చలికాలంలో ఉబ్బసం సమస్యకు ఇలా చెక్ పెట్టండి!

ఉబ్బసం అనేది శ్వాస సంబంధ సమస్య. ఈ సమస్య వచ్చిన వాళ్లలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. సాధారణ సమయంలో బాగానే ఉన్నా అతి చల్లని వాతావరణం ఉన్నప్పుడు, కొన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితులలో సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ ఉబ్బసం సమస్య ఎందుకు వస్తుంది అంటే..  వాతావరణ కాలుష్యం వల్ల, పీల్చే గాలి కలుషితమైపోయి శ్వాస కోశాన్ని దెబ్బతీయడం వల్ల, ఆహారపు అలవాట్ల వల్ల, నేటి కాలంలో కృత్రిమమైన జీవన విధానం వల్లా ఉబ్బసం వ్యాధి వస్తుంది. ఈ ఉబ్బసం వ్యాధినే ఆస్తమా అని కూడా అంటారు. ముఖ్యంగా ఈ చలి కాలములో ఆస్తమా సమస్య ఉన్నవారు మరింత ఎక్కువ ఇబ్బంది పడతారు. వీరు తీసుకునే ఆహారం, జీవనశైలి మొదలైన విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. జీవన శైలి.. రాత్రి ఎప్పుడో ఆలస్యంగా పడుకుని, ఉదయమేప్పుడో సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాక నిద్రలేవడం వంటి జీవన విధానాన్ని వదిలిపెట్టాలి. ప్రతిరోజూ సూర్యోదయంతో పాటే నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. ఉదయం నిద్ర లేవగానే కాలకృత్యాలు పూర్తి చేసుకుని ముఖం కడుక్కున తరువాత తేనె, తులసి రసం రెండింటిని సమానంగా కలిపి 10గ్రాముల వరకు తీసుకోవాలి. అంటే 5గ్రాముల తేనె, 5 గ్రాముల తులసిరసం తీసుకోవాలి.  నువ్వుల నూనె తీసుకుని శరీరమంతా పట్టించి బాగా మర్దన చేసుకుని సూర్యుడి లేత ఎండలో గడపాలి. ఎండలో కొద్దిసేపు ఉన్న తరువాత ఒక బకెట్టు వేడి నీరు, ఒక బకెట్టు చల్ల నీళ్లు తీసుకోవాలి. ఈ నీటిని మొదట రెండు చెంబులు తల మీద, వీపు మీద పోసుకోవాలి. ఆ తరువాత చల్ల నీళ్లు తలమీద నుండి పోసుకోవాలి.  ఇలా మార్చి మార్చి నీటిని పోసుకుంటూ స్నానం పూర్తి చేయాలి. వేసవికాలంలో కూడా ఇదే విధంగా స్నానం చేయాలి.  ఆస్తమా సమస్య ఉన్నవారు తీసుకునే ఆహారం ఎలా ఉండాలంటే :-  ఆస్తమా సమస్య ఉన్నవారు తినే ఆహారం కఫం లేకుండా ఉండాలి. ముఖ్యంగా పులుపు, ఉప్పు, కారం మొదలైనవి ఎంత మానుకుంటే అంత మంచిది. నూనెలో వేయించిన పదార్థాలు, దుంపలు మొదలైనవి మానుకోవాలి.  మత్తు మాదకద్రవ్యాలు, కాఫీ, టీలు, ఐస్ క్రీమ్లు చల్లని ఫ్రిజ్లో పెట్టినవి వాడరాదు. పంచదార, బెల్లము తగ్గించి వాడాలి. మలబద్దకం లేకుండా ఉండటానికి  అన్నం తక్కువ కూరలు ఎక్కువ తినాలి. దేహతత్త్యమును బట్టి ఆయా ఋతువులలో దొరికే పండ్లు వాడాలి. పాలు త్రాగాలంటే పిప్పలి, ధనియాలు శొంఠి పౌడరు చేసి డికాషన్ కలిపిన పాలు త్రాగాలి. మనం తినే ఆహారము ఎంత రుచిగా ఉన్నా చాలా తగ్గించి తినాలి. కడుపు నిండుగా అతిగా తినకూడదు. కడుపులో ఎప్పుడూ కాస్త కాళీ ఉండేట్టుగా తినాలి. ఎప్పుడూ ఆకలి కలిగిఉండాలి. చిరుతిండ్ల జోలికి వెళ్లకూడదు.  వ్యాయామము:- ప్రతిరోజూ ఉదయం స్నానం చేయగానే సూర్యనమస్కారములు చేయాలి. ఇలా  చేసినవారికి ఉబ్బసమే కాదు సమస్త వ్యాధులు నయమైపోతాయి.                                                 ◆నిశ్శబ్ద.

 జున్ను తింటున్నారా?? ఇది చదవండి అయితే...

జున్ను తినలేదు ఇప్పటి వరకు అని ఎవరైనా చెప్పారు అంటే అది నిజంగా చాలా పెద్ద వింత అనుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాలలో ఎంతో విరివిగా దొరికే జున్ను చాలా మంచి పౌష్టికాహారం అని అంటారు. అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే… నాణేనికి రెండవవైపు వాదించేవారు ఉన్నారు. వారు చెప్పేది ఏంటంటే.. జున్ను ఆరోగ్యానికి హానికరం అని. ఇంకా జున్ను గురించి చాలా విషయాలు అనుమానాలుగానే ఉండిపోతున్నాయి అందరికీ. వాటిని నివృత్తి చేసే సమాచారం ఇదిగో ఇదే… జున్నుని అని సంస్కృతంలో పీయూషం అని అంటారు. అలాగే పన్నీర్ అని హిందీలో అంటారు. ఇంకా ఇంగ్లీష్ లో అయితే చీజ్ అని అంటారు. ప్రస్తుతం చీజ్ ఆధారిత వంటలు రోడ్ సైడ్ నుండి రెస్టారెంట్ల వరకు ఒకటే హల్చల్ చేస్తుంటాయి. అయితే అదంతా కృత్రిమమైనది.  నిజమైన జున్ను అంటే.. ఆవులు లేదా గేదెలు ఈనిన మూడు నుంచి వారం రోజుల వరకూ వచ్చే పాలు ఇస్తాయి. ఈ పాలను 'ముర్రుపాలు' అంటారు. వీటిలో పచ్చదనం ఎక్కువ వుంటుంది. ఎక్కువ కొవ్వు పదార్థాలుంటాయి. ఇలా ఆవులు, గేదెలు ఈనిన మూడు నుండి వారం రోజుల లోపు ఇచ్చే పాలను పల్లె ప్రాంతాలలో ఆ దూడలు తాగగా మిగిలిపోయేవాటిని పిండి తమకు తెలిసిన ఇళ్లకు పంచుతుంటారు. ఈ పాలలో పంచదార లేదా బెల్లం, మిరియాల పొడి, యాలకులు పొడి వేసి స్టవ్ మీద కాచినప్పుడు ఆ పాలు గట్టిగా అవుతాయి. గడ్డ పెరుగులా… ఎంతో రుచిగా ఉంటుంది ఈ జున్ను.  జున్నులో ఏముంది??  జున్నులో 355 కేలరీలు ఉంటాయి. అదే పాల నుండి మనకు లభించే వెన్నలో 716 కేలరీలు ఉంటాయి. పాల నుండి లభించే మీగడలో 204 కేలరీలు ఉంటాయి. ఇలా మూడింటిని పోల్చి చూసుకుంటే, పాల మీగడకు, వెన్నకు మధ్యగా జున్నులో కేలరీలు ఉంటాయి. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే… ఎక్కువ కేలరీలు అవసరమయ్యే వారు మాత్రమే జున్నును ఆహారంలో భాగంగా తీసుకోవద్సమ్ మంచిది. మరీ ముఖ్యంగా షుగర్, కీళ్ల వాతం జబ్బులు, అధికబరువు గలవారు, వాతం సమస్యలు ఉన్నవారు జున్నును దూరంగా ఉంటే మంచిది. ఈ సమస్యలు ఉన్నవారు జున్ను తీసుకుంటే అనారోగ్య సమస్యలు సులువుగా అధికమయ్యే అవకాశం ఉంటుంది. ప్రొటీన్ల కథ : జున్నులో ప్రొటీన్ల శాతం ఎక్కువ ఉంటుంది. ఇది నాణ్యమైన ప్రొటీన్, శరీరానికి త్వరగా చక్కగా వంటబట్టే ప్రోటీన్లు ఇందులో ఉంటాయి. పైన చెప్పుకున్నట్టు వెన్న, మీగడతో పోల్చి చూస్తే వెన్నలో, మీగడలో ప్రోటీన్లు చాలా తక్కువ ఉంటాయి. అదే జున్నులో అయితే వీటన్నికంటే ఎక్కువగా ఉంటుంది.  జున్నులో ఉండే ప్రోటీన్ల కంటెంట్ జీడిపప్పు, బాదంపప్పు, పిస్తాపప్పు వంటి ఖరీదైన పప్పులకన్నా ఎక్కువగా ఉంటుంది.  దీన్ని బట్టి చూస్తే ప్రోటీన్ లోపంతో బాధపడేవారికి  చిక్కి శల్యమై పోతున్నవారికీ, టీబి, ఎయిడ్స్ వంటి శరీర సామర్థ్యాన్ని క్షీణింపచేసే వ్యాధులతో బాధపడే వారికి జున్ను చాలా మేలు చేస్తుంది.  కొవ్వు: కొవ్వు శాతం పోలిస్తే.. వెన్నలో 81 శాతం కొవ్వు వుంటే, జున్నులో 26.9%, మీగడలో 20% కొవ్వు వున్నాయని తెలిసింది.  కాబట్టి వెన్న కన్నా జున్నులోనే  తక్కువ కొవ్వు ఉంది.  పై విషయాలు అన్నీ గమనిస్తే.. జున్నును తినకూడని పదార్థంగా భావించాల్సినంత ప్రమాదం ఇందులో ఏమీ లేదు. అయితే అతి అనేది అన్నింటిలోనూ ప్రమాదమే కాబట్టి జున్నును కూడా మితంగా తీసుకోవడం మంచిది.  జున్ను వల్ల లాభాలు:- జున్ను తినడం వల్ల లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో అన్నివిధాలా పోషకాలు, కొవ్వులు, ప్రోటీన్లు తగినమొత్తంలో ఉండటం వల్ల శారీరకంగా బలహీనంగా ఉన్నవారికి జున్ను మేలు చేస్తుంది.శారీరకంగా చాలామంది అధిక వేడితో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారి శరీరవేడిని తగ్గిస్తుంది. పైత్యం చేసి ఇబ్బంది కలిగే వారు జున్ను తీసుకుంటే పైత్యం తగ్గిపోతుంది. కడుపులో మంటను తగ్గిస్తుంది. మంచి నిద్రకు సహాయపడుతుంది. రక్త సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. గుండెకు మంచి చేస్తుంది. గొంతు సంబంధ సమస్యలతో బాధపడేవారికి ఆ సమస్యలు నయం చేస్తుంది.  సహజంగానే జున్నులో ప్రొటీన్లు, కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి, జీర్ణమవడానికి సమయం ఎక్కువ తీసుకుంటుంది. జీర్ణశక్తి సరిగా లేనివారు  దీన్ని తిన్నప్పుడు అది సరిగా అరగకపోగా వాతదోషం కఫదోషాలు పెరిగి, శరీరం బరువెక్కడం, మలబద్దకం, కడుపునొప్పి, కడుపులో  బరువు ఏదో తెచ్చిపెట్టినట్లు అనిపించడం... వంటి బాధల్ని కల్గిస్తుంది. వాతదోషం పెరిగి, కాళ్ళు చేతులు నొప్పులు, కీళ్ళు వాచిపోవడం, నడుంనొప్పి, శరీరం కదలకుండా బిగుసుకు పోయినట్లవడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. అందుకని, జున్నుపాలు కాచేప్పుడే అందులో కొద్దిగా మిరియాల పొడిని కలిపి జున్ను తయారుచేస్తారు. దీనివల్ల తేలికగా అరిగేందుకు ఈ మిరియాల పొడి సహకరిస్తుంది. వాతకఫ దోషాలను పెరగకుండా అదుపులో వుంచుతుంది. ఈ బాధలున్నవారు జున్నును పరిమితంగా తినాలి. ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోతే, పాత రోగాలు తిరిగి మొదలయ్యేలా చేస్తుందని జున్ను గురించి హెచ్చరిస్తారు వైద్యులు. ఇదీ జును రహస్యం...                                    ◆నిశ్శబ్ద

అధికవేడి చేస్తోందా?? భయం వద్దు.. ఇలా తగ్గించేయండి.

ఒళ్ళు ముట్టుకుంటే సాధారణంగానే ఉంటుంది కానీ.. ఆ వ్యక్తికి మాత్రం లోపల నిప్పులు కురిసినట్టే ఉంటుంది. గొంతంతా తడి ఆరిపోతూ ఉంటుంది.. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. నోరు పిడచకట్టుకుపోతుంది. పెదవులు ఎండిపోయి నిర్జీవంగా తయారవుతాయి. ఊపిరి వదులుతుంటే వేడిగా సెగలు కొడుతుంది. చర్మం అంతా కళ కోల్పోతుంది. మొత్తానికి మనిషి వాడిపోయిన పువ్వులా తయారవుతాడు. ఇదంతా అధిక వేడి వల్ల కలిగే ఇబ్బంది. ఎదుటివారు మాత్రం నీకేమి కాలేదు ఊరుకో… అని అంటుంటారు. తమను అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకుంటున్నారు ఏంటి వీళ్ళు అనే ఒకానొక బాధ మనుషుల్ని పట్టి పీడిస్తుంది. ఇలా శరీర సమస్య కాస్తా మానసిక సమస్యగానూ తయారవుతుంది. వైద్యులను కలసి మందులు వాడితే… వారు ఇచ్చే ఇంగ్లీష్ మందులు కూడా శరీరానికి వేడిని పెంచేవే… మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా?? అని బాధపడేవారు కంగారు పడాల్సిన అవసరం లేదు. దానికీ కొన్ని చిట్కాలు ఉన్నాయి..  వేడి తగ్గడానికి సహజమైన చిట్కాలు.. అందరికీ సులువుగా దొరికేది వేప. దీని రుచి గురించి పక్కన పెట్టి కాస్త ఓపికగా వాడితే మంచి ఫలితం ఉంటుంది.  వేపాకుల రసం 20-50 మి.లీ.  తీసుకోవాలి. అందులోకి 5 నుండి20 గ్రా॥ల పటిక బెల్లము కలపాలి. చేదు ఎక్కువ భరించలేము అన్నవారు పటికబెల్లం ఎక్కువగా అంటే 20 గ్రాముల వరకు. చేదు తీసుకోగలం అనేవారు 5గ్రాములు మోతాదు కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ఒక వారము రోజులు తాగడం వల్ల వేడి తగ్గుతుంది. మామిడి చెట్టు లోపలి బెరడు తీసుకోవాలి, తరువాత అత్తి (మేడి) చెట్టు వేరు బెరడును, ఇంకా మర్రి చిగుళ్ళను తీసుకోవాలి. వీటి నుండి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని 10 నుండి 40 మి.లీ. తీసి,  అందులో 1 నుండి 2 గ్రా॥ల జీలకర్ర, 5 నుండి 20 గ్రా॥ల పటిక బెల్లము కలపాలి. ఈ మిశ్రమాన్ని తాగటం వల్ల ఎలాంటి వేడి అయినా తగ్గిపోతుంది. సోంపు మనందరికీ తెలిసిందే. ఇప్పట్లో హోటళ్లలో తిన్న తరువాత స్వీట్ సొంపు ఇస్తారు మౌత్ ఫ్రెషనర్ గా. ఈ సొంపు, జీలకర్ర, పటిక బెల్లమును మూడింటిని రాత్రి పూట నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే దీన్ని వడపోసి పరగడపున త్రాగాలి. ఇలా చేస్తుంటే  శరీరంలోని వేడి మొత్తం తగ్గిపోతుంది. అందరికీ అతి సులువుగా ఏ కాలంలో అయినా లభించేది నిమ్మకాయ. ఈ  నిమ్మరసంలో పఠిక బెల్లం వేసి జ్యుస్ లాగా తయారుచేసుకోవాలి. దీన్ని తాగుతుంటే కూడా అధికవేడి దెబ్బకు తగ్గిపోతుంది.  అధికవేడి సమస్య అన్ని కాలాలలో ఉన్నా వేసవికాలంలో ఎక్కువగా వేధిస్తుంది. ఈ వేసవి కాలంలో అందరికీ దొరికే అద్భుతమైన ఫలం పండ్లకు రారాజు మామిడి. ఈ మామిడి పండు పచ్చిగా ఉన్నది తీసుకోవాలి. దాన్ని తోలు తీసి నీటిలో మరిగించాలి. తర్వాత దాని గుజ్జును చల్లని నీటిలో పిసికి రసము తీసి నచ్చినట్టుగా అందులో  ఉప్పు, జీలకర్ర, చెక్కెర మొదలయినవి కలిపి తాగాలి. దీనిని ప్రస్తుతం చాలామంది ఆమ్ పన్నా అని పిలుస్తుంటారు. పచ్చిమామిడితో చేసే ఈ జ్యుస్ అధికవేడి సమస్యకు చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా వడదెబ్బ సమస్య రాకుండా వేసవిలో ఈ జ్యుస్ ను తీసుకుంటూ ఉంటారు.   చెరకు రసం అద్భుతమైన ఔషధం. ఒకప్పుడు చెరకును నేరుగా తినేవారు. ప్రస్తుత కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇది అరుదైపోయింది. అయితే అక్కడక్కడా చెరకు రసం అమ్ముతూ ఉంటారు. ఈ చెరకు రసాన్ని రోజూ తీసుకుంటూ ఉంటే అధికవేడి సమస్య క్రమంగా తగ్గిపోతుంది. అలాగే కడుపులో మంట లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి.  దానిమ్మపండ్లు అన్నిచోట్లా లభ్యమవుతాయి. ఈ దానిమ్మ పండు రసం తీసినా.. లేదా నేరుగా అలాగే విత్తనాలు తిన్నా మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో తలనొప్పి వచ్చినా, వడదెబ్బ తగిలినా, కళ్ళు ఎరుపెక్కినా, దానిమ్మ పండు రసం తాగితే ఫలితం ఉంటుంది.  ఇలా సహజమైన చిట్కాలు ఉపయోగించి శరీరాన్ని మండించే అధికవేడిని తరిమేయచ్చు..    ◆నిశ్శబ్ద.  

భారత్ కు కోవిడ్ వేవ్ ముప్పు ఉందా?

భారత్ కు మరో మారు కోవిడ్ మూడవ విడత ప్రమాదం పొంచిఉందా ?అంటే అవుననే అంటున్నారు నిపుణులు.దేశంలో పెరుగుతున్న xbb కేసులు ఇపట్టికే 9 రాష్ట్రాలలో ఒమేక్రాన్ కొత్త స్ట్రైన్ ఉన్నట్లు గుర్తించారు.దేశంలో 24 గంటలలో కోరోనా 16౦౦ కేసులు పెరిగాయని xbb స్ట్రైన్ గురించి మాట్లాడితే అక్టోబర్ 2౩ వ తేదివరకూ ౩8౦ కేసులు నమోదు అయ్యాయని. ఇది క్రమంగా పెరుగుతోందని xbb సోకిన వారి సంఖ్య తమిళనాడులో ఎక్కువగా ఉందని నిపుణులు పేర్కొన్నారు.ప్రపంచవ్యాప్తంగా నేడు కోరోనా ప్రమాదం పొంచి ఉందని. ఒమైక్రాన్ యొక్క కొత్తరూపం స్ట్రైన్ xbb తీవ్ర సమస్యలు సృష్టిస్తోంది.సింగపూర్ నుండి భారత్ చేరిందని తమిళనాడులో అత్యదికకేసులు నమోదు అవుతున్నాయని మొత్తం 9 రాష్ట్రాలాలో ఇప్పటికే ఈ వేరియంట్ ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు.జర్మనీకి చెందినా సంస్థ గ్లోబల్ ఇనిషిఏటివ్ ఇన్ఫ్లూయెంజా సమాకు సంబందించిన దాటా పంచుకుందని. కోరోనా వైరస్ లో వస్త్ర్హున్న మార్పులు పై దృష్టి పెటారు. భారత్ లో గతవారం xbb సబ్ వేరియంట్ ప్రభావం ఉన్నట్లు నిర్ధారించారు. తమిళనాడులో 175 కేసులు xbb వైరస్ విషయం లో తమిళనాడు ముందుఉందని.ఇప్పటికే 175 కేసులు నమోదు కాగా 1౦౩ కేసులు పశ్చిమ బెంగాల్ లో రెండవస్థానం లో ఉంది. xbbవేరియంట్ కేసులు పశ్చిమ బెంగాల్ లో నమోదు కవాదం విశేషం. కొన్ని రాష్ట్రాలాలో xbb మూడు రూపాలు... xbb కి మూడు సబ్ వేరియంట్స్ ఉన్నాయి. xbb.1,xbb.౩ రూపాలుగా గుర్తించారు. భారత్ లో లభించిన ౩8౦ కేసులలో అత్యధికంగా 68.4 2 కేసులు xbb2 సబ్ వేరియంట్ గా గుర్తించారు. ఇదే15% క్రేసులు xbb.2 2.౩6 కేసులు xbb.1గా గుర్తించారు.దేశంలోని 9 రాష్ట్రాలలో xbb వేరియంట్ విభిన్నమైన రూపాలలో ఉంటుందని ఇక వివిధరాస్త్రాలలో ఎంతమంది దీనిబారిన పడ్డారో చూదాం తమిళనాడు 175 పశ్చిమబెంగాల్ లో 1౦౩ ఓడిస్సలో ౩5 మహారాష్ట్రాలో21 డిల్లి18 పాండిచ్చేరి 16 కర్నాటక 9 గుజరాత్2 రాజాస్తాన్ 1 కేసు నమోదు అయినట్లు సమాచారం.xbbవేవ్ రూపం లో మున్చుకోస్తోందా?ఒమైక్రాన్ కొత్తరూపం xbb వస్తోందని డబ్ల్యు హెచ్ ఓ ఆందోళన వ్యక్తం చేసింది.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాదన్ మాట్లాడుతూ శరీరంలో రోగానిరోదకశక్తిని మోసం చేస్తూ వ్యక్తికి సంక్రమిస్తుందని.దీనితోపాటు. కొన్నిదేశాలలో కోరోనా కొత్తేవవే పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరోనా కొత్తేవేవ్ ౩౦౦ కు పైగా వేరియంట్లు ఉన్నాయని.ప్రపంచవ్యాప్తంగా xbb చాలా శక్తివంతమైనదని పేర్కొన్నారు.గతంలో మనం అత్యంత ప్రమాదకరమైన కోరోనా వేరియంట్లను చూసామని xbb యాంటి వేరియంట్ పై దాడిచేస్తుందని ఈ కారణంగా కొన్ని దేశాలాలో మళ్ళీ కోరోనా వేవ్ వచ్చే అవకాశం ఉందని దీనికితోడు ba5 ba1 పై దృష్టి పెట్టమని వివరించారు. రెండు వేరియంట్లు అత్యంత ప్రమాదకరమని అన్నారు.  

కీళ్ల ఆరోగ్యం కులాసాయేనా??

ఒకప్పుడు అరవై సంవత్సరాలు దాటినా ఆరోగ్యంగా ఉంటూ ఎన్నో పనులు చేసుకుంటూ చక్కని జీవితం సాగించేవారు. మన అమ్మమ్మలు, తాతయ్యల కాలంలో ఇలాగే ఉండేది. అందుకే వారు ఇప్పటికీ 80,90 సంవత్సరాల వయసుకు చేరువ అయినా ఒకరి మీద ఆధారపడకుండా తమ పనులు తాము చేసుకుంటూ ఉండగలుగుతున్నారు. అయితే వీరి మనవళ్లు, మనవరాళ్లు మాత్రం 40 సంవత్సరాలు కూడా పూర్తి కాకనే కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. మరీ ముఖ్యంగా కీళ్ల సమస్యలు ఇప్పటి తరాన్ని చాలా వేధిస్తున్నాయి.  ఎముకలు శరీరంలో చట్రాన్ని ఏర్పరిస్తే, అందులో వున్న కీళ్ళు మనిషి కదిలేట్లు చేస్తాయి. రెండు లేక మూడు ఎముకలు కలిసే ప్రదేశాన్ని 'కీలు’ అంటామనే విషయం మనకు తెలిసిందే.. పుర్రెలో వున్న ఎముకల కలయిక తప్ప మిగతా కీళ్ళన్నీ కదిలేవే! కదిలించదగిన కీలులో ఎముకల అగ్రభాగములు పల్చని కార్టిలేజ్ తో కప్పబడి, నునుపైన ఉపరితల ప్రదేశాన్ని కలిగి వుంటాయి. వెన్నుపూసల మధ్య వుండే కార్టిలేజ్ ముక్కలు షాక్ అబ్సార్బర్స్ లాగా పనిచేస్తాయి. ఎముకలు కలిసే ప్రదేశంలో వాటిని ఫైబ్రస్ టిష్యూతో నిర్మింపబడిన తాళ్ళ వంటి లిగమెంటులు కలిసి వుండేట్లు చేస్తాయి. ఈ పొరపై నోవియల్ ఫ్లూయిడ్ అవే ద్రవపదార్థాన్ని  సృష్టిస్తుంది. అది కందెనలా తోడ్పడుతుంటుంది. అయితే చాలామందిలో ఉన్న ప్రశ్న.. కీళ్లు ఎందుకు అలా అరిగిపోతాయి?? చిన్న వయసులోనే కీళ్లు అరిగిపోవడం ఏంటి విచిత్రం కాకపోతే.. అనుకుంటూ వుంటారు.  90°కన్నా ఎక్కువగా మోకాల్ని బెండ్ చెయ్యడం మంచిదికాదు. ఇప్పుడంటే కొన్ని కొత్త ఇళ్లలో టాయిలెట్స్ అన్నీ వెస్ట్రన్ వెర్షన్ వచ్చాయి. కానీ చాలా ఇళ్లలో సాధారణ టాయిలెట్స్ ఉంటాయి. టాయిలెట్ వెళ్ళినప్పుడు మోకాళ్ళ మీద కూర్చుంటూ వుంటాం. ఇలా ఎక్కువగా కూర్చోవటం మంచిదికాదు. మోకాలు కీలుని అంత ఎక్కువగా వంచి కూర్చోవటం వల్ల ఆ కీళ్ళు బాగా అరిగిపోతాయి. ఇలా ఎక్కువగా వాడడం వల్ల ‘జాయింట్స్ ఏజ్' బాగా పెరిగిపోతుంది. మనిషి వయసుతో సంబంధం లేకుండా జాయింట్స్ వయసు పెరిగిపోతుందన్న మాట! కొంతమంది ఇతరులతో కంపేర్ చేసుకుంటూ ఫలానా అతనికి యాభై సంవత్సరాలు దాటినా అరగలేదు, నా కీళ్ళు నలభై అయిదేళ్ళకే అంతగా అరిగిపోయాయేంటి అనుకుంటుంటారు. అయితే ఇక్కడ ముఖ్య విషయం కీళ్ళు వాడకాన్ని బట్టి అరుగుతాయి కానీ వయసుని బట్టి కాదు. కాబట్టి ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే… కీళ్లు అనేవి వయసును బట్టి కాదు మనం చేసే పనులు, కీళ్లను ఉపయోగించే విధానం మీద ఆధారపడి అరుగుతాయి.  కీళ్లు బలంగా ఉండటానికి మంచి ఆహారం తీసుకోవాలి. కీళ్ల మీద మరీ ఎక్కువ ఒత్తిడి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిలుచుకోవడం, కూర్చోవడం, పరిగెత్తడం, నడవడం, పడుకోవడం ఇలా చేసే ప్రతి పనిలో కీళ్లు సౌకర్యవంతంగా ఉండే భంగిమ చూసుకోవాలి.  ఆహారం, జాగ్రత్తలు, లైఫ్ స్టైల్ వీటిని సక్రమంగా ఉంచుకుంటే కీళ్ల ఆరోగ్యం కలుక్కుమనకుండా కులాసాగా ఉంటుంది.                                   ◆నిశ్శబ్ద.

అలర్జిక్ వ్యాధుల గురించి నమ్మలేని నిజాలు!!

శ్వాసకోశ వ్యవస్థలోని వివిధ భాగాలు అలర్జీ వ్యాధికి గురవటం చూస్తున్నాము. అలర్జిక్ రైనైటిస్, అలర్జిక్ బ్రాంకైటిస్, బ్రాంయల్ అస్తమా వంటి వ్యాధులు ఈ కోవకు చెందుతాయి. అలర్జీ అంటే మితిమీరిన సున్నితత్వం అని చెప్పవచ్చు. కొన్ని హానికరంకాని పదార్థాలకు, వాతావరణానికి శరీరం అతి సున్నితంగా స్పందించడమే. ఏ పదార్థానికైతే రోగి సున్నితత్వం కలిగి ఉంటాడో ఆ పదార్థాన్ని అలెర్జిన్ అంటాము. ఈ పదార్థాలు ఇతర ఆరోగ్యవంతులు తీసుకున్నా, ఎక్స్పోజ్ అయినా, ఎలాంటి దుష్ప్రభావం ఉండదు. కాని అలా ఉన్నవాళ్ళు ఈ అలెర్జెన్స్ ని తీసుకున్నట్లయితే దేహరక్షణ వ్యవస్థ తీవ్రంగా స్పందిస్తుంది. దీనినే అలర్జిక్ రియాక్షన్ అంటాము.  ఇది గాలిలో పుప్పొడి, దుమ్ము . ధూళి, తినే పదార్థాలలోగాని, పాలు, చేపలు, గుడ్లు, పులుపు, పండ్లు మొదలయి వాటికి దేనికైనా ఈ అలర్జీ రోగులు రియాక్ట్ కావచ్చు. ఆరోగ్య వంతులు ఈ పదార్థాలను సులభంగా శరీరంలో ఇముడ్చుకుంటారు. దేహరక్షణ వ్యవస్థ ఈ పదార్థాలను దేహానికి శత్రువులుగా భావించటం వల్ల రియాక్ట్ అవుతుంది. ఈ రియాక్షన్ చర్మం పైకాని, జీర్ణనాళంలో కాని, శ్వాసమండలంలో కాని జరగవచ్చు. శ్వాసమండలంలో ఈ అలర్జీ రియాక్షన్ ఏర్పడటం వల్ల రైనైటిస్, అలర్జిక్ బ్రాంకై టెస్, బ్రాం యల్ ఆస్తమావంటి వ్యాధులు వస్తాయి. అలర్జీక్ రియాక్షన్ తినే పదార్థాలనుండే కాకుండా ముఖ్యంగా వాతావరణ పరిస్థితుల వల్ల కూడా వస్తుంది. కొంతమంది అధిక తేమవల్ల, కొంతమంది చల్లదనం వల్ల, కొంతమంది వాతావరణంలో మార్పులకు కూడా స్పందిస్తారు. వేడి నుండి మేఘాలతో కూడిన తేమ వాతావరణం, మరికొంతమంది వాతావరణం లోని విద్యుత్ మార్పులకు కూడా స్పందించటం జరుగుతుంది. ఆరోగ్యవంతులు ఈ వాతావరణ పరిస్థితులకు సులభంగా తట్టుకోగలరు. అలర్జీ రోగుల్లో వ్యాధినిరోధక శక్తిలో సమతుల్యం లోపించటం వల్లనే ఈ విధంగా అతిగా రియాక్ట్ అవుతారు.  సాంప్రదాయ వైద్య విధానంలో రోగి ఏ పదార్థాలకు సున్నితంగా ఉన్నాడో, ఆ పదార్థాన్ని డైల్యూట్ చేసి అతిసూక్ష్మ పరిమాణంలో కొంతకాలం రక్తంలోకి ఇంజెక్ట్ చేస్తారు. దీనినే డిసిన్సిలైజేషన్ అంటారు. అంటే రోగి ఉన్న అతి సున్నితత్వం ఆ పదార్థం నుండి తగ్గిపోతుంది. ఈ పద్ధతి వల్ల రోగి రియాక్ట్ అవటం కొంత తగ్గుతుంది. కాని ఈ రకమైన డిసెన్సిటైనేషన్ వల్ల కూడా ఉపశమం తాత్కాలికమే. కొంతకాలం తర్వాత రోగి ఇంకో పదార్థానికి సున్నితత్వం పెరుగుతుంది. అలర్జిన్ మారిపోతుంది కాని సమస్య పరిష్కారం అవటంలేదు.  ఆహార పదార్థాలకు, దుమ్ము, ధూళి, పుప్పొడి వంటి పదార్థాలకు డిసిన్సిటైజేషన్ ప్రయత్నించవచ్చు. కాని, చల్లదనం, వేడి, వాతావరణంలో మార్పులకు సున్నితత్వాన్ని మా తం ఈ ప్రక్రియ ద్వారా ఏమి చేయలేరు. ఈ అలర్జిక్ వ్యాధులు దీర్ఘవ్యాధులు. అపుడపుడు వ్యాధి ఉద్రేకిస్తుంది. దీనిని అక్యూట్ అటాక్ అంటాము. అక్యూట్ అటాక్ తగ్గటానికి అక్యూట్ మందులు వాడినా, వెంటనే రోగ లక్షణాలు తక్కువవుతాయి. కాని రోగం నిగూఢంగా ఉంటుంది. తగిన పరిస్థితులు ఏర్పడినపుడు ఈ వ్యాధి మళ్లీ దర్శనమిస్తుంది. అలర్జిక్ వ్యాధులను సమూలంగా నయం చేయటానికి సమయం పడుతుంది. అలర్జిక్ వైనైటిస్లో 1-3 సంవత్సరాలు, ఆస్తమాలో 2 నుండి 6 సంవత్సరాలు పడుతుంది. వ్యాధి తీవ్రత, అక్యూట్ అటాక్స్ తరచుదనం, క్రమంగా తగ్గిపోతాయి. చికిత్స ప్రారంభ దశలో రోగి తనకు పడని ఆహార పదార్థాలకు, వాతావరణ పరిస్థితులకు దూరంగా ఉండడం మంచిది. చర్మానికి సంబంధించిన అలర్జిక్ వ్యాధులను పై పూతతో వ్యాధిని అణచివేయటం వల్ల రెస్పిరేటరీ అలర్జీ వచ్చే అవకాశం వుంది. ఇదీ అలర్జీక్ వ్యాధుల తీరూ… తెన్ను.                                       ◆నిశ్శబ్ద.

నిద్ర మీద శరాఘాతం ఇన్సోమ్నియా!!

కొందరు మానసిక చికాకులవల్ల, ఆలోచనలవల్ల నిద్ర పట్టడం లేదనుకుంటే మరి కొందరు పైకి ఏ కారణం లేకుండానే రోజుల తరబడి సరైన నిద్రపోకుండా గడిపేస్తారు. కొందరు రాత్రిళ్ళు గుడ్ల గూబల్లాగా కళ్ళు తెరచి గడియారం వంక చూస్తూ ఎప్పుడు తెల్లవారుతుందా అని నిరీక్షిస్తూ వుంటారు. ఇలాగే రోజులు, నెలలు, సంవత్సరాలు నిద్ర లేకుండా గడిపే వ్యక్తులు ఎందరో వున్నారు. ఈ రకంగా నిద్ర పట్టకపోవడం కూడా ఒక వ్యాధే. దీనినే వైద్యభాషలో "ఇన్సామ్నియా" అంటారు. అసలు నిద్ర పట్టకపోవడాన్నీ, ఎవరికైనా నిద్రపట్టినా సరిగ్గా పట్టకపోవడాన్ని ఇన్సామ్నియాగా భావించవచ్చు.  సాధారణంగా పెద్దవాళ్ళు రోజుకు ఏడు, ఎనిమిది గంటలు, పిల్లలు 10-11 గంటలు నిద్రపోతారు. చంటిపిల్లలు రోజుకు 18 గంటల వరకూ నిద్రిస్తారు. ఎవరికైనా సరే పడుకున్న గంట తరువాత మంచి నిద్ర పడుతుంది. తరువాత 4 గంటలకు ఆ నిద్ర తీవ్రత తగ్గుతుంది. మళ్ళీ ఒక గంటలో ఆ నిద్ర తీవ్రత పెరుగుతుంది. అంటే ఎనిమిది గంటల పాటు వరసగా నిద్రపోయే వారికి మధ్యలో కొద్దిసేపు నిద్ర తీవ్రత తక్కువగా ఉండి త్వరగా మెలుకువ రావడానికి ఆస్కారం వుంది. ఏది ఏమైనా వయస్సుకు తగినంత నిద్రపోయేవారు. శారీరకంగా, మానసికంగా హాయిగా ఉంటారు. ఆరోగ్యవంతుడైన వ్యక్తికి వరసగా రెండు మూడు రోజులు నిద్ర లేకపోయేసరికి కళ్ళు మండడం, తలనొప్పి అనిపించడం, తలతిరగడం, ఒళ్ళు కూలడం, నరాల బలహీనత, అనవసరంగా ఆందోళన కలగడం లాంటి లక్షణాలు ఉంటాయి. అంతేకాదు, శక్తి లేనట్లు అనిపించడం, ఆలోచనల్లో క్రమం లేకపోవడం, కనురెప్పలు బరువుగా మూసుకుని పోవడం, మాటలు తడబడడం, ఊరికినే కోపం, చికాకు కలగడం కూడా సహజమే. కాని నిద్ర రాని వ్యాధితో బాధపడే వ్యక్తిలో ఇటువంటి లక్షణాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. అటువంటి వ్యక్తులు సాధారణంగా న్యూరోటిక్ వ్యక్తులైనా అయి ఉంటారు, లేదా సైకోటిక్ వ్యక్తులయినా ఆయి వుంటారు. న్యూరోటిక్ వ్యక్తులలో మానసిక ఆందోళన, ఆలోచన, గందరగోళం, ఆవేశం ఎక్కువ ఉంటాయి. ప్రతిదానికి భయం, ఆదుర్దా ఉంటాయి. ఇటువంటి ఆందోళనలు, అంతులేని ఆలోచనలు ఉండడంతో నిద్ర పట్టదు. మరి కొందరు మానసిక రోగులకు సైకోసిస్ వల్ల భ్రమలు, భ్రాంతులతో మనస్సునకు స్థిమితం లేక నిద్ర పట్టదు. అలాగే నిరుత్సాహం (డిప్రషన్) వల్ల కూడా కొందరు రోజులతరబడి నిద్రపోకుండా గడిపేస్తూ ఉంటారు. అలాంటి వారు అనవసరంగా చికాకు పడడం, దేనిమీదా సరయిన ఆసక్తి లేకపోవడం, ఎప్పుడూ ముఖంలో ఏదో ఒక విచారము, నఖశిఖ పర్యంతం ఏదో రుగ్మత, నిరాశ, నిస్పృహ ఉండడం, వ్యక్తులతో దూరంగా మసలడం, ప్రతి దానికి తేలికగా అలసిపోవడం లాంటి లక్షణాలు ఉంటాయి.  ఇలాంటి వ్యక్తులు కూడా నిద్ర రాని వ్యాధితో బాధపడడం సహజం. న్యూరోసిస్ గాని, సైకోసిస్ గాని, నిరుత్సాహంగాని మానసిక వ్యాధులే. ఈ మానసిక వ్యాధుల తీవ్రతను బట్టి అసలు నిద్ర పట్టకపోవడమా, కొద్దిగా నిద్రపట్టడమా లాంటివి ఆధారపడి వుంటాయి. డిప్రషన్ తో బాధపడే చాలామంది తాము ఫలానా కారణం వల్ల బాధపడుతున్నామని తెలుసుకోలేక నిద్రపట్టక పోవడం వల్లనే తక్కిన లక్షణాలన్నీ వున్నాయని భావిస్తారు. కాని నిద్ర పట్టకపోవడం కూడా డిప్రషన్ లో ఒక లక్షణమని గుర్తించరు.  నిద్ర రాకపోవడానికి మానసిక వ్యాధులు కారణమయిన పక్షంలో కాస్తో కూస్తో నిద్రను కూడా చెడగొట్టే ఇతర  స్థితులు సైతం "ఇన్సామ్నియా"కి దోహదం చేస్తాయి. కొందరికి నిద్రపట్టి పట్టగానే కాలో చెయ్యో అకస్మాత్తుగా ఎవరో పట్టుకొని గట్టిగా ఊపేసినట్లయి వెలుకువ వచ్చేస్తుంది. కొందరికి మొత్తం శరీరాన్నే కుదిపేసినట్లు అవుతుంది. ఇలా జరగడానికి నిద్రపోయే వ్యక్తిలో ముఖ్య మయిన నాడీ కేంద్రాలు కూడా విశ్రమిస్తే, చిన్న చిన్న నాడీ కేంద్రాలు స్వేచ్ఛ వచ్చినట్లయి ఒక్కసారిగా విచ్చలవిడిగా వ్యవహరించడమే కారణం. నిద్రపట్టక పోవడానికి తగిన మానసిక వ్యాధిని గుర్తించి చికిత్స చేస్తే ఆ వ్యక్తి త్వరగా కోలుకుంటాడు. మానసిక ఆందోళన, చికాకులు నిద్రపట్టకపోవడానికి కారణాలు అయిన పక్షంలో ట్రాన్క్విలైజర్స్, డిప్రషను అయితే అది పోవడానికి మందులు వాడితే మంచి ఫలికాలు కలుగుతాయి. సరైన చికిత్స పొందకుండా ఊరుకుంటే ఆ వ్యక్తిలో వృత్తి నైపుణ్యము తగ్గిపోవడమే కాకుండా ఆరోగ్యం కూడా త్వరగా దెబ్బతింటుంది.   ◆నిశ్శబ్ద.

యమపాశం లాంటి క్షయకు చెక్ పెట్టండి ఇలా...

ఈ మధ్య కాలంలో విస్తృతం అవుతున్న ఆరోగ్య సమస్యలలో టిబి కూడా ఒకటి. దీన్నే క్షయ అని కూడా అంటారు. ఈ క్షయ వ్యాధి చూడడానికి సాధారణ దగ్గులా అనిపించి అయోమయానికి గురి చేస్తుంది. కానీ దీన్ని గురించి తెలుసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ఇది ప్రాణాంతక సమస్యగా  మారే అవకాశం ఉంటుంది.  ఇంతకూ ఈ క్షయ సమస్య ఎందుకు ఎలా వస్తుంది?? దీనికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?? టిబి సోకిన వారికి చావే గతి అని అంటూ ఉంటారు చాలామంది. అది నిజమేనా లేక అపోహనా?? టిబి నయం అవుతుందా?? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటే ఈ సమస్య గురించి పూర్తి అవగాహన వస్తుంది. ఈ సమస్య నుండి ప్రతి ఒక్కరు తమని తాము కాపాడుకునేందుకు ఆస్కారం వుంటుంది. వీటికి సంబంధించిన వివరాల్లోకి వెళితే… టి.బి ఎందుకు ఎలా వస్తుంది?? టి.బి అనే దాన్ని క్షయ అని కూడా అంటారు. ఇది మైక్రో బాక్టీరియా టుబరంక్యులోసిన్ అనే బాక్టీరియా వల్ల వచ్చే సమస్య. ఈ బాక్టీరియా సాధారణ వ్యక్తి పీల్చే గాలి ద్వారా ఊపిరితిత్తులలోకి ప్రవేశించి క్షయను కలుగజేస్తుంది. ఇది పూర్తిగా అంటువ్యాధి. ఒకరి నుండి మరొకరికి చాలా సులభంగా వ్యాప్తి చెందుతుంది. టిబి సోకిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి?? టిబి లేదా క్షయ వ్యాధి సోకిన వారి లక్షణాలు పైకి కనిపిస్తాయి. విపరీతమైన దగ్గు ఉంటుంది. ఈ దగ్గు కూడా కఫంతో కూడి ఉంటుంది. ఇది సుమారు మూడు వారాలకు పైగా ఉంటే వ్యాధి లక్షణంగా అనుమానించాల్సి ఉంటుంది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది కలగడం, ఆయాసం, తేలికపాటి జ్వరం, శరీరం శుష్కించిపోవడం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు ఉంటాయి. దగ్గు క్రమంగా పెరిగితే రక్తంతో కూడిన కఫం పడే అవకాశం కూడా ఉంటుంది. టిబి సమస్యకు జాగ్రత్తలు ఏమిటి?? టిబి సోకిన వారు అది ఇతరులకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దగ్గుతో ఉంటారు కాబట్టి మాస్క్ ధరించాలి. ఎక్కడంటే అక్కడ ఉమ్మి వేయకూడదు. చల్లని వాతావరణానికి తిరగకూడదు. వైద్యులు సూచించిన మందులు వాడుతూ తమ వస్తువులను విడిగా ఉంచుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలి. టిబి సమస్య లేనివారు తమ చుట్టూ టిబి వ్యాధి వ్యాప్తిలో ఉన్నప్పుడు జాగ్రత్త పాటించాలి. ఎక్కడంటే అక్కడ తినడం, తాగడం చేయకూడదు. బయట ప్రాంతాలలో ఉమ్మివేయకూడదు. ఇతరులతో మాట్లాడేటప్పుడు రద్దీ ప్రాంతాలలో తిరిగెటప్పుడు మాస్క్ ధరించాలి.  టిబి నయం అవుతుందా??  టిబి వ్యాధి గురించి పట్టించుకోకపోతే అది ప్రాణాంతకం అయినప్పటికీ దాన్ని గురించి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వైద్యులు సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడితే ఆరు నెలలలోపు జబ్బు తగ్గిపోతుంది. కాబట్టి టిబి వస్తే ఇక చావే గతి అనే అపోహను వదిలేయాలి. క్షయ రోగానికి కేవలం ఇంగ్లీషు వైద్యం మాత్రమే కాకుండా ఆయుర్వేదంలో కూడా వైద్యం అందుబాటులో ఉంది. ఏ రకం వైద్యం అయినా వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడితే టిబి నయమవుతుంది. చలి మరియు వర్షా కాలంలో ఈ సమస్య మరింత విస్తృతం అయ్యే అవకాశాలు ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలి.                                    ◆నిశ్శబ్ద.

ఆకుకూరలు ఎందుకు ముఖ్యం?? క్యాల్షియం ఎందుకు అవసరం??

మనం రోజువారీ తీసుకునే ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు ఎంతో ముఖ్యమైనవి. అయితే చాలామంది ప్రస్తుతం పట్టణాల్లో నివశిస్తున్నవారు అందుబాటులో లేవనే కారణంతో ఆకుకూరలు సరిగా తీసుకోవడం లేదు. కొందరు ఇంట్లో ఉన్న ఖాళీ స్థలంలో కొన్ని ఆకుకూర మొక్కలు పెంచుకుని అప్పుడప్పుడు వాటిని తింటూ ఉంటారు. అవి ఎంతో ఆరోగ్యకరమే కాకుండా రసాయనాలు లేనివి కాబట్టి పలితాలు కూడా బాగా ఇస్తాయి. కానీ అసలు ఆకుకూరలు తిననివారు చాలామంది ఉంటారు.   అసలు ఆకుకూరలు ఎందుకు తీసుకోవాలి?? వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?? వంటివి వివరంగా తెలిస్తే వాటిని ఆహారంలో తప్పకుండా తినడం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. నిజానికి ఆకుకూరల ప్రాధాన్యత చిన్నప్పటి నుండి పాఠాలలో చదువుకుని తెలుసుకుంటూనే ఉన్నాం, విటమిన్స్ మొదలైన అంశాలలో మళ్ళీ మళ్ళీ ప్రస్తావించుకుంటుంటాం కానీ ఆరోగ్యం గురించి మాట్లాడుకునే సమయంలో మళ్ళీ వాటిని వివరంగా చర్చించుకోవాలి. లేకపోతే మన మొండి బుర్రలు ఆరోగ్యం గురించి భయంతో ఉండవు.  ఆరోగ్యానికి ఆకుకూరలు రోజు తినాలి వీటిలో కూరగాయల కంటే రెట్టింపు పోషక విలువలు, మాంసకృత్తులు ఉంటాయి. చాలామంది పాలకూర, టమాట కలిపి వండుకునే విషయంలో ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. కానీ ఈ రెండింటిని అప్పుడప్పుడు సందేహం లేకుండా వండుకుని తినచ్చు.   ఆకు కూరలను మొక్కల నుండి కోసిన తరువాత ఒకటి రెండు రోజులు నిలువ ఉంచుకోవచ్చేమో కానీ వాటిని చిన్నగా తరిగి నిలువ ఉంచకూడదు. అలా నిలువ ఉంచితే వాటిలో ఉండే పోషక విలువలు పోతాయి.   చాలామంది క్యాల్షియం తక్కువ ఉందని, ఐరన్ తక్కువ ఉందని టాబ్లెట్లు వాడుతుంటారు. ఇలా టాబ్లెట్లు ఎక్కువగా వాడితే కిడ్నీలో రాళ్ళు తయారవుతాయి.  అందుకే వీటిని ఆకుకూరల నుండి పొందవచ్చు.  ఆకు కూరలతో చాలామంది పొడికూరలు చేస్తుంటారు. ఆకుకూరలు ఫ్రై చేసి చేసే ఈ పొడికూరలలో పోషకాలు ఏమి ఉండవు. ఫ్రై చేయడం వల్ల వాటిలో ఉండే పోషక విలువలు నశిస్తాయి. అలాగే ఆకుకూరలతో చింతపండు ఎక్కువ జతచేయకూడదు   తోటకూరను పెరుగు కలిపి నూనె లేకుండా వండుకోవచ్చు, అలాగే గోంగూరను  పాలు కలిపి వండుకోవచ్చు  అయితే నూనె లేకుండా వండాలి. ఇలా చేస్తే  రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యం కూడా.  పప్పులను కూరగాయలతో లేదా ఆకుకూరలతో కలిపి వండుకోవాలి. దీనివల్ల రుచి మాత్రమే కాదు రెండింటి వల్ల పోషకాలు సమతుల్యంగా ఉంటాయి.  ఆకు కూరలలో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మద్యాహ్న సమయంలో తినాలి. ఆకుకూరలను పప్పులతో కలిపి వండినప్పుడు వాటిని  సాయంత్రం(లేదా రాత్రి) సమయంలో  తింటే గ్యాస్ ట్రబుల్ సమస్య వస్తుంది. ఆకుకూరలు అన్నింటిలో "ఎ" విటమిన్ పుష్కలంగా ఉంటుంది.  ఎన్నో చోట్ల విరివిగా పెరిగే చెట్లు మునగచెట్లు.  వీటికి ప్రత్యేక నీటి వసతి, సంరక్షణ అవసరం లేదు. వాటికవే పెరుగుతాయి. వీటి నుండి లభించే మునగాకును ప్రతిరోజు వంటలలో వాడవచ్చు, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.మరీ ముఖ్యంగా షుగర్ ఉన్నవారికి ఎంతో మంచిది. ఇందులో అధికమొత్తంలో ఐరన్ కూడా ఉంటుంది. కాబట్టి ఐరన్ లోపం ఉన్నవారు దీన్ని తీసుకోవచ్చు.  ఆకు కూరలలో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది కాబట్టి వీటిని విరివిగా వాడితే మహిళలకు  జట్టు బాగా పెరుగుతుంది. ముఖ్యంగా తోటకూర, మునగాకు, కరివేపాకు బాగా వాడాలి.  ఆకుకూరలు బాగా వాడితే బాలింతలకు మంచిది. వీటివల్ల బాలింతలకు పాలు బాగాపడతాయి. ఆకుకూరలలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. క్యాల్షియం టాబ్లెట్లు వాడితే అనర్థాలు కలుగుతాయి. అదే  సహజంగా లభించే క్యాల్షియం ద్వారా మన శరీరానికి ఎలాంటి అనర్థముండదు. కిడ్నీలో రాళ్లురావు.   మనకు అవసరమైన ఐరన్ కూడా  పండ్లలో కంటే ఆకు కూరలలోనే ఎక్కువగా ఉంటుంది. పాలకూర, శనగపిండి, నిమ్మరసం, పచ్చిమిర్చి, అల్లం అన్ని కలిపి నూనె లేకుండా వెయించి బజ్జీల్లాగా తినవచ్చు. గోధుమలు, పాలిష్ చేయని బియ్యం వంటి వాటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివి ఆహారంలో భాగం చేసుకుంట పూర్తి స్థాయిలో కాల్షియం అందుతుంది. ఒకసారి తీసుకున్న పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులు సుమారు 300 మిల్లీల కాల్షియాన్ని అందిస్తాయి.  క్యాబేజీ, క్యాలీఫ్లవర్ మొదలైన వాలో కూడా కాల్షియం అధికంగా ఉంటుంది. కాల్షియం శరీరంలో వచ్చే వ్యాధి కారక క్రిములను నాశనం చేస్తుంది. కాబట్టి క్యాల్షియాన్ని శరీరానికి సరిపడా అందివ్వాలి.                                      ◆నిశ్శబ్ద.  

కిడ్నీ ఫెయిల్యూర్ ను కనిపెట్టచ్చు ఇలా….

ఈమధ్య కాలంలో చాలామంది విషయంలో తరచుగా వినబడుతున్న మాట కిడ్నీ ఫెయిల్యూర్. శరీరంలో ఒక ముఖ్యమైన అవయవం అయిన కిడ్నీలు దెబ్బతినడం అంటే ఆరోగ్యానికి చాల పెద్ద ముప్పు వచ్చినట్టే. అయితే కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏంటి?? అది ఎలా వస్తుంది?? దాన్ని ఎలా నిర్ధారిస్తారు వంటి విషయాలు తెలుసుకుంటే… కిడ్నీ ఫెయిల్యూర్ అంటే…. మూత్రపిండాలలోని నెఫ్రాన్లు వడపోత పోయగలిగే సామర్థ్యాన్ని కోల్పోయినప్పుడు దానిని మూత్ర పిండాలు వైఫల్యం చెందడం లేదా కిడ్నీ ఫెయిల్యూర్ అని అంటారు.  ఈ సమస్య హఠాత్తుగానూ జరగవచ్చు లేదా ఏళ్ళ తరబడి లక్షణాలేమీ కనిపించక పోయినా... చివరికి ఎప్పుడో బైటపడవచ్చు. హఠాత్తుగా కిడ్నీ ఫెయిల్యూర్ అయితే దానికి మూత్రపిండాలపైన బలమైన దెబ్బలు తగలడం కాని, విపరీతమైన రక్తస్రావం కావడం కానీ, విషపదార్ధాలను తీసుకోవడం కానీ కారణం అయి ఉంటుంది. అలాగే చాలా రకాల మందులకు మూత్రపిండాల మీద దుష్ప్రభావాన్ని చూపించే గుణం ఉంది. మూత్రపిండాలకు మందుల నుండి ప్రమాదం అంటూ ఉంటే అది 'ఓవర్ ది కౌంటర్' మందుల నుంచే ఉంటుంది. ఈ మందుల్లో చాలా వరకూ జ్వరాన్ని, నొప్పిని తగ్గించేవే ఉంటాయి. యాసిన్, ఎసిటెమైనోఫిన్, బబుబ్రూఫెన్ మొదలైన మందులన్నీ మూత్రపిండాల పై దుష్ప్రభావాన్ని చూపించేవే. మూత్రపిండాల వ్యాధితో బాధపడే వాళ్లు కానీ, అవి వచ్చే అవకాశాలు ఉన్నవాళ్లు గానీ ఈ మందులను ఎక్కువగా ఉపయోగించడం మంచిది కాదు. ఎంతోకాలం నుంచి మూత్రపిండాల వైఫల్యం కొనసాగుతున్నట్లైతే దానికి హై బీపీ కాని, షుగర్ కాని కారణమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. మధుమేహంలో గ్లూకోజ్ కణజాలాలకు అందకుండా రక్తంలోనే ఉండిపోయి మూత్ర పిండాల మీద ఒత్తిడిని కలిగిస్తుంది. హై బీపీలో మూత్రపిండాలలో ఉండే కేశ సాదృశ్యమైన రక్తనాళాలు నష్ట పోయి వడపోత దెబ్బతింటుంది. కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు:  మూత్రపిండాల వ్యాధుల్లో, ముఖ్యంగా మూత్రపిండాల వైఫ్యలం మొదట్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. కొంతకాలం తర్వాత అనారోగ్య లక్షణాలు మొదలవుతాయి. నలతగా అనిపిస్తుంది. తలనొప్పి ఎక్కువగా వస్తుంది. దురదగా ఉంటుంది. మూత్రానికి ఎక్కువసార్లు వెళ్ళాల్సి వస్తుంది. కానీ, మూత్రం తక్కువగా వస్తుంది. ఆకలి ఉండదు. కడుపులో తిప్పుతున్నట్లుగా, వికారంగా అన్పిస్తుంటుంది. కాళ్ళు, చేతులు వాపులు వస్తాయి. ముఖం ఉబ్బుతుంది. శరీరమంతా మొద్దుబారినట్టు, తిమ్మిరిగా ఉన్నట్లు అనిపిస్తుంది. కిడ్నీ ఫెయిల్యూర్ వ్యాధి నిర్ధారణ :  రక్తంలో క్రియాటినిన్, యూరియా నైట్రోజెన్ అధిక మోతాదులో ఉన్నా,  మూత్రంలో ప్రొటీన్  ఎక్కువగా పోతున్నా, మూత్రపిండాల వ్యాధి బారిన పడినట్లు గ్రహించాలి. క్రియాటినిన్ అనేది కండరాల విధి నిర్వహణలో వెలువడే వ్యర్థ పదార్థం. అలాగే యూరియా నైట్రోజెన్ అనేది శరీరంలో ప్రొటీన్ వినియోగం తర్వాత రక్తంలోకి విడుదలయ్యే వ్యర్థ పదార్థం. ఈ రెండు పదార్థాలను మూత్రపిండాలు వడపోయ లేకపోవడంతో అవి రక్తంలోనే పేరుకుపోతాయి. అందుబాటులో ఉన్న నిర్దారణ మార్గాలు:-  అల్ట్రాసౌండ్, కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, మాగ్నటిక్ రిసోనెన్స్ ఇమేజింగ్ వంటి పరీక్షలను చేయడం వల్ల మూత్రపిండాలలో వ్యాధి పెరుగుదలను కనిపెట్టే అవకాశం ఉంది.  కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు : మధుమేహం కానీ, హైబీపీ వంటివి ఉంటే వాటిని ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. ప్రోటీన్ వాడకాన్ని తగ్గిస్తే మూత్రపిండాల పై ఒత్తిడి తగ్గు తుంది.. అలాగే కొవ్వు పదార్థాలను తగ్గించాలి, ఆహారంలో ఉప్పు వాడకం కూడా తగ్గిస్తే చాలా మంచిది.                                    ◆నిశ్శబ్ద.

మంచి నిద్రకు ముచ్చటైన మార్గాలు ఇవిగో!

ఆరోగ్యకరమైన మంచి నిద్ర అందరికీ ఇష్టమే.. అయితే ఈమధ్య కాలంలో నిద్ర కూడా యాంత్రికం అయిపోయింది. మరబొమ్మలాగా అలా పడుకోవడం, అలారం మొగగానే లేచి పనులలోకి జారుకోవడం ప్రతి ఒక్కరికీ అలవాటు అయిపోయింది. అయితే మంచి నిద్ర ఇక ఎవరికీ సాధ్యం కాదేమో అనుకుంటే పొరపాటు. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ అంటారు- నాకు మూడు గంటల నిద్ర అయినా లక్షణంగా సరిపోతుంది అని. కానీ కొంతమంది మాత్రం 7 నుండి 8 గంటలు నిద్రపోయిన నిద్రసరిపోలేదు అని వాపోతుంటారు. దీనికి కారణం ఏమిటంటే… పడుకోవడం వేరు, నిద్రపోవడం వేరు. నిద్ర అనేది మనిషికి పూర్తి వ్యవస్థను ఒక ట్రాన్స్ లోకి పంపినట్టు ఉండాలి. అది ఎలాగుంటుంది అంటే శరీరం ఒక శవ స్థితికి వెళ్ళిపోతుంది. కానీ ప్రస్తుతం అందరూ నిద్రపోయే తీరు ఎలాగుంటుంది అంటే అందరిదీ కోడి నిద్ర. నిద్రపోతున్నాం అనేమాటే కానీ చీమ చిటుక్కుమన్నా, లైటు చటుక్కున వెలిగినా లేచి కూర్చుంటారు. మరి ఎలా??  గొప్పవారికి సాధ్యమైనట్టు  కొద్దిసేపటి నిద్ర మన దేశానికి సరిపడిన శక్తిని, విశ్రాంతిని ఎలా ఇస్తుంది అని అనుకుంటారు చాలామంది. అయితే సుఖమైన నిద్ర కొద్దిసేపు అయినా ఎంతో శక్తిని శరీరంలోకి విడుదల చేస్తుంది.  అద్భుతమైన నిద్రకోసం కొన్ని అమేజింగ్ చిట్కాలున్నాయి… ఈ మాత్రం మాకు తెలియదా అంటారు కొందరు. కానీ మంచి నిద్రకు మొదటి చిట్కా సమయపాలన. ప్రతి రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల శరీరం ఆ సమయానికి విశ్రాంతి స్థితిలోకి వెళ్లడం అలవాటు పడుతుంది. శరీరం ఇలా అలవాటు పడితే ఇతర అవాంతరాల ప్రభావానికి లోనవ్వదు. హాయిగా నిద్రపోవచ్చు.  రాత్రిపూట పండుకునేముందు చాలామందికి చల్లగా ఏమైనా తాగాలని అనిపిస్తుంది. అయితే ఈ చల్లటి పానీయాలను త్రాగకూడదు.  చల్లని పానీయాలు జీర్ణం అవడానికి చాలా శక్తి ఖర్చు అవుతుంది.  ఇంకా కొందరికి నిద్రపోయే ముందు టీవీ చూడటం, పాటలు వినడం వంటి అలవాటు ఉంటుంది. అయితే అది చాలా తప్పు. నిద్రపోవడానికి అరగంట ముందే అన్నిటినీ బంద్ చేయాలి. మొబైల్ ఫోన్ కూడా దూరంగా పెట్టి పడుకోవాలి.  నిద్రపోయేవారికి కొందరికి తలకింద చాలా ఎత్తుగా ఉన్న దిండ్లు పెట్టుకోవడం అలవాటుగా ఉంటుంది. అయితే ఇలా ఎత్తైన దిండ్లు పెట్టుకోకూడదు. నిద్రకు ఆహారానికి దగ్గర సంబంధం ఉంటుంది. చాలామంది ఫుల్ గా తింటే ఎక్కువ శక్తి వస్తుందని బాగా నిద్ర పడుతుందని అంటారు. కానీ రాత్రి పూట ఎక్కువ తినకూడదు. కడుపు కాస్త తేలికగా ఉండాలి. దీనివల్ల శరీరం కూడా తేలికగా ఉండి మంచి నిద్ర వస్తుంది. అంతేనా శరీరంలో జరిగే క్రియలు కూడా అస్తవ్యస్తం కావు. అదే ఎక్కువ తింటే శరీరంలో క్రియలు వేగంగా ఉంటాయి. దానివల్ల నిద్ర సరిగా పట్టదు.  ఈ చిట్కాలు పాటిస్తే అందరికీ సుఖవంతమైన నిద్ర సొంతమవడం ఖాయం.                                       ◆నిశ్శబ్ద.

