Brahmamudi: పడి పడి నవ్విన కావ్య.. రాజ్ చేసిన ఆ పనికి రుద్రాణికి మంట!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి(Brahmamudi)'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-580 లో.. దుగ్గిరాల ఇంటికి క్యారేజ్ తీసుకొని వస్తుంది కావ్య. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర సీతారామయ్య, ఇందిరాదేవి కలిసి కావ్య తెచ్చిన ఇంటి భోజనం కూర్చొని తింటుంటారు. ఇంతలో రాజ్ వచ్చి.. మన కోసం బిర్యానీ ఆర్డర్ పెట్టాను. స్పైసీ బిర్యానీ అని చెప్తాడు. ఇక ఓ వైపు సీతారామయ్య, ఇందిరాదేవి , సుభాష్ కలిసి కావ్య తెచ్చిన భోజనం తింటుంటే.. రాజ్ తెచ్చిన బిర్యానీ ఒక్క మద్ద రుద్రాణి తినేసరికి అలానే ఆగిపోతారు. ఫుల్ స్పైసీగా ఉండటంతో రాజ్, రుద్రాణి ఇద్దరు ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటారు.