English | Telugu
`ఎన్నెన్నో జన్మలబంధం`: తప్పులో కాలేసిన యశోధర్
Updated : Nov 23, 2021
`స్టార్ మా`లో రీసెంట్గా మొదలైన ప్రేమకథ `ఎన్నెన్నో జన్మలబంధం`. ప్రారంభం నుంచి మేకింగ్ పరంగా, కంటెంట్ పరంగా ఈ సీరియల్ ఆకట్టుకుంటోంది. తెలుగు సీరియల్స్ అంటే కన్నడ స్టార్స్ అనేట్టుగా మారిన ఈ నేపథ్యంలో ఈ సీరియల్లోనూ కన్నడ టీవీ పరిశ్రమకు చెందిన వారే ప్రధాన పాత్రల్లో నటించారు. బెంగళూరుకు చెందిన నిరంజన్ కోల్కతాకు చెందిన డెబ్జాని మోడక్ కీలక పాత్రల్లో యశోధర్, వేదలుగా నటించారు. మరో కీలక పాత్రలో బెంగళూరు పద్మ నటించింది.
శినవారం ఖుషీని వేద కిడ్నాప్ చేసిందంటూ యశోధర్ తల్లి అనుమానించడంతో ఆమెపై కేసు పెడతాడు యశోధర్. దీంతో వేద తండ్రిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళతారు. అక్కడికి వెళ్లిన వేద ముందు ఖుషీని ఒంటరిని చేసిన యశోధర్ని నిలదీస్తుంది. గంట ఆలస్యమైతే ఖుషీ ప్రాణాలకే ప్రమాదం జరిగేదని చ,ఎబుతుంది. కావాలంటే డాక్టర్ని అడిగి తెలుసుకోండి అంటుంది. అయితే నువ్వు చెప్పిందే నిజమని గ్యారంటీ ఏంటని ఇన్స్పెక్టర్ ప్రశ్నిస్తాడు. సాక్షమేంటని నిలదీస్తాడు.
ఇలా వేదని యశోధర్, ఇన్స్పెక్టర్ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సమయంలో నేను సాక్షం అంటూ యశోధర్ మాజీ భార్య అక్కడికి వచ్చి షాకిస్తుంది. డాక్టర్ వేద ఖుషీని కిడ్నాప్ చేసిందనడానికి మీదగ్గర ఏదైనా ఆధారం వుందా? అంటుంది. దానికి వెంటనే `చెయ్యలేదు అనడానికి మీదగ్గర ఏం సాక్ష్యం వుందని ఇన్స్ పెక్టర్ ప్రశ్నిస్తాడు. వెంటనే యశోధర్ మాజీ భార్య వేద ఖుషీని కిడ్నాప్ చెయ్యలేదు అనడానికి సాక్ష్యం నేనే అంటుంది. వెంటనే వాట్ మీరెవరు అసలు అని ఇన్స్పెక్టర్ ప్రశ్నించడంతో `ఖుషీ కన్నతల్లిని` అని అంటుంది. దీంతో యశోధర్, ఇన్స్పెక్టర్ ఇద్దరూ షాక్కి గురవుతారు. ఆ తరువాత ఏం జరిగింది? .. వేద విషయంలో తప్పు చేశానని యశోధర్ తెలుసుకున్నాడా? అన్నది తెలియాలంటే ఈ రోజు 9:30 గంటలకు ప్రసారం అయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే.