ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర షురూ!

గణేష్ చతుర్థి నుంచి భక్తుల పూజలందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర శనివారం (సెప్టెంబర్ 6) ఉదయం ప్రారంభమైంది. 69 అడుగుల ఎత్తు, 50 టన్నుల బరువు ఉన్నవిశ్వశాంతి మహాశక్తి మహాగణపతిని  గంగమ్మ ఒడిలోకి చేర్చేందుకు ఎస్టీసీ ట్రాన్స్ పోర్టుకు చెందిన26 టైర్ల  ప్రత్యేక వాహనం ఏర్పాటు చేశారు.   100 టన్నుల బరువును మోయగల సామర్థ్యం ఉన్న ఈ భారీ ట్రాలీపై మహాగణపతిని నిమజ్జన ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. గణపతికి ఇరువైపులా ఉన్న పూరీ జగన్నాథ్ స్వామి, లలితా త్రిపుర సుందరి, లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, గజ్జలమ్మ దేవత విగ్రహాలను మరో వాహనంపై ఊరేగిస్తున్నారు. శోభాయాత్ర మధ్యాహ్నం 2 గంటల సమయానికి ట్యాంక్ బండ్ లోని ఎన్టీఆర్ మార్గ్ లోని నాలుగో నంబర్ క్రేన్ వద్దకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.    ఖైరతాబాద్ నుంచి ఆరంభమైన న ఈ శోభాయాత్ర రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా సచివాలయం ముందు నుంచి ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకుంటుంది. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక క్రేన్ సహాయంతో గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని మధ్యాహ్నం 2 గంటల సమయానికి పూర్తి అవుతుందని భావిస్తున్నారు.  

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం భక్త జనసంద్రంగా మారింది. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా తిరుమల దేవుడిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. దీంతో తిరుమల గిరి నిత్యం భక్తుల రద్దీతో కిటకిట లాడుతుంటుంది. శనివారం (సెప్టెంబర్ 6) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.   క్యూలైన్‌లోని భక్తులకు టీటీడీ అన్న ప్రసాదం, జల ప్రసాదం, పాలు అందిస్తున్నారు.  ఇక శుక్రవారం(సెప్టెంబర్ 5) శ్రీవారిని మొత్తం 69 వేల 531 మంది దర్శించుకున్నారు.  శ్రీవారిని 69,531 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 1,439 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం  3 కోట్ల 49 లక్షల రూపాయలు వచ్చింది.  

హైదరాబాద్ మహిళా పోలీసుల్లో అశ్విక దళం, డాగ్ స్క్వాడ్ విస్తరణ

    హైదరాబాద్ నగర పోలీసులు ఈరోజు ఒక చారిత్రాత్మక మైన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ సిపి సి.వి. ఆనంద్ మహిళా హార్స్ రైడర్స్‌ను ప్రవేశపెట్టారు. పదిమంది సాయుధ రిజర్వ్  మహిళా కానిస్టే బుళ్లు రెండు నెలల పాటు గోషామహల్ మౌంటెడ్ యూనిట్‌లో శిక్షణ పొంది, ఇప్పుడు గుర్రపు పోలీసు దళంలో భాగమయ్యారు. దేశంలోనే ఇదొక కీలకమైన నిర్ణయం అని హైదరాబాద్ కమిషనర్ తెలిపారు. ఈ మహిళా కానిస్టేబుళ్లను బందోబస్తు, విఐపిల భద్రత, పెట్రోలింగ్ వంటి విధులకు వినియోగించనున్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకు న్నామని, మహిళా మౌంటెడ్ పోలీసులు గస్తీలో మొదటిసారి గా పాల్గొనబోతు న్నారని హైదరాబాద్ సిపి పేర్కొన్నారు.హైదరాబాద్ నగర పోలీసులు తమ డాగ్ స్క్వాడ్‌ను కూడా విస్తరిస్తు న్నారు. కిస్ ఇన్వెస్టిగేషన్ చేయడంలో శునకాలు ఎంత గానో సహాయప డుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న 34 శునకాల తో పనిభారం ఎక్కువగా ఉన్నం దున, ఆ సంఖ్యను 54కు పెంచాలని నిర్ణయించుకున్నారు. అదనపు శునకాలను ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ లో విస్తృత శిక్షణ పొందిన తర్వాత బృందంలో చేర్చుకుంటామని సిపి అన్నారు.  ఇంకా బాంబులు, మాదక ద్రవ్యాలు, మరియు నేరస్తుల గుర్తింపు వంటి వాటిలో వీటిని వినియోగిస్తాము.శునకాల నాణ్యత ను మెరుగుపరచడా నికి ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ దేశవ్యాప్తంగా ఉన్న డాగ్ బ్రీడర్ల నుండి నాణ్యమైన శునకా లను ఎంపిక చేస్తోంది. మొదటి దశలో 12 శునకా లను సేకరించారు. భవిష్యత్తులో మరికొన్నిటిని తీసుకుంటామని సిపి తెలిపారు. ప్రస్తుతం నూతన ఉస్మా నియా జనరల్ హాస్పిటల్  నిర్మాణానికి సంబంధించిన ఇటీవలి పరిణా మాల నేపథ్యంలో, గోషామహల్ పోలీస్ స్టేడియం ఆవరణ లోని గుర్రపు మైదానం మరియు అశ్విశాల వంటివా టిని కొత్త ప్రదేశానికి మార్చుతున్నారు.  ఈ కొత్త మౌలిక వసతుల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్ట్‌లో సిటీ సెక్యూరిటీ వింగ్ కోసం కొత్త భవ నాలు, స్వాధీనం చేసుకున్న వాహ నాల నిలుపుదల ప్రదేశాలు, కొత్త గుర్రపు శాలలు, మరియు పెరేడ్ గ్రౌండ్ వంటివి ఉంటాయని సి.వి ఆనంద్ తెలిపారు.11.5 ఎకరాల విస్తీర్ణంలో 60 శునకాల కోసం డాగ్ కెనాల్స్ మరియు మౌంటెడ్ యూనిట్‌ ను నిర్మిస్తాము. ఈ ప్రాజెక్టుకు సంబం ధించిన టెండర్లు సెప్టెంబర్ 8న పూర్తవుతాయని సిటీ కమిషనర్  తెలిపారు. రేపు జరగబోయే గణేష్ నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కమిషనర్  తెలిపారు.సుమారు 40 గంటల పాటు నిమజ్జనం సాగబోతుందని, ట్యాంక్ బండ్ వద్ద మాత్రమే 50 వేల విగ్రహాల నిమజ్జనం జరుగుతుందని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగ కుండా ముందస్తు జాగ్రత్తగా అన్నిచోట్ల పటిష్టమైన పోలీస్ భద్రతను ఏర్పాటు చేశాము. మొత్తం 29 వేల మంది పోలీసులు షిఫ్టుల లో విధులు నిర్వర్తి స్తారు. నిమజ్జన మార్గాలను పర్యవేక్షించడానికి సిసి కెమెరాలతో పాటుగా అదనంగా 250 సిసి కెమెరాలు మరియు 6 డ్రోన్‌ లను కూడా వినియోగిస్తున్నామని తెలిపారు. గత సంవత్సరాల్లో డీజేల కారణంగా చాలా మంది యువకులు మరణించారని, వారి ఆరోగ్యం దెబ్బతింటుందని కమిషనర్  పేర్కొన్నారు. అందుకే ఈ సంవత్సరం డీజేలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. భక్తిలో మతం కాకుండా ప్రజల ఆరోగ్యం ప్రధానమని, ఈ విషయంలో భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి కూడా పోలీసులకు సహకరిస్తోందని చెప్పారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనాన్ని ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల లోపు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.  

ధూల్ పేట్ లఖన్ సింగ్‌పై పీడీ యాక్ట్

  ధూల్ పేట్ ను అడ్డగా మార్చుకుని గంజాయి వ్యాపారం కొనసాగిస్తున్న లేడీ డాన్ పై పీడియాక్ట్ నమోదుచేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా అదే దూల్పేట్ లో గంజాయి వ్యాపారం చేస్తూ లక్షల్లో డబ్బులు సంపాది స్తున్న మరో వ్యాపా రిపై కలెక్టర్ పీడి యాక్ట్  నమోదు చేయాలంటూ  ఆదేశాలు జారీ చేశారు...గంజాయి హోల్  సెల్ వ్యాపా రిగా ఎదిగిన ఓ వ్యక్తి పై పోలీస్ స్టేషన్లో,ఎక్సైజ్ స్టేషన్లో 30కి పైగా  కేసులు నమోద య్యాయి..పోలీసులు ఒక మారు, ఎక్సైజ్ రెండో మారు లకాన్ సింగ్ పై పీడీ యాక్ట్ నమోదు చేశారు.. అయినా కూడా అతని ప్రవర్తన మార్చుకోకుండా మళ్లీ తిరిగి గంజాయి దందా  కొనసాగిస్తూనే ఉన్నాడు.. దూల్పేట్ లో నివాసం ఉంటున్న లఖన్ సింగ్ ఒరిస్సా లోని గంజాయి సాగు, అమ్మకం  బడా వ్యాపారులతో సంబంధాలు పెట్టుకున్నాడు. అంతే కాకుండా సులభ పద్ధతిలో డబ్బులు సంపాదిం చాలని ఆలోచించిన లఖన్ సింగ్ ఒరిస్సా నుంచి నేరుగా 25 కిలోల నుంచి 100 కేజీల వరకు గంజా యిని పోలీసుల కంట పడకుండా ధూల్పేటకు తెప్పించి స్థానిక వ్యాపారులకు అమ్మకాలు జరుపుతూ...హాయిగా గంజాయి  దందా కొనసాగిస్తున్నాడు.    ఎనిమిది నెలల్లోనే  లఖాన్ సింగ్ మూడుమార్లు 25 కేజీల, 27,26 కేజీల గంజాయిలతో ఎక్సైజ్ ఎస్ టి ఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి బృందానికి పట్టుపడ్డాడు. అంతే కాదు ఇతనిపై మంగళ హార్ట్, దూల్పేట్, నారాయణగూడ తో పాటు మరో స్టేషన్లో పదికి పైగా పెద్ద మొత్తంలో గంజాయి పట్టు కున్న కేసులు నమోదయ్యాయి. దూల్పేట్ లో గంజాయి లేడీ డాన్ అంగూర్ భాయ్ పై కూడా పీడీ యాక్ట్ పెట్టడంతో నిందితు రాలు జైల్లో ఉన్నారు. ఇప్పుడు తాజాగా లఖాన్ సింగ్ పై కూడా హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన పీడియాట్ ఇంపోస్ చేశారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాస్ కాసిం పిడి యాక్ట్ పెట్టాలని చేసిన సిఫార్సు మేరకు కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ ఇచ్చినటు వంటి పీడీ యాక్ట్ ఉత్తర్వులను దూల్పేట్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ మధుబాబు లఖాన్ సింగ్ కు యాక్ట్ నోటీసులను అందించారు.  

గురువులను జీవితంలో మర్చిపోలేము : సీఎం చంద్రబాబు

  దేశంలో ఆంధ్రప్రదేశ్‌ను నంబర్ వన్‌గా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు  సీఎం చంద్రబాబు అన్నారు. సర్వేపల్లి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్‌ హాల్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథులుగా ముఖ్యమంత్రి హాజరయ్యారు. ప్రపంచంలోనే తెలుగుజాతి నంబర్‌వన్‌గా నిలవాలి. రాబోయే 22 ఏళ్లపాటు మనమంతా దీనిపై దృష్టి సారిస్తే సాధ్యమే అని చంద్రబాబు అన్నారు. ఇంటర్ చదువుతున్నప్పుడే పోటీ పరీక్షలకు ప్రిపేర్ చేసేలా విద్యార్థులను సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు సూచించారు. హాస్టళ్లతో విద్యాశాఖ సమన్వయం చేసుకుంటూ విద్యార్థులను పోటీ పరీక్షలకు ప్రిపేర్ చేయాలని ఆదేశించారు.  ఇటీవల ఐఐటీలకు వెళ్లిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తనను కలిశారని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే విద్యార్థులను ప్రతిష్టాత్మక జాతీయ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు సాధించేలా తీర్చిదిద్దాలని తెలిపారు.ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో ఆంధ్ర యూనివర్సిటీకి నాలుగో ర్యాంక్ రావడం శుభపరిణామమని హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటివి మరిన్ని రావాలని ఆకాంక్షిస్తున్నట్లు స్పష్టం చేశారు. విద్యా శాఖ మంత్రి లోకేష్ మాట్లాడుతు మా ఉపాధ్యాయుల మార్గనిర్దేశనంతో బ్యాక్ బెంచ్ నుంచి స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీకి వెళ్లాని పేర్కొన్నారు. కొన్ని అంశాల్లో వీక్ గా ఉన్నానని మా నాన్న బ్రిడ్జి కోర్సుల్లో శిక్షణ ఇప్పించారు. నారాయణని పిలిపించి నాకు శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత యూనివర్శిటీలో రాజిరెడ్డి ఆధ్వర్యంలో చదువుకున్నాను. సమయానికి హెయిర్ కట్ కూడా చేయించుకోవాలని తెలియదని లోకేశ్ తెలిపారు, తల్లిని ఆ తర్వాత నా ఉపాధ్యాయులనే గౌరవిస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచాలని పిలుపిస్తే... స్కూటరుకు మైక్ కట్టుకుని అనౌన్స్ మెంట్ చేస్తూ అడ్మిషన్లు పెంచిన ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. జీరో ఇన్వెస్టిమెంట్-హై రిటన్స్ అని చెబుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచిన టీచర్లూ ఉన్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా కొన్ని పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు పెట్టిన పరిస్థితి తెచ్చామని తెలిపారు. ఎప్పుడూ లేని విధంగా మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ నిర్వహించామని విద్యాశాఖ మంత్రి వెల్లడించారు. పిల్లలు ఎక్కడ వెనుకబడి ఉన్నారనే అంశాన్ని పేరెంట్సుకు అర్థమయ్యేలా చెప్పేందుకు పేరెంట్-టీచర్ మీటింగ్ పెట్టాం.. దీన్ని కొనసాగిస్తామన్నారు. నాకు ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం... అందుకే విద్యా శాఖ బాధ్యతలు తీసుకున్నాని లోకేశ్ పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యలో రాజకీయాలను దూరంగా పెట్టామన్నారు. వేదిక మీదున్న బోర్డులోనూ సీఎం ఫొటో కూడా పెట్టలేదు. పిల్లలకు అందించే పుస్తకాలు, కిట్ల పైనా ఎవ్వరి ఫొటోలు వేయలేదన్నారు.  

ఏపీ మద్యం కేసులో కీలక పరిణామం

  ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిమాణం చోటుచేసుకుంది. మాజీ సీఎం వైఎస్ జగన్‌ సోదరుడు, వైఎస్ అనిల్ రెడ్డి  పీఏగా దేవరాజులను సిట్ విచారణకు పిలిచింది. ఈ కేసుకు సంబంధించి ఆయన ప్రశ్నిస్తోంది. సిట్‌కు  ఆయన ఇచ్చే సమాచారం ఆధారంగా కేసు  కీలక పురోగతి సాధిస్తుందని సిట్ అధికారులు భావిస్తున్నారు.  కాగా ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డితో పాటు  10 మందిని అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఇక ఇదే కేసులో గత వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం, మంత్రిగా పని చేసిన నారాయణ స్వామిని సైతం సిట్ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా ఆయన స్టేట్‌మెంట్‌ను వారు రికార్డు చేసుకున్నారు.

యూరియా కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలు

  మహిళలు ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం పంచాయతీ పెట్టుకోవడం....జుట్లు జట్లు పట్టుకొని కొట్టుకోవడం చూసాం కానీ మహబూబాబాద్ జిల్లా కేంద్రం లో యూరియా బస్తాల కోసం ఇద్దరు  మహిళలు జుట్లు జుట్లు పట్టుకొని పొట్టు..పొట్టుగా కొట్టుకున్నారు. ప్రధాన రహదారిపై పొర్లాడుతూ కొట్టుకోవడం అందర్నీ విస్మయపరిచింది. చుట్టుపక్కల వారు ఆపుతున్నా ఆగకుండా కొట్టుకున్నారు. చివరకు ఇద్దరు వ్యక్తులు ధైర్యం చేసి ఆ ఇద్దరు మహిళలను బలవంతంగా ఆపారు.  మహబూబాబాద్ పట్టణం లోని వివేకానంద సెంటర్ లో గల ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ముందు మహిళలు , పురుషులు ఆధార్ కార్డు జిరాక్స్ లు పట్టు కొని  పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఒకరికొకరు నెట్టుకోవడంతో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. ఈ సమయంలోనే ఇద్దరు మహిళలు తీవ్రంగా కొట్టుకున్నారు.

చైనా యుద్ధ తంత్రాలతో ప్రపంచం దిగ్భ్రాంతి

    భవిష్యత్ యుద్ధ తంత్రాలంతా ఆటోమేటెడ్ అలాగే డిజిటల్‌గా మారుతున్నాయనడానికి చైనా మిలటరీ పరేడ్ నిదర్శనం. ఒకప్పుడు లక్షల సంఖ్యలో సైనికులు అవసరం. కానీ ఇప్పుడు సైనికులు తక్కువున్నా టెక్నాలజీతో దెబ్బకొట్టే మిలటరీ ఎక్విప్ మెంట్ అవసరం. ఈ పెరేడ్ తో  చైనా తన లేటెస్ట్ టెక్నాలజీని ప్రదర్శించడం ప్రపంచాన్ని నిర్ఘాంతపోయేలా చేసిందంటున్నారు. గతంలో చైనీస్ వెపన్స్ అమెరికన్ లేదంటే రష్యన్ టెక్నాలజీ కాపీ ఆధారంగా ఉండేవి. కానీ ఇప్పుడు చైనా దేశీయంగా కెపాసిటీలను పెంచుకుంది. అయితే ఈ కొత్త ఆయుధాలు యుద్ధాల్లో ప్రూవ్ కాలేదు. ఎందుకంటే చైనా ఆధునిక యుగంలో ఒక్క యుద్ధంలో కూడా పాల్గొనలేదు. ఈ ఆయుధాలు ఎలా పని చేస్తాయో ఎవరికీ తెలియదు. పైగా అమెరికన్ ఎక్స్ పర్ట్స్ ఇవన్నీ పేపర్ వెపన్సే అంటున్నారు.  తమ బీ 2 బాంబర్ ఒక్కటి చాలు అంటున్నారు. జిన్‌పింగ్, పుతిన్, కిమ్ ఒకే వేదికపై కలిసి కనిపించడం ఈ మూడు దేశాల మధ్య బలమైన రాజకీయ కూటమిగా మారింది. ఇది పశ్చిమ దేశాలకు, ముఖ్యంగా అమెరికాకు ఒక హెచ్చరికగా మారింది. ఎందుకంటే తైవాన్ స్ట్రెయిట్, అలాగే సౌత్ చైనా సీ లో అమెరికాకు చెక్ పెట్టే కెపాసిటీతో ున్నాయి. గతంలో జపాన్ చేసిన దురాక్రమణలపై జిన్ పింగ్ మాట్లాడడం కూడా ఆసియా పసిఫిక్ లో ఫ్యూచర్ లో ఉద్రిక్తతలు పెంచడానికి దారి తీయొచ్చు. ఈ పరేడ్ తో చైనా తన ఆయుధాలను ఇంటర్నేషనల్ మార్కెట్ లో అమ్ముకోవడం, మార్కెటింగ్ చేసుకోవడం వంటి వాటిని లక్ష్యంగా పెట్టుకుంది.  మయన్మార్ వంటి దేశాలు ఇప్పటికే చైనా నుంచి ఆయుధాలను భారీగా కొనుగోలు చేస్తున్నాయి. సో ఇప్పుడు అమెరికా దగ్గరికి వద్దాం. చైనా మిలటరీ పరేడ్ ను చూసిన ట్రంప్ కామెంట్ చేయకుండా ఊరుకుంటారా?  చైనా, రష్యా, నార్త్ కొరియా కలిసి USకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. కుట్రలు చేస్తే ట్రంప్ భయపడుతారా? అది తెలియాలంటే.. అమెరికా, చైనా ఆయుధ సంపత్తి ఏంటో తెలుసుకోవాలి. గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్ 2025 ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో అమెరికా, చైనా దగ్గర ఎంత ఆయుధ బలగం ఉందో చెప్పింది. చైనా దగ్గర 20 లక్షల 18 వేల మంది యాక్టివ్ సైనికులు ఉన్నారు.  అలాగే 10 లక్షల 15 వేల మంది రిజర్వ్ సైనికులున్నారు. అటు అమెరికా దగ్గర 10 లక్షల 39 వేల యాక్టివ్ ఆర్మీ, 8,45,000 రిజర్వ్ సైనికులు ఉన్నారు. ఇక ఎయిర్ ఫోర్స్ విషయం చూస్తే.. చైనా దగ్గర 3,300 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి. ఇందులో 1,200 ఫైటర్ జెట్‌లు, 400 బాంబర్‌లు, 400 డ్రోన్‌లు ఉండగా, అమెరికా దగ్గర 13,300 ఎయిర్‌క్రాఫ్ట్‌లున్నాయి. అందులో 1,800 ఫైటర్ జెట్‌లు, 600 బాంబర్‌లు 2 వేల డ్రోన్‌లతో ఆధిపత్యంతో ఉంది. ఇక నేవల్ కెపాసిటీ చూస్తే చైనా దగ్గర 370 వార్ షిప్స్ ఉన్నాయి. ఇందులో 3 ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లు, 50 డిస్ట్రాయర్‌లు, 70 సబ్‌మెరైన్‌లతో చైనా ప్రపంచంలో అతిపెద్ద నౌకాదళంగా ఉంది.  అటు అమెరికా దగ్గర 290 నేవీ వార్ షిప్స్ ఉన్నాయి.  ఇందులో 11 ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లు, 70 సబ్‌మెరైన్‌లు, 90 డిస్ట్రాయర్‌లున్నాయి. కీలకమైన అణ్వాయుధాల విషయంలో చైనా దగ్గర 600 వార్‌హెడ్‌లు ఉన్నాయి. 2035 నాటికి 1,500కి విస్తరణ టార్గెట్ గా పెట్టుకున్నారు. అమెరికా దగ్గర 5,044 వార్‌హెడ్‌లు ఉన్నాయి. అయితే USతో పోలిస్తే చైనా దగ్గర అణ్వాయుధాలు తక్కువగా ఉన్నప్పటికీ అమెరికా దగ్గర ఉన్న వాటికంటే పవర్ ఫుల్. చైనా క్షిపణుల్లో DF-41, DF-31, JL-3 వంటి ఖండాతర బాలిస్టిక్ క్షిపణులు, YJ సిరీస్ హైపర్‌సోనిక్ క్షిపణులున్నాయి. అమెరికా దగ్గర AGM-183A ARRW, HAWC హైపర్‌సోనిక్ మిసైల్స్, టామ్‌హాక్ క్రూయిజ్ క్షిపణులున్నాయి. ఇక సైబర్ స్పేస్ విషయంలో చైనా దగ్గర HQ-29 స్పేస్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది.  అదే సమయంలో అమెరికాకు US సైబర్ కమాండ్ స్పేస్ ఫోర్స్, యాంటీ-శాటిలైట్ వెపన్స్ ఉన్నాయి. రోబోటిక్ డిఫెన్స్ ఎక్విప్ మెంట్ లో చైనాకు రోబోట్ వోల్వ్స్ ఉన్నాయి. GJ-11 డ్రోన్‌లు, అండర్‌వాటర్ డ్రోన్‌లతో సత్తా పెంచుకుంటుండగా.. అమెరికా దగ్గర MQ-9 రీపర్, RQ-4 గ్లోబల్ హాక్, XQ-58A డ్రోన్‌లు ఉన్నాయి. సో ఎవరూ ఎక్కడా తగ్గడం లేదు. అయితే అమెరికా చైనా డిఫెన్స్ ఎక్విప్ మెంట్స్, వార్ స్ట్రాటజీల్లో కొన్ని తేడాలు ఉన్నాయి. అమెరికన్ ఫైటర్ జెట్‌లు F-22, F-35 లాంటివి యుద్ధాల్లో పరీక్షించారు. సాంకేతికంగా అడ్వాన్స్డ్. అయితే చైనా J-20, రోబోట్ డాగ్స్ కొత్త ఆవిష్కరణలు. వీటిని యుద్ధాల్లో పరీక్షించలేదు.  చైనా హైపర్‌సోనిక్ క్షిపణుల్లో ముందంజలో ఉంది. అయితే అమెరికా వేగంగా ఆ గ్యాప్‌ను తగ్గించుకుంటోంది. అటు అమెరికా 750కి పైగా విదేశీ సైనిక స్థావరాలను కలిగి ఉంది. ఇది అమెరికాకు యుద్ధాల విషయంలో స్ట్రాటజిక్ పాయింట్. చైనాకు కేవలం 3-4 విదేశీ స్థావరాలే ఉన్నాయి. అంటే ఏ యుద్ధం చేసినా చైనా నుంచే చేయాలి. 2024 చైనా మిలటరీ పవర్ రిపోర్ట్ ప్రకారం, చైనా సైనిక శక్తి వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా నేవీ, మిసైల్స్, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్లో అమెరికాను మించిపోయింది. అందుకే ట్రంప్ జాగ్రత్త పడుతున్నారు. చైనాకు రష్యా, నార్త్ కొరియా తోడైతే తట్టుకోవడం కష్టమన్న ఉద్దేశంలో అమెరికా ఉంది. అందుకే ఈ ముగ్గురు కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

పేదల తలరాతను మార్చేది చదువు ఒక్కటే : సీఎం రేవంత్‌

  తెలంగాణ రాష్ట్రానికి నూతన విద్యా విధానం కావాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మాదాపూర్‌లో శిల్పకళా వేదికలో గురుపూజోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారని సీఎం అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు బోధిస్తున్నట్లు తెలిపారు. ప్త్రెవేటు, కార్పొరేట్ స్కూళ్ల కంటె నాణ్యమైన విద్యా అందిస్తామని ప్రతిజ్ఞ చెేద్దామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.  విద్యాశాఖ ముఖ్యమైందని.. అందుకే తన దగ్గర పెట్టుకున్నానని తెలిపారు. విద్యాశాఖలో చాలా సమస్యలు పేరుకుపోయి ఉన్నాయన్నారు. గత పదేళ్ల పాటు టీచర్ల నియామకాలు జరగలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక టీచర్ల నియామకాలు చేపట్టామని ఆయన తెలిపారు. బీఆర్‌ఎస్ హయంలో కేజీ టు పీజీ ఉచిత విద్య హామీ అమలు జరిగిందా? అంటూ ప్రశ్నించిన రేవంత్‌.. విద్యాశాఖలో ప్రతి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నానని పేర్కొన్నారు.  ‘‘గత ప్రభుత్వంలో విద్యను వ్యాపారంగా మార్చి సొమ్మును చేసుకున్నారు. ఉస్మానియా వర్శిటీని మూసేసే పరిస్థితికి తీసుకొచ్చారు. విద్యను వ్యాపారంగా మార్చి సొమ్మును చేసుకున్నారు. పేదల తలరాత మార్చేది చదువు ఒక్కటే. ఫుడ్‌ పాయిజన్‌ వార్తలు చూస్తే బాధేస్తుంది. టీచర్లు కూడా పిల్లలతో కలిసి భోజనం చేయాలి’’ అని సీఎం రేవంత్‌ పిలుపునిచ్చారు. విద్యలో మనం ప్రపంచంతోనే పోటీ పడేలా పాఠశాలను తీర్చిదిద్దాలని సూచించారు.  95 శాతం మంది మంచి టీచర్లు ఉంటే 5 శాతం మంది చెడ్డవాళ్ల ఉంటారని వాళ్ల వల్లే మొత్తం శాఖకు పేరు వస్తుందన్నారు. దీనిని మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, యూనివర్సిటీ వీసీలు, ఉన్నతాధికారులు, పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరయ్యారు.

నిమజ్జనానికి సర్వం సిద్ధం : సీపీ ఆనంద్

    హైదరాబాద్‌లో  రేపు జరగబోయే గణేష్ నిమజ్జనం కొరకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించారు.. అన్నిచోట్ల పటిష్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేశామని సిపి అన్నారు... ఈ నిమజ్జనం సమయంలో మొత్తం 30 వేల మంది పోలీసులు షిఫ్ట్ లో ఉన్నారు. 100 సీసీ కెమెరాలు ఉన్నాయి. అదనంగా 250 సీసీ కెమెరాలు కొన్నాం. ఆరు డ్రోన్స్ తో గణేష్ నిమజ్జనం పర్యవేక్షిస్తామని సిపి అన్నారు. 40 గంటల పాటు వినా యకుని నిమజ్జనం సాగబోతుంది. రేపు ఒక ట్యాంక్ బండ్ లోనే 50వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయి.  నిన్న చత్రినాకలో ఓ ఘటన జరిగింది. విగ్రహం ఎత్తుగా ఉండడం వల్ల కరెంటు వైర్ కు తగలకుండా ఉండేలా సుమారు 6 గంటల పాటు కష్టపడాల్సి వచ్చింది... అయితే ఎత్తుగా ఉండే వినాయకులను తీసుకువచ్చే సమయంలో కరెంటు వైర్లను గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా డీజే లకు అనుమతి లేదు. గత సంవ త్సరం డీజే కారణం గా చాలామంది చనిపోయారు. డిజే వైబ్రేషన్స్ వల్ల యువకుల ఆరోగ్యం దెబ్బతింటుంది.  భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి కూడా డీజే వద్దంటే ఒప్పుకుంది. ఇందులో మతం అనే అంశమే లేదు. పూర్తిగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తు న్నామని సిపి అన్నారు... ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం రేపు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు అయి పోయేలా చూస్తా మని అన్నారు.... సౌత్ జోన్ విగ్రహాల తరలింపు మాకు అత్యంత ప్రాధాన్యత... ప్రతి ఒక్కరు నిదానంగా గణేష్ నిమజ్జనం చేసి... సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకు చేరుకోవాలని హైదరాబాద్ సీపీ సీవి ఆనంద్ విజ్ఞప్తి చేశారు....మరోవైపు మైట్రో రైలు సమయాన్ని పొడిగించింది. తొలి ట్రైన్ రేపు ఉదయం 6 గంటలకు, చివరి ట్రైన్ అర్థరాత్రి ఒంటి గంటకు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి బయలుదేరుతాయని తెలిపింది.

ప్రధాని మోదీతో మంత్రి లోకేష్ సమావేశం

  దేశ ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ మంత్రి నారా లోకేశ్ సమావేశం అయ్యారు. ఐటీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనకు చేయూత అందించాలని ప్రధానిని లోకేశ్‌ కోరారు. ఏపీలో సెమీ కండక్టర్ యూనిట్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యాప్రమాణాల మెరుగుదలకు సంస్కరణలు అమలు చేస్తున్నామని  మెరుగైన ఫలితాల సాధించేందుకు సహకరించాలని  కోరారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 15నెలలుగా కేంద్రం సహకారంతో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తున్నామని చెప్పారు. జీఎస్టీ సంస్కరణల ద్వారా దేశంలోని కోట్లాది పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించిన ప్రధాని మోదీకి మంత్రి లోకేశ్‌ కృతజ్ఞతలు తెలిపారు.  ఏపీలో గత కొంతకాలంగా నెలకొన్న వివిధ పరిణామాలను ఆయన వివరించారు. ప్రధాని స్పందిస్తూ.. రాష్ట్రాభివృద్ధికి అన్నివిధాలా సహకారం అందిస్తామని చెప్పారు. యోగాంధ్ర నిర్వహణపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను ఈ సందర్భంగా ప్రధానికి లోకేశ్‌ బహుకరించారు. నేడు పలువురు కేంద్ర మంత్రులతో లోకేశ్‌ భేటీ కానున్నారు.  

ఏనుగుల ముందస్తు సమాచారం కోసం ఆర్టీజీఎస్‌ సేవలు

చిత్తూరు జిల్లాను ఏనుగుల బెడద అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. పొలాలపై పడి పంటలను నాశనం చేయడమే కాకుండా, జనాలపై దాడి చేస్తున్న సంఘటనలు, ఆ దాడులలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న సంఘటలూ కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అటవీ శాఖ అధికారులు ఓ కొత్త ప్రయోగం చేపట్టారు.  ఏనుగుల సంచారం, కదలికలపై ముందస్తు సమాచారం కోసం ఆర్టీజీఎస్‌ సేవలను ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంది. పంట పొలాలను ధ్వంసం చేయడమే కాకుండా ఇటీవల కాలంలో అనేక మంది ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు.  ఈ నేపథ్యంలో    ఏనుగుల గుంపును చెదరగొట్టడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ కు కుంకీ ఏనుగులను తీసుకు వచ్చారు. ఆ ప్రయత్నం కూడా పూర్తిగా ఫలించలేదు. ఇప్పటికీ   ఏనుగులు విధ్వంసాన్ని సృష్టి స్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏనుగుల సంచారం, వాటి కదలి కపై ఆర్టీజీఎస్ సేవలను ఉపయోగిం చుకుని ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.   గ్రామాల సమీపంలోని  ఏనుగులు సమీపిస్తున్న సమయంలో ఎలిఫెంట్‌ టాస్క్‌ఫోర్స్‌ అలర్ట్‌ మెసేజ్‌లు పంపేందుకు ఆర్టీజీఎస్ సేవలను ఉపయోగించుకోనున్నారు. 

కార్ల అమ్మకాలు భారీగా పెరగనున్నాయా?.. జీఎస్టీ సంస్కరణతో ధరలు దిగిరావడమే కారణమా?

కారులో షికారుకెళ్లే పాల‌బుగ్గ‌ల ప‌సిడిదానా.. అంటూ పాట పాడుకోవాలంటే సెప్టెంబ‌ర్ 22 వ‌ర‌కూ ఆగండి.. కార్ల ధరలు రూ. 80 వేల నుంచి రూ. 1. 5 ల‌క్ష‌ల వ‌ర‌కూ  త‌గ్గ‌నున్నాయ‌న్న‌ది పతాక శీర్షిక‌ల‌కెక్కిన వార్త‌. దీంతో 10 ల‌క్ష‌ల రేంజ్  కార్లు భారీగా సేల్ అవుతాయ‌ని పెద్ద ఎత్తున ఆశ‌లు పెట్టుకుని క‌నిపిస్తున్నాయి.. స‌ద‌రు కార్ల కంపెనీలు. జీఎస్టీతో పాటు జీవిత‌కాల ప‌న్ను రిజిస్ట్రేష‌న్ చార్జీల ఉప‌శ‌మ‌నం కూడా క‌లుగుతుంద‌ని అంటున్నారు. దీంతో టోట‌ల్ ఎక్స్ పెండిచ‌ర్ ఆఫ్- కార్ ప‌ర్చేస్ లో భారీ త‌గ్గుద‌ల ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రీ ముఖ్యంగా 1200 సీసీ  కార్ల జీఎస్టీ 18 శాతానికి ప‌డిపోనుంది. దీంతో కారు కొన‌డానికి సెప్టెంబర్ 22 తరువాత వచ్చేవి మంచి రోజులు అంటున్నారు.   బేసిగ్గా గ‌త కొంత  కాలంగా కార్ల విక్ర‌యాలు ఏమంత గొప్ప‌గా లేవు. గ‌తంలో మారుతీ అయితే అత్యంత సులువుగా క‌స్ట‌మ‌ర్ల‌కు కార్ల‌ను అంట‌గ‌ట్టేసేది. పాతిక వేలు కూడా చేతిలో లేని వారు కార్లు  కొనేసి విలాస‌వంతంగా తిరిగేవారు. కానీ ఈ మ‌ధ్య కాలంలో మారుతి సైతం ఏమంత ఎక్కువ కార్ సేల్స్ చేయ‌లేక పోతోంది.  దీనంత‌టికీ కార‌ణం జీఎస్టీ కానే కాదు.   సిబిల్ రేటింగ్. ఎప్పుడైతే సిబిల్ రేటింగ్ ఒక గుదిబండ‌గా మారిందో..  కార్ల అమ్మ‌కాలు అమాంతం ప‌డిపోయాయి. ప్ర‌స్తుతం మార్కెట్ గ‌ణాంకాల‌ను బ‌ట్టి చూస్తే త‌యారయ్యి అమ్ముడు పోక గోడౌన్ల‌లో ప‌డి ఉన్న కార్ల విలువ.. సుమారు 70 వేల కోట్ల రూపాయ‌లుగా ఉంది. దీనంత‌టికీ కార‌ణం సిబిల్ రేటింగే. ప్ర‌స్తుతం జీఎస్టీ ద్వారా త‌గ్గ‌నున్న మొత్తం డిస్కౌంట్ ఇవ్వ‌డానికి ఈ కంపెనీలు ఎప్ప‌టి నుంచో రెడీగా ఉన్నాయి. 50 వేల నుంచి 80 వేల డిస్కౌంట్ల‌కు కార్లు కొన‌మంటూ క‌స్ట‌మ‌ర్ల‌ను వెంటాడుతూనే ఉంటాయి. కానీ స‌ద‌రు క‌స్ట‌మ‌ర్ల‌లో చాలా మందికి ప‌ర్స‌న‌ల్ లోన్, హోం లోన్ ఇంకా ఇత‌ర‌త్రా లోన్ల వ‌ల్ల‌.. వాటిని క‌ట్ట‌డంలో వారి వారి స‌మ‌స్య‌ల కార‌ణంగా సిబిల్ రేటింగ్ దారుణంగా దెబ్బ తిన‌డం వ‌ల్ల‌.. వారికి కారు కొనుగోలు అంద‌ని ద్రాక్ష‌గా మ‌రింది. ఎప్పుడైతే సిబిల్ రేటింగ్ ని తిరిగి స‌వ‌రిస్తారో అప్పుడు నిజంగా కార్ల అమ్మ‌కాలు భారీగా పెరిగే ఛాన్సులు క‌నిపిస్తున్నాయని అంటారు ఆర్ధిక రంగ నిపుణులు.

భక్తసంద్రంగా మారిన ఖైరతాబాద్

ఖైరతాబాద్ లో ఉన్న బడా గణేష్ దర్శనానికి  గురువారం(సెప్టెంబర్ 4)  రాత్రి 11 గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతి  ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఖైరతాబాద్ గణేషుడి దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఖైరతాబాద్ భక్త జనసంద్రంగా మారింది. దాదాపు  28 లక్షల మంది ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్నారని నిర్వాహకులు తెలిపారు.  ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఈ ఏడాది ఖైరతాబాద్ మహా గణపతిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.   ఒకవైపు  భక్తులు పెద్ద ఎత్తున దర్శనానికి తరలి వస్తుంటే... మరోవైపు గణేష్ నిమజ్జనానికి పోలీస్  ఉన్నతాధి కారులు సర్వం సిద్ధం చేశారు. శనివారం (సెప్టెంబర్ 5)  వినాయక నిమజ్జనం జరగనుంది.   ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనంశనివారం (సెప్టెంబర్ 6) మధ్యాహ్నం ఒంటిగంటన్నర లోగా పూర్తి చేయాలని అధికార యంత్రాంగం టర్గెట్ గా పెట్టుకుంది.   కాగా, జంటనగరాలలో వినాయక నిమజ్జనం సందర్భంగా దాదాపు 302 కిలోమీటర్ల మేర గణేష్ శోభయాత్ర జరుగుతుంది. ఇందు కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చేసింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.  ఇక జీహచ్ఎంసీ గణేష్ నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 13 కంట్రోల్ రూములు ఏర్పాటు చేసింది. 30 వేల మందితో పోలీసు బందోబస్తు నిర్వహించనుంది. అలాగే 169 యాక్షన్ టీంలను కూడా రంగంలోకి దింపుతున్నాయి.  ఇక వినాయక నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరురువుల, 72 కృత్రిమ కొలనులు సిద్ధం చేశారు. ఇక పోతే 134 క్రేన్లు, 239 మొబైల్ క్రేన్లు రెడీ చేశారు. ఇక హుస్సేన్ సాగర్ లో 9 బోట్లను రెడీ చేశారు. శానిటేషన్ కోసం 14 వేల 486 మంది సిబ్బందిని నియోగించారు.  శనివారం (సెప్టెంబర్ 6) 50 వేల గణేష్ విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 

వేలంలో మైహోం భూజా గణేషుడి లడ్డూ ధర అరకోటిపైనే!

 హైదరాబాద్ లో గణేష్ నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఏటా అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవాలలో వాడవాడలా గణేష్ మంటపాలను ఏర్పాటు చేస్తారు. అదే విధంగా.. మండపాలలో కొలువై పూజలందుకున్న గణేషుడి లడ్డూల వేలం కూడా ఒక సంప్రదాయంగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ లడ్డూను వేలం పాటలో దక్కించుకోవడాన్ని భక్తులు ఒక ఘనతగా, ఎంతో గొప్పగా ఫీలౌతుంటారు. గత కొంత కాలం వరకూ గణేష్ లడ్డూ వేలం అంటూ బాలాపూర్ గణపతి లడ్డూ వేలం మాత్రమే గుర్తుకు వచ్చేది. అయితే గత కొన్నేళ్ల నుంచీ పలు మండపాలలో  వేలంలో లడ్డూ ధరల లక్షల రూపాయలు పలుకుతోంది. ఈ ఏడాది హైదరాబాద్ లోని మైహోం భూజా లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో లడ్డూ వేలం ఇప్పటి వరకూ ఉన్న అన్ని రికార్డులనూ తిరగరాసింది.   రాయదుర్గంలోని మై హోమ్ భూజాలోని లడ్డూ వేలంలో   అక్షరాలా 51లక్షల 77 వేల777 రూపాయలు పలికింది.  ఇల్లందుకు చెందిన గణేష్ అనే వ్యక్తి వేలం పాటలో ఈ ధరకు  లడ్డూను సొంతం చేసుకున్నారు.  

టెంపుల్ టౌన్లలో హోం స్టేలకు ప్రోత్సాహం.. పర్యాటక శాఖ సమీక్షలో చంద్రబాబు

టెంపుల్ టౌన్లలో హోమ్ స్టేలను ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం (సెప్టెంబర్ 3) పర్యాటక శాఖపై సమీక్షించిన ఆయన  తిరుపతి సహా రాష్ట్రంలోని అన్ని ముఖ్య దేవాలయాల పట్లణాలలో వీటిపై దృష్టి పెట్టాల న్నారు.  కోనసీమలో గ్రామీణ వాతావరణం అనుభూతి చెందేలా హోమ్ స్టేలను అభివృద్ధి చేయాలనీ, వీటిలో ఎన్ఆర్ఐలు పెట్టుబడులు పెట్టేలా కార్యాచరణ రూపొందించాలన్నారు.  ఈ  హోమ్ స్టేలు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలన్నారు. విశాఖ, విజయవాడ, అమరావతి, తిరుపతి, అనంతపురం, కర్నూలు ఇలా వేర్వేరు ప్రాంతాల్లో నిరంతరం ఏదోక టూరిజం ఈవెంట్ జరిగేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేందుకు స్థలాలను గుర్తించాలని చంద్రబాబు  అధికారులకు సూచించారు.  అనంతపురంలో డిస్నీ వరల్డ్ సిటీ ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ప్రతినిధుల్ని సంప్రదించాలన్న చంద్రబాబు..  కొండపల్లి ఖిల్లా లాంటి ప్రాజెక్టులను దత్తత తీసుకునేలా ప్రైవేటు భాగస్వాములను గుర్తించాలన్నారు. ఉండవల్లి గుహల వద్ద లైట్ అండ్ సౌండ్ షో ఏర్పాటుతో పాటు, చింతపల్లిలో ఎకో టూరిజం, కుప్పంలో ఏనుగుల సఫారీ, విశాఖలో డాల్ఫిన్ షో వంటి ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. పర్యాట రంగానికి మరింత శోభ తెచ్చేలా అదనపు ఆకర్షణలు జోడించటంతో పాటు, స్థానికంగా ఉన్న ఉత్పత్తులను కూడా బ్రాండింగ్ చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అన్ని పర్యాటక ప్రాంతాలు, ప్రత్యేకంగా నిర్వహించే ఈవెంట్లలోనూ అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేయాలనీ, అలాగే అరుదైన ఎర్రచందనం బొమ్మలు, ఫర్నిచర్ లాంటి ఉత్పత్తులను కూడా ప్రదర్శించాలన్నారు. 

శ్రీవారి సేవకులకు నిరంతర శిక్షణ కోసం నూతన సాఫ్ట్ వేర్.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నార్ధం విచ్చేసే భ‌క్తుల‌కు మ‌రింత మెరుగైన సేవలు అందించేందుకు శ్రీ‌వారి సేవ‌కుల‌కు గ్రూప్ సూప‌ర్ వైజ‌ర్లు, ట్రైనర్లతో నిరంత‌ర‌ శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్   బీఆర్‌నాయుడు తెలిపారు. ఇందు కోసం  నూతన సాఫ్ట్ వేర్ రూపొందించినట్లు చెప్పారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో బుధ‌వారం (సెప్టెంబర్ 3) న ఆయన  ఈవో జె.శ్యామ‌ల‌రావు, అద‌న‌పు ఈవో  వెంక‌య్య చౌద‌రి, సివిఎస్వో  ముర‌ళికృష్ణ‌తో క‌లిసి ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో మాట్లాడారు. తిరుమలలో బిగ్, జనతా క్యాంటిన్లను పారదర్శకంగా కేటాయించినట్లు తెలిపారు.  భక్తులకు మరింత రుచికరమైన, నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలన్న సదుద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం దేశంలోని ప్ర‌ముఖ ఆహార ప‌దార్థ‌ల త‌యారీ సంస్థ‌ల‌కుఈవోఐ ద్వారా పార‌ద‌ర్శ‌కంగా కేటాయించింద‌న్నారు. టీటీడీ  రూపోందించిన నూతన విధానానికి అనుగుణంగా   నిపుణుల క‌మిటీ ఆహార ప‌దార్థాల నాణ్యతా ప్ర‌మాణాలలు, ఇత‌ర అంశాల‌ను ప‌రిశీలించింద‌ని చెప్పారు. అలాగే లాభాపేక్ష లేకుండా భక్తులకు సేవలందించేందుకు ఆయా సంస్ధలు ముందుకు వచ్చాయని బీఆర్ నాయుడు తెలిపారు.   5 బిగ్, 5 జనతా క్యాంటిన్లకు ఈ ఏడాది జూన్ 14న నోటిఫికేషన్ ఇచ్చి సీల్డ్ ఈవోఐ దరఖాస్తులను ఆహ్వానించామనీ.  ఇందులో టీటీడీ నిబంధ‌న‌ల మేర‌కు ఉన్న దరఖాస్తులను ప‌రిశీలించి  కేటాయించామనీ బీఆర్ నాయుడు వివరించారు.