రౌండప్ 2022.. అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం

సెప్టెంబర్   కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. 2022 మోస్ట్ హ్యాపెనింగ్ ఇయర్ గా చెప్పుకోవచ్చు.  కొద్ది  రోజుల్లో 2022 వెళ్ళిపోతుంది. 2023 సంవత్సరం వచ్చేస్తుంది. క్యాలెండరు మారి పోతుంది. స్వాగత తోరణాలు, వీడ్కోలు వేడుకలు షరా మాములే ... కాలచక్రం కదులుతూనే ఉంటుంది... కానీ, వెళ్ళిపోతున్న 2022 సంవత్సరం, ఏమి సాధించింది, ఏమి మిగిల్చింది, ఏది పట్టుకు పోయింది, ఏమి బోధించింది, ఒక సారి వెనక్కి తిరిగి చూసుకుంటే .. సంవత్సర కాలంలో చెరగని ముద్ర వేసిన చేదు తీపి జ్ఞాపకాలను ఒక సారి సింహవలోకనం చేసుకుంటే.. సెప్టెంబర్1..  కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను ఆ పార్టీ నేతలు వెల్లడించారు. సెప్టెంబర్ 22న పార్టీ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్‌ రానుంది. 24 నుంచి సెప్టెంబర్ 30 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి. 19న కౌంటింగ్ జరగనుంది. రెండు రోజుల క్రితం జరిగిన  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.  సెప్టెంబర్ 9...  భారత్ జోడి యాత్రలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, 41 వేల రూపాయల విపువచేసే, బ్రాండెడ్ టీషర్టు’ వేసుకున్నారని బీజేపీ ఆరోపించింది.  దీంతో ఇరు పార్టీల మది ట్వీట్ల యుద్ధం మొదలైంది.  సెప్టెంబర్ 11.. తూర్పు లడఖ్‌లోని ఎల్‌ఎసి వెంబడి చివరి ఘర్షణ పాయింట్ నుండి భారత్, చైనా దళాలు వైదొలగుతున్నాయని ఉభయ దేశాలు ప్రకటించిన నేపధ్యంలో మాజీ ఆర్మీ చీఫ్ వేద్ మాలిక్,  చైనాతో మరింత అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని, అన్నారు. గతంలో చైనా సరిహాద్దు ఒప్పందాలను అనేకమార్లు ఉల్లంగించిన విషయన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.     సెప్టెంబర్ 15...  ఉజ్బెకిస్తాన్ లోని సమార్ఖండ్ లో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్’ ఆర్గనైజేషన్ ( ఎస్సీఓ) సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాద్మిర్ పుతిన్’ , చైనా అధ్యక్షుడు  జిన్’పింగ్` తో భేటీ అవుతారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత పుతిన్’తో మోడీ సమావేశం కావడం ఇదే తొలిసారి కావడంతో ఈ భేటి ప్రధాన్యతను సంతరించుకుంది. కాగా, ఎస్సీఓ సదసుల్లో ప్రసంగించిన మోడీ, భారత దేశం స్టార్టప్’ కంపెనీల ప్రగతితో ఉత్పాదక కేంద్రంగా రూపాంతరం చెందుతోందని వివరించారు.  సెప్టెంబర్ 17.. ప్రధాని నరేంద్ర మోడీ 72 వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సహా పలువురు కేంద్రమంత్రులు ప్రధాని మోదీకి శుభాకాంక్షలు చెప్పారు.అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.ఇక ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు దేశవ్యాప్తంగా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు.  సెప్టెంబర్ 17... తెలంగాణ విమోచన దినోత్సవం. ఈ వేడుకలను తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.  హైదరాబాద్‌ సంస్థానం భారత్‌ యూనియన్‌లో కలిసిన 1948 సెప్టెంబర్‌ 17న అప్పటి హోంశాఖమంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పతాకం ఆవిష్కరించగా.... ప్రస్తుత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. కాగా, గడచిన ఎనిమిది సంవత్సరాలలో తెలంగాన విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి జాతీయ సమైక్యతా దినంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికారిక కార్యక్రమాలను నిర్వహించింది. భారతదేశంలో అంతరించిపోయిన అడవి చిరుతలను తన పుట్టిన రోజు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కునో జాతీయ పార్కులో విడుదల చేశారు.   ప్రపంచంలోనే మొదటి ఖండాంతర అతిపెద్ద మాంసాహార జంతువుల మార్పిడి ప్రాజెక్టు "ప్రాజెక్ట్ చీతా" కింద నమీబియా నుండి ఈ  చిరుతలను భారతదేశానికి తీసుకురావడం జరిగింది.  మొత్తం ఎనిమిది చిరుతల్లో ఐదు ఆడ, మూడు మగ చిరుతలు ఉన్నాయి. సెప్టెంబర్ 19... పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్’ బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన స్థాపించిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేశారు .సెప్టెంబర్ 19.. .కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశి థరూర్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని ప్రకటించారు. సెప్టెంబర్ 25...రాజస్థాన్ ప్రభుత్వంలో సంక్షోభం తలెత్తింది. ముఖ్యమంత్రి అశోక్ గేహ్లోట్’ స్థానంలో పీసీసీ మాజీ అధ్యక్షడు సచిన్ పైలట్’ను ముఖ్యమంత్రిగా నియమించేందుకు పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గేహ్లోట్ వర్గానికి చెందిన 80 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.

ఫామ్ హౌస్ కేసు.. బీఆర్ఎస్ అనుకున్నదొకటి.. అయినది మరొకటి

ఫామ్ హౌస్ కేసు విషయంలో అనుకున్నదొకటి.. అయినది ఒకటి అన్నట్లుగా తయారైంది ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి. కేసీఆర్ అత్యుత్సాహం.. పార్టీ చేతిలోని ఆయుధాన్ని ప్రత్యర్థికి అప్పగించిందని పార్టీవర్గాలే గుసగుస లాడుకుంటున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసు విషయంలో కేసీఆర్ బీజేపీ ఆయువుపట్టు మీద దెబ్బకొట్టానని సంబరపడినంత సేపు పట్ట లేదు.. ఆ కేసు తిరిగి తిరిగి తమ పార్టీ ఎమ్మెల్యేల మెడకే చుట్టుకుంటోందని తెలియడానికి. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసును సీబీఐకి ఇవ్వాలని హైకోర్టు నిర్ణయించడంతో బీఆర్ఎస్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది.  కేంద్రానికేనా దర్యాప్తు సంస్థలు.. రాష్ట్రాలకు లేవా అంటూ ఈ కేసు దర్యాప్తునకు సీట్ ను ఏర్పాటు చేసినప్పుడు పార్టీ క్యాడర్ లో,  పార్టీ మారాలంటూ  తమను ప్రలోభ పెట్టారంటూ ఫిర్యాదు చేసిన అప్పటి టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కనిపించిన ధీమా ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు. ఇందుకు  ఈ కేసులో అత్యంత కీలకంగా ఉన్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గాభరా, కంగారూ చూస్తే ఇట్టే అర్ధమైపోతుంది. ట్రాప్ జరిగిన సమయంలో పోలీసులు కోట్ల రూపాయలు పట్టుకున్నట్లు జరిగిన ప్రచారమే కానీ, అందుకు తగ్గ ఆధారాలు ఇప్పటికీ బయటకు రాలేదు.  నిజంగా అప్పట్లో సొమ్ము బయటపడి ఉంటే.. ఈడీ ఈ పాటికే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించేసి ఉండేది. అయితే ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థల చేతికి వెళ్లకూడదన్న ఉద్దేశంతోనే అప్పట్లో సొమ్ము రికవరీ చూపలేదన్న వాదన కూడా ఉంది. అయితే ఫామ్ హౌస్ కేసులో సొమ్ములు కనిపించకపోయినా  వ్యూహాత్మకంగా ఈడీ రంగప్రవేశం చేసింది. ఆ వెను వెంటనే హైకోర్టు తీర్పుతో సీబీఐ రంగంలోకి దిగుతోంది. దీంతో ఈ కేసు విషయంలో ఒక తార్కిక ముగింపునకు ఎంతో సమయం పట్టదన్న అభిప్రాయం న్యాయనిపుణుల్లోనూ, రాజకీయ వర్గాలలోనూ కూడా వ్యక్తమౌతోంది. సీబీఐ, ఈడీల రంగ ప్రవేశంలో ఇక ఫామ్ హౌస్ కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి అలియాస్‌ సతీశ్‌ శర్మ,   సింహ యాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌లే కాక, ఫిర్యాదు చేసి నలుగురు ఎమ్మెల్యేలూ కూడా దర్యాప్తు సంస్థల స్కాన్ లోనే ఉంటారు. ఎవరు ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రయత్నించారన్న దగ్గర నుంచి, ఎలా ట్రాప్ చేశారు, సొమ్ముల సమీకరణ ఎలా వరకూ అన్ని అంశాలనూ కేంద్ర దర్యాప్తు సంస్థలు వెలుగులోనికి తీసుకు వస్తాయి. ఇప్పటి వరకూ ఈ కేసులో సిట్ వైపు నుంచి మాత్రమే వివరాలు బయటకు వచ్చాయి. ఇక ఇప్పుడు సిట్ ఇంత వరకూ చేసిన దర్యాప్తు, వెల్లడించిన విషయాలూ అన్నీ పక్కకు వెళ్లిపోతాయి. ఎందుకంటే ఈ కేసు దర్యాప్తు చేసే అధికారం ఇక సిట్ కు లేదు.  సో.. ఆ దర్యాప్తును అంతా పక్కన పెట్టేసి కేంద్ర దర్యాప్తు సంస్థలు మళ్లీ మొదటి నుంచీ దర్యాప్తు ప్రారంభిస్తాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ ట్రాప్ కేసులో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి రోహిత్ రెడ్డి కంగారు పడుతున్నారు. ఈడీ, సీబీఐలకు ఈ కేసు దర్యాప్తు చేసే అధికారమే లేదంటున్నారు. హైకోర్టు ఫామ్ హౌస్ ట్రాప్ కేసును సీబీఐకి అప్పగిస్తూ తీర్పు వెలువరించిన తరువాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ రోహిత్ రెడ్డి తన స్పందన తెలిపారు. కేసును సీబీఐకి ఎలా అప్పగిస్తారన్నారు. ఇదంతా బీజేపీ కుట్ర అని నిందలేశారు. కోర్టు తీర్పు మేరకే కేసును సీబీఐ దర్యాప్తు చేయనుందన్న సంగతి విస్మరించి మరీ బీజేపీపై నిందలేశారు. అంతకు ముందు ఇదే కేసుకు సంబంధించి తనను ఈడీ విచారించిన తరువాత కూడా ఆయన ఇవే ఆరోపణలు చేశారు. రెండు సందర్భాలలోనూ ఆయనలో ఆందోళన, గాభరా స్పష్టంగా కనిపించింది. మీడియా ముందుకు రాలేదు కనుక మిగిలిన ముగ్గురూ ఎలా ఫీల్ అవుతున్నారన్న సంగతి తెలియడం లేదు.. కానీ ఈ ఫామ్ హౌస్ ట్రాప్ కేసులో మొదటి నుంచీ క్రియాశీలంగా ఉన్నదీ, కీలకంగా వ్యవహరించినదీ పైలట్ రోహిత్ రెడ్డే. ఈడీ విచారణ అనంతరం తనపై కేసులు నమోదౌతాయనీ, అరెస్టు చేస్తారనీ అనుమానం వ్యక్తం చేసిన ఆయన నందకుమార్ ఫిర్యాదు మేరకే తనపై కేసులు పెడతారన్నారు. అయినా ఫామ్ హౌస్ లో డబ్బుల చెలామణియే జరగలేదనీ, అలాంటప్పుడు కేసులు ఎలా పెడతారనీ కూడా ప్రశ్నించారు.   అసలు వాస్తవానికి రోహిత్ రెడ్డి నందకుమార్ ద్వారా బీజేపీ పెద్దలు తనను ప్రలోభపెట్టారనీ, పార్టీ మారితే వందకోట్లు ఇస్తామని ప్రతిపాదించారనీ ఆరోపించారు. ఇంతకీ ఈ నందకుమార్ స్వయంగా రోహిత్ రెడ్డికి పార్టనర్. ఈ నేపథ్యంలోనే ఫామ్ హౌస్ కేసులో ఇంత వరకూ బయటపడని మరింత లోతైన వ్యవహారం ఉందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఆ అనుమానాలన్నీ కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో వెల్లడౌతాయని పరిశీలకులు అంటున్నారు. అలా వెల్లడౌతాయన్నకంగారు రోహిత్ రెడ్డి మాటల్లో బయటపడుతోందనీ అంటున్నారు.  మొత్తం మీద సిట్ దర్యాప్తు తో బీఆర్ఎస్ నేతల్లో కనిపించివన ధీమా ఇప్పుడు హైకోర్టు తీర్పుతో సీబీఐ రంగంలోనికి దిగనుండటంతో ఆవిరైపోయినట్లే ఉంది. 

కొవిడ్ ప్రమాదం పొంచే వుంది తస్మాత్ జాగ్రత్త

చైనా, జపాన్‌ సహా పలు ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ప్రభావం మన దేశంలో అంతగా ఉండదు,  మనం భయపడవలసిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని అటు వైద్య రంగ నిపుణులు, అధికారులు భావిచారు. కానీ, తాజా పరిణామాలను గమనిస్తే, కేవలం అప్రమత్తత సరిపోదని, తగిన  ముందు జాగ్రత్త చర్యలు, ఆంక్షలు అనివార్యమయ్యే పరిస్థితి  తప్పదని అంటున్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి వస్తున్న ప్రయాణీకులతో  కొత్త వేరియంట్ వ్యాప్తి వేగంగా జరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. అలాగే నూతన వేడుకల్లో తగిన జాగ్రత్తలు అవసరమని అంటునారు.   ఈ నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది.అలాగే, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా  వైద్య రంగం సన్నద్ధతపై  మంగళవారం(డిసెంబర్ 27) మాక్‌డ్రిల్‌ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.  మరోవంక విదేశాల నుంచి వస్తోన్న ప్రయాణికులకు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు తప్పని సరి చేసింది. అలాగే  విమానాశ్రయాల్లో వెలుగు చూస్తున్న  పాజిటివ్‌ కేసులు విషయంలో తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వారి కాంటాక్టులను ట్రేస్‌ చేయడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అధికారులు ప్రాధాన్యతన ఇస్తున్నారు.అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఎక్కడిక్కడ, ఎప్పటికప్పడు అవసరమైన తక్షణ చర్యలు తీసుకుంటున్నాయి.  ముఖ్యంగా విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు విమానాశ్రయాల్లో కొవిడ్‌ పరీక్షలు చేస్తుండటంతో పలువురికి పాజిటివ్‌గా తేలుతోంది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో 12 మందికి పాజిటివ్‌గా తేలినట్టు అధికారులు తెలిపారు. డిసెంబర్‌ 24న 2867మందికి పరీక్షలు చేయగా.. వారిలో 12మందికి పాజిటివ్‌గా తేలింది. వీరి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపినట్టు కర్ణాటక ఆరోగ్యమంత్రి సుధాకర్‌   వెల్లడించారు.  బిహార్‌లోని గయ విమానాశ్రయంలో నలుగురు విదేశీయులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిలో ముగ్గురు మయన్మార్‌ నుంచి రాగా.. ఒకరు బ్యాంకాక్‌ నుంచి వచ్చినట్టు గుర్తించారు. వారందరిలోనూ లక్షణాల్లేవని.. ఐసోలేషన్‌లో ఉన్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.  మూడు రోజుల క్రితం చైనా నుంచి దిల్లీ మీదుగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాకు వచ్చిన 40 ఏళ్ల వ్యక్తికి కొవిడ్‌-19 సోకిన విషయం తెలిసిందే. అయితే, అతడిని దిల్లీ నుంచి ఆగ్రాకు తీసుకొచ్చిన ట్యాక్సీ డ్రైవర్‌ను అధికారులు గుర్తించారు. కరోనా సోకిన వ్యక్తి ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. అతడితో కాంటాక్టు అయిన 27మందిని గుర్తించి వారి నమూనాలను సేకరించారు. అలాగే, కోల్‌కతా విమానాశ్రయంలో రెండు కొవిడ్‌ కేసుల్ని గుర్తించారు. వీరిలో ఒకరు దుబాయి నుంచి డిసెంబర్‌ 24న రాగా.. మరొకరు మలేషియాలోని కౌలాలాంపూర్‌ నుంచి వచ్చారని అధికారులు తెలిపారు. ఇద్దరి  శాంపిల్స్‌ను సేకరించి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌కు పంపినట్టు కోల్‌కతా విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. విదేశాల నుంచి వస్తున్న వారితో  ముప్పు పొంచి ఉందని గుర్తించిన అధికారులు విమానాశ్రయాల్లో ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు తప్పని సరి చేశారు.  మరోవంక నూతన సంవత్సరం వేడుకలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించాయి. అందులో భాగంగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కును తప్పనిసరి చేస్తున్నట్టు వెల్లడించింది. సినిమా థియేటర్లు, పాఠశాలలు, కళాశాలల్లో మాస్కులు తప్పనిసరి చేసింది. న్యూఇయర్‌ వేడుకల్లో పబ్‌లు, రెస్టారంట్లు, బార్లలో మాస్కు తప్పనిసరిగా ధరించాల్సిందేనని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు. నూతన సంవత్సర వేడుకలకు అర్ధరాత్రి 1గంట వరకే అనుమతి ఉంటుందన్నారు. కరోనా వల్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. ముందు జాగ్రత్తలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితిపై ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ, సీఎస్‌ జవహార్‌ రెడ్డి ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు.  ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. ఆస్పత్రి పరిసరాల్లో మాస్కులను తప్పనిసరి చేసినట్టు డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్‌ వెల్లడించారు.. అన్ని రద్దీ ప్రాంతాల్లో మాస్కు ధరించాలని ఆయన ప్రజలను కోరారు.  ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌ న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీచేసింది. సిబ్బంది, అధికారులు, న్యాయవాదులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆదేశాలు జారీచేసింది. మాస్కు ధరించిన వారికే లోపలికి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.కాగా దేశంలో   సోమవారం(డిసెంబర్ 26) దేశ వ్యాప్తంగా 35,173 టెస్టులు చేశారు.198 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3428కి చేరింది. నిన్న 190మంది కోలుకోవడంతో ప్రస్తుతం రికవరీ రేటు 98.8శాతంగా ఉందని అధికారులు తెలిపారు.

తెలంగాణలో మరో చంద్రోదయం

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని  మళ్లీ బలోపేతం చేసేందుకు, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలకు ప్రజల నుంఛి, ఎలాంటి స్పందన వచ్చిందో ఖమ్మం సభ రుజువు చేసింది. అనూహ్యంగా సభ సక్సెస్ అయింది. అదొక ఎత్తయితే, కేవలం ప్రజల నుంచే కాదు, రాజకీయ పార్టీలు, నాయకుల నుంచి కూడా తెలుగు దేశం పార్టీకి ప్రత్యక్ష, పరోక్ష మద్దతు లభిస్తోందని నాయకుల ప్రకటనలు సూచిస్తున్నాయి. ఒక విధంగా సెంటిమెంట్ తెర తొలిగి పోయిన నేపథ్యంలో, తెలంగాణలో మరో చంద్రోదయం ఖాయంగా కనిపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.  నిజానికి  ఇతర పార్టీలలో ఉన్న మాజీ టీడీపీ నేతలు ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ టచ్ లోకి వెళ్లి నట్లు సమాచారం. అందులో ప్రస్తుతం అధికార బీఆర్ఎస్  కీలక నేతలుగా చెలామణి అవుతున్న నాయకులు కూడా  ఉన్నారని అంటున్నారు. అంతేకాదు ఇప్పటికే కారు దిగి సైకిల్  ఎక్కే కొందరి పేర్లు  రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే  పీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి ఆయన వర్గానికి చెందిన నేతలు సహా  గతంలో తెలుగు దేశం పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కీలక పదవుల్లో ఉన్న ముఖ్యనేతలు కొదంరు తెలుగు దేశం అడుగులను గమనిస్తున్నారని, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. అలాగే  బీజేపీలోని  టీడీపీ మాజీ నాయకులు పసుపు చొక్కాలు పైకి తీస్తున్నారని అంటున్నారు.  అయితే ఇదంతా ఒకెత్తు అయితే  టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే  మాజీ తెరాస మంత్రి ఈటల రాజేందర్  టీడీపీ రీఎంట్రీ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలంగాణ రాజకీయాల్లో రీఎంట్రీకి అవకాశం కల్పించారని అన్నారు. అంతే కాదు. కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని చంద్రబాబు గొప్పగా ఉపయోగించుకుంటారని అన్నారు. తెలంగాణ సక్సెస్ అవుతారని జగ్గా రెడ్డి చెప్పు కొచ్చారు. మరోవంక బీజేపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈటల రాజేందర్  తెలుగుదేశం పార్టీకి తెలంగాణ వాసన, పునాది రెండు ఉన్నాయని అన్నారు. అలాగే టిడిపి ఏమీ నిషేధించిన పార్టీ కాదని, తెలుగు దేశం పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరిస్తామని గతంలో చంద్రబాబు కూడా చెప్పారని ఈటల రాజేందర్ గుర్తుచేశారు. తెలుగుదేశం పార్టీ ఎప్పటినుంచో ఉన్న పార్టీ అని పేర్కొన్న ఈటల దేశంలో ప్రతి పార్టీకి ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు.తెలంగాణ రాష్ట్రంతో టిడిపికి సంబంధం ఉంది కాబట్టే చంద్రబాబు తెలంగాణలో సభలు పెడుతున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు .ప్రజలు టీడీపీని ఆదరిస్తున్నారని కూడా అన్నారు. అంతే కాకుండా తెలంగాణలో టీడీపీ, బీజేపీ పొత్తుకు సంబంధించి ఈటల ఆచి తూచి స్పందించారు.అవునని కాదని అనకుండా, బీజేపీ తెలంగాణలో ఒంటరిగానే విజయం సాధిస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.  అయితే పొత్తుల విషయం ఎలా ఉన్నప్పటికీ  తెలుగు దేశం పార్టీ  తెలంగాణలో మళ్ళీ ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందని ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి  అటు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్  ప్రకటించడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు ఆస్కారం కలిపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల మాటలు దేనికి సంకేతం  అనే చర్చ ఇప్పటికే జోరందుకుంది. ఈటల మాట తీరు, బాడీ లాంగ్వేజ్ గమనిస్తే, బీజేపీ టీడీపీల మధ్య పొత్తు పొడిచే సంకేతాలు స్పష్టమవుతున్నాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. అదెలా ఉన్నప్పటికీ, ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నాయి. నిజానికి, మొదటి నుంచి కూడా తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి ప్రజా బలం, క్యాడర్ నాయకత్వ బలం పుష్కలంగా ఉన్నాయి. అయితే, ఇంతవరకు తెలంగాణ సెంటిమెంట్ తో తెలంగాణ చంద్రుడు (కేసీఆర్) ఓ వెలుగు వెలిగారు. జగ్గారెడ్డి అన్నట్లుగా ఇప్పడు కేసీఆర్ స్వయంగా సెంటిమెంట్ కు టాటా చెప్పేశారు. కేసేఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను వదిలేయడంతో తెలంగాణ రాజకీయ ఆకాశంలో మరో స్వయం ప్రకాశిత చద్రోదయం (చంద్రబాబు) అయ్యే సమయం ఆసన్నమైందని  పరిశీలకులు అంటున్నారు. అలాగే  మరో రెండు మూడు నెలల్లోనే రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా  మారి పోతుందని పరిశీలకులు జోస్యం చెపుతున్నారు.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సర్కార్ కు డబుల్ షాక్

ఇటు భారతీయ జనతా పార్టీ, (బీజేపీ) అటు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రెండు పార్టీల మధ్య, ఇంచుమించుగా సంవత్సరానికి పైగా సాగుతున్న రాజకీయ పోరాటం మరో మలుపు తిరిగింది. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బీజీపీని టీఆర్ఎస్ /బీఆర్ఎస్ ఇరకాటంలోకి నెట్టిన సంగతి తెలిసిందే. ఇఫ్పుడు ఎమ్మెల్యేల బేరసారాల కేసులో రాష్ట్ర హై కోర్టు, కేసీఆర్ ప్రభుత్వానికి షాకిచ్చింది. కేసు విచారణను సిబిఐకి అప్పగించింది.రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ రాష్ట్రంలో కాలు పెట్టకుండా అడ్డుకునేందుకు  జనరల్  కన్సెంట్ రద్దు చేసినా, హై కోర్టు తీర్పుతో ఇప్పుడు సిబిఐ రాష్ట్రంలో ఎంటర్ అవుతుంది. ఇలా రెండు విధాలా రాష్ట్ర ప్రభుత్వానికి  హై కోర్టు డబల్ షాక్ ఇచ్చింది.   కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం ( సిట్) విచారణ పై విశ్వాసం లేదని, విచారణ పారదర్శకంగా జరగట్లేదని, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ కేసులో నిందితులుగా ఉన్న నంద కుమార్, అనుమానితుడిగా ఉన్న అడ్వకేట్ శ్రీనివాస్‌తో పాటు మరో వ్యక్తి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన రాష్ట్ర హై కోర్టు,. కేసును సీబీఐకి అప్పగిస్తూ సంచలన తీర్పు నిచ్చింది.  నిజానికి  సిట్ దర్యాప్తును బీజేపీ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈ నేపధ్యంలోనే సిట్ విచారణపై అనుమానాలున్నాయని ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు, హైకోర్టును కోరారు. న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం సీబీఐకి ఆర్డర్ చేస్తూ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం ఎమ్మెల్యేల కొనుగోలు కేసును హైదరాబాద్ సీపీ ఆనంద్ నేతృత్వంలోని సిట్ విచారణ చేస్తోంది. ఇప్పుడు ఈ కేసును హైకోర్టుకు అప్పగించడంతో విచారణను తిరిగి మొదటి నుంచి ఆరంభించే అవకాశం ఉంది.  అధికార టీఆర్‌ఎస్‌/బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రూ.400 కోట్లతో కొనుగోలు చేసేందుకు కొందరు చేసిన యత్నాన్ని సైబరాబాద్‌ పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన మధ్యవర్తులను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.  టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పైలెట్‌ రోహిత్‌రెడ్డి (తాండూరు), గువ్వల బాలరాజు (అచ్చంపేట), బీరం హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్‌), రేగా కాంతారావు (పినపాక)ను ఢిల్లీకి చెందిన కొందరు వ్యక్తులు సంప్రదించారు. పార్టీ ఫిరాయిస్తే వారికి ఒక్కొక్కరికీ రూ.100 కోట్ల చొప్పున ఇస్తామని.. దాంతోపాటు కాంట్రాక్టులు కూడా ఇప్పిస్తామని ప్రలోభానికి గురిచేసేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన ఎమ్మెల్యేలు దీనిపై తమకు ఫిర్యాదు చేశారని.. తమకు డబ్బులు, కాంట్రాక్టులు, పదవులు ఎర చూపించి పార్టీ మారాలని బలవంతం చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారం మేరకు పక్కా ప్రణాళిక ప్రకారం వల పన్ని ఈ ఆపరేషన్‌ నిర్వహించాం అని స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడించారు. ఫరీదాబాద్‌ ఆలయానికి చెందిన రామచంద్ర భారతి అలియాస్‌ సతీశ్‌ శర్మ, మరొకరు తిరుపతికి చెందిన సింహ యాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈకేసు విచారణకు ఏర్పాటు చేసిన ‘సిట్’ ఏర్పాటు విషయంలో  మొదటి నంచి అనుమనాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ నేతృత్వంలో ఆరుగురు అధికారులతో ఏర్పాటు సెహ్సిన  సిట్  కూర్పు, విషయంలో అనుమనాలు వ్యక్తమయ్యాయి. అలాగే, సిట్ అధికార పరిధిని దాటి తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పద  మయ్యాయి. న్యాయ స్థానాలు సైతం సిట్  గీత దాటిందని పేర్కొన్నాయి. కీలక కేసుల్లో సిట్‌ ఏర్పాటు సాధారణమే అయినా.. డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో దర్యాప్తు బృందాన్ని నియమించడం రాష్ట్రంలో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే తొలిసారి కావడంతో అనుమానాలు మరింతగా బలపడ్డాయి.  ఈ నేపధ్యంలోనే  విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగట్లేదన్న పిటిషర్ల వాదనతో ఏకీభవించింది. ఈ కేసులో సిట్‌ను విచారణను తక్షణమే నిలిపివేయాలని ఆదేశిస్తూ.. సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. ఎలాంటి ఆలస్యం లేకుండా కేసుకు సంబంధించిన వివరాలను సీబీఐకి అప్పగించాలని తీర్పు వెలువరించింది. కాగా.. హైకోర్టు తీర్పుపై సిట్ అప్పీలుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

భేటీకి సిద్ధం..!

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. మళ్లీ తెలుగుదేశం పార్టీ గుటికి తిరిగి వెళ్లిపోతారా? ఆ పార్టీ పగ్గాలు చేపట్టి.. తెలంగాణలో సైకిల్‌ని సవారీ చేయిస్తారా? అందుకోసం ఆయిన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? ఆ క్రమంలో ఆయిన తనదైన శైలిలో పావులు కదుపుతోన్నారా? అంటే రాజకీయ విశ్లేషకులు అవునని అంటున్నారు. ఇటీవల చోటు చేసుకొన్న పరిణామాలే అందుకు సాక్ష్యమని వారు వివరిస్తున్నారు.     తాజాగా తెలంగాణ రాష్ట్రంలో వరుసగా రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయని.. వాటిలో ఒకటి ఖమ్మంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శంఖారావం పేరిట సభ నిర్వహించడం... ఆ సభ కాస్తా సూపర్ సక్సెస్ కావడం.. ఈ సభకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు తరలి రావడం.. అలాగే ఈ సభా వేదికపై నుంచి పార్టీని వదిలి వెళ్లిన వారు ఎవరైనా సరే.. తిరిగి రావొచ్చునంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.. ఆ పార్టీని వదిలి వెళ్లిన వారి గుండెల్లో కొత్త ఆశలు చిగురించాయని రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో పేర్కొంటున్నారు.   ఇక రెండోవది కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు.. సూపర్ సీనియర్లంతా.. తమకు కాకుండా... నిన్న కాక మొన్న పార్టీలోకి వలస వచ్చిన రేవంత్ రెడ్డికి టీపీసీపీ చీఫ్ పగ్గాలు కట్టబెట్టారంటూ.. హస్తం పార్టీలోని కురు వృద్దులంతా తనదైన శైలిలో అసమ్మతి గళం విప్పడం.. ఆ క్రమంలో ధర్నాలు, నిరసనలు, దాడులు.. ప్రతి దాడులకు హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోవడం.. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల మాజీ బాధ్యుడు, హస్తం పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్.. ఎదుటే పంచాయతీ పెట్టడం.. దీంతో వారందరినీ ఈ డిగ్గీరాజా కూల్‌గా.. సైలెంట్‌ చేశారని రాజకీయ విశ్లేషకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.    ఇంకోవైపు తమను వలసవాదులన్నారంటూ ములుగు ఎమ్మెల్యే సీతక్క, వేం నరేంద్రరెడ్డి తదితరులంతా.. తమ పదవులకు రాజీనామా చేసి.. హస్తం పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామన్నారని.. అదీకాక పీసీసీ చీఫ్ పదవి ఇవ్వలేదంటూ ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హస్తం పార్టీ వీడి.. బీజేపీలోకి జంప్ కొట్టగా.. త్వరలో ఆయన సోదరుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం కాషాయం కండువా కప్పుకోనేందుకు సమయత్తమయ్యారని.. వారు ఈ సందర్బంగా పేర్కొంటున్నారు.   మరోవైపు తొలుత రేవంత్ రెడ్డి టీడీపీలోనే ఉన్నారని.. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఆయిన వరుస విజయాలను సైతం అందుకున్నారని.. కానీ రాష్ట్ర విభజన జరగడం.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన హస్తం పార్టీ గుటికి చేరాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు ఈ సందర్బంగా సోదాహరణగా విపులీకరిస్తున్నారు.   అలా హస్తం పార్టీలోకి వెళ్లిన రేవంత్‌రెడ్డికి టీపీసీసీ చీఫ్‌గా ఢిల్లీ అధిష్టానం పగ్గాలు అప్పగించిందని.. అయితే తెలంగాణ తెచ్చింది కారు పార్టీ అధినేత కేసీఆరే అయినా.. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది మాత్రం సోనియా గాంధీ అంటూ ప్రజల్లోకి వెళ్లి బలంగా చెప్పుకోలేని స్థితిలో ఉన్న హస్తం పార్టీ నేతలకు.. రేవంత్ రెడ్డి ఓ బలమైన గొంతుకగా మారారని.. ఆ క్రమంలో ఆయిన హస్తం పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లడమే కాకుండా.. కాంగ్రెస్ పార్టీ పేరుతో సభలు, పాదయాత్రలు చేస్తూ.. తెలంగాణలో ఆ పార్టీని కాంగ్రెసుగుర్రంలా దౌడు తీయిస్తున్నారని ఈ సందర్బంగా రాజకీయ విశ్లేషకులు  అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే తన బహిరంగ సభలకు లక్షలాది మంది ప్రజలను రేవంత్ రెడ్డి స్వచ్చందంగా రప్పించుకోగలుగుతోన్నారు కానీ.... పార్టీలోని నేతలను మాత్రం ఒక తాటిపైకి తీసుకురావడంలో ఆయన పూర్తిగా విఫలమవుతున్నారని వారు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హస్తం పార్టీలోనే ఉండి.. ఆ పార్టీ నేతలతో చెయ్యి.. చెయ్యి కలిపి.. కలిసి నడవడం కంటే.. సైకిల్ పార్టీలోకి వెళ్లిపోయి.. తన పాత మిత్రులతోపాటు వివిధ పార్టీల్లో ఉన్న అసంతృప్తి జీవులను సైతం మళ్లీ పసుపు పార్టీలోకి తీసుకు వచ్చి.. వారందరిని ఏకం చేసి.. అడుగులో అడుగు వేసుకొంటూ కలిసి నడిస్తే.. సైకిల్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావచ్చుననే ఓ ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.   అదీకాక టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కి ఆయన ప్యామిలీకి ఇప్పటికే బీజేపీతో వ్యవహారం ఉప్పు నిప్పుగా ఉందని... అలాగే టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్‌గా మారడంతో.. ఆ పార్టీలోని తెలంగాణను వదిలేసి.. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లిపోయారంటూ ఓ ప్రచారం అయితే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో తెగ హల్‌చల్ చేస్తోందని వారు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. అయితే ఈ ఇలాంటి సమయంలో బీజేపీకి ఏమో కానీ.. సైకిల్ పార్టీకి మాత్రం మంచి బలం పుంజుకోనే సమయమని వారు విశ్లేషిస్తున్నారు. ఓ వేళ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీని వీడి..తన పాత పార్టీలోకి వెళ్లితే.. సైకిల్ పార్టీ దెబ్బకు కారు పార్టీ.. తెలంగాణలో షికారు చేయడం కష్టమని.. అలాగే కాషాయ పార్టీ నేతలకు సైతం అసలు సిసలు బొమ్మ.. ఈస్ట్‌మన్ కలర్‌లో పోలిటికల్ స్క్రీన్ మీద కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో ఓ అంచనా వేసి మరీ  చెబుతున్నారు.

ఏపీలో ఎస్సీఎస్టీ నియోజకవర్గాలపై శ్రీ ఆత్మసాక్షి సర్వే.. ఏం తేల్చిందంటే..

జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అది విభిన్న రూపాల్లో వ్యక్తమవుతోంది. దాంతో జగన్ పాలనకు చరమగీతం పాడేందుకు వచ్చే ఎన్నికలే అత్యంత కీలకం. అయితే ఆ క్రమంలో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వీనియోగం చేసుకొంటూ..  జగన్ పార్టీలోని లోపాలను.. ప్రతిపక్ష టీడీపీ... బలంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లగలిగితే.. సైకిల్ సవారీ చేసినంత ఈజీగా..  తెలుగుదేశం పార్టీ అధికార పీఠాన్ని హస్తగతం చేసుకోగలుగుతుంది.  అయితే ప్రతి నియోజకవర్గంలోని టీడీపీ ఇన్‌చార్జులను నియమించడం.. అలాగే ఇన్‌చార్జులు లేని నియోజకవర్గంలో వారిని నియమించడం.. వారి ద్వారా నియోజకవర్గ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు లీడర్ నుంచి కేడర్ వరకు అందరిని ఒకే తాటిపైకి తీసుకు వస్తేనే విజయం తెలుగుదేశం సొంతం అవుతుంది. ఈ విషయాన్ని శ్రీ ఆత్మసాక్షి సంస్థ (ఎస్ఎఎస్) నిర్వహించిన సర్వే  తేటతెల్లం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 29 ఎస్సీ , 7 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి.   ఆయా నియోజకవర్గాల్లో అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, ప్రతిపక్ష టీడీపీ పరిస్థితిపై శ్రీ ఆత్మసాక్షి ( ఎస్ ఏ ఎస్ ) గ్రూప్ సర్వే ప్రకారం   ఎస్సీ నియోజకవర్గాల విషయానికి వస్తే...    ఈ నెల 24 వరకూ నిర్వహించిన సర్వేలో పార్టీల పరిస్థితి, ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ పై చేయి సాధిస్తుంది. జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు ఉంటే ఏ మౌతుంది. పొత్తే లేకుండా ఆ రెండు పార్టీలూ వేర్వేరుగా రంగంలోకి దిగితే ప్రయోజనం సిద్ధించేది ఏ పార్టీకి తదితర అంశాలపై   ఆసక్తి కర ఫలితాలు వెలువడ్డాయి.  కొన్ని ఎస్సీ నియోజకవర్గాలలో అధికార వైసీపీ తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నప్పటికీ.. ఆ  పార్టీ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయినప్పటికీ, ఆయా నియోజకవర్గాలలో  తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా లేదు. గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్పప్పటికీ ఆ అవకాశాలను అందిపుచ్చుకునే స్థాయిలో తెలుగుదేశం పని తీరు లేదు. ఇలాంటి 15 నియోజకవర్గాలపై తెలుగుదేశం  మరింత నిశిత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. శ్రీ ఆత్మసాక్షి సర్వే ప్రకారం పార్వతీపురం, పి.గన్నవరం, అమలాపురం, గోపాలపురం, చింతలపూడి, పామర్రు, తిరువూరు, సత్యవేడు, అలాగే పూతలపట్టు, రైల్వే కోడూరు, ప్రత్తిపాడు, మడకశిర, నంది కొట్కూరు, గంగాధర నెల్లూరు నియోజకవర్గాలలో అధికార వైసీపీ ప్రజా విశ్వాసాన్ని  కోల్పోయింది.  ఆయా నియోజకవర్గాలలో తెలుగు దేశం పని తీరు కూడా అంతంత మాత్రంగానే ఉంది. 2024 ఎన్నికలలో మంచి ఫలితాలు సాధించాలంటే ఈ నియోజకవర్గాలపై తెలుగుదేశం మరింత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక మొత్తంగా చూస్తే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నియోజకవర్గాలలో తెలుగుదేశం కంటే వైసీపీ అనుకూల వోటే ఎక్కువగా ఉంది. అయితే 2019 ఎన్నికలతో పోలిస్తే ఎస్సీఎస్టీ మైనారిటీలలో యువ వోటర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇక  కొన్ని అసెంబ్లీ స్థానాలలో ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడంలో తెలుగుదేశం విఫలమైంది. అలాగే బలహీనమైన నియోజకవర్గ  ఇన్ చార్జల కారణంగా ఈ సీట్లలో తెలుగుదేశం వెనుకబడింది. ప్రస్తుత ఇన్ చార్జీల పని తీరు పట్ల పార్టీ క్యాడర్ లోనూ ప్రజలలోనూ అసంతృప్తి గూడుకట్టుకుంది.  శ్రీ ఆత్మసాక్షి సర్వే ప్రకారం రాష్ట్రంలోని ఎస్సీ నియోజకవర్గాల వారీగా ఫలితాలిలా ఉన్నాయి...   శ్రీకాకుళం జిల్లా రాజాంలో వైసీపీ కంటే తెలుగుదేశందే పై చేయిగా ఉంది. ఇక్కడ అధికార వైసీపీ కంటే తెలుగుదేశం వైపు 3.7శాతం మొగ్గు కనిపిస్తోంది. అయితే కొంత మంది తెలుగుదేశం నాయకుల పని తీరు సంతృప్తి కరంగా లేదు.  తెలుగుదేశం ఇన్ చార్జ్ కి సహకారం అందించడం లేదు. మొత్తంగా రాజాం నియోజకవర్గ  తెలుగుదేశంలో గ్రూపు రాజకీయాలు ఉన్నాయి.  అలాగే విశాఖపట్నం జిల్లా పాయకరావు పేట నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే పని తీరు పట్ల తీవ్ర అసంతృప్తి ఉంది. తెలుగుదేశం కంటే ఇక్కడ వైసీపీకి 30 శాతం తక్కువగా  అనుకూలత కనిపిస్తోంది. మొత్తం మీదఈ నియోజకవర్గంలో  హోరాహోరీ పోరు ఉంటుంది. పాయకరావు పేట నియోజకవర్గంలో జనసేనకు 18 శాతం ఓటు బ్యాంకు ఉందన్న అంచనాల ప్రకారం ఈ నియేజకవర్గంలో జనసేనతో పొత్తు లేకుండా పోటీ చేస్తే  తెలుగుదేశం ఒటమి పాలయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయి. అదే వైసీపీ 2024 ఎన్నికలలో ఈ స్థానంలో కొత్త అభ్యర్థిని నిలబెడితే కనుక సమీకరణాలు మారిపోయే అవకాశాలు ఉన్నాయి.  ఇక విజయనగరం జిల్లా పార్వతీపురం అసెంబ్లీ స్థానం విషయానికి వస్తే.. ఇక్కడ తెలుగుదేశం, వైసీపీల మధ్య గట్టి పోటీ ఉంది. ఇరు పార్టీల మధ్య కేవలం 1.5శాతం ఓట్ల తేడా మాత్రమే ఉంది. ఇక్కడ వైసీపీకి 1.5 శాతం మొగ్గు కనిపిస్తోంది. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జల్లా రాజోలు నియోజకవర్గం విషయానికి వస్తే.. ఇక్కడ జనసేన పార్టీకి 4 శాతం మెగ్గు కనిపిస్తోంది. ఈ స్థానంలో తెలుగుదేశం పార్టీ మూడో స్థానానికే పరిమితమౌతుంది.   ఇదే జిల్లా పీ. గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే పనితీరు 30 శాతం కంటే తక్కువగా ఉంది. ఈ నియోజకవర్గంలో వైసీపీ కంటే తెలుగుదేశం, జనసేనల పరిస్థితి మెరుగ్గా ఉంది. అయితే ఓట్ల చీలిక కారణంగా వైసీపీకి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. అలాగే అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీకి ఇన్ చార్జి లేడు. స్థానిక ఎమ్మెల్యే పనితీరు పట్ల వ్యతిరేకత ఉంది. ఇక్కడి ఎమ్మెల్యేకు 27 శాతం కంటే తక్కువ మద్దతు ఉంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేవం, జనసేన పార్టీలకు ప్రజామద్దతు ఉంది. ఇక్కడ వైసీపీ మూడో స్థానానికే పరిమితం కాక తప్పదు. అయితే ఇక్కడ గెలుపు అన్నది తెలుగుదేశం, జనసేన పొత్తుపై ఆధారపడి ఉంటుంది. ఈ నియోజకవర్గంలో జనసేనకు 16 శాతం ఓటు షేరు ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గలో ప్రస్తుతానికి తెలుగుదేశం కంటే 4.5 శాతం మొగ్గు ఎక్కువ ఉంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పని తీరు ఏ మాత్రం మెరుగ్గా లేదు. తెలుగుదేశం ఈ నియోజకవర్గ ప్రజల విశ్వాసాన్ని పొందడంలో విఫలమైంది. ఈ నియోజకవర్గంలో  మెరుగైన ఫలితం సాధించాలంటే.. ప్రజల విశ్వాసాన్ని పొందిన వ్యక్తిని ఇన్ చార్జిగా నియమించాల్సి ఉంది. ఇదే జిల్లాలోని గోపాల పురం నియోజకవర్గంలో తెలుగుదేశం పట్ల ప్రజా విశ్వాసం బొత్తిగా తక్కువగా ఉంది. ఇక్కడి తెలుగుదేశం ఇన్ చార్జిపై ప్రజా వ్యతిరేకత గరిష్టంగా ఉందని సర్వే తేల్చింది. వైసీపీపై కూడా ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అవకాశాలు లేవని సర్వే ఫలితం పేర్కొంంది. ఇక్కడ మెరుగైన ఫలితం సాధించాలంటే తెలుగుదేశం పార్టీ సమర్ధుడైన అభ్యర్థిని నిలబెట్టాల్సి ఉంది.  ఇక నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే పని తీరు 20శాతం కంటే దిగువన ఉంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పనీ తీరు ఏ మంత ఆశాజనకంగా లేదు.  ప్రస్తుత ఎమ్మెల్యే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఇక్కడ కనుక వైసీపీ కొత్త అభ్యర్థిని నిలబెడితే 2024 ఎన్నికలో ఆ పార్టీ విజయం సాధిస్తుంది. తెలుగుదేశం ఇక్కడ మెరుగైన ఫలితం సాధించాలంటే మాత్రం ప్రస్తుత ఇన్ చార్జిని మార్చి 2024 ఎన్నికలలో కొత్త అభ్యర్థిని నిలబెట్టాలి. ఇదే జిల్లా సూళ్లూరు పేట నియోజకవర్గంలో కూడా వైసీపీకే స్వల్ప ఆధిక్యత కనిపిస్తోంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కంటే వైసీపీకి 3.5శాతం ఓటు షేరు ఆధిక్యత ఉంది. ఇక్కడ తెలుగుదేశం ఇన్ చార్జి పని తీరు కారణంగా ఆ పార్టీ ప్రజా విశ్వాసాన్ని పొందడంలో విఫలమైంది. ఇక్కడ  తెలుగుదేశం పుంజుకోవాలంటే బాగా కష్టపడటంతో పాటు వ్యూహాత్మకంగా ముందుకు సాగాలి. లేదా కొత్త ఇన్ చార్జ్ ని నియమించాలి. ప్రకాశం జిల్లా కొండెపి విషయానికి వస్తే.. ఇక్కడ వైసీపీ కంటే తెలుగుదేశం పార్టీకే మొగ్గు కనిపిస్తోంది. వైపీసీ కంటే 4.5 శాతం అధిక ఓటు షేరుతో  తెలుగుదేశం ముందుంది. వైసీపీ పని తీరు పట్ల ప్రజలలో వ్యతిరేకత అధికంగా ఉంది. ఈ నియోజకవర్గంలో వైసీపీ కొత్త అభ్యర్థిని నిలబడితే సమీకరణాలు మారే అవకాశాలు ఉన్నాయి. ఇదే జిల్లా సంతనూతల పాడు అసెంబ్లీ నియోజకవర్గంలోసిట్టింగ్  ఎమ్మెల్యే పని తీరు పట్ల ప్రజలలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోంది. తెలుగుదేశం పని తీరు కూడా ఏమంత మెరుగ్గా లేదు. ఈ నియోజకవర్గంలో పరిస్థితిని మెరుగు పరుచుకోవడానికి తెలుగుదేశం మరింత దృష్టి పెట్టాలి. ప్రస్తుతానికి అయితే తెలుగుదేశం పని తీరు సంతృప్తికరంగా లేదు. వైసీపీ కనుక ఇక్కడ కొత్త అభ్యర్థిని ప్రవేశపెడితే సమీకరణాలు మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే సంతనూతల పాడు నియోజకవర్గంలో వైసీపీ కంటే తెలుగుదేశం పార్టీ  1 నుంచి 1.5 శాతం ఓటు షేరుతో ఆధిక్యత కనబరుస్తోంది.  ఇక ఎర్రగొండ పాలెం అసెంబ్లీ నియోజకవర్గంలో  ప్రస్తుతం వైసీపీ మెరుగైన స్థితిలో ఉంది. తెలుగుదేశం పార్టీ కంటే నాలుగు శాతం ఓటు షేరు ఆధిక్యతతో ఉంది. ఈ నియోజకవర్గంపై తెలుగుదేశం ఇన్ చార్జి మరింత దృష్టి పెట్టి  అలాగే అన్ని సమాజిక వర్గాలకూ పార్టీని చేరువ చేయడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంది. లేకుంటే  ఎర్రగొండ పాలెం వైసీపీ ఖాతాలో పడుతుంది. అనంతపురం జిల్లా  సింగనమల అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే పని తీరు పట్ల ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. ఇక్కడ తెలుగుదేవం పార్టీ 2.5శాతం అధిక వోటు షేరుతో ఆధిక్యత కనబరుస్తోంది. అయితే తెలుగుదేశం ఇన్ చార్జికి కొంత మంది పార్టీ నాయకులు సహకరించడం లేదు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో గ్రూపు తగాదాలు ఉన్నాయి. ఇక్కడ పార్టీ హై కమాండ్ ప్రత్యేక దృష్టి సారించి గ్రూపు రాజకీయాలను కంట్రోల్ చేయాల్సన అవసరం ఉంది.  మడకశిర నియోజకవర్గంలో ప్రస్తుతానికి తెలుగుదేశం కంటే మొగ్గు వైసీపీ వైపే ఉంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం ఇన్ చార్జి పని తీరు అసంతృప్తికరంగా ఉంది.  ఈ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టి క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపాల్సి ఉంది. చిత్తూరు జిల్లా సత్యవేడు  నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం కంటే వైసీనీ 4శాతం ఓటు షేరుతో ముందంజలో ఉంది. ఈ నియోజకవర్గంలో సరైన ఇన్ చార్జిని నియమించడంలో తెలుగుదేశం విఫలమైంది. ప్రస్తుత ఇన్ చార్జితో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం 2024 ఎన్నికలలో విజయం సాధించే అవకాశాలు లేవు. ఈ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఒకింత భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ వైసీపీ, తెలుగుదేశం పార్టీలకు వచ్చే ఎన్నికలో పోటీ చేసేందుకు సరైన ఎస్సీ అభ్యర్ది అవసరం ఉంది. ఇదే జిల్లా పూతల పట్టు నియోజకవర్గంలో కూడా 4.5 శాతం ఓట్ల షేరుతో తెలుగుదేశం కంటే వైసీపీ ఆధిక్యత కనపరుస్తోంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలమైన ఇన్ చార్జిని నియమించడమే కాకుండా, పార్టీ క్యాడర్ లో ఉత్సామాన్ని నింపక పోతే పూతల పట్టు వైపీసీ ఖాతాలో పడే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ఇక గంగాదర నెల్లూరు విషయానికి వస్తే.. ఇక్కడ వైసీపీ కంటే  తెలుగుదేశం  వైపు మొగ్గు కనిపిస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.  అయితే ఇక్కడ ప్రజలలో విశ్వాసం కల్పించడంలో తెలుగుదేశం ఇన్ చార్జ్ విఫలమయ్యారు. ఇక్కడ 2024లో మెరుగైన ఫలితం సాధించాలంటే తెలుగుదేశం పార్టీ పటిష్టతపై దృష్టి సారించాలి. దే సమయంలో అవసరం అనుకుంటే ఇక్కడ కొత్త అభ్యర్థిని నిలబెట్టాలి.  గుంటూరు జిల్లా తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి వైసీపీ కంటే 3.25శాతం ఓటు షేరుతో ముందుంది. అయితే ఈ నియోజకవర్గంలో కొందరు తెలుగుదేశం నాయకులు ప్రస్తుత ఇన్ చార్జికి సహకరించడం లేదు. ఈ నియోజకవర్గంలో గ్రూపు తగాదాలపై తెలుగుదేశం అధిష్టానం దృష్టి సారించాల్సి ఉంది.  ఇదే జిల్లా వేమూరు నియోజకవర్గంలో వైసీపీ తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ప్రస్తుత ఎమ్మెల్యే పని తీరు పట్ల ప్రజలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. ప్రస్తుతం వైసీపీ కంటే 2.75శాతం ఓటు షేరుతో తెలుగుదేశం ఆధిక్యత కనబరుస్తోంది.  ఇక ప్రత్తిపాడు నియోజకవర్గంలో కూడా వైసీపీ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ప్రస్తుత ఎమ్మెల్యే పని తీరు పట్ల ప్రజలలో అసంతృప్తి వ్యక్తమౌతోంది. అదే సమయంలో తెలుగుదేశం ఇన్ చార్జి ఇక్కడ ప్రజా విశ్వాసం పొందడంలో విఫలమయ్యారు. ఇక్కడ మెరుగైన ఫలితం సాధించాలంటే టీడీపీ ఇన్ చార్జిని మార్చాల్సి ఉంటుంది. లేకుంటే ఈ నియోజకవర్గం వైసీపీ ఖాతాలో పడే అవకాశం ఉంది. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే పని తీరు పట్ల ప్రజా వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ఇక్కడ తెలుగుదేశంలో గ్రూపు తగాదాలు ఉన్నాయి. అలాగే నియోజకవర్గ ఇన్ చార్జి పని తీరు కూడా సంతృప్తికరంగా లేదు. ప్రస్తుతం ఇక్కడ తెలుగుదేశం పార్టీ కంటే 4.75 శాతం ఓటు షేరు ఆధిక్యతతో వైసీపీ ముందుంది.  కొడుమూరు నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కంటే వైసీపీ 1.25 శాతం ఓటు షేరుతో ఆధిక్యత కనబరుస్తోందిజ ఇక కృష్ణా జిల్లా పామర్రు నియోజవకర్గంలో అయితే తెలుగుదేశం కంటే వైసీపీ మెరుగైన పరిస్థితిలో ఉంది.  ఇక్కడ  అధికార పార్టీ పట్ల 6.25శాతం అధిక ఓటు షేరుతో మొగ్గు కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో పుంజుకోవాలంటే తెలుగుదేశం మరింత దృష్టి పెట్టి ప్రజలకు చేరువ కావడానికి కష్టపడాలి. అలాగే నందిగామ నియోజకవర్గంలో కూడా వైసీసీ 1.75శాతం ఓటు షేరుతో తెలుగుదేశం కంటే మెరుగైన స్థితిలో ఉంది. అధికార పార్టీపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ దానికి అనుకూలంగా మార్చుకోవడంలో తెలుగుదేశం పార్టీ విఫలమైంది. ఈ నియోజకవర్గంపై తెలుగుదేశం మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రజలలో విశ్వాసం కల్పించడమే కాకుండా పార్టీ బలో పేతానికి చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.  తిరువూరులో ప్రస్తుతానికి   తెలుగుదేశం, వైసీపీల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం, వైసీపీల మధ్య ఓటు షేరు శాతం కేవలం1.25 శాతం మాత్రమే.  ఇక్కడ ఇరు పార్టీలూ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కడప జిల్లా బద్వేల్ విషయానికి వస్తే ఇక్కడ  వైసీపీ ఇన్ చార్జి, క్యాడర్ పని తీరు తెలుగుదేశంతో పొలిస్తే 9 శాతం మెరుగ్గా ఉంది. తెలుగుదేశం  ఇన్ చార్జి పని తీరు ఏ మాత్రం సంతృప్తి కరంగా లేదు. ప్రజా విశ్వాసం చూరగొనడంలో పార్టీ ఇన్ చార్జ్ క్యాడర్ విఫలమయ్యారు.  రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీయే అధిక్యత కనబరుస్తోంది. తెలుగుదేశం పార్టీ కంటే 2.5శాతం ఓటు షేరుతో ముందుంది. ఈ నియోజకవర్గ తెలుగుదేవం ఇన్ చార్జ్ ప్రజా విశ్వాసం చూరగొనడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.  తొలుత ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ప్రస్తుత అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ప్రతిపక్ష టీడీపీ కంటే 5 శాతం ఓట్ల షేర్‌తో ముందంజలో ఉంది. స్థానికంగా టీడీపీ పని తీరు ఆశించిన స్థాయిలో లేదు.... అలాగే స్థానిక నియోజకవర్గ ఇన్‌చార్జ్ సైతం.... పార్టీ కేడర్‌తోపాటు ప్రజల్లో ఆత్మ విశ్వాసం నింపడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో సదరు నియోజకవర్గంపై టీడీపీ మరింత దృష్టి సారించాల్సి ఉంది.  ఇక ఉమ్మడి విజయనగరంలోని కురుపాం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ప్రస్తుత అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయింది. అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే పనితీరుపై దాదాపు 30 శాతం మంది ప్రజలు పెదవి విరుస్తున్నారు. మరోవైపు ఈ నియోజకవర్గ ప్రజల్లో.. ఈ ప్రభుత్వంపై బాగానే అసంతృప్తి గూడు కొట్టుకొని ఉంది. ఇక స్థానిక తెలుగుదేశం పార్టీలో గ్రూప్ రాజకీయాలతో సతమతమవుతోంది. అంతేకాదు.. ఈ నియోజకవర్గానికి సరైన టీడీపీ ఇన్‌చార్జ్‌ కూడా లేకపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం.  అలాగే సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ టీడీపీ కంటే అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3.5 శాతం ఓట్ల షేరుతో అధిక్యంలో ఉంది. అయితే ప్రస్తుత పార్టీ ఇన్‌చార్జ్‌ మరింత కష్టపడడంతోపాటు.. పార్టీ కేడర్‌లోనే కాకుండా ప్రజల్లో సైతం విశ్వాసాన్ని కల్పిస్తే.. విజయం నల్లేరు మీద నడకలా సాగిపోనుందనేది సుస్పష్టం.  ఇక ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అరకు నియోజకవర్గంలో అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య 2 శాతం ఓట్ల షేరింగ్ ఉంది. దీంతో ఈ నియోజకవర్గంలో ఇరు పార్టీల మధ్య హోరా హోరి పోరాటం జరగుతోంది.  అయితే ప్రస్తుతం.. టీడీపీ కంటే అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిక్యంలో ఉంది. ఇక స్థానిక ప్రస్తుత టీడీపీ ఇన్‌చార్జీ.. సరైన పనితీరు కనబరచడం లేదు. అంతేకాదు.. పార్టీ కేడర్‌లో సైతం సరైన రీతిలో ఆత్మవిశ్వాసం నింపలేకుండా సదరు ఇన్ చార్జ్ ఉన్నారు. మరోవైపు గ్రామ, మండల స్థాయిలోని కేడర్ సైతం..ఈ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌కు సరైన రీతిలో సహకరించడం లేదు. ఈ నేపథ్యంలో సదరు నియోజకవర్గంపై టీడీపీ మరింత ప్రత్యేక శ్రద్ద కనబరచాల్సి ఉంది.  అలాగే ఇదే జిల్లాలోని పాడేరు నియోజకవర్గంలో అటు అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రతిపక్ష టీడీపీ పరిస్థితి దొందు దొందుగానే ఉన్నాయి. ఇక్కడ ఈ రెండు పార్టీల నాయకులు పనితీరు ఏ మాత్రం బాగోలేదనే చెప్పాలి. అధికార వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పనితీరు 35 శాతం కంటే తక్కువగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. అలాగే గ్రూప్ రాజకీయాలతో.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సతమతమవుతోంది. ఇక టీడీపీ ఇన్‌చార్జ్ పనితీరు సైతం ఆశించిన స్థాయిలో అయితే లేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గ పలితం మాత్రం.. ఇరు పార్టీలు నిలబెట్టే అభ్యర్థులపై ఆధారపడి ఉంటాయన్నది సుస్పష్టంగా గోచరిస్తోంది. ఇక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పనితీరు.. 25 శాతం కంటే తక్కువగానే ఉంది. అలాగే ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని సాక్షాత్తూ ఎమ్మెల్యేకు సైతం అర్థమైపోయింది. మరోవైపు టీడీపీ పనితీరు సైతం ఏ మాత్రం బాగోలేదు. అంతేకాదు.. బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపడంలో సైతం.. సైకిల్ పార్టీ ఘోరంగా విఫలమైంది. అయితే ఈ నియోజకవర్గంలో గెలుపు కోసం మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవాలంటే మాత్రం ప్రస్తుత ఇన్‌చార్జీని ముందుగా మార్చాలని.. అలాకాకుంటే.. సైకిల్ పార్టీ గెలుపు చాలా కష్టమని స్పష్టమవుతోంది.  ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏకైక ఎస్టీ నియోజకవర్గం...పోలవరం. ఈ నియోజకవర్గంలో టీడీపీ కంటే.. వైయస్ఆర్ సీపీ 5 శాతం ఓట్లతో ముందంజలో ఉంది. అయితే ప్రస్తుత టీడీపీ ఇన్‌చార్జీ అయితేనేమీ.. పార్టీ కేడర్ అయితేనేమీ ప్రజల్లోకి బలంగా వేళ్లింది అయితే లేదు. అంతేకాదు.. ఓటర్లు, ప్రజల విశ్వాసం చూరగొనడంలో.. ఆ పార్టీ ఘోరంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవాలంటే మాత్రం బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాల్సిందే.  అయితే వచ్చే ఎన్నికల్లో రంపచోడవరం, పాడేరు, కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాల్లో తెలుగుదేశం జెండా రెపరెపలాడాలంటే మాత్రం.. ఆయా నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థిని అనేకంటే బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలి. అలాగే నియోజకవర్గ ఇన్‌చార్జులు..  ఓవైపు తమ పనితీరును మెరుగుపరుచుకొంటూ.. మరోవైపు పార్టీలోని వారందరిని ఒకే తాటిపైకి తీసుకురావడం కోసం కృషి చేయాలి. తద్వారా సైకిల్ పార్టీ గెలుపు సునాయాసం అవుతోందని శ్రీ ఆత్మ సాక్షి నిర్వహించిన సర్వే ద్వారా తేటతెల్లమవుతోంది.

రంగా చుట్టూ ఏపీ రాజకీయం

వంగవీటి మోహన్ రంగా.. పరిచయం అవసరం లేని పేరు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ రాజధానిగా పేరొందిన బెజవాడ ( విజయవాడ)కు ఎంత పేరుందో, బెజవాడ కేంద్రంగా రాజకీయ చక్రం తిప్పిన, దివంగత కాపు నేత వంగవీటి మోహన రంగాకూ అంతే పేరుంది.  అప్పుడే కాదు  ఆయన కన్నుమూసి మూడు దశాబ్దాలకు పైగా అయిన ఈ నాటికీ, రంగా పేరు ఏపీలో  పొలిటికల్  వైబ్రేషన్స్ సృష్టిస్తున్నది. నిజానికి,  రంగాను కాపులు మాత్రమే కాదు బడుగు బలహీన వర్గాలు పేదలందరూ తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు. రాజకీయ పండితులు బడుగు బలహీన వర్గాలు పొలిటికల్ లెజెండ్ గా రంగాను అభివర్ణిస్తారు. ఆయన అకాల మరణం తరువాత ఆ స్థాయి  ఉన్న బలమైన నాయకుడు కాపులకు లభించలేదు. అయితే మోహన్ రంగా భౌతికంగా లేకున్నా..ఆయన ఇచ్చిన స్ఫూర్తి అంతా ఇంతా కాదు. ఎన్నికలు వచ్చిన ప్రతి సారీ రంగా పేరు మార్మోగుతుంది.ఇప్పడూ అదే జరుగుతోంది. అందరి వాడుగా పేదల గుండెల్లో నిలిచిన రంగా మావాడంటే మావాడు అని తమ సొంతం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. రంగా బొమ్మ పెట్టుకుని కాపులు, బడుగు బలహీనవర్గాల వారి ఓట్లను కొల్ల గొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. రంగా కన్నుమూసిన తర్వాత  జరిగిన ప్రతి ఎన్నికలోనూ రంగా పేరు గెలుపు ఓటములను నిర్ణయించే ఒక ఫాక్టర్ గా నిలిచింది అంటే అతిశయోక్తి కాదు. నిజానికి రాష్ట్రంలో ఇప్పడు ఎన్నికలు లేవు, కానీ, ఎన్నిక వాతావరణం వుంది. అందుకే రంగా వర్ధంతి సందర్భంగా రాజకీయ చలి మంటలు భగ్గుమంటున్నాయి. అందుకే  పార్టీలు, పార్టీలకు అతీతంగా నాయకులు  పోటీపడి మరీ రంగాకు జై కొడుతున్నారు. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా, విజయవాడలో రంగా విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. అదలా ఉంటే, గతంలో రంగా పేరు చెప్పుకుని ఓట్లు దండుకున్న వైసీపీ, ఆ తర్వాత రంగా వారసుడు, ఆయన కుమారడు వంగవీటి రాధాకృష్ణకు అన్యాయం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు గుర్తు చేస్తున్నారు. రాధాకృష్ణకు టిక్కెట్ ఇవ్వకుండా జగన్ మోసం‌ చేశారని.. ఇప్పుడు ఆ పార్టీ నాయకులు రాజకీయ అనవసరాల కోసం డైలాగ్ లు చెబుతున్నారని రంగా, రాధా అభిమానులు ఆక్షేపిస్తున్నారు. రాధా సేవలను తొమ్మిదేళ్లు ఉపయోగించుకుని, జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో మొండి చేయి చూపించారని, అయిఆ ఆనాడు నోరు విప్పని వైసీపీ నాయకులు ఆయన్ని ఎందుకు ప్రశ్నించలేదు .. ఈ రోజు ఏముఖం పెట్టుకుని, రంగా వర్దంతికి వచ్చారని  వంగవీటి అభిమానులు వైసీపీ  నేతలను ప్రశ్నిస్తున్నారు.  అందుకే  రాధా, రంగా అభిమానులు వచ్చే ఎన్నికల్లో జగన్‌కు తగిన బుద్ది చూపుతారని పరిశీలకులు అంటున్నారు. కొత్త జిల్లాకు రంగా పేరు పెట్టాలని‌ కోరినా..  జగన్ స్పందించ లేదని,  వైఎస్సార్‌సీపీ నాయకులపై  ఫైర్’ అవుతున్నారు. మరోవంక  ఈ సంవత్సరం మొదట్లో  వంగవీటి రాధ హత్యకు ‘రెక్కి’ జరిగిన నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రాబాబు నాయుడు స్వయంగా ఇంటికి వెళ్లి పలకరించడమే కాకుండా.. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిజానికి రాధా తెలుగు దేశం పార్టీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అందుకే, రంగా అభిమానులు మరో మారు, తెలుగుదేశం విజయం కోసం కృషి చేస్తామని రాగా సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు.

ఏపీ బీజేపీలో ముసలం.. జల్లా అధ్యక్షుల మార్పుపై రగడ

అధిష్ఠానం మాటే శిరోధార్యం.. క్రమశిక్షణ కు మారు పేరు.. ఇదీ నిన్న మొన్నటి దాకా బీజేపీపై జనాలలో సాధారణంగా ఉన్న అభిప్రాయం.  అయితే ఈ అభిప్రాయాన్ని మార్చుకోక తప్పని అనివార్య పరిస్థితులను స్వయంగా ఆ పార్టీ అగ్రస్థానమే కల్పిస్తోంది. గతానికి భిన్నంగా పార్టీ తలుపులు బార్లా తెరిచేసి సిద్ధాంత సారూప్యత ఇసుమంతైనా లేని పార్టీల నుంచి వచ్చి చేరుతున్న నాయకులకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. దీంతో బీజేపీ గతంలోలా అధిష్ఠానం ఏం చెబితే దానికి తలూపేసి క్రమశిక్షణతో మెలిగే నాయకుల సంఖ్య రాను రాను మారిపోతోంది. గతంలో బీజేపీ ఏ పార్టీ సంస్కృతినైతే వేలెత్తి చూపి ప్రత్యామ్నాయంగా ఎదిగిందో..  ఇప్పుడు అదే కాంగ్రెస్ సంస్కృతిని అనుసరిస్తూ.. ఆ పార్టీని మించి పోయింది. ఇక తాజాగా ఏపీ బీజేపీలో లుకలుకలు బయటపడ్డాయి. ఏపీ బీజేపీ జిల్లా కమిటీల మార్పు విషయంలో పార్టీలో తిరుగుబావుటా ఎగిరింది. ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజు పదవీ కాలం ఇంకా ముగియకుండానే, ఆయన పదవిలో ఉండగానే జిల్లా కమిటీల మార్పు ప్రక్రియ మొదలు కావడం బీజేపీలో అసమ్మతి, అసంతృప్తి జ్వాలలు ఎగసిపడేలా చేసింది. జిల్లా అధ్యక్షుల మార్పునకు రాష్ట్ర నాయకత్వం శ్రీకారం చుట్టగానే అసమ్మతి భగ్గు మంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మురళీధరన్ కు ఇష్టం లేకుండానే, ఆయన ప్రమేయం లేకుండానే  పెద్ద ఎత్తున జిల్లా అధ్యక్షులనుమార్చేందుకు రాష్ట్ర నాయకత్వం నడుం బిగించింది.   పార్టీ నిబంధనల ప్రరాకం  ఓటింగు ద్వారా  ఎన్నికల ప్రక్రియలో గెలిచిన తమను తొలగించి,   నామినేషన్ పద్ధతిలో మరొకరిని నియమించేందుకు సోము వీర్రాజు చేస్తున్న ప్రయత్నాలను పార్టీ లో  మెజారిటీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.    బీజేపీ జాతీయ అధ్యక్షుడు నద్దా తో పాటే రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల పదవీ కాలం కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది.   నిన్న మొన్నటి వరకూ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి నడ్డాకు అవకాశం ఖాయమన్న ప్రచారమే జరుగుతూ వచ్చింది. అయితే హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పరాజయంతో సీన్ రివర్స్ అయ్యింది. సొంత రాష్ట్రంలో పార్టీని విజయపథంలో నడిపించలేని  నడ్డా ఇక జాతీయ స్థాయిలో బీజేపీని ఎలా గెలిపించగలరన్న విమర్శలు వెల్లువెత్తుతున్న నేపపథ్యంలో నడ్డాకు స్థాన  భ్రంశం తప్పదన్నప్రచారం జోరందుకుంది.   నడ్డా స్థానంలో అమిత్‌షాకు సన్నిహితుడైన కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్‌ను పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకునే అవకాశాలున్నయన్న ప్రచారం ఇప్పుడు జరుగుతోంది.  ఈ నేపథ్యంలోనే రాష్ట్రాల అధ్యక్షుల మార్పు చర్చ కూడా జరుగుతోంది. ఆ చర్చలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఉద్వాసన ఖాయమని వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే  జిల్లా అధ్యక్షుల మార్పు ప్రక్రియకు ఏపీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం శ్రీకారం చుట్టడం కలకలానికి కారణమైంది. తమను తప్పించి నామినేషన్ ద్వారా కొత్త అధ్యక్షులనున నియమించేందుకు ససేమిరా అంగీకరించబోమంటూ వారు తిరుగు బావుటా ఎగుర వేస్తున్నారు. ఒకవైపు సోము వీర్రాజునే తొలగిస్తున్నారన్న ప్రచారం జరుగుతుంటే, ఆయన తమను ఏ విధంగా తొలగిస్తారని  జిల్లా అధ్యక్షులు  నిలదీస్తున్నారు.   

మాస్కంటే ఇదే.. భలేగుంది కదూ!

కరోనా మహమ్మారి జనం జీవితాలలో మాస్క్ ను ఒక భాగం చేసేసింది. కష్టమైనా, నష్టమైనా ప్రాణానికి పూచీ ఉండాలంటే మాస్క్ తప్పని సరి అని చెప్పేసింది. దీంతో కరోనా ఆంక్షలు ఉన్నా లేకున్నా ఎక్కువ మంది మాస్కును ఒక అలవాటుగా మార్చేసుకున్నారు. ఇక ప్రస్తుతం చైనాలో అయితే కరోనా విలయ తాండవమే చేస్తోంది. 20 రోజుల్లో పాతిక కోట్ల మందికి పైగా కరోనా సోకిందంటేనే అక్కడి పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. దీంతో చైనా కరోనా ఆంక్షలు ఎత్తివేసినా జనం మాత్రం జాగ్రత్తలు వదలడం లేదు. మాస్కులు ధరించే తిరుగుతున్నారు. ఈ మాస్కుల అనివార్యత కారణంగా ఓ వ్యక్తి సృజన బయటపడింది. మాస్కు ధరించినా తినడానికీ, తాగడానికీ ఇబ్బంది లేకుండా ఓ ఏర్పాటు చేసుకున్నాడు. ఓ వెరైటీ మాస్కును   తయారు చేసుకుని ధరిస్తున్నాడు. ఈ మాస్క్ వల్ల అతడికి తినడానికీ, తాగడానికీ మాస్కు తీయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ మాస్కు జనాలకు విపరీతంగా నచ్చేసింది. అందరూ ఇదెలా తయారు చేసుకోవాలి, మాక్కూడా అలాంటి మాస్కు కావాలంటున్నారు. ఈ మాస్కు ధరించి అతగాడు రెస్టారెంట్లో దర్జాగా ఫుడ్ లాగించేస్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమలో తెగ వైరల్ అయిపోయింది. నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతూనే అతడి సృజనను తెగ పొగిడేస్తున్నారు.  

దక్షిణ భారతంలోనే అత్యంత అవినీతి రాష్ట్రం ఏదో తెలుసా?

దక్షిణ భారత దేశంలో అత్యంత అవినీతి రాష్ట్రాలలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏదో తెలుసా?2019లో ఇండియన్ కరప్షన్ సర్వే 2019 ప్రకారం దక్షిణ భారత దేశంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. దేశం మొత్తంలో టాప్ పొజిషన్ లో నిలిచిన రాష్ట్రం రాజస్థాన్. దేశం మొత్తంలో తెలంగాణ ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉంది. అత్యంత అవినీతి రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 13వస్థానంలో నిలిచింది. అయితే ఈ గణాంకాలు 2019 నాటివి.  అయితే 2019 నాటికి ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. నాడు అవినీతిలో టాప్ టెన్ లో వరుసగా రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, యూపీ, తెలంగాణ, కర్నాటక, పంజాబ్, తమిళనాడు, ఛత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. 2019లో ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా నిర్వహించిన ఇండియా కరప్షన్ 2019 సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఆ సర్వేలో అవినీతి రాష్ట్రాల జాబితాలో కేరళ దిగువ నుంచి తొలి స్థానాన్ని దక్కించుకుంది.   మొత్తం 21 రాష్ట్రాల్లో ఈ సర్వేను ట్రాన్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా నిర్వహించింది.  తెలంగాణ విషయానికి వస్తే ఆస్తుల రిజిస్ట్రేషన్, భూ వివాదాల అంశాల్లో   అవినీతి అధికంగా జరిగింది.  మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా భారీ ఎత్తున అవినీతి జరిగింది.   రాష్ట్రంలో పనులు పూర్తి కావాలంటే లంచాలు ఇవ్వాల్సిందేనని, తాము అలా లంచాలు ఇచ్చే పనులు చేయించుకున్నామని 67  శాతం మంది వివరించారు. వీరిలో 27 శాతం మంది పలుమార్లు లంచాలుఇచ్చినట్లు పేర్కొన్నారు.  కేవలం  11 శాతం మంది మాత్రమే  లంచాలు ఇవ్వకుండానే తమ పనులు అయ్యాయని చెప్పారు.  అయితే ఇదంతా గతమనీ, తాజాగా అందుతున్న వివరాలను బట్టి అత్యంత అవినీతి జరుగుతున్నరాష్ట్రాల జాబితాలో ప్రస్తుతం ఏపీయే అగ్రస్థానంలో నిలుస్తుందని తెలుగుదేశం చెబుతోంది. చంద్రబాబు హయాంలో  విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిచిందనీ, అవినీతికి దూరంగా ఉందనీ, అయితే జగన్ హయాంలో ఆ సీన్ రివర్స్ అయ్యిందనీ అవినీతిలో అగ్రస్థానానికి, అభివృద్ధిలో అధమస్థానానికీ పడిపోయందనీ విమర్శిస్తున్నారు.

చైనాలో ఏమి జరుగుతోంది ?

నిజానిజాలు భగవంతుడికే తెలియాలి.. కానీ, చైనాలో కరోనా కరాళ నృత్యం భీకరంగా సాగుతోందని ప్రపంచ మీడియాలో కనిపిస్తున్న, వినిపిస్తున్న కన్నీటి కథలు ఒక్క చైనాను మాత్రమే కాదు, ప్రపంచాన్నే కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అయితే, ప్రసార, ప్రచార మాధ్యమాలలో వస్తున్న కథలు, కథనాలు పూర్తిగా నిజమా? అంటే అవుననో కాదనో చెప్పడం అయ్యే పని కాదు అంటున్నారు. చైనా నాలుగు గోడల మధ్య ఏమి జరిగినా, సదరు వార్త ప్రభుత్వ అంక్షల అడ్డు గోడలను దాటి యథాతథంగా ప్రపంచానికి చేరుతుందన్న  గ్యారెంటీ లేదు. అందుకే ... ప్రపంచ దేశాలు ఓ వంక తమ తమ దేశాల్లో కరోనా మహమ్మారి కట్టడికి చర్యలు తీసుకుంటూనే, మరో వంక అసలు చైనాలో ఏమి జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.  చైనాపై కన్నేసి ఉంచాయి.  చైనాలో పుట్టి  ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఒకటికి రెండు మార్లు కరాళ నృత్యం సాగించిన కొవిడ్ మహమ్మారి మరోమారు ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ముఖ్యంగా చైనా నుంచి వస్తున్న వార్తలను గమనిస్తే ఆ దేశంలో ప్రతి  రోజు లక్షల్లో కేసులు ..నమోదవుతున్నాయి. .వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఏది నిజం ?ఏది కాదు ? అంటే చెప్పడం కష్టం.  బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం కొత్తగా పుట్టిన ఓమిక్రాన్ కొత్త వేరియంట్ బీ ఎఫ్. 7 కల్లోలం సృష్టిస్తున్నదనేది మాత్రం నిజం.  నిజానికి, కరోనా వైరస్ పుట్టిల్లు చైనానే అయినా,ఆ దేశం మొదటి నుంచి అనుసరిస్తూ వచ్చినట్లు చెపుతున్న “జీరో కొవిడ్” పాలసీ కారణంగా ఇతర దేశాలలో పోలిస్తే చైనాలో కొవిడ్ ప్రభావం తక్కువగానే ఉందని గణాంకాలు సూచిస్తున్నాయి. అయితే, చైనాలో ఏమి జరిగినా బయటి ప్రపంచానికి తెలిసే అవకాశం  చాలా  తక్కువ... కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉక్కు పిడికిలిని దాటి,  సమాచారం ఏదీ అంత తేలిగ్గా ప్రపంచానికి చేరదని అంటారు. సరే అదెలా ఉన్నా, ఇంత కాలం జీరో కొవిడ్ పాలసీలో భాగంగా కఠిన లాక్ డౌన్ ఆంక్షలు అమలుచేసిన చైనా ప్రభుత్వం ఆంక్షలకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్డు ఎక్కడంతో ప్రజా గ్రహానికి భయపడి లాక్ డౌన్ ఆంక్షలను సడలించింది. సదలించడం కాదు పూర్తిగా ఎత్తి వేసింది.  ఆలా ఆంక్షలు సడలించింది మొదలు చైనాలో గత పది రోజులుగా కేసుల సంఖ్య చకచకా పైకి పాకుతోంది. వైద్య సేవలకు సిబ్బంది కరువయ్యారంటే అక్కడ పరిస్థితి ఎంతగా విషమించిందో అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు, ఆసుపత్రులలో బెడ్స్ నిండిపోవడంతో కొవిడ్ బాధితులకు అసుపత్రి ప్రాంగణంలో స్టూల్స్ వేసి కూర్చో పెట్టే చికిత్స అందిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి.  ఇలా కేసుల తీవ్రత కనివినీ ఎరుగని స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కొవిడ్ నిర్ధారణ పరీక్షలను నిలిపివేసింది..  రోజువారీ కేసులను వెల్లడించడం లేదు. అంతేకాదు మెజారిటీ కుటుంబాల్లో కుటుంబ సభ్యులు అందరూ కొవిడ్ బారిన పడ్డారు..  ముఖ్యంగా మహిళలు గొంతు ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారు. వృద్ధులు మరణ శయ్యపై ఉన్నారు..  వీరిలో 25 శాతం మందికి ప్రాణాపాయం ఉంది.  కొవిడ్ పాజిటివ్ గా తేలిన వారు ఆసుపత్రిలో చేరేందుకు మూడు గంటల దాకా నిరీక్షించాల్సి వస్తోంది.. ప్రభుత్వం జీరో కోవిడ్ పాలసీని ఎత్తివేసినప్పటికీ రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.  చైనా రాజధాని బీజింగ్ లో 80 శాతం పైగా ప్రజలు కొవిడ్ కు గురయ్యారు. బీజింగ్ సహా ప్రధాన నగరంలోని ఆసుపత్రులు కొవిడ్ బాధితుల, రోగుల తాకిడిని తట్టుకోలేకపోతున్నాయి.. బీజింగ్ లోని ఒక ఆసుపత్రికి రోజుకు 500 పైగా సీరియస్ కేసులు వస్తున్నాయి. దీంతో తాత్కాలిక ఇన్సెంటివ్ కేర్ యూనిట్లు, పడకల పెంపును ప్రభుత్వం చేపడుతోంది. ప్రజలు సంప్రదాయ వైద్యాన్ని నమ్ముతున్నారు. ఫ్యాక్టరీలు, కంపెనీలు నడుస్తున్నప్పటికీ వాటిల్లో కార్మికుల హాజరు 10 శాతానికి మించడం లేదు. ఇక గత వారం వరకు 99 శాతం మంది ఇళ్ళకే పరిమితమయ్యారు. ఇక మొన్నటి వరకు జీరో కొవిడ్ బాధితులకు పాలసీ అమలు చేసిన చైనా ఇప్పుడు దానిని ఎత్తేసింది. గతంలో పాజిటివ్ కేసులు వస్తే ఐసోలేషన్లో ఉంచిన ప్రభుత్వం… ఇప్పుడు పాజిటివ్ ఉన్నప్పటికీ విధులకు రమ్మని ఆహ్వానిస్తున్నది. అంతే కాదు వివిధ రాష్ట్రాల మధ్య ఆంక్షలను కూడా పూర్తిగా సడలించింది.. అన్నింటికంటే ముఖ్యంగా విదేశాల నుంచి వస్తే పది రోజుల క్వారంటైన్ ను పూర్తిగా ఎత్తేసింది.. ప్రజలే స్వచ్ఛందంగా క్వారంటైన్ అవుతున్నారు.. ఇక రోగుల తాకిడి పెరగడంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యేందుకు గంటలపాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఆస్పత్రుల్లో కూడా కండిషన్ సీరియస్ గా ఉన్న వారినే అడ్మిట్ చేసుకుంటున్నారు. ఇక చైనాలో మందులు కావాలంటే మనలాగా బయటకు వెళ్లి తెచ్చుకోవడం ఉండదు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉంటాయి.. కొన్ని మందులు మాత్రమే దుకాణాల్లో విక్రయిస్తారు.. కొవిడ్ విజృంభణ నేపథ్యంలో పారాసిటమల్ వంటి మాత్రలను ప్రజలు పెద్ద ఎత్తున తీసుకెళ్లి ఇంట్లో నిల్వ చేసుకున్నారు.. దీంతో ఆ మాత్రలకు కొరత ఏర్పడింది.. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా వచ్చేందుకు చాలా సమయం పడుతున్నది. ఇలా చెప్పుకుంటూ పోతే చైనాలో కొవిడ్ బాధితుల కష్టాలకు అంతూ పొంతూ లేకుండా పోతోందని, చైనాలో ఉన్న తెలుగువారి ద్వారా తెలుస్తోంది.

