చంద్రబాబును అరెస్ట్ చేసే ధైర్యం ఎవరికీ లేదు... పరకాల

నోటుకు ఓటు కేసులో ఎలాగైనా సీఎం చంద్రబాబును ఇరికించాలని గట్టి ప్రయత్నమే చేస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. నిన్న రాత్రి చంద్రబాబు సంభాషణల ఆడియో టేపును బయటపెట్టడం.. అది కూడా తన సొంత ఛానల్ అయిన టీ న్యూస్ లో ప్రసారం చేయడం దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఈ పనికి ఏపీ ప్రభుత్వం నిప్పులు చెరుగుతోంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ ఎక్కడెక్కడో మాటలన్నీ గుచ్చి చంద్రబాబు మాటలంటున్నారని.. అసలు ఆ ఆడియోలో ఉన్నది చంద్రబాబు గొంతు కాదని టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా నీచంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. అన్ని సాక్ష్యాలు కోర్టుకు సమర్పించినప్పుడు ఈ సంభాషణ ఎక్కడి నుండి వచ్చిందని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబును ఏం చేయలేరని, ఆయనను అరెస్ట్ చేసే ధైర్యం ఎవరికి లేదని స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడి మొదటి వారికోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో కావాలనే ఈ టేపును విడుదలచేశారని అయినా తమ సభ జరుగుతుందని, తమ సంకల్పం బలపడుతుందని అన్నారు.

రేవంత్ బెయిల్ పిటిషన్ విచారణ బుధవారానికి వాయిదా

  నోటుకు ఓటు కేసులో రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. మొన్న జరిగిన రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణలో కోర్టు ఈరోజు కౌంటర్ దాఖలు చేయమని ఏసీబీ అధికారులను ఆదేశించింది. అయితే ఈ పిటిషన్ పై ఏసీబీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో కోర్టు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెయిల్ పిటిషన్ పై విచారణను బుధవారానికి వాయిదా వేసింది. మరోవైపు రేవంత్ రెడ్డికి కనీస సౌకర్యాలు కల్పించట్లేదని అతని తరపు న్యాయవాది పిటిషన్ వేయగా ఏసీబీ అధికారులు దీనికి స్పందించి ఆయనకు అన్ని సౌకర్యాలు అందిస్తున్నామని నివేదికను సమర్పించారు.

రేవంత్ రెడ్డి మూడోరోజు కస్టడీ.. జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్నరేవంత్

  నోటుకు ఓటు కేసు నేపథ్యంలో రేవంత్ రెడ్డి మూడో రోజు ఏసీబీ కస్టడీలో ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డికి జ్వరం, గొంతునొప్పితో ఆరోగ్యం సరిగా లేకపోవడంవలన పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఏసీబీ రేవంత్ రెడ్డిని విచారించనుంది. అయితే రేవంత్ రెడ్డికి సరైన సౌకర్యాలు కల్పించాలని కోర్టు ఆదేశించినా అవేమి పట్టించుకోవట్లలేదని, రేవంత్ కు సరైన సౌకర్యాలు కల్పించాలని అతని తరపు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ వాయిదా పడిన నేపథ్యంలో ఈ రోజు ఏసీబీ అధికారులు కోర్టులో కౌంటర్ దాఖలు చేయనున్నారు.

సీఎం క్యాంపు కార్యలయం ప్రారంభించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని భూమి పూజ రోజు జరగాల్సిన సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు ఉదయం విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. విజయవాడలో ఉన్న ఇరిగేషన్‌ క్యాంప్‌ కార్యాలయాన్నే ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా సీఎం క్యాంప్‌ ఆఫీస్‌గా మార్చారు. ఈ కార్యక్రమానికి మంత్రులు యనమల రామకృష్ణ, దేవినేని ఉమ, కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే బాలకృష్ణ, సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

కడప విమానశ్రయానికి అన్నమయ్య పేరు

    కడప విమానశ్రయం ప్రారంభించబోతున్నట్లు వార్తలు వెలువడగానే, దానికి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టాలంటూ వైకాపా డిమాండ్ చేసింది. కానీ దానికి సుప్రసిద్ద వాగ్గేయకారుడు అన్నమయ్య పేరు పెట్టామని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ వ్రాయనున్నట్లు నిన్న విమానశ్రయాన్ని ఆరంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కడప విమానశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయనతో బాటు కేంద్రమంత్రులు అశోక్‌గజపతిరాజు, వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతోనే కడప జిల్లా ప్రజల కోరిక నెరవేరిందన్నారు. త్వరలోనే కడప నుంచి చెన్నై, తిరుపతి, హైదరాబాద్‌లకు కూడా విమానాలు నడిపేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో పరిశ్రమలు స్థాపనకు ఈ విమానాశ్రయం ఎంతో ఉపయోగవచ్చని ఆయన అన్నారు. అనంతరం కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ కడప విమానాశ్రయం నుండి ఏ 320 విమానాలు నడిపేందుకు కూడా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.   కడప విమానాశ్రయం ఆరంభం అవడం వలన కడప జిల్లా వాసులకు చాలా సౌకర్యం ఏర్పడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ వారందరి కంటే ఎక్కువగా వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, జిల్లాకు చెందిన వైకాపా నేతలకే ఎక్కువ ఉపయోగపడుతుందని చెప్పవచ్చును. హైదరాబాద్, కడప, బెంగుళూరుల మధ్య తరచుగా తిరిగే జగన్మోహన్ రెడ్డికి ఈ విమాశ్రయం ప్రారంభం కావడం చాలా సౌకర్యం కలిగించిందని భావించవచ్చును. ముఖ్యమంత్రి ప్రారంభించిన కడప విమానాశ్రయం, ఆయనను, రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ద్వేషించే, విమర్శించే జగన్మోహన్ రెడ్డికే ఎక్కువగా ఉపయోపడటం చాలా విచిత్రమే.

వైకాపాలో చేరిన బొత్స అండ్ కో.

  ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఆయన భార్య బొత్స ఝాన్సీ రాణి ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ వైకాపా కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరారు. వారితో బాటు మాజీ శాసనసభ్యులు బొత్స అప్పల నరసయ్య, అప్పలనాయుడు, డీసీసీబీ చైర్మన్ తులసి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నెలాఖరులోగా బొత్స సత్యనారాయణ విజయనగరంలో ఒక భారీ బహిరంగ ఏర్పాటు చేసి దానికి జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించి ఆయన సమక్షంలోనే మరికొంతమంది కాంగ్రెస్ నేతలను, పార్టీ కార్యకర్తలను వైకాపాలో చేర్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

లైపోసక్షన్ వల్లే ఆర్తి మృతి?

హీరోయిన్ ఆర్తి అగర్వాల్ అమెరికాలోని అట్లాంటిక్ సిటీ న్యూజెర్సీలో గుండెపోటు కారణంగా మరణించినట్టు ఆమె మేనేజర్ ప్రకటించినప్పటికీ ఆమె శరీరంలోని అధిక కొవ్వును తగ్గించుకునే లైపోసక్షన్ శస్త్ర చికిత్స విఫలం కావడం వల్లే మరణించి వుండవచ్చన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. లైపోసక్షన్ శస్త్ర చికిత్స విఫలం అయితే గుండెపోటు రావడం జరుగుతూ వుంటుందని వైద్యులు చెబుతున్నారు. మొదటి సినిమా ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చిన ఆర్తి అగర్వాల్ తెలుగు పరిశ్రమలోని అగ్ర కథానాయకులతోపాటు యువ కథానాయకుతో నటించినా తన స్టార్‌డమ్‌ని ఎక్కువకాలం నిలుపుకోలేకపోయారు. ప్రేమ విఫలం, రెండుసార్లు ఆత్మహత్యాయత్నం, వైవాహిక జీవిత వైఫల్యంతోపాటు బాగా పెరిగిపోయిన శరీర బరువు ఆమెను మానసికంగా కృంగదీశాయి. తన కెరీర్‌ని కొనసాగించడానికి ఆమె చిన్న చిన్న సినిమాలలో నటించడానికి కూడా అంగీకరించారు. ఇప్పుడు ఈ దుర్వార్త వినాల్సి వచ్చింది.

షాకింగ్ న్యూస్‌ ఆర్తి అగ‌ర్వాల్ మృతి

క‌థానాయిక ఆర్తి అగ‌ర్వాల్ (31) క‌న్ను మూసింది. అమెరికాలోని న్యూజెర్సీ ఆసుప‌త్రిలో చికిత్స‌పొందుతూ.. ఆర్తి మృతి చెందింది. ఆర్తి కొంత‌కాలంగా శ్వాస‌కోస సంబంధ‌మైన వ్యాధితో బాధ‌ప‌డుతోంద‌ని తెలుస్తోంది. అయితే ఇది ఆత్మ‌హ‌త్య అని చెబుతున్న‌వాళ్లూ ఉన్నారు. గ‌తంలో ఓసారి ఆర్తి ఆత్మ‌హ‌త్యాప్ర‌య‌త్నం కూడా చేసింది. ఆర్తి మ‌ర‌ణం చిత్ర‌ప‌రిశ్ర‌మ‌ను క‌ల‌చివేసింది. నువ్వునాకున‌చ్చ‌వ్‌, ఇంద్ర‌, అందాల రాముడు, నువ్వులేక నేనులేనులాంటి హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఒక‌ట్రెండు సినిమాలూ ఆమె చేతిలో ఉన్నాయి. ఆర్తి మ‌ర‌ణంతో ప‌రిశ్ర‌మ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది.

రేవంత్ ను వ్యూహాత్మకంగా విచారిస్తున్న ఎసిబి

ఓటుకు నోటు కేసులో అరెస్టు అయిన టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఎసిబి అధికారులు వ్యూహాత్మకంగా విచారిస్తున్నట్లు సమాచారం. రేవంత్ ను ఎసిబి ఆఫీస్ లో విచారిస్తున్నారని అందరూ అనుకున్నారు కానీ ఆయనను చర్లపల్లి జైలులోనే విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో సహ నిందితులు సెబాస్టియన్, ఉదయసింహ లను మాత్రమే ఎసిబి ఆఫీస్ కి తీసుకెళ్ళిన అధికారులు, రేవంత్ ని మాత్రం జైలులోనే విచారించడం ముందస్తూ వ్యూహంగా తెలుస్తోంది. రేవంత్ తరపు న్యాయవాదులు తమకు సమాచారం ఇవ్వకుండా ఎసిబి అదికారులు విచారణ చేస్తున్నారంటూ ఎసిబి ఆఫీస్ ఎదుట ఆందోళనక దిగారు. రేవంత్ ఎసిబి ప్రశ్నలకు ఎలా సమాధానాలు చెబుతారన్నది ఉత్కంఠగా మారింది.

40 ఎకరాలు భూమి విరాళం ఇచ్చిన అశ్వినీ దత్త్

  ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీ దత్త్ గన్నవరం మండలంలో కేసరపల్లి గ్రామంలో తన 40ఎకరాల వ్యవసాయ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేసారు. గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గన్నవరం మండలంలో సుమారు 550ఎకరాల భూములను సేకరించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. దాని కోసమే అశ్వినీ దత్త్ తన 40ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చేరు. ఆయన ఈరోజు జిల్లా ఆర్.డి.ఓ.ని కలిసి ఆ భూమి తాలూకు యాజమాన్య పత్రాలను అందజేశారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో రాజకీయ నేతలు అందరూ కూడా ముందుకు వచ్చి సహకరిస్తే ప్రజలు కూడా హర్షిస్తారు.

ఒంగోలు గిత్తలతో అరక దున్నిన బాబు

నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు భూమి పూజ నిర్వహించారు.అనంతరం ఒంగోలు గిత్తలతో అరక దున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నవ ధాన్యాలు చల్లారు. వేదపండితుల మంత్రోఛ్చారణల మధ్య శాస్ర్తోక్తంగా పూర్ణాహుతి కార్యక్రమం సాగింది. వైదిక సంప్రదాయం ప్రకారం వేదపండితులు పూజలు చేశారు. చంద్రబాబు సంప్రదాయ దుస్తుల్లో చంద్రబాబు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు కుటుంబసభ్యులతో పాటు కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, సుజనా చౌదరి, ఏపీ సభాపతి కోడెల శివప్రసాద రావు, రాష్ట్ర మంత్రులు, తదితరులు పాల్గొన్నారు.

నిర్మాత‌కి స్టార్ ఇమేజ్ తెచ్చిన రామానాయుడు

డి.రామానాయుడుకి ముందు.. డి.రామానాయుడు త‌రువాత‌.. ఇదీ తెలుగు సినిమా నిర్మాత‌ల‌కి సంబంధించి చెప్పుకోవాల్సివ‌స్తే ప్ర‌ముఖంగా చెప్పుకోవ‌ల‌సిన మాట‌. అంత‌గా త‌న‌దైన ముద్ర‌ను నిర్మాణ రంగంలో వేసారు రామానాయుడు. నాణ్య‌త ఉన్న సినిమాల‌ను నిర్మించ‌డ‌మే కాదు.. ఎన్నో ఘ‌న‌విజ‌యాల‌ను అందించి నిర్మాత‌గా స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు ఈ మెగా ప్రొడ్యూస‌ర్‌. ఐదు ద‌శాబ్దాల పాటు నిర్మాణ రంగంలో ఎన్నో అద్భుతాల‌కు చిరునామాగా నిలిచిన రామానాయుడు జ‌యంతి నేడు (జూన్ 6). ఈ సంద‌ర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని విష‌యాల‌ను స్మ‌రించుకునే ప్ర‌య‌త్నం ఇది. రైతు బిడ్డ నుంచి నిర్మాత వ‌ర‌కుః ప్ర‌కాశం జిల్లా కారంచేడు గ్రామంలో జూన్ 6, 1936న జ‌న్మించారు రామానాయుడు. వ్య‌వ‌సాయ కుటుంబానికి చెందిన రామానాయుడు.. సినిమాల‌పై ఉన్న ఇష్టంతో 1965లో ఎన్టీఆర్ న‌టించిన రాముడు - భీముడు చిత్రంతో సోలో ప్రొడ్యూస‌ర్‌గా అడుగులు వేశారు. 1971లో వ‌చ్చిన ప్రేమ‌న‌గ‌ర్‌తో  ఇక వెనుక‌కు చూడ‌వ‌ల‌సిన ప‌రిస్థితి లేకుండా భారీ విజ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్నారు.  1965 నుంచి 2014 వ‌ర‌కు త‌న బ్యాన‌ర్‌లో  దాదాపు 50 ఏళ్ల పాటు సినిమాల‌ను అందించారాయ‌న‌. ఈ 50 ఏళ్ల‌లో నాలుగైదు సంద‌ర్భాల్లో మిన‌హాయిస్తే ప్ర‌తి ఏడాదిలోనూ త‌న‌ సినిమాల‌తో సంద‌డి చేశారు. ఒక్కో ఏడాదిలో అయితే ఐదారు సినిమాల‌ను నిర్మించిన ట్రాక్ రికార్డూ ఉంది. రికార్డులు రివార్డులు అవార్డులు అత్య‌థిక సంఖ్య‌లో సినిమాల‌ను నిర్మించిన నిర్మాత‌గా గిన్నిస్‌బుక్ ఆఫ్ వ‌రల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కిన రామానాయుడు..  మ‌రెవ‌రికి సాధ్యం కాని విధంగా 13 భాష‌ల్లో సినిమాల‌ను ప్రొడ్యూస్ చేసి త‌న పేరిట మ‌రో రికార్డును సొంతం చేసుకున్నారు. దాదాపు అన్ని భాష‌ల్లోనూ విజ‌యాల‌ను సొంతం చేసుకున్నారు.   ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును, ప‌ద్మ భూష‌ణ్ పుర‌స్క‌రాన్ని త‌న సొంతం చేసుకున్నారు. స్టార్స్ ప్రొడ్యూస‌ర్ రామారావు, నాగేశ్వ‌ర‌రావు, కృష్ణ‌, శోభ‌న్‌బాబు, కృష్ణంరాజు.. ఇలా ఓ త‌రంలోని టాప్ హీరోలంద‌రితోనూ సినిమాల‌ను నిర్మించి హిట్స్‌ను కైవ‌సం చేసుకున్న రామానాయుడు.. త‌రువాత త‌రంలోని స్టార్ హీరోలైన చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్‌ల‌తోనూ సినిమాల‌ను తీసి స‌క్సెస్‌ల‌ను అందిపుచ్చుకున్నారు.  స్టార్స్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నారు. స్టార్ ప్రొడ్యూస‌ర్‌ స్టార్ హీరోల‌తో సినిమాలు తీసి మెప్పించ‌డ‌మే కాదు.. నూత‌న న‌టీన‌టుల‌ను ప‌రిచ‌యం చేస్తూ ఆయ‌న కొన్ని సినిమాల‌ను నిర్మించారు. హ‌రీష్‌, మాలాశ్రీ‌ల‌ను హీరోహీరోయిన్లుగా ప‌రిచ‌యం చేస్తూ నిర్మించిన  ప్రేమ‌ఖైదీ చిత్రం అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. స్టార్‌ల‌ను కాకుండా క‌థ‌ల‌ను న‌మ్మి ఆయ‌న సినిమాలు తీసేవారు. అందుకే ఆయ‌న నిర్మించిన సినిమాల్లో సింహ‌భాగం విజ‌య‌ప‌థంలో ప‌య‌నించాయి.  ఎంతో మంది కొత్త న‌టీన‌టులును, సాంకేతిక‌నిపుణుల‌ను ప‌రిచ‌యం చేయ‌డ‌మే కాకుండా.. వారిలో చాలా మందిని స్టార్స్‌గా మ‌లిచిన ఘ‌న‌త కూడా ఉన్నందున స్టార్ ప్రొడ్యూస‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు రామానాయుడు. న‌ట‌నా కోణం నిర్మాత‌గా ఎన్నో ఘ‌న‌విజ‌యాల‌ను సొంతం చేసుకున్న రామానాయుడు.. న‌టన మీద ఆస‌క్తితో కొన్ని సినిమాల్లో చిరు పాత్ర‌ల‌ను పోషించారు. మ‌రి కొన్ని సినిమాల్లో క‌థ‌ను కీల‌క మ‌లుపు తిప్పే పాత్ర‌ల్లోనూ మెప్పించారు. హోప్ సినిమా కోసం పూర్తినిడివి ఉన్న పాత్ర‌ను చేసి అల‌రించారు. నాయుడుగారి కుటుంబం - సినిమాకే అంకితం  సినిమాల‌పై త‌న‌కున్న ప్రేమ‌ను త‌న వ‌ర‌కే ప‌రిమితం చేసుకోలేదు రామానాయుడు. త‌న కొడుకుల‌ను, మ‌న‌వ‌ళ్ల‌ను సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేసారు. రామానాయుడు పెద్ద కుమారుడు డి.సురేష్‌బాబు నిర్మాత‌గా తండ్రి అడుగుజాడ‌ల్లోనే న‌డిస్తే.. మ‌రో త‌న‌యుడు వెంక‌టేష్ క‌థానాయ‌కుడుగా అగ్ర‌స్థానానికి చేరుకున్నాడు. ఇక మూడోత‌రంలో రామానాయుడు మ‌న‌వ‌ళ్లు రానా, నాగ‌చైత‌న్య క‌థానాయ‌కులుగా త‌మ‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకునే ప్ర‌యత్నం చేస్తున్నారు. నిర్మాత‌గా స్టార్ డ‌మ్‌ని సొంతం చేసుకున్న రామానాయుడు  ఫిబ్ర‌వ‌రి 18, 2015న క‌న్నుమూశారు.  నిర్మాత‌కు స్టార్‌డ‌మ్ ని తీసుకువ‌చ్చిన ఆయ‌న లాంటి  నిర్మాత‌ బ‌హుశా మ‌ళ్లీ పుట్ట‌క‌పోవ‌చ్చు.

నిర్విగ్నంగా సాగుతున్న అమరావతి భూమిపూజ

  ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి భూమి పూజా కార్యాక్రమాలు తుళ్ళూరు మండలంలో మండడం గ్రామంలో సర్వ్ నెంబర్స్:135,136లలో ఈరోజు తెల్లవారు జామున సుమారు 4.30గంటల నుండే ప్రారంభం అయ్యాయి. వైఖానస ఆగమనశాస్త్రంలో దిట్ట నల్లూరు విఖనస భట్టాచార్యులు, దాశరధి శ్రీనివాసా దీక్షితుల నేతృత్వంలో మొదట స్థల శుద్ధి కార్యక్రమం నిర్వహించిన తరువాత వరుసగా విఘ్నేశ్వర పూజ, కలశ, ఆగారం, విష్వక్సేన, అష్ట దిక్పాల, నవగ్రహ, నాగేటి పూజలు, వాస్తు పురుష పూజ, గోపూజ, వృషభ పూజ నిర్వహిస్తున్నారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన భార్య భువనేశ్వరితో కలిసి మరి కొద్ది సేపటిలో అంటే 8.49నిమిషాలకు భూమి పూజ చేసి అనంతరం హల పూజలో భాగంగా భూమి పూజ చేసిన అ ప్రాంతానికి దక్షిణం నుంచి ఉత్తరం వైపుకు నేలను దున్ని పూజా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. చంద్రబాబు స్వయంగా అరకపట్టి నేలను దున్నుతుంటే ఆయన అర్ధాంగి భువనేశ్వరి స్వయంగా విత్తనాలు చల్లుతారు.   ఇదివరకు రాజులు తమ రాజ్యాలను స్థాపించే ముందు తమ రాజ్యంలో ప్రజలు అందరూ భోగ భాగ్యాలతో, పాడిపంటలతో కలకాలం సుఖంగా, సంతోషంగా ఉండేందుకుగాను ఈవిధంగానే ముందుగా అన్ని పూజలు నిర్వహించిన తరువాత భూమిని దున్ని విత్తనాలు చల్లేవారని చరిత్రలో పేర్కొనబడింది. అందుకే చంద్రబాబు నాయుడు దంపతులు కూడా వేదపండితులు సూచించిన విధంగా ఈ కార్యక్రమాలన్నీ అన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. హలపూజ తరువాత దంపతులిరువురూ వేద పండితులకు ఘనంగా సంభావన ఇచ్చి వారి ఆశీర్వచనం పొందుతారు.

జయలలిత కోర్టు కేసుల బిల్లు జయకే

  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసు సుమారు గత రెండు దశాబ్దాలుగా కర్నాటక రాష్ర్టంలో సాగింది. తమిళనాడులో విచారణ జరిగితే కోర్టు తీర్పుపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది కనుక పొరుగు రాష్ట్రమయిన కర్ణాటకలో జరపాలని జయలలిత అభ్యర్ధన మేరకే ఆమె కేసు అక్కడికి బదిలీ అయ్యింది. ఏళ్ల తరబడి ప్రత్యేకకోర్టులో ఆ తరువాత కర్నాటక హైకోర్టులో సాగిన కేసుల నుండి ఆమె చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు ఎలాగో బయటపడి మళ్ళీ తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీలో సెటిల్ అయిపోయి చాలా కులాసాగా రాష్ట్రాన్ని తనదైన శైలిలో పరిపాలించుకొంటున్నారు. కానీ ఇన్నేళ్ళుగా ఆమె కేసు జరుగుతున్నప్పుడు తమ ప్రభుత్వం సుమారు రూ.5 కోట్లు పైనే ఖర్చు పెట్టిందని దానిని చెల్లించమని కోరుతూ కర్ణాటక ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వానికి ఒక లేఖ వ్రాసింది.   అయితే కర్నాటక హైకోర్టు తనను నిర్దోషిగా ప్రకటించి కేసుల నుండి విముక్తి చేస్తే అందుకు సంతోషించవలసిన కర్నాటక ప్రభుత్వం, ఊరుకోకుండా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో చేయబోతున్నప్పుడు అది పంపిన బిల్లును జయలలిత చెల్లిస్తారా? ఒకవేళ చెల్లిస్తే ఆమెకు సుప్రీంకోర్టుకి ఈడ్చినందుకు కూడా మున్ముందు బిల్లు చెల్లించమని అడుగుతుందేమో కూడా? ఒకవేళ ఆమె ఇప్పుడు చెల్లించకపోతే ఆమె నుండి ఆ డబ్బు వసూలు చేసుకోవడానికి కర్నాటక ప్రభుత్వం మరొక కొత్త కేసు వేస్తుందేమో? దానికి కూడా జయలలితనే బిల్లు చెల్లించమని అడిగినా ఆశ్చర్యం లేదు.ఆ లెక్కన జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టు కేసుల బిల్లును ఆయనకే పంపించాలేమో?