Read more!

English | Telugu

బిగ్ సర్ప్రైజ్.. తారక్ షోలో మహేష్ తో పాటు పవన్ కూడా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ షోలో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు సందడి చేయగా.. త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు సందడి చేయనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ ఎపిసోడ్ ప్రోమోకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు ఎపిసోడ్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ ఎపిసోడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్ ప్రైజ్ ఎంట్రీ ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది.

'ఎవరు మీలో కోటీశ్వరులు' షోలో మహేష్ పాల్గొన్న ఎపిసోడ్ షూట్ ఎప్పుడో పూర్తయింది. ఆ షూట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో లీకై వైరలయ్యాయి. దీంతో ఈ ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందా అని తారక్, మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రోమో విడుదల కావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. జస్ట్ ప్రోమోతోనే ఈ ఎపిసోడ్ ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేయబోతుందో చెప్పేశారు. అయితే ఈ ఎపిసోడ్ లో పవన్ ఫ్యాన్స్ కి కూడా ఓ సర్ ప్రైజ్ ఉందని ప్రచారం జరుగుతోంది. మహేష్ ఒక ప్రశ్నకు సమాధానం తెలియక.. వీడియో కాల్ లైఫ్ లైన్ ఉపయోగించుకొని పవన్ కి కాల్ చేస్తాడట. అలా పవన్ సాయంతో మహేష్ ఆ ప్రశ్నకు సమాధానం చెబుతాడట. అంతేకాదు ఆ సమయంలో ముగ్గురు స్టార్ల మధ్య జరిగే సంభాషణ ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుందని సమాచారం.

ఈ ప్రచారంలో నిజమెంతో తెలియదు కానీ.. ఆ ఎపిసోడ్ లో నిజంగానే పవన్ కూడా కనిపిస్తే ఎపిసోడ్ కి రికార్డ్ రేటింగ్ వస్తుంది అనడంలో సందేహం లేదు. ముగ్గురు స్టార్స్ ఒకే స్క్రీన్ పై సందడి చేస్తే ఫ్యాన్స్ కి అంతకంటే కావాల్సింది ఏముంటుంది. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 2న టెలికాస్ట్ అయ్యే అవకాశముందని అంటున్నారు.