English | Telugu
`గుప్పెడంత మనసు` : బయటపడిన దేవయాని కుట్ర
Updated : Nov 23, 2021
మహిళా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న ధారావాహిక `గుప్పెడంత మనసు`. వసుధార , రిషిల చిలిపి ప్రేమకథ నేపథ్యంలో సాగుతున్న ఈ సీరియల్ గత కొన్ని వారాలుగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తోంది. తాజాగా మంగళవారం 299వ ఎపిసోడ్లోకి అడుగుపెడుతోంది. ఈ రోజు హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వసు కోసం జగతి ఇంటికి వచ్చిన రిషి అక్కడే వసు వంట చేయడంతో భోజనం కూడా లాగించేస్తాడు. ఆ తరువాత వసుకి థ్యాంక్స్ చెప్పేస్తాడు.
ఇది చలా గొప్ప విషయం సార్. జగతి మేడమ్ ఇంటికి రావడం.. ఇక్కడే భోజనం చేయడం నిజంగా గొప్ప విషయం సార్ అంటుంది. ఆ మాటలు విన్న వెంటనే రిషికి ఇగో తన్నుకొస్తుంది. వెంటనే `నిజమే కదా.. నేనేంటి ఇక్కడ తిన్నాను` అనకుంటూ వసు పిలుస్తున్నా ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. కట్ చేస్తే జగతి, మహేంద్ర ఇంటికి వచ్చేస్తారు. మహేంద్రకు కాల్ రాగానే బయటికి వెళ్లిపోతారు. అక్కడ డైనింగ్ టేబుల్పై రెండు ప్లేట్లు వుండటాన్ని గమనించిన జగతి `ఏంటి వసు రెండు సార్లు తినేసి ప్లేట్లు కడగడం మానేసావా? అంటుంది. రిషి వచ్చిన విషయం చెప్పేస్తుంది వసు.
విషయం తెలియగానే జగతి నవ్వే ఓ గెస్ట్వి అంటూ షాకిస్తుంది. ఇదిలా వుంటే రిషి, వసుధారల మధ్య ఏదో జరుగుతోందని దేవయాని ఆరాతీయడం మొదలుపెడుతుంది. ఆ విషయం మహేంద్రకు తెలుస్తుంది. దేవయాని కుట్ర గురించి తెలుసుకున్న మహేంద్ర `వదిగారు ఏం చేస్తున్నా ఓపిక పడుతున్నాను.. ఆమె భయపడే రోజు ఖచ్చితంగా వస్తుందని మహేంద్ర అంటాడు. ఆ తరువాత ఏం జరిగింది? కథ ఎలాంటి మలుపులు తిరిగింది? .. కాలేజీకి వెళుతూ వసుధారతో రిషి చేసిన చిలిపి పని ఏంటీ అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.