మధుమేహం ఉన్నవారిలో హృదయసమస్యలా?? ఇవిగో అద్భుత చిట్కాలు..

ఆరోగ్యం అందరికీ అవసరమే అయితే ఆ ఆరోగ్యం అనేది కొందరి విషయం లో చాలా సమస్యాత్మకంగా మారుతోంది. ప్రస్తుతకాలంలో ఏదైనా ఒక సమస్య ఎదురైతే... దానికి అనుబంధంగా పెరుగుతూ పోతుంటాయి సమస్యలు. వాటి నుండి బయట పడటం అంత సులువైన విషయం ఏమీ కాదు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలలో, పెద్దవయసు వారిలో  ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. ఈ కారణం వల్ల ఆరోగ్య సమస్యల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.  ప్రస్తుతం అన్ని వయసుల వారికి చాలా తొందరదగా మధుమేహ సమస్య వస్తోంది. ఈ మధుమేహ సమస్య తగ్గడం కోసం ఎన్నో రకాల మందులు అందరికీ అందుబాటులోకి వచ్చినా  ఈ మందులు మెల్లిగా గుండె కండరాలను బలహీనం చేసి గుండె పోటు సమస్యకు దారి తీస్తున్నాయనే విషయం చాలా విచారించాల్సిన విషయం. మధుమేహ సమస్య ఉన్న వారిలో గుండె పోటు సమస్యను తగ్గించేందుకు రోజువారి ఉపయోగించుకోగలిగే ఆయుర్వేద ఔషదాలు ఉన్నాయి. వాటిలో అద్భుతమైన అయిదు మూలికల గురించి తెలుసుకుదాం.. పునర్ణవ:-  దీన్నే తెల్లగలిజేరు అని అంటారు. తెల్లగలిజేరు ఆకును గ్రామీణ ప్రాంతాలలో ఆకుకూర స్థానంలో వాడుతుంటారు. ఇది ఎంతో మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన మొక్క. దీన్ని ఆహారంలో  బాగంగా తీసుకోవడం వల్ల రక్తంలో చెక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది.  మూత్రం సరిగా రాకుండా ఉన్నప్పుడు  ఈ తెల్లగలిజేరు ఆకును వండుకుని తింటే మూత్రవిసర్జన  సాఫీగా జరుగుతుంది. మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. మధుమేహం వల్ల వచ్చే రెటీనోపతి, నెప్రోపతి మొదలయిన సమస్యలను నివారించడంలో చక్కగా పనిచేస్తుంది. జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది.  పునర్ణవను ఎలా తీసుకోవచ్చు.. పునర్ణవను గ్రామీణ ప్రాంతాల అలవాటుననుసరించి పప్పుగానూ, పొడికూర కానీ చేసుకుని తినవచ్చు. లేదంటే పునర్ణవను ఎండబెట్టి పొడి చేసి రోజూ 2నుండి 2.5 గ్రాము పొడిని వేడినీటితో తీసుకోవాలి.  శొంఠి:- శొంఠి పొడి అనేది అందరికీ తెలిసిందే.. అల్లంను సున్నంలో ఉడికించి తరువాత ఎండబెట్టి పొడి చేస్తారు. దీన్ని మందుగా ఎప్పటినుండో వాడుతున్నారు. శొంఠి పొడి పాలు, శొంఠి, మిరియాల లేహ్యం వంటివి మాత్రమే కాకుండా శొంఠి పొడిని తేనె తోనూ ఇతర మూలికలతోనూ కాంబినేషన్ గా తీసుకుంటారు. ఇకపోతే శొంఠి గొప్ప ఇమ్యునిటీ బూస్టర్ గానే కాకుండా జీర్ణక్రియకు మంచి ఔషదంగా కూడా ఉపయోగపడుతుంది. దీనివల్ల శొంఠి అనేది మన భారతీయుల రోజువారి జీవితంలో భాగమయ్యింది.  శొంఠి ఎలా తీసుకోవచ్చు.. శొంఠి పొడి రూపంలో ప్రతిరోజూ ఆహారం తీసుకోవడానికి ముందు అరస్పూన్ మోతాదులో తీసుకోవటచ్చు. దీన్ని గోరువెచ్చని నీటితో తీసుకుంటే మంచి ఫలితాన్ని ఇస్తుంది. మిరియాలు:- ఎంతో సులభంగా లభించే మిరియాలు వంటలకు ఇచ్చే రుచి, ఘాటు అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా ఈ చలి, వర్షపు వాతావరణానికి మిరియాలు కాసింత ఎక్కువ వాడుకున్నా ఎంతో బాగుంటుంది. కేవలం అలా వంటల్లోకే కాకుండా సలాడ్ లు, సూప్ లు, చాట్స్ ఇలా అన్నిటిలోకి మిరియాల పొడిని జల్లుకోవడం వల్ల రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం సొంతమవుతుంది. అయితే మధుమేహం ఉన్నవారికి మిరియాలు ఒక వరం అని చెప్పుకోవచ్చు. మిరియాలు ఎలా తీసుకోవాలి అంటే…. ప్రతి రోజూ ఉదయాన్నే ఒక నల్ల మిరియం తీసుకోవాలి. దీన్ని నమిలి తినవచ్చు కారంగా అనిపించినా మంచి ప్రయోజనం చేకూరుస్తుంది. యాలకులు:- తీపి పదార్థాలు, బిర్యానీ వంటి వంటకాలలోకి ఎక్కువగా ఉపయోగించే యాలకులు మంచి సువాసనతో ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీపి పదార్థాలకు జతచేయడం మనకు అనుభవంలోనిదే. మధుమేహం ఉన్నవారిలో వారి సమస్యను బట్టి సహజంగానే తీపి పదార్థాల వైపు మనసు మల్లుతుంది. అలాంటి వారికి ఈ యాలకులు మంచి ఉపశమనాన్ని ఇస్తాయి. తీపి తినాలని అనిపించినప్పుడు యాలకులు తింటే తీపి తినాలనే కోరికలు సాధారణంగానే తగ్గుతాయి. యాలకులు తీసుకుంటే శరీరంలోని నరాలను ఉద్దీపన చెందించవచ్చు. మధుమేహం ఉన్నవారు యాలకులు తీసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. యాలకులు ఎలా తీసుకోవచ్చంటే… దీన్ని సాధారణంగా టీలో జతచేసి తీసుకోవచ్చు. లేదంటే ప్రతి రోజు కనీసం ఒక యాలకుల పొడిని భోజనానికి గంట ముందు గోరువెచ్చని నీటితో తీసుకోవాలి.  అర్జున పత్రం:- అర్జున పత్రం అనగానే చాలామంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అయితే ఈ అర్జున పత్రాన్ని తెల్లమద్ది అని కూడా అంటారు. ఈ చెట్టు ఆకులు, బెరడు మొదలైనవి ఆయుర్వేదంలో ఎంతో బాగా ఉపయోగిస్తారు. గుండె పనితీరు మెరుగుపరచడానికి, గుండె ఆరోగ్యానికి, రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలకు అర్జున పత్రం మంచి ఔషధంగా పనిచేస్తుంది.  అర్జున పత్రాన్ని ఎలా తీసుకోవాలంటే… దీన్ని ప్రతిరోజు రాత్రి సమయం నిద్రించే ముందు నీళ్లలో వేసి ఉడికించి టీ లాగా చేసుకుని తాగాలి. దీనివల్ల గుండె పనితీరు మెరుగుపడటమే కాకుండా మధుమేహం కూడా నియంత్రించవచ్చు. ◆నిశ్శబ్ద.

ఇలా చేస్తే జుట్టు పెరుగుతుందా ?...