విత్త మంత్రి నిర్మలా సీతారామన్ కు అస్వస్థత.. ఎయిమ్స్ లో చేరిక

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అస్వస్థతకు గురై  ఆస్పత్రిలో చేరారు.   ఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్) లో సోమవారం (డిసెంబర్ 26)  చేరారు. అయితే జనరల్ చెకప్ కోసమే ఆమె ఆస్పత్రికి వెళ్లరని ఆమెకు సన్నిహితంగా  ఉండే వర్గాలు చెబుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్పి ఉంది.   వార్షిక బడ్జెట్ రూపకల్పనలో తలమునకలై ఉన్న నిర్మలా సీతారామన్ తనకు ఒకింత అసౌకర్యంగా ఉందని చెప్పడంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. ఆమె వయస్సు 67 ఏళ్లు. ఆమెకు భర్త పరకాల ప్రభాకర్, కుమార్తె  వాంగ్మయి ఉన్నారు. 

రౌండప్ 2022 ఉప రాష్ట్రపతి వెంకయ్యకు ఫేర్ వెల్

ఆగష్టు  ఉపరాష్ట్రపతి వెంకయ్యకు వీడ్కోలు .. రాజీవ్ జయంతి ..బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ 8 సారి ప్రమాణ స్వీకారం ... ఈడీ సోదాలు .. అరెస్టులు ..ఇంకా కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. 2022 మోస్ట్ హ్యాపెనింగ్ ఇయర్ గా చెప్పుకోవచ్చు.  కొద్ది  రోజుల్లో 2022 వెళ్ళిపోతుంది. 2023 సంవత్సరం వచ్చేస్తుంది. క్యాలెండరు మారి పోతుంది. స్వాగత తోరణాలు, వీడ్కోలు వేడుకలు షరా మాములే ... కాలచక్రం కదులుతూనే ఉంటుంది... కానీ, వెళ్ళిపోతున్న 2022 సంవత్సరం, ఏమి సాధించింది, ఏమి మిగిల్చింది, ఏది పట్టుకు పోయింది, ఏమి బోధించింది, ఒక సారి వెనక్కి తిరిగి చూసుకుంటే .. సంవత్సర కాలంలో చెరగని ముద్ర వేసిన చేదు తీపి జ్ఞాపకాలను ఒక సారి సింహవలోకనం చేసుకుంటే.. ఆగష్టు 1...  రూ 1,034 కోట్ల రూపాయల పాత్రా చావ్లా భూ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శివసేన ఎంపీ సంజయ్ రౌత్’ ను మనీ లాండరింగ్ నియంత్రన చట్టం పరిధిలో అరెస్ట్ చేసింది.  ఆగష్టు 1... పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ త్వరలో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ప్రకటించారు. ఆగష్టు 2...  కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అద్యక్షుదు రాహుల్ గాంధీ  విచారణ ఎదుర్కుంటున్నా నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ నేషనల్ హెరాల్డ్ పత్రిక కార్యాలయాలు అన్నింటిలో ఏక కాలంలో సోదాలు నిర్వహించింది. ఢిల్లీ లోని పత్రిక కార్యాలయాన్ని ఈడీ తత్కాలికంగా సీల్ చేసింది.   ఆగష్టు 3...  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు.మమత మత్రివర్గంలో సీనియర్ మంత్రి పార్థా చట్టేర్జీ అరెస్ట్ నేపధ్యంగా చేపట్టిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో బీజేపీ నుంచి తృణమూల్’లో చేరిన మాజీ కేంద్ర మంత్రి  బాబులాల్ సుప్రియ సహా తొమ్మిదిమంది కొత్తవారికి అవకాశం కల్పించారు. ఆగష్టు 4...  పాత్రా చావ్లా భూ కుంభకోణం కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్’ శివసేన ఎంపీ సంజయ్ రౌత్’ భార్య వర్షా రౌత్’కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సామాన్లు జారీ చేసింది. కాగా, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంకా వాద్రా, వర్షా రౌత్’కు మద్దతు తెలిపారు. ఈడీ చర్యను ఖండించారు. ఆగష్టు 5.. ధరల పెరుగుదల,  పెరుగతున్న నిరుద్యోగ సమస్య, అత్యవర సరకులపై జీఎస్టీ పెంపుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశ రాజధాని ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఎఐసీసీ  కరలయం వద్ద మొదలైన నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ, లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర రంజన్’ సహా పార్టీ ఎంపీలు ఇతర ముఖ్యనాయకులు పాల్గొన్నారు. పోలీసులు రాహుల్ గాంధీ సహా సుమారు 200 కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేశారు.     ఆగష్టు 8... ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి రాజ్యసభలో వీడ్కో లు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఇది ఉద్వేగభరితమైన క్షణమని అన్నారు. పదవీకాలం విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు వెంకయ్య నాయుడికి అభినందనలు తెలిపారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన.. బీజేపీ అధ్యక్షుడు సహా అనేక పదవులు చేపట్టారని కొనియాడారు..  యువ ఎంపీలను వెంకయ్య నాయుడు ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. వెంకయ్య నాయుడు కొత్తతరంతో మమేకమయ్యారని మోదీ పేర్కొన్నారు. ఆయన వాక్‌చాతుర్యం అందరికీ తెలిసిందేనన్నారు. భావితరాలకు వెంకయ్య నాయుడు ఆదర్శమని అన్నారు. వెంకయ్య మాటల్లో వ్యంగ్యం, గంభీరత ఉంటుందని పేర్కొన్నారు. చైర్మన్‌ హోదాలో విజయవంతంగా రాజ్యసభను నడిపించారని ప్రశంసించారు. పెద్దల సభ గౌరవ మర్యాదలను మరింత పెంచారన్నారు. రాజ్యసభ సచివాలయంలో ఎన్నో మార్పులు తెచ్చారని ప్రస్తావించిన ప్రధాని.. అనేక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని తెలిపారు. వెంకయ్య నిబద్ధత స్పూర్తిదాయకమని, ఆయనను  చూసి అందరూ నేర్చుకోవాలన్నారు.  ఉత్తర్‌ప్రదేశ్‌లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్త శ్రీకాంత్‌ త్యాగి ఇంటి వద్ద అక్రమ నిర్మాణాని బుల్‌డోజర్లతో కూల్చివేశారు అధికారులు. నోయిడా సెక్టార్ 93లోని గ్రాండ్‌ ఒమాక్సీ హౌసింగ్‌ సొసైటీలో ఉన్న ఈ ఇంటికి సోమవారం ఉదయం పోలీసు బృందాలతో వెళ్లారు. అనంతరం త్యాగి ఇంటి ముందు భాగాన్ని కూలగొట్టారు. ఆగష్టు 9..  మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే మంత్రి వర్గాన్ని విస్తరించారు. శివసేన, బీజేపీ నుంచి ఎనిమిది మంది చొప్పున మొత్తం 18 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు  బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బీజేపీ బంధాన్ని తెన్చుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆగష్టు 10.. బీహార్‌ ముఖ్యమంత్రిగా జెడి (యు) నేత నితీష్‌ కుమార్‌ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఎనిమిదోసారి ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర గవరుర్‌ ఫాగూ చౌహాన్‌.. ఆయనతో ప్రమాణం చేయించారు. ఆర్‌జెడి నాయకుడు తేజస్వీ యాదవ్‌ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మహా కూటమిలోని ఏడు పార్టీల నాయకులు, తేజస్వీ తల్లి రబ్రీదేవీ, సతీమణి, సోదరుడు తేజ్‌ ప్రతాప్‌ తదితరులు హాజరయ్యారు. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ తీరు పట్ల ఆగ్రహంతో ఉను నితీష్‌ ఆ కూటమికి దూరమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆర్‌జెడి నేతృత్వంలోని 'మహాఘట్‌బంధన్‌'కు మళ్లీ దగ్గరయ్యారు. సిఎంగా రాజీనామా చేసిన నితీష్‌.. ఆర్‌జెడి, కాంగ్రెస్‌, వామపక్షాల సహకారంతో గంటల వ్యవధిలోనే మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.  ఆగష్టు 20.. మాజీ ప్రధాని రాహుల్ గాంధీ జయంతి ... సోనివై, రాహుల్, ప్రియాంక సహా కాంగ్రెస్ నాయకులు రాజీవ్’ ఘన నివాళి అర్పించారు.

రాహుల్ యాత్ర ఎఫెక్ట్.. కమలం పార్టీలో గుబులు

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర్ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. అయితే ఈ యాత్రను సాధ్యమైనంతగా డౌన్ ప్లే చేయడానికి బీజేపీ చేయగలిగినంతా చేసింది. ఎవరికీ పట్టని యాత్రగా అభివర్ణించింది. యాత్ర సాగుతుండగా జరిగిన మునుగోడు ఉప ఎన్నిక, గుజరాత్,  అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.  అయినా రాహుల్ గాంధీ వాటిని వేటినీ పట్టించుకోకుండా స్థిత ప్రజ్ణతతో యాత్రను కొనసాగిస్తున్నారు. రాజకీయ యాత్ర కాదు..  విభజన రాజకీయాలు, విద్వేష రాజకీయాలు, అసహనం దేశంలో పెచ్చరిల్లిపోతున్న సమయంలో   ప్రేమ పంచేందుకూ, ప్రజలను ఏకం చేసేందుకు తాను పాదయాత్ర చేస్తున్నానంటూ రాహుల్ జోడో యాత్ర మొదలు పెట్టడానికి ముందు చెప్పిన మాట నుంచి ఒక్క అంగుళం కూడా అటూ ఇటూ జరగలేదు. రాజకీయాలు, ఎన్నికల ఫలితాలను గురించి ఇసుమంతైనా పట్టించుకోలేదు. ఆఖరికి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో ఓటు వేయడం తప్ప మరేం చేయలేదు.  అయినా రాహుల గాంధీ జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. ముఖ్యంగా రాజకీయాలతో సంభంధం లేకుండా యువతీ యువకులు, విద్యార్ధులు, చిన్నారులు, మహిళలు,  రైతులు, కార్మికులు  ఇలా అన్నివర్గాల ప్రజలు రాహుల్ గాంధీ యాత్రలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆటపాటలతో   రాహుల్ జోరుగా హుషారుగా ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. మధ్య మద్యలో సినిమా స్టార్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమం అంతా రాహుల్ యాత్ర వెనుక ర్యాలీ చేస్తోంది. ఇంత ఉత్సాహంగా అంతులేని ఆదరణతో సాగుతున్న కాంగ్రెస్ వల్ల కాంగ్రెస్ కు ఏం ఒరిగింది అని ప్రశ్నించే వారికి నాగపూర్ స్థానిక ఎన్నికల ఫలితాలు సమాధానం చెప్పాయి. భారతీయ జనతా పార్టీ కంచుకోట అయిన నాగపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. నాగ్ పూర్ లోని 236 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ 200 చోట్ల గెలుపొందింది. డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సొంత గ్రామం ఫెట్రీలో కూడా కాంగ్రెస్ విజయం సాధించడం విశేషం. రాహుల్ జోడో యాత్ర కారణంగానే ఈ విజయం సిద్ధించింది. ఈ పరాజయానికి కారణాలు వెతుక్కునే పనిలో బీజేపీ ఉంటే పరిశీలకులు మాత్రం కరణాలు వెతుక్కోవలసిన అవసరం ఇసుమంతైనా లేదు.. అంతా రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రభావమే అంటున్నారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ ప్రజలతో మమేకమౌతున్న విధానం, హెల్త్ కాన్షస్ నెస్, నడవడిక, వ్యవహార శైలి వంటి అంశాలపై ప్రజలలో అవగాహన కల్పించే విధంగా వ్యవహరిస్తున్న తీరు రాజకీయాలతో సంబంధం లేకుండా అందరినీ ఆకర్షిస్తున్నాయి.    ఆ ప్రభావమే నాగపూర్ ఎన్నికల ఫలితాలలో ప్రతిఫలించిందంటున్నారు. బీజేపీ ఎంత కాదంటున్నా.. రాహుల్ యాత్ర ఆ పార్టీలో గుబులు రేపుతున్నది. ఇందుకు సాక్ష్యం స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీయే కాంగ్రెస్ ను తేలిగ్గా తీసుకోవద్దని క్యాడర్ ను హెచ్చరించడమేనని పరిశీలకులు అంటున్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ.. బీజేపీ క్యాడర్ ను కాంగ్రెస్ విషయంలో హెచ్చరించడమే రాహుల్ యాత్ర బీజేపీలో గుబులు రేపుతున్నదనడానికి నిదర్శనం. అంతే కాదు కర్నాటక రాష్ట్రంలో రాహుల్ యాత్ర సాగుతున్న సమయంలో బీజేపీ సంకల్ప యాత్ర ప్రారంభించింది. కర్నాటక లోని బీజేపీ సర్కార్ రాహుల్ యాత్రకు వ్యతిరేకంగా ప్రకటనలు గుప్పించింది.  తాజాగా కోవిడ్ ప్రొటోకాల్ ఆంక్షలు విధించింది. వీటిని వేటినీ పట్టించుకోకుండా రాహుల్ యాత్ర జనాదరణతో కొనసాగుతుండటం బీజేపీలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ యాత్ర ప్రభావం వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ కు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుందన్నఆశా భావం హస్తంపార్టీలో వ్యక్తం అవుతుంటే.. అదే భావంతో బీజేపీలో ఆందోళన కనిపిస్తోంది. 

