English | Telugu

బుల్లితెరపైకి వెన్నెల కిషోర్!

ఎందరో హీరో హీరోయిన్లు, కమెడియన్లు బుల్లితెరపై యాంకర్లుగా మారి అలరించారు. ఇప్పుడు అదే బాటలో కమెడియన్ వెన్నెల కిషోర్ పయనించబోతున్నాడు. త్వరలో ఈటీవీలో ప్రసారం కానున్న 'అలా మొదలైంది' అనే షోకి ఆయన హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ షోని నిర్మిస్తుండటం విశేషం. తాజాగా ఈ షోని అధికారికంగా ప్రకటించారు. "నవ్వడానికి సిద్ధంగా ఉండండి" అంటూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు.

గతంలో ఈటీవీలో కమెడియన్ అలీ హోస్ట్ గా 'ఆలీతో సరదాగా' అనే టాక్ షో ప్రసారమైంది. అందులో అలీ సెలెబ్రిటీలను తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేసి అలరించాడు. మరి ఇప్పుడు వెన్నెల కిషోర్ హోస్ట్ చేయనున్న 'అలా మొదలైంది' షో ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తి నెలకొంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.