టాలీవుడ్ లో విషాదం.. కమెడియన్ అల్లు రమేష్ కన్నుమూత!
టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. నటుడు అల్లు రమేష్ కన్నుమూశారు. 53 ఏళ్ళ రమేష్ మంగళవారం నాడు విశాఖపట్నంలోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. నాటక రంగం నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టిన రమేష్.. 'నెపోలియన్', 'మధుర వైన్స్', 'తోలుబొమ్మలాట', 'రావణ దేశం' వంటి సినిమాల్లో నటించారు.