ఉండాలా వెళ్లాలా.. అయోమయంలో కాంగ్రెస్ సీనియర్లు

కాంగ్రెస్ లో సంక్షోభానికి కారణమైన సీనియర్ల పరిస్థితి ఇప్పుడు  అయోమయంలో పడింది. సంక్షోభ పరిష్కారానికి కేంద్రం దూతగా వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్.. ఒక్కొక్కరితో విడివిడిగా ఫేస్ టు ఫేస్ మాట్లాడారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై సీనియర్లు చేసిన ఫిర్యాదులను సావధానంగా విన్నారు. అంతే. ఆ తరువాత ఆయన వారికేమీ చెప్పలేదు. సరికదా.. ఏవైనా ఇబ్బందులు ఉంటే హైకమాండ్ కు విన్నవించుకోవాలి తప్ప మీడియా ముందు మాట్లాడటం తగదంటూ ఓ జనరల్ సూచన చేసి చక్కాపోయారు. అయితే సీనియర్ల కు ఆ సూచన ఒక వార్నింగేనని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నిక పరాజయం బాధ్యత పూర్తిగా రేవంత్ పై పడుతుందన్న భావనలో ఉన్న సీనియర్లకు  డిగ్గీ రాజా మాటలు మింగుడు పడటం లేదు. ఆయన వచ్చి వెళ్లిన తరువాత కూడా పరిస్థితి ఆయన రాక ముందు ఎలా ఉందో అలాగే ఉంది. అదనంగా తమ ఫిర్యాదులపై డిగ్గీ రాజీ స్పందించకపోవడంతో సీనియర్లు గతం కంటే బలహీనపడ్డారన్న భావన కాంగ్రెస్ శ్రేణుల్లో బలంగా వ్యక్తమౌతోంది.  దీంతో ఇక ఇప్పుడు ఏం చేయాలన్న గందరగోళంలో సీనియర్లు పడ్డారు. డిగ్గీ రాజా వచ్చి వెళ్లిన తరువాత కాంగ్రెస్ నేతల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇక  పార్టీలోనే కొనసాగుతూ అసమ్మతి కార్యకలాపాలు కొనసాగించే అవకాశం వారికి లేకుండా పోయింది. డిగ్గీ రాజా హస్తినకు వెళ్లిన తరువాత ఆయన మళ్లీ ఎప్పుడొస్తారు.. తమ అసమ్మతిని ఆయనకు ఎప్పుడు తెలియజేయాలి అని ఎదురు చూడాలే తప్ప గతంలోలా ఇప్పుడు టీపీసీసీ చీఫ్ రేవంత్ పై ఇష్టారీతిగా విమర్శలు చేసి, అసమ్మతి రాగం అంటూ తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. డిగ్గీ రాజా సూచనతో వారికి ఏమైనా ఇష్యూలు ఉంటే హైకమాండ్ ఎదుటకు తీసుకు వెళ్లాలి తప్ప గతంలోలా మీడియా మీట్ పెట్టి నిప్పులు చెరిగేసి, విమర్శలు గుప్పించాలంటే కుదిరే పరిస్థితి లేదు. క్రమశిక్షణ చర్యల కత్తి వారి మెడమీద వేళాడుతోంది. అంటే ఇకపై పార్టీలో ఉండాలంటే రేవంత్ నిర్ణయాలకు వంత పాడాల్సిందే. అలా పాడలేని వారుంటే మర్యాదగా పార్టీని వీడి వెళ్లాలి. ఇదీ డిగ్గీ రాజా సూచన సారాంశం. ఇప్పుడు ఆ సూచనే కాంగ్రెస్ సీనియర్లను అయోమయంలో పడేసింది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు టీపీసీసీ చీఫ్ ను కానీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్కం ఠాకూర్ ను కానీ మార్చే అవకాశాలు లేవని డిగ్గీ రాజా చెప్పకనే చెప్పేశారు. దీంతో దిగ్విజయ్ వచ్చి వెళ్లిన తర్వాత రేవంత్ వర్గం మరింత బలం పుంజుకుందనే చెప్పాలి. రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా గ్రూపులు కట్టిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు  ఇప్పుడు వెనక్కు తగ్గలేక, ముందుకు సాగలేక ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో కాంగ్రెస్ గతంలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం  బలోపేతం అయ్యింది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలలో ఉత్సాహం కనిపిస్తోంది. ఇదంతా రేవంత్ టీపీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టిన తరువాత చోటు చేసుకున్న పరిణమామమే. దానికి తోడు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేసి తెలంగాణను తీసుకువచ్చిన ఘనతను కూడా కేసీఆర్ వదులుకున్నారు. దీంతో ఇప్పడు  తెలంగాణ ఇచ్చిన పార్టీగా  ప్రజలకు గట్టిగా చెప్పుకునే అవకాశం కాంగ్రెస్ కు లభించింది. ఈ నేపథ్యంలోనే సీనియర్లు  ఇంత కాలం పార్టీని అంటిపెట్టుకుని ఉండి, తీరా ఫలాలు ( అధికారం) దుక్కుతాయన్న అవకాశాలు ఉన్న సమయంలో పార్టీని వీడటం తొందరపాటు అవుతుందా అన్న సంశయం వెన్నాడుతోంది. అలా కాదని పార్టీనే అంటిపెట్టుకుని ఉంటే ఇంత కాలం తాము వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఏం చెబితే అది చేయాలి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సీనియర్ నేతలు అయోమయంలో పడ్డారు. 

సంక్రాంతి తరువాత ఏ క్షణంలోనైనా కేసీఆర్ కేబినెట్ విస్తరణ

తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారా?  తన  క్యాబినెట్ లో మార్పులకు శ్రీకారం చుట్టనున్నారా? అంటే బీఆర్ఎస్ వర్గాల నుంచి ఔననే సమాధానం వస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరో ఏడాద లోగా  జగరనున్న నేపథ్యంలో కేబినెట్ విస్తరణకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించారు.  దీంతో ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కేదెవరికి? ఉద్వాసనకు గురయ్యేదెవరు అన్న చర్చ బీఆర్ఎస్ వర్గాలలో జోరుగా సాగుతోంది. కేబినెట్ విస్తరణలో భాగంగా కొత్తగా నలుగురికి మంత్రి పదవులు దక్కే అవకాశంఉందంటున్నారు. అలాగే ప్రస్తుత కేబినెట్ లో ముగ్గురికి ఉద్వాసన అనివార్యమని కూడా చెబుతున్నారు. ఇప్పటికే ఈటల రాజీనామాతో ఆరోగ్య శాఖ ఖాళీగా ఉండగా తాత్కాలికంగా హరీష్ రావుకు ఆ శాఖను అప్పగించారు.  ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావుకు ఆదనంగా ఆరోగ్య శాఖ అప్పగించడంతో ఆయనపై పని ఒత్తిడి అధికంగాఉంది. దీంతో హరీష్ రావును ఆరోగ్య శాఖ బాధ్యతల నుంచి తప్పించి ఆ శాఖను బీసీ నేతకు అప్పగించాలని కేసీఆర్ భావిస్తున్నారు. అలాగే విస్తరణలో మరో ఇద్దరు బీసీలు, ఎస్సీలకు అవకాశం కల్పించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. అలాగే తరచూ వివాదాల్లో ఇరుక్కుంటున్న మంత్రి  మల్లారెడ్డిపై ఈ సారి విస్తరణలో వేటు పడే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇక కేబినెట్ విస్తరణలో బెర్త్ లు దక్కే అవకాశం ఉందంటూ కడియం శ్రీహరి, మధుసూదనాచారి, బాల్క సుమన్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అలాగే బండా ప్రకాష్ కూడా బెర్త్ లభించే అవకాశం ఉందంటున్నారు.  సంక్రాంతి తరువాత ఏ క్షణంలోనైనా కేసీఆర్ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  

పెంచారు సరే.. అసలిస్తారా?.. పెన్షన్లపై వృద్ధుల ఆందోళన

ఏపీలో వృద్ధులకు ఇచ్చే పెన్షన్ల లో రూ. 250 పెంపునకు  జగన్ క్యాబినెట్ గ్రీన్ సిగ్నలిచ్చింది. జగన్ క్యాబినెట్ నిర్ణయంతో ఇప్పుడిస్తున్న పెన్షన్‌పై రూ.250 పెరగనుంది. అంటే ప్రస్తుతం పెన్షన్ మొత్తం రూ.2,500 నుంచి రూ.2,750కి పెరగుతుంది. పెన్షన్ దారులకు ప్రభుత్వం ఇస్తున్న నూతన సంవత్సర కానుక అని చెప్పుకుంటోంది.  వైఎస్సార్‌ పింఛను కానుక పథకం కింద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు తదితరులకు రూ.250 పింఛను పెంపు అమల్లోకి రానుంది. అయితే పెన్షన్ పెంపుపై పెన్షన్ దారుల్లో  మాత్రం ఇసుమంతైనా  ఆనందం కనిపించడం లేదు.  పెన్షన్ పెంచారన్న ఆనందం కంటే అసలు వచ్చే నెలలో పెన్షన్ ఉంటుందా? అన్న ఆందోళనే ఎక్కువగా కనిపిస్తోంది.  ఎందుకంటే ఏపీలో వచ్చే నెల నుండి   50 వేల పింఛన్లు తొలగించనున్నారన్న వార్త తెగ ప్రచారం అవుతుండటమే.  ఇప్పటికే గ్రామ, వార్డు వాలంటీర్లు ఎవరి పెన్షన్లు తొలగించాలని అనుకుంటున్నారో వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చారు. ఇప్పటి వ‌ర‌కు పింఛన్ల మంజురూలో ఎలాంటి నిబంధ‌న‌లు లేవు. కానీ, ఇప్పుడు 1000 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ ఉన్నవాళ్లు, 300 యూనిట్లు దాటి విద్యుత్ బిల్లులు కట్టేవారికి పెన్షన్ కట్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎవరి పెన్షన్ కట్ చేస్తున్నారో వాళ్ళకి వాలంటీర్లు నోటీసులు కూడా ఇస్తున్నారు. 15 రోజుల్లో వివరణ ఇవ్వకుంటే పెన్షన్ శాశ్వతంగా నిలిపివేస్తామంటూ నోటీసుల్లో పేర్కొంటున్నారు.దీంతో వృద్దులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలలో ఆందోళన మొదలైంది. వచ్చే నెలలో తన పెన్షన్ వస్తుందా లేక సాకులు చెప్పి కట్ చేస్తారా అన్న అనుమానాలు వారిలో వ్యక్తమౌతున్నాయి. కొత్త సంవత్సరంలో పెన్షన్ పెంపు శుభవార్త వింటామా.. పెన్షన్ కట్ అనే చేదు వార్త వింటామా అన్న ఆందోళన నెలకొంది. ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ల తొలగింపు చేపడితే అది ప్రతిపక్షాలకు ఆయుధం అవ్వడమే కాకుండా ప్రభుత్వానికి కొత్త చిక్కులు రావడం తథ్యం. మరి జగన్ సర్కార్ తొలగింపు నిర్ణయంతో  ముందుకు వెళ్తుందా, ఎన్నికలు, ఓట్ల భయంతో వెనక్కు తగ్గుతుందా చూడాల్సి ఉంది. ఇప్పటికే తీవ్ర మైన ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న జగన్ ప్రభుత్వం.. ఇది మరింత పెరిగేలా పెన్షన్ల రద్దు విషయంలో ముందుకు వెళ్లే అవకాశాలు లేవని పరిశీలకులు అంటున్నారు. 

దాగుడు మూతా దండా కోర్.. కుక్క వచ్చే పిల్లా భద్రం

దాగుడు మూతా ఆడండీ  కళ్ళకు చేతులు తీసేశా  ఇదిగో దొంగను వదిలేశా  దొంగకు అందక రారండీ   తల్లిని వచ్చీ తాకండి దాగుడుమూతా దండాకోర్  పిల్లీ వచ్చే ఎలుకా భద్రం హైడ్ అండ్ సీక్.. దాగుడు మూతలు పిల్లలకు చాలా ఇష్టమైన ఆట. రోజంతా ఆడుకుంటూ గడిపేయమన్నా వారికీ ఆట బోర్ కొట్టదు. అయితే అంత కు మించిన కిక్ ఓ చిన్నారికి ఈ ఆటలో దొరుకుతోంది. పూర్వ కాలంలో పిల్లలంతా కలిసి ఈ ఆట ఆడుకునే వారు. ఇంటి ఆవరణలో ఖాళీ స్థలం,  పాఠశాల ప్రాంగణంలో విశాలమైన మైదానాలూ ఉండే రోజుల్లో పిల్లలకు ఆటపాటలతో ఆనందంగా గడపడానికి బోలెడంత సమయం ఉండేది. ఆట పాటలతో చదువు సాగేది. ఇప్పుడు సింగిల్ చైల్డ్ ఫ్యామిలీలు, పాఠశాలల్లో తరగతి గదులు తప్ప మైదానమే కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో పిల్లలకు ఆటపాటలన్నవి ఎండమావుల్లాగే మిగిలిపోయిన పరిస్థితి. దీంతో పెంపుడు జంతువులే వారికి ఇంట్లో నేస్తాలయ్యాయి. అలా ఓ అమ్మాయి తన పెంపుడు కుక్కకు తనకు ఇష్టమైన ఆట నేర్పి దాంతోనే ఆనందంగా ఆడుకుంటున్న వీడియో ఒకటి తాజాగా నెట్టింట తెగ వైరల్ అయ్యింది. పెంపుడు కుక్కలు, పిల్లులతో చిన్నారుల సరదాల వీడియోలు గతంలో చాలా వచ్చాయి. అయితే ఈ వీడియోలో అమ్మాయి ఆట ఎలా ఆడాలో కుక్కకు నేర్పుతుంటే.. ఆ కుక్క శ్రద్ధగా విని ఆ తరువాత ఆ ఆమ్మాయితో సమానంగా ఆటలో నిమగ్నం అవ్వడం విపరీతంగా ఆకట్టుకుంటోంది. నెటిజన్లు ఆ ఆటను చూసి ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియోకు తెగ లైకులు, షేర్లు వస్తున్నాయి.