Best Dresses for Your 20s 30s 40s

Publish Date:Apr 7, 2025

Best Dresses for Your 20s 30s 40s Till few months back that was like a staple for me. Have to take my son, Aarav to the garden? I wear tee and jeans. Going to a dinner? I am wearing a fancy tee and jeans. Got to go to Aarav's school meeting? I am wearing a basic tee and jeans. So practically I have stayed in and out of jeans, like I did in college. But then it struck me suddenly, I will be soon turning 30, and while I like to believe that 30's is the new 20's, the truth is that my body, my face, my social interactions, and many other things around me have changed. So I guess I should start dressing appropriately, as per my age at each occasion. People say 30’s are the time to be more serious about life and style and Image. Well no, not really. This is the age where you are not on a fixed pocket money to shop, you are not under peer pressure, and you have a mind of your own. So here are my tips to dress fashionably at thirties: * Wear clothes that fit well and make you feel confident. Invest in quality fabrics, cuts and clothes that flatter your body, while steering clear of juvenile prints and tight or revealing clothes. As Marilyn Monroe said, ‘Your clothes should be tight enough to show you're a woman, but loose enough to show you're a lady.’ * You can still be fashion forward by pairing simple patterns and statement jewelry. My recommendations are bigger pieces of jewelry, because you exude the confidence it takes to pull these pieces off. * Don’t follow fashion blindly. Coloured pants are in fashion right now, so get at least one according to your body shape and style, but don’t get anything and everything that is available. So follow only those things that you are comfortable in, and not just because it is in. That way you will be able to get your money’s worth. * Buy good quality shoes. Shoes add a good elegance to your whole outfit. Have your shoes occasion wise. Peep-toes or heels for formals, sandals for slightly casual days, loafers or moccasin’s for a day out, and slip-ons only for the beach. Currently a whole range of styles are available so check what suits you. * Dressing like a 20-year old, no matter how much it might suit you, won't keep you looking young. Develop a look and personal style that has more sophistication, but retain some fun elements if that is your personality. Develop a style that is you from inside out, if you are feminine, look for fabrics which drape and have some softness. * Jeans are a great staple in many wardrobes, look for darker denims in plain washes rather than ripped or torn or distressed. Wear them with a funky sandal or flat or whatever the time and place demands. Throw out or donate jeans that are more than five years old. * Invest in some good blouses (casual and dressy), instead of wearing tees everywhere. * Get a trendy haircut by a good stylist who understands your lifestyle and day in general. A good haircut is like a quick makeover, it goes a long way if done well. * Invest in good quality creams for your skin. This is important for all ages but 30s are the most important. The way you treat your skin now, it will show the results later in life.
[

Beauty

]

అలోవెరా జెల్ సరిగా వాడకపోతే  డేంజర్..!

Publish Date:Apr 25, 2025

అలొవెరా జెల్ సరిగా వాడకపోతే డేంజర్..! భారతదేశంలో కలబంద మొక్కను లేని ఇల్లు ఏదీ ఉండదు. దీనిని చాలా మంది అలంకరణ కోసం పెంచుతూ ఉంటారు. నిజానికి దీనిని ఉపయోగించడం ద్వారా అనేక చర్మ,  జుట్టు సంబంధిత సమస్యలను  నయం చేయవచ్చు. చాలా మంది ఎవరి సలహా లేకుండానే కలబందను ఉపయోగించవచ్చని అనుకుంటారు.  కానీ అది నిజం కాదు. కలబందను సాధారణంగా చర్మానికి ప్రయోజనకరంగా పరిగణిస్తున్నప్పటికీ, సరిగ్గా ఉపయోగించకపోతే, కొంతమందికి ముఖ సమస్యలను కూడా కలిగిస్తుంది. కలబందను సరైన విధంగా ఎలా ఉపయోగించాలి తెలుసుకుంటే..  ప్యాచ్ టెస్ట్.. ఇంటి నివారణలు ఎలాంటి అలెర్జీని కలిగించవని అమ్మాయిలు  భావిస్తారు. అందువల్ల దీన్ని ఎప్పుడైనా ఉపయోగించవచ్చు అని అనుకుంటారు. అయితే ఇది నిజం కాదు. కలబందను ఉపయోగించే ముందు  ప్యాచ్ టెస్ట్ కూడా చేసుకోవాలి. దీని కోసం ముందుగా కలబందను  చేతి లోపలి భాగంలో పూయడం ద్వారా పరీక్షించాలి.  24 గంటల్లోపు ఎలాంటి అలెర్జీ కలగకపోతే అప్పుడు మాత్రమే వాడాలి.  తాజాగానే.. ఈ రోజుల్లో మార్కెట్లో చాలా కంపెనీలు కలబంద జెల్‌ను విక్రయిస్తున్నాయి. ఇందులో రసాయన మిశ్రమం ఉండవచ్చు.  అందుకే  తాజా కలబంద జెల్‌ను మాత్రమే ఉపయోగించేందుకు ప్రయత్నించాలి. అది తాజాగా లేకపోతే దాని వాడకం చర్మంపై రియాక్షన్ కు  కారణం కావచ్చు. సమయం.. కలబంద వల్ల అలెర్జీ లేదా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెద్దగా లేకపోయినప్పటికీ దానిని అప్లై చేసేటప్పుడు  ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి . దీన్ని  ముఖంపై అరగంట కంటే ఎక్కువసేపు అప్లై చేయకూడదు. చర్మ నిపుణుడి సలహా మేరకు మాత్రమే రాత్రంతా అలాగే ఉంచాలి. లేకుంటే అది చర్మ  సమస్యలను పెంచుతుంది. వారానికి ఎన్ని సార్లంటే.. రోజూ  ముఖానికి కలబందను  పూయకూడదు. ఇది అందరికీ సరిపోదు. ప్రతిరోజూ ఉపయోగించే బదులు వారానికి రెండు నుండి మూడు సార్లు మాత్రమే వాడాలి. తద్వారా ఎలాంటి అలెర్జీ ప్రమాదం ఉండదు. అప్లై చేసే ముందు.. ముఖానికి కలబందను ఉపయోగించే ముందుగా  ముఖాన్ని మంచి ఫేస్ వాష్ సహాయంతో శుభ్రం చేసుకోవాలి. ఇది  ముఖం నుండి మురికిని శుభ్రపరుస్తుంది.  అప్పుడు మాత్రమే కలబంద  ముఖంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది.                                   *రూపశ్రీ.  
[

Health

]

ప్రెగ్నెన్సీ సమయంలో ముందురోజు ఆహారం తినడం మంచిదేనా... వైద్యులేం చెప్పారంటే..!

Publish Date:Apr 18, 2025

ప్రెగ్నెన్సీ సమయంలో ముందురోజు ఆహారం తినడం మంచిదేనా... వైద్యులేం చెప్పారంటే..!   గర్భధారణ స్త్రీకి మరొక కొత్త ప్రపంచాన్ని పరచయం చేస్తుంది. ముఖ్యంగా ఆరోగ్య పరంగా స్త్రీలు గర్భధారణ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్త్రీలు తీసుకునే ఆహారం కూడా కీలకపాత్ర పోషిస్తుంది.  గర్భవతులైన స్త్రీలు సమతుల ఆహారాన్ని,  పోషకాలు సమృద్దిగా కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని చెబుతారు.  అయితే కొంతమంది మహిళలు ముందు రోజు మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్ లో ఉంచుకుని మరీ తింటూ ఉంటారు. రుచి కోసమో లేక మిగిలిపోతుందనో.. లేక ఖరీదైనదనో.. ఏదో ఒక కారణం తో ముందురోజు ఆహారం తింటూ ఉంటారు. అయితే ఇలా తినడం మంచిదేనా? దీని గురించి వైద్యులు ఏం చెప్తున్నారంటే.. గర్భధారణ సమయంలో మహిళలు ఆహారం విషయంలో చేసే తప్పులలో అతి పెద్ద తప్పు ముందురోజు ఆహారాన్ని తినడం. ఇలా పాతబడిన ఆహారం తినడం ఆరోగ్యానికి హాని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. గర్భవతులు తాజాగా వండిన పోషకమైన ఆహారాన్ని మాత్రమే తినాలని వారు చెబుతున్నారు. ముందురోజు ఆహారం లేదా పాతబడిన ఆహారం తినడం వల్ల గర్భవతులలో చాలా ప్రభావం ఉంటుందట. ముఖ్యంగా కడుపులో పిండం అభివృద్ది మీద చెడు ప్రభావం పడుతుందని అంటున్నారు.  ముందురోజు మిగిలిన ఆహారం తినడం వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుందట. ఇలా గర్భవతులుగా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ల బారిన పడితే అది అకాల ప్రసవాలకు,  గర్భస్రావాలకు, తక్కువ బరువు ఉన్న శిశువు జననానికి దారి తీస్తుందట. ముందురోజు మిగిలిపోయిన ఆహారం ఎందుకు తినకూడదు అనే విషయాన్ని కూడా వైద్యులు వివరించారు.  ముందురోజు ఆహారంలో సాల్మోనెలోసిస్,  లిస్టెరియోసిస్ వంటి బ్యాక్టీరియా,  వైరస్ లు ఉంటాయి. ఇవన్నీ ఆహారం ద్వారా వచ్చే వ్యాధులకు అతిపెద్ద కారణాలు. గర్భం ధరించాలని అనుకునే మహిళలు, గర్భవతులు ముందురోజు మిగిలిన ఆహారాన్ని తినడం మానుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఒకసారి వండిన ఆహారాన్ని పదే పదే వేడి చేసి తినడం కూడా మంచిది కాదు. బయట నుండి తెచ్చిన ఆహారానికి వీలైనంత దూరం ఉండటం మంచిది. తప్పనిసరి పరిస్థితులలో తెచ్చినా దాన్ని వేడిగా ఉన్నట్టే తినాలి. బయట తెచ్చిన ఆహారాన్ని నిల్వ ఉంచడం మంచిది కాదు.                                          *రూపశ్రీ.  

Health Benefits of Ginger

Publish Date:Apr 6, 2025

థైరాయిడ్ తగ్గాలంటే ఈ ఆసనాలు వేసి చూడండి!

Publish Date:Apr 22, 2025

థైరాయిడ్ తగ్గాలంటే ఈ ఆసనాలు వేసి చూడండి! ఒత్తిడి కారణంగా హైపోథైరాయిడిజం సమస్య వస్తుంది. థైరాయిడ్ స్థాయిలు పెరగడం అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. థైరాయిడ్ అనేది మెడలో ఉన్న ఒక చిన్న గ్రంధి, ఇది అనేక ముఖ్యమైన హార్మోన్లను స్రవిస్తుంది. ఈ హార్మోన్లు జీవక్రియ, శరీర ఉష్ణోగ్రత మరియు పెరుగుదలకు అవసరం. థైరాయిడ్ స్థాయి పెరగడం లేదా తగ్గడమనే రెండు సందర్భాలు  శరీరానికి హాని కలిగించవచేవే.. యోగా ఆసనాల ద్వారా థైరాయిడ్ గ్రంధి సమతుల్యతగా ఉండేలా చేసుకోవచ్చు. థైరాయిడ్ గ్రంధి వల్ల హార్మోన్లలో కలిగే మార్పులు మహిళలలో చాలా సమస్యలు తెచ్చిపెడతాయి. కింద చెప్పుకునే యోగా అసనాలు వేయడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. సేతుబంధాసనం సేతువు ఆకారంలో భంగిమ ఉండటం వల్ల ఈ ఆసనాన్ని సేతుబంధాసనం అని  అంటారు. వెన్నెముకను బలోపేతం చేయడానికి ఈ యోగాసనం ఉపయోగపడుతుంది. సేతుబంధాసన సాధన ద్వారా థైరాయిడ్ లక్షణాలను తగ్గించవచ్చు. ఈ ఆసనం చేయడానికి వెల్లికిలా పడుకోవాలి.  మోకాళ్లను మీ భుజాల వెడల్పు నుండి కొంచెం దూరంగా వంచాలి. ఇప్పుడు, అరచేతులను తెరచి, చేతులను నేలపై నిటారుగా ఉంచి, శ్వాస తీసుకుంటూ, నడుమును పైకి ఎత్తాలి. ఊపిరి పీల్చుకుంటూ, తిరిగి పాత స్థితికి రావాలి. భుజంగాసనం..   థైరాయిడ్ సమస్య నుండి ఉపశమనం పొందడానికి, భుజంగాసనం ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ భంగిమ గొంతు మరియు థైరాయిడ్‌ను ఉత్తేజపరచడంలో సహాయకరంగా పరిగణించబడుతుంది. సంస్కృతంలో భుజంగం అంటే పాము అని అర్థం.  భుజంగాసనంను కోబ్రా భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనం వేయడానికి నేలపై పడుకోవాలి. అరచేతులను భుజం-వెడల్పు వేరుగా నేలపై ఉంచండి. ఇప్పుడు పీల్చేటప్పుడు ఛాతీని నేలపై నుండి పైకెత్తి సీలింగ్ వైపు చూడండి. ఇప్పుడు శరీరాన్ని నేలపైకి తీసుకురండి. ఈ యోగాను పునరావృతం చేయండి. బిటిలాసనం..  థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు బిటిలాసనం వేయాలి. దీన్నే పిల్లి-ఆవు భంగిమ అని అంటారు. తులో రక్త ప్రసరణను కొనసాగించడంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఆసనం వేయడానికి, ముందుగా మణికట్టు మరియు మోకాళ్ల సహాయంతో జంతువు లాంటి భంగిమను వేయండి. లోతైన శ్వాస తీసుకోవాలి. ఆ తరువాత శ్వాసను మెల్లిగా వదలాలి. ఈ యోగాను ప్రతిరోజూ 10 నిమిషాల పాటు చేయాలి. పశ్చిమోత్తాసనం.. తల మోకాళ్ళ వైపు, చేతులు పాదాల వైపు పోనిచ్చి వాటిని ఆనించడానికి  ప్రయత్నిచాలి. అయితే ఈ యోగాసనం వేసే ప్రారంభంలో తల మోకాళ్ళకు తగలకపోవచ్చు, చేతులు పాదాలకు అందకపోవచ్చు..  రోజు సాదన చేస్తే అది సాధ్యమవుతుంది. తిరిగి పడుకుని మళ్ళి మళ్ళి లేస్తూ ఈ ఆసనం చేయాలి. ఇలా కనీసం 5 నుంచి 20 సార్లు చేయాలి.                                        ◆నిశ్శబ్ద.
[

Yoga

]

Yoga Benefits For Eyes

Publish Date:Apr 19, 2025

Yoga Benefits For Eyes Most of us do not exercise our eye muscles at all, but yet, we work them all the time, causing them to be under constant strain. The only time the eyes rest for more than a split second, is when we are asleep. * Light a lamp/candle at a distance of two feet at the eye level. Stare at the bluish centre of the flame with a steady gaze. Continue staring, even if the eyes start watering. * You can do this for about 10 minutes to begin with, and slowly increase the duration until the time you feel comfortable. * Then slowly get up and fill your mouth with water. Keeping this water in your mouth, wash eyes with tap water. * Then spit the water out. This water will be warm as heat gets released from the body. This has to be done twice or until the water temperature gets normal. This is a must after this particular kriya. * Look to your right as far as you can, being aware of the edge of your visual field. Hold for 3 seconds, then release. Repeat again, but looking to your left. Hold for 3 seconds, then release. Repeat left and right 3 times. * Sit comfortably on a straight-backed chair, with your legs uncrossed and hands resting lightly in your lap. Keep your chin level and move only your eyes, neither your head nor neck.  

Kundalini Yoga

Publish Date:Feb 15, 2025

Cat and Cow Yoga Posture

Publish Date:Dec 4, 2024

పెద్దలకు ఇది పెద్దబాలశిక్ష

Publish Date:Apr 23, 2025

పెద్దలకు ఇది పెద్దబాలశిక్ష..   పిల్లల్ని ‘పిల్లలు’ అంటూ తేలిగ్గా తీసుకోవడానికి లేదు. రెండేళ్ళ సిసింద్రీ నుంచి ఇష్టాలు, అయిష్టాలు, కోపం, విసుగు అన్నీ ప్రదర్శిస్తూ వుంటారు. మన స్పందన బట్టి వాళ్ళ ప్రవర్తన కూడా మారిపోతూ వుంటుంది. చాలాసార్లు మీరు గమనించే వుంటారు.. మూడు నాలుగేళ్ళ పిల్లలు ఏదన్నా కావాలంటే గట్టిగా డిమాండ్ చేస్తున్నట్టు అడుగుతారు. మనకి కోపం వచ్చేస్తుంది అది చూసి. వేలెడంత లేవు - ఏదన్నా కావాలంటే నెమ్మదిగా అడగకూడదా.. నామీదే అరుస్తావా అంటూ పిల్లాడిని కోప్పడతాం.కానీ నిజానికి ‘మాన్యుపులేషన్’ ఇంకా అలవాటు కాని వయసది. నెమ్మదిగా బతిమాలితేనే బావుంటుందని వాళ్ళింకా నేర్చుకోని అమాయకత్వం మరి. ఇంకా చెప్పాలంటే వాళ్ళు మనల్ని అనుకరించడమే కరెక్టు అనుకునే సందర్భమది. మనం పిల్లలకి ఏదన్నా చెప్పాలంటే గొంతు పెంచి అరిచేకదా చెబుతాం. వాళ్ళూ అదే చేస్తున్నారు. కానీ, దానికి మనకి కోపం వస్తుంది. అయితే ఇక్కడే మని వాళ్ళని పెద్ద కన్ఫ్యూజన్‌లో పడేస్తాం. అమ్మ అరిస్తే తప్పులేదుగానీ, నేను అరిస్తే తప్పేంటి? అలాగే కదా చెప్పాలి? అని ఆ పసిపాపల మనసులు ఆలోచనలో పడిపోతాయి. పెద్దల్లాగే పిల్లలూనూ:   ఒక్కొక్కరిది ఒక్కో తీరు. అందుకే వారిని పెంచడానికి మనం ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటూ వుండాల్సి వస్తుంది. ఎప్పటికప్పుడు సాధారణంగా పిల్లల ప్రవర్తనను అంచనా వేసే విషయంలో మనం చేసే కొన్ని పొరపాట్లు, చేసుకోవాల్సిన సర్దుబాట్లు కొన్ని ఉన్నాయంటూ పిల్లల మనస్తత్వాన్ని విశ్లేషిస్తూ నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ‘‘వాటికి మొండితనం చాలా ఎక్కువ’’ అంటూ మనం పిల్లల్ని పదేపదే అంటుంటాం కదా, ఆ విషయంపై నిపుణులు ఏమంటున్నారో తెలుసా? కొంతమంది పిల్లలు ప్రతీ పనిని చాలా చక్కగా చేయాలని తాపత్రయపడతారు. ఎక్కడా రాజీపడరు. అలాగే వాళ్ళ పనులన్నీ కూడా మనం అలా పద్ధతిగా చేయాలని ఆశిస్తారు. దాంతో మొండిగా ప్రవర్తిస్తున్నట్టు మనకి అనిపిస్తుంది. ఆ ప్రత్యేక గుణాన్ని గుర్తించండి:   మనం పిల్లల్ని నిందించే ముందు వారిలో వున్న ఆ ప్రత్యేక గుణాన్ని గుర్తించాలి. దానిని సరైన దారిలోకి మళ్ళించాలి. ‘‘రాజీలేని మనస్తత్వం’’ ఎన్నో అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. కావల్సిందల్లా పట్టు విడుపులు నేర్చుకోవడమే. పిల్లలకు ఆ విషయంపై క్లాసు తీసుకుంటే వాళ్ళకేం అర్థం కాదు. అలాకాక ప్రాక్టికల్‌గా ఆ మనస్తత్వాన్ని వాళ్ళకి వాళ్ళే ఎలా గుర్తించాలో, మనసుని ఎలా మలచుకోవాలో నేర్పించాలి. ఉదాహరణకి స్కూలులో ఇచ్చిన ఏదో ప్రాజెక్టు పనిని ఎంత చేసినా సరిగా రాలేదంటూ పిల్లలు విసుగు పడుతుంటే లేదా మిమ్మల్ని విసుగెత్తిస్తుంటే తేలిగ్గా తీసుకుని కొట్టిపారేయకూడదు. సమస్యపై పనిచేయడం నేర్పాలి:   పిల్లల దగ్గరకి వెళ్ళి కూర్చుని ఇది కొంచెం కష్టమే కానీ, నువ్వు చేయగలవు - ఎటొచ్చీ నువ్వు కాస్త టెన్షన్ పడకుండా చేయాలి. ఓ అరగంట విశ్రాంతి తీసుకుని మళ్ళీ మొదలుపెట్టావనుకో చురుగ్గా చేయగలవు.... ఇలా చెప్పి చూడండి. అలాగే, పిల్లలు ఏదన్నా కావాలని మొండిపట్టు పడితే ‘‘నేను ఇవ్వను’’ అని కచ్చితంగా చెప్పకుండా ‘‘తప్పకుండా ఇస్తాను. కానీ ఇప్పుడు కాదు.. అది ఎందుకు అవసరం... ఇప్పుడే ఎందుకు కావాలి... ఆలోచించి నాకు చెప్పు’’ అనాలిట. ఇలా చేయడం వలన సమస్యపై పనిచేయడం నేర్చుకుంటారుట పిల్లలు. అంటే, రాజీలేని మనస్తత్వం మంచిది కాదు - అది మొండితనమని మనం విమర్శించటం లేదు - కానీ అలా రాజీ పడలేనప్పుడు దానిని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పిస్తున్నాం. అలాగే తన ప్రవర్తనకి కారణాన్ని తానే ఆలోచించుకునేలా చేస్తున్నాం. మనవంతు సహకారం చాలా ముఖ్యం:   పిల్లలు ఎదుగుతూ, చుట్టూ పరిశీలిస్తూ తమ అనుభవాలని సమీక్షించుకుంటూ ఎన్నో నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ వుంటారు. ఆ ప్రయత్నానికి మన వంతు సహకారం అందిస్తే చక్కటి వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. అలాకాక పిల్లల ప్రతి చర్యనీ విమర్శిస్తూ, అతిగా స్పందిస్తూ, వారిని నిందిస్తూ వుంటే అది క్రమశిక్షణ అని మనం అనుకున్నా, అది పిల్లల సహజ నైజాన్ని, వ్యక్తిత్వాన్ని చిదిమేయడమే అవుతుంది. అందుకే వారిని విమర్శించేముందు, ఎలా సరిచేయొచ్చో ఆలోచించమంటున్నారు నిపుణులు.  -రమ

ఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళా చక్రవర్తి రజియా సుల్తానా!

Publish Date:Mar 8, 2025

ఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళా చక్రవర్తి రజియా సుల్తానా!   స్త్రీ....  అంటే ఓ చైతన్యం. అతివ.. ..అంటే ఓ అపూర్వం.  పడతి.... అంటే ఓ ప్రగతి.  అరచేతిని అడ్డుపెట్టి అరుణోదయాన్ని ఎలాగయితే ఆపలేమో. కట్టుబాట్ల అడ్డుగోడలు, కష్టాల కన్నీళ్ళు, స్త్రీమూర్తిని ఆపలేవు. సాధించాలన్న తపన ...లక్ష్యం చేరాలన్న ఆశయం ..ఆమెను ఆకాశమంత చేస్తాయి. ఆమె వేసే ఒక్కో అడుగు.. వేల మార్పులకు శ్రీకారం.  మహిళామణులు అందరికీ 'మహిళా దినోత్సవ' శుభాకాంక్షలు. 1908 సంవత్సరం మార్చి 8వ తేదీన అమెరికా దేశంలో మహిళలు తమకు ఉద్యోగాలలో సమాన అవకాశాలు, వేతనలు కావాలనీ డిమాండ్ చేస్తూ చేపట్టిన భారీ నిరసన ఉద్యమం చేపట్టారు. ఈ చారిత్రక నేపథ్యాన్ని పురస్కరించు కొని ప్రతి సంవత్సరం యావత్ ప్రపంచం మార్చి 8 తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. సమాన అవకాశాలు, స్వేఛ్చ అందించగలిగితే మహిళలు పురుషులకు మిన్నగా అన్ని రంగాల్లోనూ రాణిస్తారు. అకాశంలో సగమైన మహిళ ఆత్మగౌరవం కోసం, అభ్యున్నతి కోసం ప్రతీ ఒక్కరు పని చేయడమే నిజమైన నాగరికతగా భావించాలి  గృహిణిగా, శ్రమజీవిగా, ఉద్యోగిగా, ప్రజాప్రతినిధిగా, అన్ని రంగాల్లోనూ ప్రతిభావంతంగా పని చేస్తున్నా ఆమెకు తగిన గుర్తింపు రావడం లేదు. ఇప్పటికీ సమాన పనికి సమాన వేతనం దక్కడం లేదు. ప్రజాప్రతినిధులుగా స్థానం సంపాదించినా భర్తల చేతిలో కీలుబొమ్మలుగానే ఉన్నారు. మహిళల సమానత్వం ప్రచార ఆర్భాటాలకే తప్ప ఆచరణలో కానరావడం లేదు. నేటికీ మహిళగానూ, శ్రామిక మహిళగానూ, పౌరురాలిగానూ దోపిడీకి గురౌతూనే ఉంది. ఇన్ని సమస్యలున్నా కొందరు విజయం వైపు దూసుకెళ్తూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు.  సృష్టికి మూలం ఆడది. అసలు ఆడదే లేకపోతే సృష్టే లేదు. అంతటి మహోన్నత ప్రశస్తి కలిగిన మహిళ నేటి ప్రస్తుత నవ సమాజంలో అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. సాటి సభ్య సమాజాన్ని చూసి ఆమె కన్నీరు పెడుతుంది..! ఆడపిల్ల పుట్టిందంటేనే భారంగా భావించే రోజులు దాపురించాయి. అసలు బయటి ప్రపంచాన్ని చూడకుండానే అసువులు బాసిన ఆడపిల్లలు కోకొల్లలు. ఏ దేశంలో లేని దుస్థితి మన దేశంలో ఎందుకు..? ఆడపిల్లని కనడం, చదివించడం, పెళ్లి చేయడం లాంటి తదితరాలన్నింటినీ భారంగా భావించే తల్లిదండ్రులు మన దేశంలో ఎందరో..! అసలు ఆడపిల్ల పుట్టిందంటేనే అదో పెద్ద శిక్షగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఆడపిల్లల సంఖ్య రోజురోజుకూ క్షీణిస్తుంది.  భారత  రాజ్యాంగం భారతీయ మహిళలందరికీ సమానత్వం (ఆర్టికల్ 14), రాష్ట్రాలనిబట్టి ఎటువంటి వివక్షా చూపించకుండా ఉండడం (ఆర్టికల్ 15 (1) ), అవకాశంలో సమానత్వం (ఆర్టికల్ 16), సమాన పనికి సమాన జీతం (ఆర్టికల్ 39 (డి) ) మొదలైన హామీల నిస్తున్నది. రాష్ట్రాలు స్త్రీలకు, పిల్లలకు ప్రత్యేక సదుపాయాలను అందించే వీలు కలుగజేస్తుంది (ఆర్టికల్ 15 (3)). మహిళల గౌరవానికి భంగం కలిగించే చర్యలను త్యజించాలని (ఆర్టికల్ 51 (ఎ) ) సూచిస్తోంది. అలాగే స్త్రీలకు ప్రసూతి సెలవలు ఇవ్వడానికి, వారికి అవసరమైన సదుపాయాలు కల్పించడాన్ని అనుమతిస్తుంది. (ఆర్టికల్ 42).   ఆదర్శాలకీ వాస్తవాలకూ మధ్య చాలా సందర్భాల్లో పొంత్యన కుదరదన్న విషయాన్నే దేశంలో ఎల్లెడలా పరుచుకుపోయిన అసమానతలు చాటుతున్నాయి. వివిధ రంగాల్లో స్త్రీ పురుషుల మధ్య సామానత్వ సాధనలో ఏఏ దేశాలు ఎంతెంత వెనకబడి ఉన్నాయో ఆ నివేదిక కళ్లకు కడుతుంది. 2017 చివర్లో వెలువడిన ఓ నివేదిక ప్రకారం మొత్తం 145దేశాల పరిస్థితులను విశ్లేషిస్తే భారత్  108వ స్థానంలో ఉంది. ఆర్ధిక భాగస్వామ్యంలో 139, విద్యలో 125, వైద్యం, ఆరోగ్యంలో 143 వ స్థానాన్ని ఆక్రమించింది. సమానత్వ సూచీలో పేర్కొన్న గణాంకాల ప్రకారం 145 దేశాల్లో ఏ ఒక్కటీ స్త్రీ పురుష అంతరాలను తగ్గించడంలో వంద శాతం విజయం అందించలేదు.  ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే, స్వీడన్ వంటి దేశాలు 80 శాతం వరకు అధిగమించి సమానత సాధన దిశలో ముందు వరసల్లో ఉన్నాయి. బలమైన ఆర్ధిక వ్యవస్థలున్న సమాజాలు సమానత్వ సాధనలో వెనకబడిపోవడానికి మహిళా శక్తిని గుర్తించలేకపోవడంతో పాటు పాతుకుపోయిన పురుషాధిక్య భావజాలమూ ప్రధాన కారణమే. భారత్‌లో మహిళలు పురుషులతో పోలిస్తే రోజూ అయిదు గంటల పాటు ఎలాంటి ప్రతిఫలం లభించని పని చేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. పని విభజనలో తారతమ్యం ఏ దేశంలోనూ ఈ స్థాయిలో ఉండదు. ఆర్ధిక సాధికారతలో వెనకబాటుకు ప్రధాన కారణమదే. మహిళా యాజమాన్యంలోని సంస్థలు అతి తక్కువ శాతం ఉన్నదీ భారత్ లోనే.  ప్రపంచవ్యాప్తంగా గడిచిన పదేళ్లలో మహిళా కార్మిక శక్తి 150 కోట్ల నుంచి 175 కోట్లకు పెరిగింది. కానీ మహిళల వార్షిక వేతనం చూస్తే ప్రస్తుతం స్త్రీలు సంపాదిస్తున్న జీతం పదేళ్ల క్రితం పురుషుడు సంపాదించిన దానితో సమానం. ప్రగతి బాటలో స్త్రీ పురుషుల మధ్య అంతరం తగ్గుతూ పోయిన కొద్దీ జీడీపీ పెరుగుతుందని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. రాజకీయ రంగంలో అంతరాలను అధిగమించిన దేశం సుసంపన్నం అవుతోంది.  భారతదేశంలో తొలిగా అహ్మదాబాద్ లో "అనసూయా సారాభాయ్ -టెక్స్‌టైల్‌ లేబర్‌ అసోసియేషన్‌" అనే పేరుతో కార్మికసంఘం ప్రారంభించింది. భారత కార్మికోద్యమంలో కార్మిక స్త్రీలను సంఘటితం చేసిన మహిళా నేతలలో సుశీలా గోపాలన్‌, విమలారణదివే, కెప్టెన్‌ లక్ష్మిసెహగల్‌, అహల్యారంగ్నేకర్‌, పార్వతీకృష్ణన్‌ ప్రముఖులు.. కొన్ని సహస్రాబ్దులు గా  భారత దేశంలో మహిళల పాత్ర అనేక గొప్ప మార్పులకు లోనౌతూ వచ్చింది. ప్రాచీన కాలంలో పురుషులతో సమాన స్థాయి కలిగివున్న భారతీయ మహిళలు మధ్యయుగంలో అధమ స్థాయికి అణచబడటం, అనేకమంది సంఘ సంస్కర్తలు తిరిగి వారికి సమాన హక్కుల కల్పన కోసం కృషి చేయడం, ఇలా భారతదేశంలో మహిళల చరిత్ర అనేక సంఘటనల సమాహారంగా ఉంది.  ఆధునిక భారతదేశంలోమహిళలు దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్, ప్రతిపక్ష నాయకురాలు వంటి అత్యున్నత పదవులను అలంకరించి దేశ కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడింపచేసారు. పతంజలి, కాత్యాయనుడు వంటి ప్రాచీన భారత వ్యాకరణకర్తల రచనల ప్రకారం, వేదకాలపు ఆరంభంలో మహిళలు చదువుకోనేవారని తెలుస్తోంది. ఆ సమయంలో మహిళలు యుక్తవయస్సులో పెళ్ళి చేసుకోనేవారని, వారు భర్తను ఎన్నుకొనే హక్కుని కలిగి ఉండేవారని ఋగ్వేద శ్లోకాలు తెలుపు తున్నాయి. తరువాత (సుమారుగా 500 బి.సి.) నుండి మహిళల హోదా తగ్గడం మొదలయ్యింది  మధ్యయుగ సమాజంలో మహిళల స్థాయి ఇంకా దిగజారింది.   కొంత  మంది మహిళలు రాజకీయ, సాహిత్యం, విద్య, మత రంగాలలో రాణించారు. రజియా సుల్తానాఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళా చక్రవర్తి.  గోండు రాణి దుర్గావతి పదిహేనేళ్ళు పరిపాలన సాగించింది. ఆమె మొఘల్ చక్రవర్తి అక్బర్ ను ఎదుర్కొంది. అక్బర్ ను  1590లో చాంద్ బీబీ ఎదుర్కొని అహ్మద్ నగర్‌ను రక్షించింది.  జహంగీర్ భార్య నూర్జహాన్  సార్వభౌమ అధికారాన్ని ప్రతిభావంతంగా చెలాయించి మొఘల్ మకుటం వెనుక ఉన్న నిజమైన శక్తిగా గుర్తింపు పొందింది.  మొఘల్ యువరాణులు జహనారా, జేబున్నీసాలు మంచి పేరున్న రచయిత్రులు.  శివాజీ తల్లి జిజియాబాయి యోధురాలిగాను, పాలకురాలి గానూ చాటుకున్న సమర్థత వలన సమర్ధురాలైన రాణిగా గణుతి కెక్కింది.  దక్షిణ భారతంలో చాలామంది మహిళలు గ్రామాలు, పట్టణాలు, మండలాలను పాలించారు. అనేక సామాజిక, మత సంస్థలకు ఆద్యులయ్యారు. భక్తి ఉద్యమం మహిళల హోదాని తిరిగి నిలపడానికి ప్రయత్నించి కొన్ని రకాల అణిచివేతలను అడ్డుకుంది. మీరాబాయి అనే ఒక మహిళా సాధు కవయిత్రి భక్తి ఉద్యమపు ముఖ్య వ్యక్తులలో ఒకరు. ఈ కాలపు ఇతర మహిళా సాధు-కవయిత్రులు అక్క మహాదేవి, రామి జనాభాయి, లాల్ దేడ్.   యూరోపియన్ పరిశోధకులు 19వ శతాబ్దపు భారత స్త్రీలు మిగతా స్త్రీలకంటే "సహజంగా శీలవంతులు", "ఎక్కువ ధర్మపరులు" అని గమనించారు.  బ్రిటిషు పాలన సమయంలో రామ్ మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, జ్యోతిరావు ఫులే మొదలైన సంఘసంస్కర్తలు మహిళా అభ్యున్నతికి పోరాడారు. పండిత రమాబాయి వంటి చాలామంది మహిళా సంస్కర్తలు కూడా మహిళా అభ్యున్నతికి కృషి చేసారు. కర్ణాటకలోని కిట్టుర్ రాజ్య రాణి కిట్టుర్ చెన్నమ్మ బ్రిటిషువారి కాలదోషం పట్టిన సిద్ధాంతాలకి ప్రతిస్పందనగా వారికీ వ్యతిరేకంగా సైన్యాన్ని నడిపించింది. తీరప్రాంత కర్ణాటక రాణి అబ్బక్క రాణి యురోపియన్ సైన్యాల ఆక్రమణలకి ముఖ్యంగా 16వ శతాబ్దంలో పోర్చుగీసు ఆక్రమణలకి ఎదురునిలిచింది. రాణి లక్ష్మీ బాయి ఝాన్సీ రాణి బ్రిటిషువారికి వ్యతిరేకంగా 1857 భారతీయ తిరుగుబాటుని నడిపించింది. ఆమె నేడు జాతీయ హీరోగా భావించబడుతున్నది.  అవద్ సహా-పాలకురాలు బేగం హజ్రత్ మహల్ 1857 తిరుగుబాటును నడిపించిన ఇంకో పాలకురాలు. ఈమె బ్రిటిషువారితో ఒప్పందాలని నిరాకరించి తరువాత నేపాల్ కి వెళ్ళిపోయింది. మహిళలు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యపాత్ర పోషించారు. కొంతమంది ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాళ్ళు భికాజి కామా, డా. అనీ బిసెంట్, ప్రీతిలత వడ్డేదార్, విజయలక్ష్మి పండిట్, రాజకుమారి అమ్రిత్ కౌర్, అరుణ అసఫ్ ఆలీ, సుచేత కృపలానీ, కస్తుర్బా గాంధీ. మరికొందరు ముఖ్యులు ముత్తులక్ష్మీ రెడ్డి, దుర్గాబాయి దేశ్ముఖ్మొదలైనవారు. సుభాష్ చంద్ర బోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ, లక్ష్మీ సెహగల్ని కెప్టన్‌గా, మొత్తం మహిళలతో కూడిన  ది రాణి అఫ్ ఝాన్సీ రెజిమెంట్ ను ఏర్పాటు చేసింది. కవయిత్రి, స్వాతంత్ర్య సమర యోధురాలూ అయిన సరోజినీ నాయుడు, భారత జాతీయ కాంగ్రెసుకు అధ్యక్షురాలైన మొదటి భారతీయ మహిళ. భారతదేశంలో ఒక రాష్ట్రానికి గవర్నరయిన మొదటి మహిళ కూడా. నేటి భారతీయ మహిళ విద్య, రాజకీయాలు, మీడియా, కళలు, సంస్కృతీ, సేవా విభాగాలు, విజ్ఞాన, సాంకేతిక రంగాలు వంటి అన్ని రంగాలలో పాల్గొంటోంది. పదిహేనేళ్ళపాటు భారతదేశపు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరా గాంధీ ప్రపంచంలో ప్రధానమంత్రిగా ఎక్కువకాలం పని చేసిన మహిళ. ఈదేశంలో  మనం కొందరు   మహిళలు గురించి తెలుసుకోవాలి.. జాన్ ఇలియట్ డ్రింక్ వాటర్ బెతూనే 1849లో బెతూనే స్కూల్ ప్రారంభించింది, ఇది 1879లో బెతూనే కళాశాలగా వృద్ధి చెంది భారతదేశంలో మొదటి మహిళా కళాశాల అయింది. 1883 లో చంద్రముఖి బసు,  కాదంబినీ గంగూలీ బ్రిటిషు సామ్రాజ్యపు మొదటి మహిళా పట్టభధ్రులయ్యారు. కాదంబినీ గంగూలీ, ఆనందీ గోపాల్ జోషి భారతదేశమునుండి పాశ్చాత్యవైద్యంలో శిక్షణ పొందిన మొదటి మహిళలు. 1905 లో సుజన్నే ఆర్ డి టాటా కారు నడిపిన మొదటి భారతీయ మహిళ. 1916 జూన్ 2న సంఘసంస్కర్త  దొండో కేశవ్ కార్వేగారిచేత కేవలం ఐదుమంది విద్యార్థులతో మొదటి మహిళా విశ్వవిద్యాలయం SNDT మహిళా విశ్వవిద్యాలయం స్థాపించబడింది. 1917 లో అన్నే బిసెంట్ భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి మహిళా అధ్యక్షురాలయింది. 1919 లో ఆమె విలక్షణమైన సామజిక సేవకు గుర్తింపుగా పండిత రమాబాయి బ్రిటీష్ రాజ్ నుంచి కైజర్-ఇ-హింద్ పురస్కారం పొందిన మొదటి మహిళ. 1925 లో సరోజినీ నాయుడు భారత జాతీయ కాంగ్రెస్కి భారతదేశంలో పుట్టిన మొదటి మహిళా అధ్యక్షురాలు. 1944 లో భారతీయ విశ్వవిద్యాలయంనుంచి సైన్స్ డాక్టరేట్ అందుకున్న మొదటి మహిళ అసిమా చటర్జీ. 1947 ఆగస్టు 15 స్వతంత్రం తరువాత సరోజినీనాయుడు యునైటెడ్ ప్రావిన్సులకి గవర్నర్ అయింది, ఈవిడ భారతదేశపు మొదటి మహిళ గవర్నరు. 1951లోడెక్కన్ ఎయిర్వేస్ కు చెందినా ప్రేమ మాథుర్ భార్తదేశపు మొదటి మహిళా వాణిజ్య పైలట్. 1953లో  విజయలక్ష్మి పండిట్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి మొదటి మహిళా అధ్యక్షురాలు  (మొదటి భారతీయ)  1959లో  అన్నా చండీ హైకోర్టుకి మొదటి మహిళా జడ్జ్ (కేరళ హై కోర్టు)  1963లో  సుచేత కృపలానీ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అయి, భారతదేశంలోని ఏ రాష్ట్రములోనైనా ఆస్థాయిని పొందిన మొదటి మహిళ అయ్యారు. 1966 లో  కేప్టన్ దుర్గ బెనర్జీ ఒక రాష్ట్ర ఎయిర్లైన్స్, ఇండియన్ ఎయిర్లైన్స్ కి పైలట్ అయిన మొదటి భారతీయ మహిళ. 1966లో  కమలాదేవి చటోపాధ్యాయ  వర్గ నాయకత్వానికిగానూ రామన్ మెగాసస్సే పురస్కారం గెలుచుకున్నారు. 1966లో ఇందిరాగాంధీ భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి. 1970లో కమల్జిత్ సందు ఏషియన్ గేమ్స్ లో బంగారు పతకం గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ. 1972లో  కిరణ్ బేడి ఇండియన్ పోలీస్ సర్వీస్ కి ఎన్నికయిన మొదటి మహిళా అభ్యర్థి. 1979లో  మదర్ థెరిస్సా నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళా పౌరురాలు. 1984 మే 23న బచేంద్ర పాల్ మౌంట్ ఎవరెస్ట్ను  అధిరోహించిన మొదటి మహిళ అయ్యారు. 1989 లో జస్టిస్ ఎం.ఫాతిమా బీవీ సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియాకి మొదటి మహిళా జడ్జ్ గా ఎన్నికయ్యారు. 1997లో కల్పనా చావ్లా గగనంలోకి వెళ్ళిన మొదటి భారత జన్మిత మహిళ. వీరందరి స్ఫూర్తితో మన సోదరీమణులు ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు...💐💐💐

Makara Sankranthi Special Muggulu

Publish Date:Jan 13, 2025

 

Pongal Muggulu

Publish Date:Jan 13, 2025