చంద్రబాబు పేరు చెప్పాలని బెదిరిస్తున్నారు.. మత్తయ్య
తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్టీవెన్ సన్ కు లంచం ఇస్తూ దొరికిపోయిన నేపథ్యంలో చంద్రబాబును ఏలాగైనా ఇరికించాలని చూస్తున్నారని ఈ కేసులో నాలుగో నిందితుడైన జెరూసలేం మత్తయ్య ఆరోపించారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు ప్రమేయం ఉందని చెప్పాలని, లేకపోతే థర్డ్ డిగ్రీ ఉపయోగించైనా చెప్పిస్తామని బెదిరిస్తున్నారని మత్తయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలిండియా దళిత క్రైస్తవ సమాఖ్య కార్యదర్శి బాధ్యతగా స్టీవెన్ సన్ దగ్గరకు వెళ్లానని అంతేకాని . ఏసీబీ అధికారులు, మీడియా ప్రతినిధులు ప్రతి 5 నిమిషాలకొకసారి ఫోన్ చేసి బెదిరిస్తున్నారని, నిన్ను కేసు నుంచి తప్పిస్తాం.. అంతే కాదు రూ. 10 లక్షల నుండి 15 లక్షల వరకు ఇస్తామని ప్రలోభపెడుతున్నారని తెలిపారు. చంద్రబాబు, రేవంత్ లపై ఉన్న వారి కోపానికి నన్ను బలిపశువును చేస్తున్నారని వాపోయారు.