English | Telugu

విజయ్ బిన్నీ ఎవరో కాదు.. నాగార్జునతో సినిమా తీసిన డైరెక్టర్

ఢీ షో 19 వ ఢీ జోడిగా రాబోతోంది. అంటే అన్నీ జోడీస్ ఇక్కడ డాన్స్ చేసి ఆడియన్స్ ని అలరించబోతున్నాయన్నమాట. ఐతే ఈ న్యూ సీజన్ కి జడ్జ్ గా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఎంట్రీ ఇచ్చారు. అది కూడా శేఖర్ మాష్టర్ ప్లేస్ లో. ఐతే విజయ్ బిన్నీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. విజయ్ బిన్నీ ఎవరో కాదు తెలుగులో అక్కినేని నాగార్జునతో కలిసి "నా సామి రంగ" మూవీని డైరెక్ట్ చేసిన డైరెక్టర్. నాగార్జునతో విజయ్ బిన్నీ ఫస్ట్ మూవీ ఇదే. ఐతే కొరియోగ్రాఫర్ కాస్త డైరెక్టర్ గా మారారు. ఇక నాగార్జున కొత్తదనం ఎక్కడ ఉంటె అక్కడ వాళ్ళను ఎంకరేజ్ చేస్తారు కాబట్టి విజయ్ బిన్నీ ని ఎంకరేజ్ చేశారు.

అమ్మా నువ్వు లేని జీవితం ఏమీ బాలేదు

 బిగ్ బాస్ సీజన్ 5లో శ్వేతా వర్మ గురించి అందరికీ తెలిసిందే. ఐతే  ఆమె సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.  '2017 డిసెంబర్ 2 తెల్లవారుజామున   2:35 గంటలకు  నన్ను వదిలేసి మా అమ్మ భగవంతుడి దగ్గరకు వెళ్ళిపోయింది' అంటూ ఆమె తన తల్లిని గుర్తు చేసుకుంటూ పోస్ట్ పెట్టింది. 'నీ తోడు, నీ నీడ  నాకు దేవుడు ఇచ్చిన బహుమతి. నీలాంటి వాళ్లు ఎప్పటికీ నాకు దొరకరు. నేను, నాన్న నిన్ను చాలా మిస్ అవుతున్నాం. నువ్వు ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. నువ్వు లేకుండా జీవితం ఏం బాలేదు' అని భావోద్వేగానికి లోనైంది శ్వేతా వర్మ. అని మరో పోస్ట్ పెట్టింది శ్వేత. దీంతో పలువురు బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శ్వేతా వర్మకు ధైర్యం చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు.

Karthika Deepam2 : దీపే అసలైన వారసులైన విషయం తెలుసుకున్న జ్యోత్స్న.. ఏం చేయనుంది?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'( karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -217 లో..... పారిజాతం ఇంటికి దాస్ వచ్చి సుమిత్ర దశరథ్ లు ఉన్నారా అని.. అడుగగా వాళ్ళ తో నీకేం పని.. వాళ్లు ఊళ్ళో లేరని శివన్నరాయణ తిట్టి పంపిస్తాడు. ఇతను ఎందుకు వాళ్ళ గురించి అడుగుతున్నాడని జ్యోత్స్న తన వెనకాలే వెళ్లి మా మమ్మీ డాడ్ లని ఎందుకు కలవాలనుకుంటున్నావు.. ఆ కుబేర్ ఫోటో పట్టుకొని ఎందుకు తిరుగుతున్నావంటూ జ్యోత్స్న అడుగుతుంది. నాకు నిజం తెలిసింది అందుకే అని దాస్ అనగానే.. ఏం నిజమని జ్యోత్స్న అడుగుతుంది.