English | Telugu

దెయ్యాలను చూడడానికి చంద్రగిరి కోటకు వెళ్లిన గీతూ

గీతూ మోటివేషనల్ వీడియోస్ తో బాగా ఫేమస్ అయ్యింది. అలాగే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లొచ్చాక ఇంకా ఫేమస్ అయ్యింది. అలాంటి గీతూ దెయ్యాలు సంబంధించి ఒక విషయం చెప్పింది. చిట్ చాట్ విత్ బిగ్ బాస్ టీం 2 పేరుతో వచ్చిన ఒక చాటింగ్ లో ఈ దెయ్యాల విషయాలను షేర్ చేసుకుంది. " నేను ఫోర్త్ క్లాస్ లో ఉన్నప్పుడు చంద్రగిరి కోటకు స్కూల్ లో ఎక్స్కర్షన్ కి తీసుకెళ్లారు. అప్పుడు నాకు దెయ్యాలని చూడాలనిపించింది. కోటలో దెయ్యాలు ఉంటాయని అప్పట్లో ఎవరో చెప్పారు అందుకే చూద్దామనిపించింది. అందుకే 4 గంటల తర్వాత దెయ్యాలుంటాయంట చూసి వెళదాం ఎవరికీ చెప్పొద్దూ మనం అని అక్కడ ఎవరికీ కనిపించకుండా ఒక చోట దాక్కుని ఉన్నాం నేను నా ఫ్రెండ్. ఆరోజు రాత్రి 7 గంటల వరకు అక్కడే దెయ్యాల కోసం వెయిట్ చేస్తున్నాం. ఆ టైంకి కోట మొత్తం ఒక్కసారిగా చీకటైపోయింది.

Illu illalu pillalu : ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో కీలక మలుపు.. అతని మీద కోప్పడ్డ రామరాజు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -16 లో....భద్రవతి బాంబులు పేల్చుతూ హ్యాపీగా ఉంటుంది. అప్పుడే తన ఆనందానికి కారణం మా కుటుంబంలో ఏదో విషయం అయి ఉంటుందని రామరాజు అనుకుంటాడు. వాళ్ళ సంతోషానికి కారణం అన్నయ్య విషయమై ఉంటుందా అని ధీరజ్ అనుకుంటాడు. నాకు తెలియకుండా ఏదో జరుగుతుందని రామరాజు ఆలోచిస్తుంటాడు. అప్పుడే వేదవతి వస్తుంది. ఎప్పుడు లేనిది భద్రవతి ఇంత సంతోషం ఉందంటే అందుకు కారణం కచ్చితంగా మన కుటుంబంలోని ఒక విషయమై ఉంటుందని రామరాజు అంటాడు.

Karthika Deepam2: దీపే వారసురాలని కనిపెట్టిన దాస్.. నిజాన్ని అనసూయ తెలుసుకోగలదా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కార్తీకదీపం-2(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-215 లో... దీపని వెతుక్కుంటూ దాస్ ఇంటికి వస్తాడు. దీప ఆప్యాయంగా ఆహ్వానిస్తుంది. నేను వెళ్లి కాంచనమ్మ గారిని పిలుస్తానంటూ దీప వెళ్తుండగా.. పర్వాలేదమ్మా.. అయినా నేను నా చెల్లెల్ని కలవడానికే రావాలా? నీ కోసం రాకూడదా అని దాస్ అంటాడు. అలా ఎందుకు అంటాను బాబాయ్.. ఈ రోజుల్లో ఆప్యాయంగా పలకరించే మనుషులు దొరకడమే ఎక్కువ అని దీప అంటుంది. అయితే అనసూయ అప్పటికే మరో గుమ్మం ముందు కింద కూర్చుని.. కుబేర్ ఫొటోకి ప్లాస్టర్ వేస్తూ ఉంటుంది. కుబేర్ ఫొటోని సగమే చూస్తున్న దాసు.. అది కుబేర్ ఫొటో అయ్యి ఉంటుందా? చూపించమని అడిగితే బాగోదు.. దీప ముందు అనసూయతో ఏం మాట్లాడలేను ఇప్పుడు ఎలా అని దాస్ అనుకుంటాడు. అమ్మా దీపా.. నలుగురికి వెలుగునిచ్చే పేరు నీది. ఈ పేరు నీకు ఎవరు పెట్టారమ్మా అని దాస్ అంటాడు.

Brahmamudi: పడి పడి నవ్విన కావ్య.. రాజ్ చేసిన ఆ పనికి రుద్రాణికి మంట!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి(Brahmamudi)'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-580 లో.. దుగ్గిరాల ఇంటికి క్యారేజ్ తీసుకొని వస్తుంది కావ్య. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర సీతారామయ్య, ఇందిరాదేవి కలిసి కావ్య తెచ్చిన ఇంటి భోజనం కూర్చొని తింటుంటారు. ఇంతలో రాజ్ వచ్చి.. మన కోసం బిర్యానీ ఆర్డర్ పెట్టాను. స్పైసీ బిర్యానీ అని చెప్తాడు. ఇక ఓ వైపు సీతారామయ్య, ఇందిరాదేవి , సుభాష్ కలిసి కావ్య తెచ్చిన భోజనం తింటుంటే.. రాజ్ తెచ్చిన బిర్యానీ ఒక్క మద్ద రుద్రాణి తినేసరికి అలానే ఆగిపోతారు. ఫుల్ స్పైసీగా ఉండటంతో రాజ్, రుద్రాణి ఇద్దరు ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటారు.