English | Telugu

వాట్సాప్ గ్రూప్ లో ఇంతమంది పెళ్లిళ్లు చేసేసుకున్నారా ? 

మింగిల్ కావొద్దు మావా సింగల్ లైఫ్ చాలా బాగుంటుంది...సోలో బతుకే సో బెటరు లాంటి కామెంట్స్ వింటూ ఉంటాం.. సింగల్ లైఫ్ మీద పాటలు కూడా ఎన్నో ఉన్నాయి. ఐతే మన ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది సింగిల్స్ ఉన్నారు. సోలో లైఫ్ అనుకోండి అంతకంటే హ్యాపీ లైఫ్ అనేది ఇంకోటి ఉండదు అనుకుంటారంతా. ఇండస్ట్రీలో హీరో నవదీప్ కూడా ఎప్పుడూ ఇదే మాట అంటూ ఉంటాడు. ఇలా సింగిల్స్ ఉన్న ఫొటోస్, వీడియోస్ వంటివే ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటాడు. అలా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది సింగిల్స్ కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారు. దానికి సంబంధించి  రీసెంట్ గా ఒక పిక్ పోస్ట్ చేసాడు. అందులో ఒక ఇంటరెస్టింగ్ పాయింట్ ఉంది.

Ticket to Finale: సెకెంఢ్ కంటెండర్ గా అవినాష్.. షాక్ లో కన్నడ బ్యాచ్!

బిగ్ బాస్ సీజన్-8 లో కంటెస్టెంట్స్ ఆటతీరు రోజు రోజుకి పెరుగుతుంది. ఇందులో ముఖ్యంగా కన్నడ బ్యాచ్ గ్రూపిజానికి చెక్ వేస్తూ మొన్న రోహిణి, నిన్న అవినాష్ గుణపాఠం చెప్పారు. వీళ్లు కమెడియన్స్.. ఏదో ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వడానికి తప్పితే ఎందుకు పనికిరారు. ముఖ్యంగా ఫిజికల్‌ గేమ్‌లలో అస్సలు ఆడలేరు. ఏదో అదృష్టం కలిసి వచ్చి హౌస్‌లో ఉంటున్నారు తప్పితే.. టోటల్‌గా వీళ్లు జీరో.. ఇవీ అవినాష్, రోహిణి, తేజాలను ఉద్దేశించి కన్నడ అండ్ కో బ్యాచ్‌లోని పృథ్వీ అన్నాడు. అయితే జీరో అన్న నోటితోనే హీరో అనిపించుకుని.. పృథ్వీ అహంకారాన్ని తన విజయంతోనే సమాధి చేసింది రోహిణి. బిగ్ బాస్ హౌస్‌కి చివరి మెగా చీఫ్ కావడమే కాకుండా.. వరుసగా రెండు టాస్క్‌లలో గెలిచి టికెట్ టు ఫినాలే ఫస్ట్ కంటెండర్ అయ్యింది.

కావ్యశ్రీని పటాయిస్తున్న సుడిగాలి సుధీర్

ఫామిలీ స్టార్స్ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో బుల్లితెర స్టార్స్ అంతా సందడి చేశారు. అమర్ దీప్, తేజస్విని గౌడ, రీతూ చౌదరి, మానస్, భానుశ్రీ, కావ్య, అష్షు రెడ్డి, భోలే షావలి, వర్ష, పాగల్ పవిత్ర వంటి వాళ్లంతా వచ్చి ఎంటర్టైన్ చేశారు. ఇక షో ఎంట్రీలో ఒక్కో లేడీ స్టార్ గురించి షో హోస్ట్ సుడిగాలి సుధీర్ తెగ బిల్డప్ ఇచ్చాడు. ఇక ఈ షోలో గోరింటాకు సీరియల్ తో మంచి పేరు తెచ్చుకున్న కావ్యశ్రీని పటాయించాడు సుడిగాలి సుధీర్. ఇటు రండి అంటూ కావ్యశ్రీని స్పెషల్ గా పక్కకు తీసుకెళ్లి తన చేతిలోని సెల్ ని విసిరిపారేసాడు.

Eto Vellipoyindhi Manasu : విడాకులు పంపిన భార్య.. వారం గడువు అడిగిన భర్త

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -264 లో....రామలక్ష్మి పంపినట్లు విడాకుల నోటిస్ శ్రీలత ప్లాన్ చేసి పంపిస్తుంది. సీతాకాంత్ టిఫిన్ చేస్తుంటే కొరియర్ వస్తుంది. అందులో విడాకుల నోటిస్ చూసి సీతాకాంత్ షాక్ అవుతాడు. రామలక్ష్మి నాకు విడాకులు ఇవ్వాలనుకుంటుందని చెప్తాడు. దాంతో దొరికింది టైమ్ అనుకొని శ్రీలత వాళ్లు రామలక్ష్మిపై చెడుగా చెప్తారు. అక్కకి ఆస్తులతో అవసరం కానీ బావ గారి ప్రేమ అవసరం లేదని శ్రీవల్లి అంటుంది. అసలు అన్నయ్యని వదినా ఇలా మోసం చెయ్యడమేంటని సందీప్ అంటాడు. దాంతో సీతాకాంత్ కోపంగా రామలక్ష్మి దగ్గరికి బయలుదేర్తాడు. వెళ్తూ రామలక్ష్మితో ఉన్నా జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటాడు.

పాపం రాకేష్ ..సుజాత దెబ్బలకు భయపడిపోతున్నాడు

సుమ అడ్డా షో ప్రతీ వారం ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి కపుల్స్ వచ్చి ఫుల్ జోష్ తో ఎంటర్టైన్ అయ్యారు అందరినీ ఎంటర్టైన్  చేశారు. లాస్య - మంజునాథ్, రాకేష్ - సుజాత, జ్యోతక్క - గంగులు జంటలుగా వచ్చారు. ఐతే వీళ్లకు రకరకాల టాస్కులు ఇచ్చింది. ఎలా అంటే పుట్టినరోజులు, పెళ్లిరోజులు, మొదటిసారి కలిసి చూసిన సినిమా ఇలా అన్న మాట. ఐతే జ్యోతక్క అన్నీ తప్పులు చెప్పేసరికి గంగులు దబిడి దిబిడి బాదేశాడు. ఇక లాస్య ఆన్సర్ చెప్పడం లేట్ అయ్యేసరికి మంజునాథ్ లాస్య బుగ్గలు పుణికాడు. ఇక అప్పుడు గంగులు సుమని ఒక ఆఫర్ ఇవ్వాలని అడిగాడు లేడీస్ తప్పులు జెంట్స్ కొట్టుకోమంటారా అని అడిగాడు.