బ్లాక్ మెయిల్ చేసినా బెదిరేది లేదు.. చంద్రబాబు
posted on Jun 5, 2015 @ 6:54PM
ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీల నేరవర్పు గురించి నేనొకటి చెబితే ఓ వార్తా పత్రికా దాన్ని వేరేలా రాసి దుర్మార్గంగా వక్రీకరించిందని చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. శీలంవారిపేటలో నిర్వహించిన జన్మభూమి- మాఊరు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రం విడిపోయి ఆర్ధికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నట్టు మేము చెబితే హామీలు అమలు కష్టసాధ్యమన్నట్టుగా రాశారని మండిపడ్డారు. పేదవారు ప్రమాదంలో చనిపోతే రూ.9లక్షల భీమా ఇప్పించనున్నట్లు స్పష్టం చేశారు. కాగా గ్రామంలో పనులేమి సరిగా జరగడంలేదని గ్రామస్తులు సీఎంకు ఫిర్యాదు చేయగా సీఎం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల పనులు జరగపోతే సహించేది లేదని హెచ్చరించారు. తమపై కొంత మంది కేసులు పెడతామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అలాంటి వాటికి భయపడేది లేదని చంద్రబాబు అన్నారు.