Read more!

English | Telugu

తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజి మీద రచ్చ చేయబోతున్న దేవిశ్రీ

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 సెమీఫైనల్స్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. దీనికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి డిఎస్పి వచ్చాడు. దేవి శ్రీప్రసాద్ ఎక్కడ ఉంటే అక్కడ మస్త మజా డాన్సులు, పాటలు ఉంటూనే ఉంటాయి. అలాంటి డిఎస్పి ఇండియన్ ఐడల్ స్టేజి మీదకు వచ్చాడంటే రచ్చ రచ్చ కాకుండా ఎలా ఉంటుంది. ఇక స్టేజి మీదకు కార్తిక్, థమన్, దేవి వచ్చారు ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించారు. "తెలుగు ఇండియన్ ఐడల్ కి మోస్ట్ స్పెషల్ ఎక్సక్లూసివ్ మూమెంట్ ఏమిటి అంటే థమన్, డిఎస్పీ ఈ స్టేజి మీదకు రావడమే..డిఎస్పీ మచ్చా థాంక్యూ సో మచ్" అని చెప్పాడు కార్తిక్. "దేవిశ్రీప్రసాద్ సాంగ్స్ లో నీకు ఇష్టమైన సాంగ్ ఏమిటి " అని కార్తిక్  థమన్ ని అడిగాడు.

తర్వాత "ఆ అంటే అమలాపురం" అనే సాంగ్ పాడింది లాస్యప్రియ. "ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది"..అన్నాడు డిఎస్పీ...ఇక ఈ వారం జరిగే ఈ సెమీ ఫైనల్స్ లో ఎవరెవరు ఎలా పోటీ పడబోతున్నారు...డిఎస్పీ ఇచ్చే అల్టిమేట్ ఛాలెంజ్ ని దాటి ఫినాలేకి వెళ్లే ఆ టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయం తెలియాలంటే  19 వరకు వెయిట్ చేయాలి. ఇక డిఎస్పీ గురించి అతని మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీసెంట్ గా రిలీజ్ ఐన  ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ అనే మూవీలో "లెట్స్ డాన్స్ చోటు మోటు" అనే సాంగ్ ని స్వరపరిచారు దేవిశ్రీప్రసాద్. ప్రస్తుతం ఈ సాంగ్ ఇంటర్నేషనల్ బిల్ బోర్డు ఛార్ట్స్ లో నాలుగవ స్థానంలో ఉంది...ఆయన ఇప్పుడు "పుష్ప 2 , "సూరియా 42 " వంటి బిగ్ ప్రాజెక్ట్స్ కి సంగీతాన్ని అందిస్తున్నాడు.