English | Telugu

Duvvada Madhuri Wildcard entry: వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా దువ్వాడ మాధురి.. బిగ్ బాస్ ఇచ్చిన పవర్ ఏంటంటే!

బిగ్ బాస్ సీజన్-9 లో నిన్నటి ఎపిసోడ్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ జోరు సాగింది. ఎందుకంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీనీ బిగ్ బాస్ చాలా వైల్డ్ గా ప్లాన్ చేసాడు ఒక్కొక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవుతుంటే బిగ్ బాస్ లోని పాత కంటెస్టెంట్స్ కి వణుకుపుట్టింది. మూడవ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా దువ్వాడ మాధురి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ పొలిటిషన్ దువ్వాడ శ్రీనివాస్ రెండో భార్యగా దువ్వాడ మాధురి ఫుల్ వైరల్ అయింది. ఈ మధ్య ఇన్ స్టాగ్రామ్ లో ట్రెండింగ్ ఉన్న దువ్వాడ మాధురి భారీ అంచనలా మధ్య హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

దువ్వాడ మాధురి స్టేజ్ పైకి వచ్చింది. తను వచ్చీరాగానే 'AV(ఏవి)' ప్లే చేసాడు నాగార్జున. ఇక ఆ తర్వాత తన గురించి చెప్తుంది. హౌస్ లో ఎవరంటే ఇష్టమని నాగార్జున అడుగగా.. ఎవరు ఇష్టం లేదని చెప్తుంది. హౌస్ లో ఉన్నవాళ్ళ గురించి ఏం చెప్తారని నాగార్జున అడుగగా.. హౌస్ లోకి బాండింగ్ పెట్టుకోవడానికి వెళ్తారు కొందరు.. ఇప్పుడు కప్ ఒక్కరికే వస్తుంది కదా ఇవన్నీ బంధాలు పెట్టుకుంటే వాళ్ళని తొక్కుకుంటూ కప్ తీసుకోలేం కదా అని మాధురి అనగానే మీరు ఇప్పుడు ఒక బంధంతోనే కదా ముందుకి వెళ్తుందని నాగార్జున కౌంటర్ వేస్తాడు. అది జీవితం.. ఇది గేమ్ అని మాధురి కవర్ చేస్తుంది. శ్రీనివాస్ కోసం ఏదైనా చేస్తాను తను ఉండిపొమ్మంటే ఉండి పోయేదాన్ని కానీ వెళ్ళు నేను పిల్లల్ని చూసుకుంటానని ధైర్యంగా పంపాడని అంది. వారిద్దరి గురించి చాలా గర్వంగా, గొప్పగా చెప్పుకుంది మాధురి.

కన్నడ బిగ్ బాస్ హోస్ట్ కిచ్చ సుదీప్ ఒక సూపర్ పవర్ పంపించాడు. మాధురికి ఒక సూపర్ పవర్ ఇచ్చాడు. అదేంటంటే ఎలిమినేషన్ ని రద్దు చేసే పవర్. ఆ తర్వాత మాధురి హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇక అందరిని పరిచయం చేసుకుంటుంది దువ్వాడ మాధురి. ఇక అప్పుడే మీ పేరు ఏంటని శ్రీజ అడుగుతుంది. నా పేరు తెలియదా అని మాధురి రూడ్ గా మాట్లాడుతుంది. అదేంటి అలా అడగడం తప్పా, నాకు తెలియదు కాబట్టి అడిగా అని శ్రీజ అంటుంది. రావడంతోనే గొడవ పెట్టుకోవాలి అనుకుంటున్నావా అని మాధురి అంటుంది. దువ్వాడ మాధురి బిహేవియర్ తో పాత కంటెస్టెంట్స్ కి భయం మొదలైంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.