English | Telugu

'విరూపాక్ష' ముందు భారీ టార్గెట్!

సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ 'విరూపాక్ష'. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా విజయాన్ని సాధించాలంటే భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాల్సి ఉంది.

సాయి ధరమ్ తేజ్ చివరి చిత్రం 'రిపబ్లిక్' బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలైనప్పటికీ.. 'విరూపాక్ష' బిజినెస్ భారీగానే జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ రూ.20 కోట్లకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. నైజాంలో రూ.7 కోట్లు, సీడెడ్ లో రూ.4 కోట్లు, ఆంధ్రాలో రూ.9 కోట్లకు అమ్ముడైన విరూపాక్ష.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.20 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇక కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియా రూ.1.50 కోట్లు, ఓవర్సీస్ లో రూ.1.50 కోట్లు కలిపి.. వరల్డ్ వైడ్ గా రూ.23 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందట. అంటే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలవాలంటే కనీసం రూ.24 కోట్ల షేర్ రాబట్టాల్సింది ఉంది.

'విరూపాక్ష' సాయి తేజ్ కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా నిలిచింది. మీడియం రేంజ్ హీరో నటించిన థ్రిల్లర్ సినిమాకి ఈ స్థాయి బిజినెస్ జరగడం విశేషమే. రూ.33 కోట్లకు పైగా షేర్ రాబట్టి ఇప్పటిదాకా సాయి తేజ్ కెరీర్ లో కలెక్షన్స్ పరంగా 'ప్రతిరోజూ పండగే' టాప్ లో ఉంది. మరి 'విరూపాక్ష' కూడా ఆ స్థాయి వసూళ్లు రాబట్టి సత్తా చాటుతుందేమో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .