం యవ్వనంగా ఉండాలని,  జుట్టు ఎప్పటికీ నల్లగా ఉండాలని కోరుకోని వారు ఎవరూ ఉండరు.  దీనికి కారణం ఇలా ఉంటే ఎప్పటికీ వయసు మీద పడినట్టు కనిపించదు. కానీ కొంతమందికి దురదృష్ట వశాత్తు చిన్న వయసులోనే చర్మం ముడతలు పడటం,  జుట్టు తెల్లగా మారడం కనిపిస్తుంది. అయితే ఇలా జరగడానికి శరీరంలో హార్మోన్ల లోపమే అని వైద్యులు, పరిశోధకులు చెబుతున్నారు. అసలు ఏ హార్మోన్లు లోపించడం వల్ల చర్మం అలా ముడతలు పడటం, జుట్టు తెల్లగా మారడం జరుగుతుంది? ఈ హార్మోన్ల లోపం రాకూడదు అంటే ఏం చేయాలి? పూర్తీగా తెలుసుకుంటే.. చర్మం వృద్దాప్యానికి లోను కావడంలో,  ముడతలు పడటంలో హార్మోన్లు చాలా కీలక పాత్ర పోషిస్తాయట. చర్మం ఎక్కువగా సూర్యరశ్మికి గురికావడం, కాలుష్యం,  శరీరంలో వ్యర్థాలు ఎక్కువగా ఉండటం మొదలైన కారణాల వల్ల కూడా చర్మం ముడతలు పడే అవకాశం ఉంటుంది ఇన్సులిన్ లాంటి గ్రోత్ ఫ్యాక్టర్,  గ్రోత్ హార్మోన్..  ఈస్ట్రోజెన్లు,  మెలటోనిన్ వంటి హార్మోన్లు చర్మాన్ని ప్రభావితం చేస్తాయి. మెలటోనిన్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడుతుంది,  చర్మ కణాల మరమ్మత్తుకు సపోర్ట్  ఇస్తుంది.  మెలటోనిన్ భవిష్యత్తులో యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ లో భాగంగా మారవచ్చని వైద్యులు, పరిశోధకులు అంటున్నారు.. ఎండోకన్నబినాయిడ్స్ (CBD ఉత్పత్తులలో కనిపిస్తాయి),  ఆక్సిటోసిన్ (లవ్ హార్మోన్) చర్మాన్ని సూర్యుడి కాంతి నుండి దెబ్బతినకుండా రక్షించగలవని,  కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. చర్మం వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేయడంలో సహాయపడే 8 హార్మోన్లు.. గ్రోత్ హార్మోన్:   కణజాలాలను మరమ్మతు చేయడంలో, దృఢమైన చర్మం కోసం కొల్లాజెన్‌ను నిర్వహించడంలో సహాయపడుతుంది. ఈస్ట్రోజెన్లు:   ముఖ్యంగా రుతుక్రమం ఆగిన మహిళల్లో చర్మ ఆర్ద్రీకరణ,  స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది. రెటినోయిడ్స్ (రెటినోల్,  ట్రెటినోయిన్):   చర్మ కణాల పునరుద్ధరణను పెంచుతాయి,  ముడతలను తగ్గిస్తాయి. మెలటోనిన్:   చర్మాన్ని UV నష్టం నుండి రక్షిస్తుంది,  కణాల మరమ్మత్తుకు మద్దతు ఇస్తుంది. ఆక్సిటోసిన్:   మంటను తగ్గించి, మెరిసే చర్మాన్ని ప్రోత్సహిస్తుంది. ఎండోకన్నాబినాయిడ్స్:   CBD ఉత్పత్తులలో కనిపిస్తాయి, ఇవి చర్మం ఒత్తిడి,  కాలుష్యం నుండి కోలుకోవడానికి సహాయపడతాయి. α-మెలనోసైట్-స్టిమ్యులేటింగ్ హార్మోన్:   చర్మపు పిగ్మెంటేషన్‌ను పెంచుతుంది,  సూర్యరశ్మి దెబ్బతినకుండా రక్షిస్తుంది.                            *రూపశ్రీ.  

మహిళలలో PCOS, థైరాయిడ్ కు చెక్ పెట్టి, సంతాన అవకాశాలు పెంచే అద్బుతమైన చిట్కాలు..!

మహిళలలో  PCOS, థైరాయిడ్ కు చెక్ పెట్టి, సంతాన అవకాశాలు పెంచే అద్బుతమైన చిట్కాలు..! నేటి కాలంలో మహిళలు సహజంగా గర్భం దాల్చడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  దీనికి అతిపెద్ద కారణం హార్మోన్ల అసమతుల్యత. PCOD,  థైరాయిడ్ వంటి సమస్యల కారణంగా, హార్మోన్లు అసమతుల్యత చెందుతాయి. ఇది సహజ గర్భధారణలో సమస్యలను కలిగిస్తుంది . అయితే  జీవనశైలిని మెరుగుపరచుకోవడం ద్వారా,  మందులతో పాటు కొన్ని ఇంటి నివారణలను తీసుకోవడం ద్వారా  హార్మోన్లను సరిదిద్దుకోవచ్చు. హార్మోన్లను సమతుల్యం చేయడం ద్వారా సహజంగా గర్భం దాల్చడానికి  వైద్యులు చెప్పిన   అద్బుతమైన చిట్కాను తెలుసుకుంటే.. హార్మోన్లను సరిచేయడానికి, PCOSని నియంత్రించడానికి మరియు టెస్టోస్టెరాన్‌ను పెంచడానికి, PCOD కూడా ఉంటే లేదా హార్మోన్ల అసమతుల్యత కారణంగా మరే ఇతర కారణం చేతనైనా గర్భం దాల్చలేకపోతే వైద్యులు చెప్పిన చిట్కా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకుని, అందులో ఒక చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్,  దాల్చిన చెక్క వేసి కలపాలి.  ప్రతి రాత్రి పడుకునే ముందు దీన్ని తాగాలి. ఈ  పానీయం తాగడం ద్వారా,  హార్మోన్లు సమతుల్యమవుతాయి మరియు ఇన్సులిన్ నిరోధకత కూడా నయమవుతుంది. ఈ పానీయం  ప్రయోజనాల గురించి మాట్లాడుకుంటే, ఇది  PCOD ని నయం చేస్తుంది,  శరీరంలో టెస్టోస్టెరాన్‌ను పెంచుతుంది. దాల్చిన చెక్క.. దాల్చిన చెక్క ఇన్సులిన్ నిరోధకతను సరిచేయడం ద్వారా ఆండ్రోజెన్ ఉత్పత్తిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఇది PCOS ని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది . ఇది పిసిఒఎస్ రోగులలో ఆండ్రోజెన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్.. ఆపిల్ సైడర్ వెనిగర్ శరీరంలో ఈస్ట్రోజెన్,  టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తుంది కానీ ప్రొజెస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది. విజయవంతమైన ఇంప్లాంటేషన్‌కు ప్రొజెస్టెరాన్ చాలా ముఖ్యమైనది.  కాబట్టి ఒక స్పూన్  ఆపిల్ సైడర్ వెనిగర్ ను గ్లాసుడు నీళ్లలో వేసి అందులో కాసింత దాల్చిన చెక్క వేసి తాగాలి.     *రూపశ్రీ.  

గర్భిణి స్త్రీలు వేసవిలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!

గర్భిణి స్త్రీలు వేసవిలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!     గర్భధారణ అనేది స్త్రీకి ఒక ముఖ్యమైన సమయం. అందుకే  వారి ఆరోగ్యం పట్ల  ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా వేసవి కాలంలో గర్భిణీ స్త్రీలు తమను తాము  జాగ్రత్తగా చూసుకోవడం మరింత ముఖ్యం. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా అది హీట్ స్ట్రోక్‌కు కారణమవుతుంది  డీహైడ్రేషన్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. శరీరంలో నీరు లేకపోవడం మొత్తం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. శరీరంలో నీరు లేకపోవడం వల్ల వేడి ఆవిర్లు,  ముందస్తు ప్రసవం వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇది మాత్రమే కాదు తీవ్రమైన వేడి వల్ల రక్తపోటు, హృదయ స్పందన రేటు పెరగడం, తలతిరగటం,  మూర్ఛపోవడం వంటి సమస్యలు కూడా వస్తాయి. వీటన్నింటినీ నివారించడానికి, గర్భిణీ స్త్రీ తనను తాను,  తన పుట్టబోయే బిడ్డను ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో తెలుసుకోవాలి. హైడ్రేటెడ్ గా.. గర్భధారణ సమయంలో పుష్కలంగా నీరు త్రాగడం ద్వారా తమను తాము  హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం తల్లి మరియు బిడ్డ ఇద్దరికీ మంచిది. తలతిరగడం, వికారం, పెదవులు ఎండిపోవడం,  పసుపు రంగు మూత్రం నిర్జలీకరణానికి సంకేతాలు. మండే వేడి శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. అందువల్ల,హైడ్రేటెడ్ గా ఉండటానికి రోజంతా 6-8 గ్లాసుల నీరు త్రాగడం మంచిది. ముఖ్యంగా  ఇంటి నుండి బయట ఉన్నప్పుడు ఎల్లప్పుడూ  స్టీల్ వాటర్ బాటిల్  వెంట ఉంచుకోవాలి. ఆహారం.. వేడిని నివారించడానికి గర్భిణీ స్త్రీ తాజా పండ్లు,  రసాలను తీసుకోవాలి. ఈ సీజన్‌లో వైద్యులు గర్భిణీ స్త్రీలు దోసకాయ తినమని సలహా ఇస్తారు. అందువల్ల,  రోజువారీ భోజనంలో దాని వినియోగాన్ని పెంచాలి.  అలాగే  కారంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి. దుస్తులు.. ఈ సీజన్‌లో  ఏ రంగు దుస్తులు ధరిస్తారో కూడా ముఖ్యమైన అంశమే.. నలుపు,  ఎరుపు రంగు దుస్తులు వేడిని గ్రహిస్తాయి. దీని కారణంగా గర్భిణీ స్త్రీకి ఎక్కువ వేడిగా అనిపిస్తుంది. సూర్య కిరణాలను నివారించడానికి వీలైనంత వరకు తెలుపు,  లేత గోధుమరంగు వంటి లేత రంగు దుస్తులను ఎంచుకోవాలి. వ్యాయామం.. గర్భిణీ స్త్రీని ఆరోగ్యంగా,  చురుకుగా ఉంచడానికి వేసవిలో వ్యాయామం మంచి మార్గం. ఉదయం,  సాయంత్రం వేళల్లో నడక, ఈత,  యోగా వంటి కార్యకలాపాలు తల్లి,  బిడ్డ ఇద్దరికీ ప్రయోజనం చేకూరుస్తాయి. కానీ  వ్యాయామం చేసేటప్పుడు మిమ్మల్ని మీరు ఎక్కువగా ఒత్తిడికి గురి చేసుకోకూడదు.  కంఫర్ట్ జోన్‌లో ఉంటూ తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల  మనసుకు, శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. నిద్ర.. గర్భిణీ స్త్రీకి మంచి నిద్ర,  తగినంత విశ్రాంతి చాలా ముఖ్యం. సరైన సమయానికి నిద్రపోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఈ రోజుల్లో వేసవి వేడి బాగా అలసిపోయేలా చేస్తుంది, కాబట్టి తమ కోసం తాము  సమయం కేటాయించుకోవాలి. పుస్తకం చదవడం, సంగీతం వినడం లేదా ధ్యానం చేయడం ద్వారా శరీరం, మనసుకు  విశ్రాంతి ఇవ్వవచ్చు.                                     *రూపశ్రీ.

గర్భవతులకు మలబద్దకం రాకుండా ఉండాలంటే ఇలా చేయాలి!

గర్భవతులకు మలబద్దకం రాకుండా ఉండాలంటే ఇలా చేయాలి! గర్భం ధరించిన స్త్రీల శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి.  డెలివరీకి ముందు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. డెలివరీ తర్వాత అంతా నార్మల్‌గా అయిపోతుందని అనుకుంటారు కానీ చాలావరకు అది జరగదు.  చాలా మంది మహిళలకు బిడ్డ ప్రసవం తర్వాత కూడా పైల్స్ సమస్యలు అలాగే ఉంటాయి. . ప్రెగ్నెన్సీకి ముందు పైల్స్ సమస్య లేకపోయినా, ప్రెగ్నెన్సీ సమయంలో, డెలివరీ తర్వాత పైల్స్ వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అయితే, మహిళలు గర్భధారణ సమయంలో కొన్ని విషయాలు తెలుసుకుని, కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ సమస్యను చాలావరకు అధిగమించవచ్చు. అసలు పైల్స్ అంటే ఏంటి? మానవ శరీరంలో పురీషనాళం చుట్టూ సిరలు ఉంటాయి. ఈ సిరలు ఉబ్బుతాయి. అసాధారణమైన వాపు ఏర్పడుతుంది.  ఈ  సమస్య కారణంగా, ప్రేగు కదలిక సమయంలో దురద,  నొప్పి ఉంటుంది.  ఇవి బయటికి పొడుచుకు వచ్చిన చిన్న గింజలా ఉంటాయి. గర్భవతుల్లో ఎందుకొస్తుంది? నిజానికి, గర్భధారణ సమయంలో గర్భాశయం పరిమాణం పెరుగుతుంది. రక్త ప్రసరణ పెరగడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా, సిరలు సులభంగా ఉబ్బుతాయి. అంతే కాకుండా ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్ పెరగడం వల్ల గర్భిణీ స్త్రీలో మలబద్ధకం ఏర్పడుతుంది. మలబద్ధకం సమయంలో, మలం చాలా గట్టిగా మారుతుంది. ఈ కారణంగా పైల్స్ పరిస్థితి తీవ్రంగా మారుతుంది. సరళంగా చెప్పాలంటే, గర్భిణీ స్త్రీలు మలబద్ధకం కారణంగా పైల్స్‌కు గురవుతారు. డెలివరీ సమయంలో అధిక ఒత్తిడి కారణంగా హేమోరాయిడ్లు సంభవించవచ్చు. పైల్స్ సమస్యను ముందే గుర్తుపట్టడం ఎలా? పైల్స్ వ్యాధిలో, మలద్వారంలో నొప్పి, మంట, దురద ఉంటుంది. ప్రేగు కదలిక సమయంలో నొప్పి పెరుగుతుంది. కూర్చున్నప్పుడు కూడా పైల్స్ కారణంగా నొప్పి ఉంటుంది. పైల్స్ కారణంగా, మల విసర్జన తర్వాత కూడా ఇబ్బందిగానే ఉంటుంది.  పురీషనాళం సమీపంలోని కణజాలంలో వాపు, పుండ్లు, రక్తస్రావం కనబడతాయి. పైల్స్ తగ్గడానికి, రాకుండా ఉండటానికి గర్భవతులు ఏమి చేయాలంటే..  ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.. గర్భధారణ సమయంలో మలబద్ధకంతో బాధపడే మహిళలు తమ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి. దీని కోసం, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవచ్చు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. మలాన్ని మృదువుగా ఉంచుతుంది. ఇది పైల్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మలవిసర్జన ఆపకూడదు.. గర్భవతులు బాత్రూమ్‌కు వెళ్లాలని అనిపించినప్పుడు, వెంటనే టాయిలెట్‌కు వెళ్లిపోవాలి. కారణాలు చెప్పుకుని మెలాన్ని బిగపట్టుకుని కాలం వెళ్లబుచ్చకూడదు. ఇలా చేస్తే కడుపు అస్తవ్యస్తం అవుతుంది. పేగులు ఎప్పటికపుడు శుద్ధి అవుతుంటేనే ఆరోగ్యంగా ఉండొచ్చు.   శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి గర్భిణీ స్త్రీలు తమను తాము హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. దీని కోసం నీరు బాగా త్రాగాలి. కొబ్బరి నీరు, నిమ్మరసం, పండ్ల రసాలు వంటి ద్రవాలను తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల పైల్స్ సమస్యను కూడా దూరం చేసుకోవచ్చు.                                      ◆నిశ్శబ్ద.

గర్భవతులు ప్రయాణాల్లో ఇవి పాటిస్తే పండంటి బిడ్డ పుడతాడు!

గర్భవతులు ప్రయాణాల్లో ఇవి పాటిస్తే పండంటి బిడ్డ పుడతాడు! మహిళల జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఏదైనా ఉందంటే అది తల్లి కావడం. పెళ్ళైన పరిస్థి అమ్మాయి తల్లి కావాలని అనుకుంటుంది. తాను గర్భవతినని తెలిసినప్పుడు ఎంత సంతోషపడుతుందో మాటల్లో వర్ణించలేనిది. ఒకానొక కొత్త ప్రపంచం పరిచయం అవుతుంది. అంతేనా మరొక ప్రాణాన్ని మోస్తూ ఈ ప్రపంచానికి కొత్త ప్రాణాన్ని పరిచయం చేయబోతున్నాను అనే భావం కూడా చాలా బావోద్వేగాన్ని కలిగిస్తుంది. అయితే గర్భం ధరించిన తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలు చాలా ఉంటాయి. కుటుంబ సభ్యులు తన విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు మాత్రమే కాకుండా తన మీద తాను చాలా జాగ్రత్త వహించాలి.  మరీ ముఖ్యంగా గర్భవతులకు ప్రయాణాలు అనేవి సహజం. కనీసం డాక్టర్ చెకప్ లకు అయినా వెళ్లాల్సి ఉంటుంది. కొందరికి సరైన డాక్టర్లు దగ్గర్లో లేక కాసింత దూరమే వెల్లడి వస్తుంది. గర్భం ధరించిన  మహిళలు ప్రయాణం సమయాల్లో తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు….. గర్భం ధరించిన తరువాత ఎంత కాదనుకున్నా ప్రయాణాలు తప్పవు. ఉద్యోగాలు చేసే మహిళలు అయితే కచ్చితంగా తిరగాల్సి ఉంటుంది. కాబట్టి గర్భవతులు ప్రయాణములో బాగా కాచి చల్లార్చిన నీటినే త్రాగాలి. బయటి నీరు, డ్రింక్స్, సోడాలు, ఇతర ద్రవాలు త్రాగకూడదు!!  చాలామందికి ఎత్తు మడమల చెప్పులు వేసుకోవడం అలవాటు ఉంటుంది. పెళ్ళయ్యి గర్భం దాల్చేవరకు అమ్మాయిల లైఫ్ స్టైల్ లో ఈ ఎత్తుమడమల చెప్పులు సాధారణం. కానీ  గర్భవతులైన స్త్రీలు ఎత్తుమడమల చెప్పులు వేసుకోకూడదు. వదులుగా, ఫ్లాట్ గా ఉండే చెప్పులు  వాడాలి!!  గర్భవతులు వాంతులు కావడం సహజం. వేవిల్లు అని పిలిచే ఇవించెప్పలేనంత నీరసాన్ని తెచ్చిపెడతాయి. ప్రయాణములో వాంతులయ్యే అలవాటు ఉన్న వారికి గర్భ సమయములో ఇంకా పెరుగుతాయి. కాబట్టి... ముందుగానే వైద్యుని సంప్రదించి, తగిన మందులు తీసుకెళ్ళాలి. ప్రయాణంలో ఆకలి అనేది సహజం. అయితే గర్భవతులు మాత్రం తమతో పాటు  కొన్ని రకాల  పండ్లను వెంట ఉంచుకోవాలి, ప్రయాణంలో ఆకలి అనిపిస్తే పండ్లనే తినాలి!  అంతేకానీ బస్సులు, ట్రైన్లు ఆగినప్పుడు అడ్డమైన తిండి కొనుక్కుని తినకూడదు. బయటి పదార్థాలను తినకపోవడం మంచిది!! ఇంట్లో గర్భవతులు ఉన్నారంటే చాలామంది కాలు కింద పెట్టకుండా రెస్ట్ తీసుకోమని చెబుతుంటారు. వారి మీద ప్రేమ అలా చేయిస్తుంది. అయితే ఇలా గర్భవతులకు ఏ విధమైన పనులు లేకుండా ఒకే చోట కూర్చోమని చెప్పడం తప్పు.  గర్భవతులకు నడక మంచిది. సాధారణంగా గర్భవతులు నడుస్తున్నప్పుడు తొందరగా అలసిపోతారు.... అలా అలసట అనిపిస్తే.... ఆగి కొద్దిసేపు కూర్చుని.. అలసట తీరిన తరువాత తిరిగి నడవాలి. పనులు చేసుకున్నా, నడిచినా గర్భవతులు బరువులు మాత్రం ఎత్తకూడదు, మోయకూడదు!! ఒకవేళ ఎత్తవలసిన పరిస్థితి వస్తే.... నిలుచున్న స్థితిలోకాక మోకాళ్ళు వంచి, కూర్చుని అప్పుడు ఎత్తాలి! కానీ బరువులు ఎత్తుకుని నడవకూడదు. గర్భవతులు  పండంటి బిడ్డను పొత్తిళ్ళతో చూసుకొని ఆనంద పడాలంటే.... ప్రయాణములో పై పద్దతులను తప్పక ఆచరించాలి.                                     ◆నిశ్శబ్ద.

అండాశయంలో తిత్తుల గురించి ఈ విషయాలు తెలుసా...!

అండాశయంలో తిత్తుల గురించి ఈ విషయాలు తెలుసా? అండాశయ తిత్తులు అనేవి అండాశయాలపై లేదా లోపల అభివృద్ధి చెందే ద్రవంతో నిండిన సంచులు. చాలా తిత్తులు ప్రమాదకరం కావు,  వాటంతట అవే తగ్గిపోతాయి, కొన్ని అసౌకర్యాన్ని కలిగిస్తాయి లేదా ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. సాధారణంగా అండాశయంలో తిత్తులు స్త్రీ సంతానోత్పత్తికి ముప్పు కలిగించవు  వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ కొన్ని మాత్రం చాలా ఆందోళనకు దారి తీస్తాయి.  ఈ మధ్య కాలంలో మహిళలలో ఈ అండాశయంలో తిత్తుల సమస్య ఎక్కువగా కనిపిస్తోంది.  ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలలో కూడా  ఈ సమస్యలు కనిపిస్తుండటంతో  గర్భం ధరించే విషయంలో చాలా ప్రశ్నలు వారిలో నిలిచిపోతున్నాయి.  అయితే అసలు అండాశయంలో తిత్తుల గురించి పూర్తీగా తెలుసుకుంటే.. ఎండోమెట్రియోమాస్ , సిస్టాడెనోమాస్,  డెర్మాయిడ్ సిస్ట్‌లు వంటి కొన్ని రకాల సిస్ట్‌లు ప్రాణాంతకమైనవి.  ఇవి ప్రాణాపాయం కలిగించేంత ప్రభావం కలిగి ఉంటాయి.  ఇవి వయస్సుతో పాటు పెరుగుతాయి. చికిత్స చేయకుండా వదిలేస్తే, ఈ సిస్ట్‌లు ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. వీటికి వైద్యం కూడా చాలా నిపుణుల దగ్గర తీసుకోవడం ముఖ్యం.   క్రమం తప్పకుండా చెకప్ లు చేయించుకుంటూ   ఉంటే సిస్ట్ లను ముందే గుర్తించి వాటికి వైద్యం చేయడంలో సహాయపడుతుంది. ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా? మహిళలు అండాశయ తిత్తుల గురించి ఆందోళన చెందాల్సిన కొన్ని పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడూ  నీరసంగా లేదా  కటి భాగంలో పదునుగా ఉన్న వస్తువుతో గుచ్చినట్టు నొప్పి కలగడం,  చికాకు కలగడం వంటివి ఎక్కువగా ఉంటే  వైద్యుడిని సంప్రదించాలి. అధిక ఋతు రక్తస్రావం, తరచుగా మూత్రవిసర్జన, మూత్రాశయం నిండినట్లు పదే పదే   అనిపించడం,  కడుపు నొప్పిలో ఆకస్మిక మార్పులు ఈ సిస్ట్ లకు సంకేతాలు.  ఈ లక్షణాలు ఉన్న మహిళలు వైద్యులను కలవాలి. మెనోపాజ్ మహిళలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  వీరికి ఈ సమస్యవల్ల ప్రాణం మీదకు వచ్చే అవకాశం ఉంటుంది. కారణాలు,  ప్రమాదాలు.. అండాశయ తిత్తులు రావడానికి వివిధ కారణాలు ఉన్నాయి. వీటిల అత్యంత సాధారణ కారణం ఋతు చక్రంలో హార్మోన్ల హెచ్చుతగ్గులు . పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS)లో, అండోత్సర్గము విఫలమైన కారణంగా అండాశయాలలో ఒకటి కంటే ఎక్కువ  తిత్తులు ఏర్పడతాయి. ఇంకొక  రకం ఎండోమెట్రియాటిక్ తిత్తులు. ఇవి రెట్రోగ్రేడ్ ఋతుస్రావ పద్దతిలో  ముడిపడి ఉన్నాయి, ఇక్కడ ఋతు రక్తం ఫెలోపియన్ గొట్టాలలోకి వెనుకకు ప్రవహిస్తుంది,  అండాశయాలపై ఇంప్లాంట్ అవుతుంది. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ (PID) వంటి ఇన్ఫెక్షన్లు కూడా అండాశయాలకు వ్యాపించి తిత్తి ఏర్పడటానికి దారితీస్తుంది. నిరపాయకరమైన తిత్తులు,  ప్రమాదకరమైన తిత్తుల గురించి తెలుసుకోవడానికి , ఆందోళనను తగ్గించుకోవడానికి   మహిళలు క్రమం తప్పకుండా అల్ట్రాసౌండ్ పరీక్షలు,  సాధారణ చెకప్ లు  చేయించుకోవాలని డాక్టర్లు సలహా ఇస్తున్నారు.                                      *రూపశ్రీ.