ఆఫీసులో క్మిస్మస్ పార్టీ.. ఇదిగో సూపర్ ఔట్ ఫిట్ డిటైల్స్..!

Publish Date:Dec 24, 2025

ఆఫీసులో క్మిస్మస్ పార్టీ.. ఇదిగో సూపర్ ఔట్ ఫిట్ డిటైల్స్..! ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకుంటారు. ఈ పండుగ కోసం  ఏడాది పొడవునా ఎదురు చూసేవారు ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా కార్పోరేట్ కంపెనీలు విదేశాలకు చెందినవి కావడంతో చాలా కార్పోరేట్ ఆఫీసులలో క్రిస్మస్ సెలబ్రేషన్ చాలా గ్రాండ్ గా జరుగుతుంటుంది.  సీక్రెట్ శాంటా పేరుతో గిఫ్ట్ లు ఇచ్చుకోవడం నుండి కేక్ కటింగ్,  గేమ్స్, పార్టీ.. ఇలా చాలా జరుగుతుంది.   ఈ సందర్భంగా చాలా అందంగా కనిపించాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. ఇంటి దగ్గర పండుగ జరుపుకున్నట్టు కాకుండా ఆపీసులో పార్టీ కావడంతో  అటు అందం చెదరకూడదు, ఇటు హుందాగా కూడా ఉండాలి. ఇలాంటి ఔట్ పిట్ కోసం చాలా ఎదురు చూస్తారు.  సౌకర్యంగా ఉంటూ అందంగా, ఆకర్షణీయంగా అందరి దృష్టిని ఆకర్షించాలంటే కింద చెప్పుకునే ఔట్ ఫిట్ లు ట్రై చేయవచ్చు. అలాగే ఎంచుకునే రంగులు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.  ఇంతకీ ఆ ఔట్ ఫిట్ లు ఏంటో తెలుసుకుంటే.. రెడ్-గ్రీన్ షేడ్స్.. క్రిస్మస్ పండుగకు కేటాయించిన  రంగులు ఎరుపు, ఆకుపచ్చ. ఈ రంగుల దుస్తులు, చొక్కాలు లేదా చీరలు ధరించవచ్చు.  క్యాజువల్ పార్టీకి అటెండ్ అవుతుంటే ఎరుపు రంగు స్వెటర్,  డెనిమ్‌తో కూల్‌గా కనిపించవచ్చు.  దుస్తులలో ఎరుపు, ఆకుపచ్చ లేదా తెలుపు రంగులు ఉండేలా చూసుకుంటే పార్టీకి న్యాయం చేసినట్టే. షైనింగ్ దుస్తులు..  పార్టీ కొంచెం గ్లామరస్ గా ఉంటే బంగారు లేదా వెండి గ్లిట్టర్ డ్రెస్  మంచి ఎంపిక అవుతుంది. ఇది పార్టీలో జిగేలు రాణి లాంటి లుక్ ఇస్తుంది. ఈ లుక్  పార్టీకి స్టార్ గా మార్చేస్తుంది. అయితే  ఆఫీసుకి గ్లిట్టర్ డ్రెస్ రెగ్యులర్ గా వేసుకునేవారు పార్టీలో కూడా అదే వేసుకుంటే ప్లాన్ బెడిసికొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి డైలీ వేర్ లో గ్లిట్టర్ వాడేవారు దీన్ని పార్టీలో అవాయిడ్ చేయాలి. చీర.. క్రిస్మస్ పార్టీకి సాంప్రదాయ లుక్ కావాలంటే ఎరుపు లేదా ఆకుపచ్చ చీర ధరించడం బెస్ట్. భారతీయ సంప్రదాయ దుస్తులలో చీర అగ్రస్థానంలో ఉంటుంది. అలాంటి దుస్తులను క్రిస్మస్ పార్టీకి జోడిస్తే మరింత ప్రత్యేకంగా కనిపిస్తారు. ఆల్-బ్లాక్ లుక్.. సింపుల్ గా గ్రాడ్ లుక్ కావాలి అంటే  మంచి నలుపు రంగు దుస్తులను ఎంచుకోవాలి. నల్లటి దుస్తులతో జత చేసిన రెట్రో-శైలి ఆభరణాలు చాలా  ఆకర్షణీయంగా కనిపిస్తాయి. పూర్తిగా నల్లటి లుక్ చాలా అందంగా, మెస్మరైజ్ చేస్తూ  క్లాసీగా కనిపిస్తుంది. యాక్ససరీస్..  క్రిస్మస్ పార్టీలో దుస్తులతో పాటు లుక్ మొత్తం సూపర్ గా కనిపించడానకి స్టైలిష్ బెల్ట్, నగలు లేదా  ట్రెండీ గా ఉండే   హ్యాండ్‌బ్యాగ్ వంటి కొన్ని మంచి  యాక్ససరిస్ ను  ఎంచుకోండి. వీటిని  ఎంచుకొనేటప్పుడు అవి ఓవర్ గా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే సింపుల్ గా ఉంటూనే సూపర్ గా, పార్టీకి అట్రాక్షన్ గా కనిపిస్తారు.                               *రూపశ్రీ.
[

Beauty

]

ముఖం మీద మచ్చలను మాయం చేసే సూపర్ టిప్ ఇది..!

Publish Date:Dec 22, 2025

ముఖం మీద మచ్చలను మాయం చేసే సూపర్ టిప్ ఇది..! అందమైన ముఖాన్ని కూడా  ఎబ్బెట్టుగా కనిపించేలా చేయడంలో ముఖం మీద మచ్చలు,  గీతలు,  మొటిమలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ మచ్చలు లుక్స్ ను చాలా ప్రబావింత చేస్తాయి. ఎండ తీవ్రత ఎక్కువ పడటం,  మొటిమలు, పిగ్మెంటేషన్, హార్మోన్ల మార్పులు,  స్కిన్ కేర్ సరిగా ఫాలో కాకపోవడం వంటి తప్పుల వల్ల ముఖం మీద మచ్చలు ఏర్పడతాయి.  ఈ మచ్చలు పోగొట్టుకోవడానికి మార్కెట్లో దొరికే ఖరీదైన ఉత్పత్తులు వాడుతుంటారు. కానీ వీటి వల్ల  ఆశించిన ఫలితాలు అయితే ఉండవు.  ఈ మచ్చలు తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో లభించే కొన్ని నేచురల్ పదార్థాలు,  ఇంటి చిట్కాలు చర్మపు రంగును సహజంగా మెరుగుపరిచి మచ్చలు తగ్గేలా చేస్తాయి. చర్మానికి మెరుపును ఇస్తాయి. క్రమం తప్పకుండా వీటిని వాడితే చాలా గొప్ప ఫలితాలు కనిపిస్తాయి. ఇంతకీ మచ్చలను తగ్గించే ఆ సూపర్ టిప్ ఏంటో తెలుసుకుంటే.. మచ్చలను తగ్గించే మ్యాజిక్ క్రీమ్.. మచ్చలను తగ్గించడంలో ఇంట్లోనే తయారు చేసే క్రీమ్ చాలా బాగా సహాయపడుతుంది.   కావలసిన పదార్థాలు.. అలోవెరా జెల్.. 1 స్పూన్ నిమ్మరసం.. అరటీ స్పూన్ రోజ్ వాటర్.. ఒక టీస్పూన్.. తయారు విధానం.. ఒక చిన్న కంటైనర్ తీసుకుని అందులో ఒక స్పూన్ అలోవెరా జెల్ వేయాలి.  అందులో ఒక అర స్పూన్ నిమ్మరసం వేయాలి. అందులోకే ఒక స్పూన్ రోజ్ వాటర్ కూడా వేయాలి. ఈ మూడు పదార్థాలను బాగా మిక్స్ చేయాలి.  ఇది క్రీమీగా మారుతుంది.   అలోవెరా జెల్ చర్మాన్ని రిపేర్ చేయడానికి, మచ్చలను లైట్ గా చేసి అవి తగ్గడానికి సహాయపడుతుంది.   నిమ్మరసం సహజ బ్లీజ్ గా పనిచేస్తుంది.  ఇది పిగ్మెంటేషన్ ను తగ్గిస్తుంది. రోజ్ వాటర్ చర్మాన్ని కూల్ గా మారుస్తుంది.  చర్మాన్ని తేమగా మృదువుగా మారుస్తుంది. ఎలా ఉపయోగించాలి? మొదటగా ముఖాన్ని మంచి ఫేస్ వాష్ తో క్లీన్ చేసుకోవాలి. ఆ తరువాత ముఖాన్ని పొడి టవల్ తో బాగా తుడుచుకోవాలి.  ఇలా చేసిన తరువాత తయారు చేసుకున్న క్రీమ్ ను చేతి వేళ్లతో కొద్దిగా తీసుకుని ముఖం మీద మచ్చలు ఉన్న ప్రాంతంలో సున్నితంగా అప్లై చేయాలి.  15 నుండి 20 నిమిషాల  వరకు అలాగే ఉంచాలి.  20 నిమిషాల తర్వాత ముఖాన్ని సాధారణ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.  మంచి ఫలితాల కోసం ఈ క్రీమ్ ను వారానికి 3 నుండి 4 సార్లు ఉపయోగించాలి. జాగ్రత్త.. ఈ క్రీమ్ లో నిమ్మరసం ఉంటుంది.  ఇది సున్నితమైన చర్మం ఉన్నవారికి చాలా చికాకు కలిగిస్తుంది.  అందుకే దీన్ని ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయాలి. ఈ క్రీమ్ ను అప్లై చేసినప్పుడు మంట,  దురద,  లేదా చర్మం ఎర్రగా మారడం వంటి  లక్షణాలు కనిపిస్తే వాడటం మానేయాలి.  ఈ క్రీమ్ చర్మానికి  ఎలాంటి హాని కలిగించకపోతే దీన్ని ఉదయం సమయాల్లో కంటే రాత్రి సమయంలో అప్లై చేయడం మంచిది.  రాత్రి సమయంలో దీన్ని ముఖానికి అప్లై చేసి అలాగే వదిలేయవచ్చు.  పైన పేర్కొన్న క్రీమ్ ను రెగ్యులర్ గా వాడుతుంటే  ముఖం మీద మచ్చలు మెల్లిగా తేలిక అవుతాయి. కలబంద చర్మాన్ని లోపలి నుండి పోషణ ఇస్తుంది. కొత్త చర్మ కణాల ఏర్పాటును ప్రోత్సహిస్తుంది. నిమ్మరసం చర్మం రంగును సమంగా చేస్తుంది.  రోజ్ వాటర్ ముఖాన్ని తాజాగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది.  కొన్ని వారాలు ఈ క్రీమ్ వాడితే చర్మం మీద స్పష్టమైన మార్పు కనిపిస్తుంది.                                     *రూపశ్రీ.
[

Health

]

ఈ విటమిన్ బాగుంటేనే మహిళలలో ఎగ్ క్వాలిటీ బాగుంటుందట..!

Publish Date:Dec 23, 2025

ఈ విటమిన్ బాగుంటేనే  మహిళలలో ఎగ్ క్వాలిటీ బాగుంటుందట..! మహిళలలో ఎగ్ క్వాలిటీ బాగుంటేనే వారికి సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.  అయితే నేటికాలంలో  ఎగ్ క్వాలిటీ సరిగా లేకపోవడం,  ఎగ్స్ తక్కువగా ఉండటం వంటి సమస్యలు ఎదుర్కుంటూ ఉంటారు.  దీనికి గల కారణాలలో విటమిన్ లోపాలు కూడా ఒకటి. మరీ ముఖ్యంగా విటమిన్-డి లోపిస్తే మహిళలలో ఎగ్ క్వాలిటీ తక్కువగా ఉంటుందని,  ఎగ్స్ నిల్వలు కూడా తక్కువగా ఉంటాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అసలు ఎగ్స్ విషయంలో విటమిన్-డి పాత్ర ఏమిటి? గర్బం దాల్చాలనుకునే మహిళలకు ఇది ఎంత అవసరం? మొదలైన విషయాలు తెలుసుకుంటే.. విటమిన్-డి.. విటమిన్-డి ప్రతి ఒక్కరి అవసరం.  దీన్ని సన్ లైట్ విటమిన్ అని కూడా అంటారు. ఇది ఆరోగ్యానికి చాలా అవసరం.  ఎముకలు ఆరోగ్యంగా ఉండాలన్నా,  డిప్రెషన్ వంటి సమస్యలు తగ్గాలన్నా విటమిన్-డి స్థాయిలు పుష్కలంగా ఉండాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే.. కానీ విటమిన్-డి మహిళలలో ఎగ్ క్వాలిటీ, ఎగ్ నిల్వల ఆరోగ్యానికి చాలా అవసరం అని అంటున్నారు. విటమిన్-డి, గుడ్ల నాణ్యత.. మహిళల అండాశయంలో గుడ్ల నాణ్యత బాగుంటే గర్భధారణ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తగినంత విటమిన్ డి స్థాయిలు ఉన్న స్త్రీలలో మెరుగైన అండాశయ నిల్వలు,  అధిక-నాణ్యత గల గుడ్లను కలిగి ఉంటాయి. ఎందుకంటే విటమిన్ డి గ్రాహకాలు అండాశయాలలో ఉంటాయి. ఇక్కడ అవి ఫోలికల్ పెరుగుదల,  గుడ్డు పరిపక్వతను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. తక్కువ విటమిన్ డి స్థాయిలు ఫోలికల్ అబివృద్దిని, ఎగ్స్ మెచ్యురిటీని ప్రభావితం చేస్తాయి. ఇది  ప్రెగ్నెన్సీ  అవకాశాలను తగ్గిస్తుంది. అంతేకాదు.. విటమిన్-డి స్థాయిలు తక్కువ ఉన్నప్పుడు సక్సెస్ అయ్యే ప్రెగ్నెన్సీ లో కడుపులో బిడ్డ బలహీనంగా ఉండే అవకాశాలు  ఉంటాయి. విటమిన్-డి.. ఇంప్లాంటేషన్.. ఎగ్స్ హెల్తీగా, క్వాలిటీతో ఉండటానికే కాదు.. ఫలదీకరణంలో   కూడా విటమిన్-డి కీలక పాత్ర పోషిస్తుంది.  గర్భం ప్రారంభం కావాలంటేట పిండం గర్భాశయ పొరలో సక్సెస్ గా అమరాలి.  ఈ ప్రక్రియకు రోగనిరోధక శక్తి బాలెన్స్డ్ గా ఉండటం చాలా అవసరం.  ఇది పిండాన్ని రక్షించడానికి సహాయపడుతుంది.  విటమిన్-డి గర్బాశయంలోని రోగనిరోధక కణాలను మాడ్యులేట్ చేయడం ద్వారా పిండం గర్బాశయ పొరలో సక్సెస్ గా అమరడంలో సహాయపడుతుంది. IVF చికిత్సలో కూడా విటమిన్-డి స్థాయిలు అధికంగా ఉన్న మహిళలు,  విటమిన్-డి స్థాయిలు తక్కువగా ఉన్న మహిళల కంటే  తొందరగా గర్బం దాల్చగలుగుతారని గైనకాలజిస్ట్ లు చెబుతున్నారు. అందుకే గర్భం దాల్చడానికి ప్రయత్నించే వారు విటమిన్-డి స్థాయిలు తగినంత ఉండేలా చూసుకోవాలి. అలాగే గర్భం దాల్చిన మహిళలు కడుపులో బిడ్డ ఎదుగుదల ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్-డి స్థాయిలు మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి.                                *రూపశ్రీ.

కీళ్ల నొప్పులకు చెక్ పెట్టాలంటే ఇదిదో ఇవి తినాలి..!

Publish Date:Dec 16, 2025

కీళ్ల నొప్పులకు చెక్ పెట్టాలంటే ఇదిదో ఇవి తినాలి..! కీళ్ల నొప్పులు మహిళలలోనే ఎక్కువ కనిపిస్తుంటాయి.  సాధారణంగా పురుషుల కంటే మహిళలలోనే ఎముకల బలహీనత ఉంటుంది. ఈ కారణంగా కాల్షియం లోపం కూడా బయటపడుతూ ఉంటుంది.  మరీ ముఖ్యంగా గర్భధారణ,  బరువు పెరగడం, తిరిగి బరువు తగ్గడం, కేవలం ఇంటి పనులు మాత్రమే చేస్తూ వ్యాయామం వంటివి చేయకపోవడం, ఆహారం పట్ల నిర్లక్ష్యం.. ఇలా చాలా విషయాలు మహిళలలో కీళ్ళ నొప్పులు రావడానికి కారణం అవుతాయి.  కీళ్ల నొప్పులను వైద్య భాషలో ఆర్థరైటిస్ అని అంటారు.  ఆర్థరైటిస్ ఉన్నవాళ్లలో కీళ్ళ నొప్పులతో పాటు కీళ్లు బిగుసుకుపోవడం వంటి సమస్యలు కూడా ఉంటాయి.  కూర్చోవడం, లేవడం వంటి పరిస్థితులలో ఇది చాలా నరకప్రాయంగా ఉంటుంది. ఈ కీళ్ల నొప్పులకు చెక్ పెట్టడానికి ఆహారం చాలా కీలకం అని వైద్యులు,  పోషకాహార నిపుణులు  అంటున్నారు.  ఇంతకూ కీళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి ఏం తినాలి? తెలుసుకుంటే.. కీళ్ల నొప్పులకు ఒమేగా-3.. ఒమేగా-3 శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి కీళ్ల వాపు,  నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. కీళ్ల నొప్పులకు అవిసె గింజలు.. అవిసె గింజలు కీళ్ల నొప్పులు తగ్గించడంలో ప్రభావవంతగా పని చేస్తాయని ఆహార నిపుణులు అంటున్నారు. అవిసె గింజలలోని పోషకాలు..  అవిసె గింజలలో ఫైబర్, కాల్షియం,  యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి,  ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి సహాయపడతాయి. ఈ విత్తనాలను  రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించడమే కాకుండా,  మొత్తం గుండె ఆరోగ్యం,  జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందట. అవిసె గింజలు.. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు లభించే  ఉత్తమ శాఖాహార పదార్థాలలో అవిసె గింజలు  ఒకటి.  ముఖ్యంగా ALA అంటే.. ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం వీటిలో ఉంటుంది. ALA శరీరంలో శోథ నిరోధక సమ్మేళనంగా మారుతుంది. అవిసె గింజలను పొడిగా చేసి పెరుగు, ఓట్ మీల్ లేదా స్మూతీలలో కలపి తీసుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది. చియా విత్తనాలు.. చియా గింజల్లో కాల్షియం, మెగ్నీషియం,  ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఈ చిన్న విత్తనాలు నీటిని పీల్చుకుని, కీళ్లను ద్రవపదార్థం చేయడానికి సహాయపడే జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తాయి. చియా గింజలను రాత్రిపూట నీటిలో లేదా పెరుగులో నానబెట్టి  చియా పుడ్డింగ్‌గా తయారు చేయవచ్చు. గుమ్మడి.. గుమ్మడికాయ గింజలలో  జింక్,  మెగ్నీషియం  పుష్కలంగా ఉంటాయి. ఆర్థరైటిస్‌లో మంటను నియంత్రించడంలో జింక్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ విత్తనాలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి. నువ్వులు.. నువ్వులలో సెసామిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శక్తివంతమైన శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. నువ్వుల గింజలు కాల్షియం,  ఐరన్  కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి,  మరమ్మత్తుకు అవసరం. సన్ ఫ్లవర్ సీడ్స్..  విటమిన్ E శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ గా పరిగణించబడుతుంది.  అలాంటి విటమిన్-E పుష్కలంగా లభించే విత్తనాలలో పొద్దుతిరుగుడు విత్తనాలు ప్రధానమైనవి.  విటమిన్ E వాపును తగ్గించడంలో,  కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ విత్తనాలు మెగ్నీషియం ను  కూడా అందిస్తాయి.  పైన పేర్కొన్న విత్తనాలను క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకుంటూ ఉంటే మహిళలలో కీళ్ల నొప్పు,  ఎముకల సమస్యలు నెమ్మదిగా తగ్గిపోయి ఎముకలు దృఢంగా మారతాయి.                             *రూపశ్రీ.
[

Yoga

]

అర్ధ భుజంగాసానం.. ఈ ఆసనంతో మహిళలకు ఎన్ని బెనిఫిట్స్ అంటే..!

