English | Telugu

పండగలా భలే మంచి రోజు!

ఈటీవీ అంటే చాలు ఎన్నో స్పెషల్ షోస్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే ఒక బెస్ట్ ఛానల్ అని చెప్పొచ్చు. ప్రతీ పండగని నిజమైన పండగలా చూపిస్తుంది. కలర్ ఫుల్ షోస్ తో బోర్ కొట్టించకుండా రకరకాలుగా ఎంటర్టైన్ చేస్తూ ఆడియన్స్ ముందుకు వస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు భలే మంచి రోజు టైటిల్ తో ఒక సూపర్ ఎపిసోడ్ ని ప్లాన్ చేసింది. ఇప్పుడా ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇది సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఈటీవీ మొదలై 27 ఏళ్ళు పూర్తైన సందర్భంగా ఈ స్పెషల్ ఎపిసోడ్ ని ప్లాన్ చేసింది ఈటీవీ.

ఈ ప్రోగ్రాం హోస్ట్ గా ప్రదీప్ మాచిరాజు ఉన్నాడు. ఇక అతని కామెడీ గురించి, హోస్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షోలో ఎంతోమంది ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసారు. ఆలీ, ఎస్పీ చరణ్, అన్నపూర్ణమ్మ, ఇంద్రజ, యాట నవీన, హరిత, జాకీ, బాలాజీ, కౌశిక్, యమున, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, అనసూయ, ఆది, రాంప్రసాద్, పోసాని కృష్ణమురళి, గీతామాధురి, రవికృష్ణ, నవ్యస్వామి, ఇలా బుల్లితెర మీద మనం రెగ్యులర్ గా చూసే ప్రతీ స్టార్ట్ ని ఈ ఒక్క ఎపిసోడ్ లో చూపించారు. ఇక ఈ ఎపిసోడ్ ఆగష్టు 28 రాత్రి 7 గంటలకు ప్రసారం కానుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.