Publish Date:Dec 24, 2025

అర్ధ భుజంగాసానం..  ఈ ఆసనంతో మహిళలకు ఎన్ని బెనిఫిట్స్ అంటే..! యోగాలో చాలా రకాల ఆసనాలు ఉన్నాయి.  ఒక్కో ఆసనం ఒక్కో రకమైన ప్రయోజనాన్ని కలిగిస్తుంది.  వీటిలో భుజంగాసనం, అర్ద భుజంగాసనం చాలా ముఖ్యమైనవి. అర్థభుజంగాసనాన్ని బేబీ కోబ్రా పోజ్ అని కూడా అంటారు. ఆసనాలు చాలా నార్మల్ గా అనిపిస్తాయి. కానీ రెగ్యులర్ గా వేస్తూ ఉంటే చాలా గొప్ప ఫలితాలు ఇస్తాయి. శీతాకాలం లేదా వేసవిలో ఉదయం ఖాళీ కడుపుతో అర్ద భుజంగాసనం చేయడం వల్ల శరీర మూలాలు బలపడతాయి. అర్ధ భుజంగాసనాన్ని సరిగ్గా చేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆసనంలో ప్రతిరోజూ కొన్ని నిమిషాలు గడపడం వల్ల  వీపును నిఠారుగా చేస్తుంది,  శ్వాసను లోతుగా చేస్తుంది ,  మనస్సు తేలికవుతుంది. మహిళలు ఈ ఆసనం వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే.. అర్ద భుజంగాసనం ప్రయోజనాలు,, వెన్నెముక.. వెన్నెముకను బలంగా,  నిఠారుగా చేస్తుంది. వెన్ను సమస్యలను దూరం చేస్తుంది. నడుము.. నడుము నొప్పి , వెన్నునొప్పి ఉన్నవారు ఈ ఆసనాన్నిరెగ్యులర్ గా చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఈ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. పొట్ట కొవ్వు.. చాలా మంది పొట్ట కొవ్వు సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు.  పొట్ట కొవ్వు తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఈ ఆసనం  పొట్ట దగ్గర కొవ్వు తగ్గించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియ.. జీర్ణ సంబంధ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ ఆసనం వేస్తుంటే జీర్ణవ్యవస్థ తిరిగి ఆరోగ్యంగా పనిచేస్తుంది.  తిన్న ఆహారం చక్కగా జీర్ణం అవుతుంది. ఊపిరితిత్తులు.. ఈ ఆసనం వేసినప్పుడు ఉచ్ఛ్వాస, నిశ్చ్వాసలు సక్రమంగా జరగడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. మానసిక ఆరోగ్యం.. నేటికాలంలో చాలామంది ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే  ఈ ఆసనం వేయడం వల్ల ఒత్తిడి, అలసటను తగ్గిస్తుంది. భుజాల ఆరోగ్యం.. ఈ ఆసనంలో భుజాలు,  మెడ సాగదీయం వల్ల భుజాలు, మెడ ప్రాంతాలలో  బిగుసుకుపోయినట్టు ఉండే ఫీలింగ్ తగ్గుతుంది. హార్మోన్స్.. అర్ద భుజంగాసనం హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. సిట్టింగ్ వర్క్ కోసం.. ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే వారికి ఈ ఆసనం చాలా   ప్రయోజనకరంగా ఉంటుంది. శరీరంలో శక్తిని,  ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.                                    *రూపశ్రీ.

పిల్లలు తెలివైన వారిగా ఉండాలంటే ప్రతి తల్లి చేయాల్సిన పనులివి..!

Publish Date:Dec 18, 2025

పిల్లలు తెలివైన వారిగా ఉండాలంటే ప్రతి తల్లి చేయాల్సిన పనులివి..! ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు తెలివిగా ఉండాలని కోరుకుంటారు.  అయితే పిల్లల చిన్నతనం చాలా వరకు తల్లి చుట్టూనే గడుస్తుంది. ఈ కారణంగా పిల్లలు ఏదైనా తప్పు చేసినా,  లేదా అల్లరి చేసినా, పిల్లల నడవడిక తప్పుగా ఉన్నా.. వెంటనే తల్లినే నిందిస్తూ ఉంటారు చాలామంది.  కానీ పిల్లలు తెలివైన వారిగా ఉండాలన్నా,  వారి నడవడిక చక్కగా ఉండాలన్నా ప్రతి తల్లి కొన్ని పనులు చేయాలి.  ఆ పనులేంటో తెలుసుకుంటే.. లైబ్రరీ.. పిల్లలను లైబ్రరీకి తీసుకెళ్లడం లేదా ఇంట్లోనే మంచి పుస్తకాలు చదివించడం అలవాటు చేయాలి. ఏదైనా పుస్తకం చదివేటప్పుడు పిల్లలతో మాట్లాడాలి.  పిల్లలు ఏదైనా చదువుతున్నప్పుడు చదివిన విషయం ద్వారా వారు ఏం అర్థం చేసుకున్నారు అడగాలి.  ఇది పిల్లల ఆలోచన తీరును మారుస్తుంది. కమ్యూనికేషన్.. పిల్లలు తెలివిగా మారాలంటే తల్లులకు ఓపిక చాలా ముఖ్యం.  ప్రతి తల్లి పిల్లలతో చాలా ఓపెన్ గా మాట్లాడాలి.  పిల్లలు చెప్పే విషయాన్ని చిరాకు పడకుండా శ్రద్దగా వినాలి. అలాగే పిల్లలు అడిగే ప్రతి ప్రశ్నకు ఓపికగా సమాధానం చెప్పాలి. పిల్లలను ప్రతి విషయంలో ప్రోత్సహించాలి.  వారు చేసే ప్రతి మంచి పనిని మెచ్చుకోవాలి. పిల్లలు మరిన్ని కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది చాలా సహాయపడుతుంది. పరిష్కారాలు.. పిల్లలకు కూడా చాలా సమస్యలు వస్తుంటాయి.  అవన్నీ వారికి చాలా పెద్దవిగా, పెద్దలకు చాలా చిన్నవిగా అనిపిస్తుంటాయి.  పిల్లలను ఇబ్బంది పెట్టకూడదని ప్రతిది తల్లిదండ్రులు చెప్పకూడదు.  ముఖ్యంగా పిల్లల సమస్యలకు నువ్వేతై ఏం చేస్తావ్,  ఎలా ఉంటే బాగుంటుంది వంటి ప్రశ్నలు వేసి పిల్లల సమస్యలకు పరిష్కారం వారే వెతుక్కునేలా చేయాల్సింది తల్లులే. రోల్ మోడల్.. పిల్లలను రూలింగ్ చేయడం కాదు.. వారికి రోల్ మోడల్ గా ఉండాలి. పిల్లలు తమ పనులు తాము చేసుకోవడం, ప్రతి  పనిని శ్రద్దగా చేయడం,  ఆరోగ్యకరమైన అలవాట్లు కలిగి ఉండటం, పెద్దలు, ఇతరులతో గౌరవంగా మర్యాదగా మాట్లాడటం వారికి నేర్పాలి. పిల్లల స్వభావం చాలా భిన్నంగా ఉంటుంది.  వారితో మాట్లాడేటప్పుడు వారి పెద్దతరం అనే గీత నుండి బయటకు వచ్చి వారితో సరదాగా కలిసిపోయి మాట్లాడాలి. అలా మాట్లాడినప్పుడే పిల్లలు పెద్దలు చెప్పినదాన్ని అర్థం చేసుకుని వాటిని ఆచరించగలరు. పైన చెప్పుకున్న పనులన్నీ చేయగలిగితే ప్రతి తల్లి తమ పిల్లలను తెలివైన వారిగా మార్చడంలో తమ వంతు కృషి చేసినట్టే.                           *రూపశ్రీ.

ఈ అలవాట్లు ఆపకపోతే చిన్న వయసులోనే ముఖం ముసలి వాళ్లలా మారుతుంది..!

Publish Date:Dec 17, 2025

ఈ అలవాట్లు ఆపకపోతే చిన్న వయసులోనే ముఖం ముసలి వాళ్లలా మారుతుంది..! అందంగా, ఆరోగ్యంగా, ఉల్లాసంగా.. ఎక్కువకాలం బ్రతకాలని అందరి డ్రీమ్. కానీ నేటి కాలంలో చాలా రకాలుగా సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా చిన్న వయసులోనే వృద్దాప్యం కనిపించడం చాలా మందిని కలతకు గురి చేస్తుంది. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం, చర్మం ముడతలు పడటం చూస్తూ ఉంటాం.  ఇలాంటి వారు చాలా ఆత్మన్యూనతా భావం కు లోనవుతారు.  కానీ చిన్న వయసులోనే ముఖం మీద ముడతలు, గీతలతో ఇబ్బంది పడుతున్న వారు నేటి కాలంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు.  వీటిని తగ్గించుకోవడానికి చాలా రకాల మార్కెట్ ఉత్పత్తులను ఉపయోగిస్తారు.  కానీ ఫలితం అంతగా ఉండదు. ఇలా చిన్న వయసులోనే ముఖం మీద ముడతలు, గీతలు రావడం రూజువారి చేసే కొమమ్ తప్పుల వల్ల జరుగుతుందట.  ఇంతకీ ఆ  అలవాట్లు ఏంటి? వాటి వల్ల చర్మం ఎందుకు తొందరగా వృద్దాప్యానికి గురి అవుతుంది.  తెలుసుకుంటే..  చర్మం తొందరగా ఎందుకు వృద్దాప్యానికి గురవుతుంది? ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40% మంది యువకులు ఒత్తిడి,  నిద్ర సరిగా లేకపోవడం, సరైన ఆహారం లేకపోవడం వల్ల ముడతలు,  బలహీనత వంటి  ఏర్పడి తొందరగా ముసలి వాళ్లలా కనిపిస్తుంటారు. ఎక్కువ చక్కెర,  ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల శరీర కణాలలో ఆక్సీకరణ ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల చర్మం ముడుచుకుపోతుంది.  చిన్న వయసులోనే వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తాయి . చిన్న వయసులోనే వృద్దాప్యం కనిపించడానికి కారణమయ్యే అలవాట్లు.. నిద్ర.. ఆరోగ్యకరమైన శరీరాన్ని కాపాడుకోవడానికి నిద్ర చాలా అవసరం. కానీ నేటి వేగవంతమైన జీవితాల్లో మంచి నిద్ర కరువవుతోంది.  ప్రతి రాత్రి కనీసం 7 నుండి 9 గంటల గాఢ నిద్ర అవసరం. నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఈ హార్మోన్ ఎక్కువగా  ఉండటం వల్ల చర్మ కణాలు దెబ్బతింటాయి, దీని వలన ముఖంపై ముడతలు త్వరగా కనిపిస్తాయి. ఆహారం.. ఆరోగ్యంగా,  యవ్వనంగా ఉండటానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. జంక్ ఫుడ్,  చక్కెర ఆహారాలు చాలా హానికరమైన ఆహారాల లిస్ట్ లో ఉన్నాయి.  ప్రాసెస్ చేసిన ఆహారాలు,  స్వీట్లను అధికంగా తీసుకోవడం వల్ల శరీర కణాలలో గ్లైకేషన్ అనే ప్రక్రియ పెరుగుతుంది. ఈ ప్రక్రియ చర్మం పొడిబారడానికి కారణమవుతుంది,  ముడతలు కనిపించడానికి దారితీస్తుంది. శ్రమ.. నేటి జీవనశైలిలో శారీరకంగా కష్టపడే పనులు ఏమీ లేవు.  కేవలం కూర్చుని చేసే ఉద్యోగాలే ఉన్నాయి.  వీటి వల్ల మానసికంగా ఒత్తిడి ఏర్పడుతుంది.  శారీరక శ్రమ లేకపోవడం వల్ల కండరాలు బలహీనం అయ్యి   అది చిన్న వయసులోనే ముసలితనానికి దారి తీస్తుంది. ఒత్తిడి..  ఒత్తిడి నేటి కాలంలో చాలామంది ఎదుర్కునే పరిస్థితి. అయితే ఎక్కువ  ఒత్తిడికి గురైతే  శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయి పెరుగుతంది.  ఇది చర్మాన్ని ముడతలు పడేలా చేయడం, చర్మం మీద గీతలు రావడం వంటి సమస్యలకు కారణమై చిన్న వయసులోనే ముసలి వాళ్లలా కనబడటానికి కారణం అవుతుంది. పైన చెప్పుకున్న అలవాట్లను మెల్లిగా మానేయడం వల్ల చిన్న వయసులోనే వృద్దాప్య సమస్యను అధిగమించవచ్చు.                              *రూపశ్రీ.  

Makara Sankranthi Special Muggulu

Publish Date:Jan 13, 2025

 

Pongal Muggulu

Publish Date:Jan 13, 2025