  యోగా శరీరానికి వ్యాయామం మేకాడు శరీర దారుడ్యానికి,మానసికంగా ఒత్తిడిని తట్టుకునేందుకు దోహదం చేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మన ముఖాన్ని అందంగా ఉంచేందుకు యోగా ఉపయోగపడుతుందని అంటున్నారు నిపుణులు. యోగా చేస్తే జుట్టు పెరుగుతుందా సహజపద్దతిలో జుట్టు పెరగాలంటే ఈ యోగాసనాలు వేస్తే జుట్టు ఊడిపోవడం తగ్గిపోతుంది అని అంటున్నారు నిపుణులు.మీరు ఎన్నిరకాల ఉపాయాలు ప్రయోగించి నప్పటికీ జుట్టు రాలిపోవడం. పెరగడం ఆగిపోయిందా. అయితే మీకు చెప్పాల్సింది ఒకటే మీరు 5 రకాల యోగ ఆసనాలు వేస్తే మీజుట్టును అన్నిరకాల సమస్యలనుండి మీకు ఉపసమనం కలిగించడం లో సహాయ పడుతుంది. జుట్టు రాలిపోవడం... స్త్రీలు లేదా పురుషులు ఎవరైనా సరే వారికురులు అంటే వారికి ప్రేమకలగడం సహజం.ప్రతి ఒక్కరికీ అందమైన మెరిసే జుట్టు ఉండాలని అది గాలికి అలా ఊగుతూ ఉంటె ఇంకాబాగుంటేనే ఇష్టపడతారు. కానీ నేటి జీవితంలో మనం అనుసరిస్తున్న జీవన శైలి కారణం గానే జుట్టు ఊడిపోవడం రాలిపోవడం. సహజమై పోయింది.ప్రజలు తమ అందమైన సిరోజాలకోసం ప్రజలు అత్యంత ఖరీదైన షాంపూలు కన్దీషనర్లు, వాడుతున్నారు. దీనికి తోడు మరిన్ని మందులు తీసుకుంటున్నారు.అయినప్పటికీ జుట్టు పై ఎలాంటి ప్రభావం ఉండడం లేదని చాలామంది ఆందోళన వ్యక్తం చేసారు.మీకు కొన్ని యోగా ఆసనాలు చూపిస్తాం దీనివల్ల దీనివల్ల మీజుట్టు రాలిపోకుండా ఊదిపోకుండా అలాగే దట్టంగా ఒత్తుగా నిగనిగలాడుతూ సిల్కీగా మెరుస్తూ ఉంటుంది  జుట్టు పెరగడానికి 5 యోగాసనాలు ఇవే... వజ్రాసనం... వజ్రసనాన్నితండర్ బోల్డ్ పోజు గా పిలుస్తారు. ఈ ఆసనం వేయడం ద్వారా మనశరీరంలో ఉన్న పంచేంద్రియాలు బలంగా ఉంచుతాయి.దీనివల్ల జుట్టులో ఉన్న మూలాలకు సరాసరి పోషకాలు లభిస్తాయి. మనజుట్టు పగిలిపోవడం రాలిపోవడం ఊడిపోవడం వంటివి సహజంగా జరుగుతాయి. వజ్రాసనం వేయడం ద్వారా ఒత్తిడి,సమస్యల నుండి దూరంగా ఉండేందుకు సహకరిస్తుంది. అధోముఖ ఆసనం.. ఈ ఆసనం వేసినప్పుడు కుక్క ను పోలిన భంగిమలో శరీరాన్ని వంచుతారు. ఈ యోగ ఆసనం ద్వారా మనం ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది దీనివల్ల సమయానికి ముందుగానే వచ్చేబాల మెరుపు,తెల్లజుట్టు రాకుండా నివారించ వచ్చు.ఈ యోగా అసనం ద్వారా మన జుట్టును సహజమైన రంగు సజీవంగా ఉంచేందుకు సహాయ పడుతుంది అదీకాక మన స్కాల్ప్ లో రక్త ప్రసరణ వృద్ధి చెందుతుంది. శీర్షాసనం... ఈ ఆసనం వేయడం ద్వారా మన మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది. దీనివల్ల జుట్టు రాలిపోవడం బట్టతల వచ్చే అవకాశం ఉంది.ఈ ఆసనం వేయడం ద్వారా జుట్టు తెల్ల బడడం మళ్ళీ జుట్టు మొలవడం జరుగుతుంది. పవన ముక్తాసనం... మన శరీరంలో ఉన్న గాలిని బయటకు వదిలి పెట్టేందుకు ఉపయోగ పడుతుంది. ఈ ఆసనం మన శరీరంలో ఉన్న పంచెంద్రియలాను బలంగా ఉంచుతుంది. దీనివల్ల జుట్టు పెరగడం సాధ్యమౌతుందని ఈ ఆసనం సాధన చేయడం ద్వారా జుట్టుకు సరైన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఊష్ట్రాసనం... ఈ ఆసనం ఒంటె ఆకారాన్ని పొలిఉంటుందని ఈ ఆసనాన్ని సాధన చేయడం ద్వారా మెదడులో రక్త ప్రవాహం సక్రమంగా జరుగుతుందని దీనివల్ల జుట్టు రాలడం పగిలి పోవడం తగ్గిపోతాయి. జుట్టులో మెరుపు వస్తుందని యోగసాధకులు అంటున్నారు.                                        

ఆరోగ్యం సంరక్షణ అందరికీ కావాలి!

మనిషి జీవితానికి ఆరోగ్యం ఎంతో ముఖ్యమైనది. కానీ ఆరోగ్యం అనేది డబ్బుతో కూడుకున్న వ్యవహారం అవుతోందిప్పుడు. ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా వాటికి వైద్యం చేయించుకోవాలి అంటే డబ్బులేనిది పని జరగదు. దీనివల్ల ఆరోగ్యం అనేది దిగువ వర్గాల వారికి అందని ద్రాక్షగా మిగిలిపోతోంది. ఆరోగ్య భద్రత కొందరికి మాత్రమే పరిమితం అవుతోంది. దీని గురించి అందరికీ అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఆరోగ్య సంరక్షణ అనేది ఒకరికి మాత్రమే పరిమితమైన, పరిమితమవ్వాల్సిన అంశం కాదు. మనిషి ఆరోగ్యం ఎంత బాగుంటే, అంత ఆరోగ్యవంతమైన ప్రపంచం అభివృద్ధి చెందుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఐక్యరాజ్యసమితి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే ని ప్రకటించింది.  ఇంతకూ ఈ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే ఎప్పుడు మొదలయ్యింది?? దీని సందర్భంగా జరిగే కార్యక్రమాలు ఏమిటి?? వంటి విషయాలలోకి వెళితే… యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే!! ఎన్నో విషయాలకు ప్రాముఖ్యత ఇస్తూ వాటి గురించి అవగాహన కల్పించాలని ఐక్యరాజ్య సమితి వాటికి సంబంధించి దినోత్సవాలను నిర్వహిస్తోంది. వాటిలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే కూడా ఒకటి. దీన్ని 2017 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.  యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే ప్రాముఖ్యత!! ప్రపంచ వ్యాప్తంగా మాకూ ఆరోగ్య సంరక్షణ కావాలి అని గొంతెత్తి చెప్పలేని పరిస్థితులలో చాలామంది  ఉన్నారు. వారందరూ పేదరికమనే వృత్తంలో చిక్కుకుపోయి కనీస ఆరోగ్య సంరక్షణను పొందలేకపోతున్నారు. వారి పక్షాన నిలబడి వారికీ ఆరోగ్య సంరక్షణ అవసరమే అనే విషయాన్ని వ్యాప్తం చేయడమే ఈ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే ప్రాముఖ్యత.  మనిషికి ఉన్న హక్కులలో భాగంగా ఆరోగ్యాన్ని పొందడం కూడా ఒకటి అని అందరూ గుర్తించేలా చేయడం. అన్ని దేశాలలో ప్రజలందరూ కూడా తమ ఆరోగ్యాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం, కనీస అవగాహన పెంచుకోవడం ఎంతో ముఖ్యం. ఈ ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయడమే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే ప్రాముఖ్యత. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు కొన్ని ఇతర సంస్థలు కలిసి ఈ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే ని నిర్వహిస్తాయి.  దీని ప్రణాళికలు ఏమిటంటే… యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే  2015 సంవత్సరంలో డవలప్మెంట్ గోల్స్ లో చేర్చబడింది. ఆ సందర్భంగా 17 లక్ష్యాలను అందులో పొందుపరిచింది. వాటిని 2030 సంవత్సరానికల్లా సాధించే దిశగా నిర్ణయం తీసుకుంది. వాటిలో పేదరికాన్ని నిర్మూలించడం, ఆకలితో అలమటించే వారి సంఖ్యను తగ్గించడం. అందరికీ ఆరోగ్యం సాధ్యమయ్యేలా చేయడం, లింగ సమానత్వంతో సరిపోయేలా విద్య, ఇతర అవసరాలు అందేలా చేయడం. అందరికీ స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం, అవసరమైన వనరుల లభ్యతతో పాటు, ఆర్థిక వృద్ధి, పరిశ్రమల వృద్ధి, మౌలిక సదుపాయాలు, స్థిరమైన అభివృద్ధికి తగ్గట్టు అందరి జీవితాల్లోనూ అభివృద్ధి మొదలైనవి ప్రణాళికగా రూపొందించబడ్డాయి. అందరికీ న్యాయం, అందరి మధ్య ఆరోగ్యకరమైన శాంతి వాతావరణం మొదలైనవి ఇందులో భాగంగా ఉన్నాయి. ఇలా యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే రోజున జరిగే కార్యక్రమాలు ప్రజల జీవితంలో ఆరోగ్య ప్రాధాన్యత గురించి, ఆరోగ్య సంరక్షణ గురించి వ్యాప్తం చేస్తాయి. ప్రతి ఒక్కరూ ఆరోగ్య భద్రత, ఆరోగ్య సంరక్షణ దిశగా అడుగులు వేస్తే ఈ రోజు ప్రాముఖ్యతను నిజం చేసినవారం అవుతాము.                                     ◆నిశ్శబ్ద.

భారత్ లో 75% హైపర్ టెన్షన్ వల్ల మరణాలు లాన్సెట్!

భారత్ లో 75% కి పైగా మరణాలు హై బిపి నియంత్రణ లేకపోవడమేనని  లాన్సేట్ 2౦ 16-2౦2౦ మధ్యలో నిర్వహించిన సర్వేలో వివరాలను ఒక జర్నల్ లో ప్రచురించింది.75% రోగులు భారత్ లో హైపెర్ టెన్క్షన్ ఉన్నట్లు గుర్తించారు. వాటిని నియంత్రించడం సాధ్యం కాక పోవదానికి గల కారణాల పై పరిశీలన వివరాలను లాన్సేట్ వెల్లడించింది.బి పి నియంత్రణ లేక పోవడం వల్లే మరణాలు పెరుగుతున్నాయి 2౦19-2౦2౦ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వెల్లడించింది. హైపర్ టేన్క్షణ్ పురుషులలో 24% స్త్రీలలో 21% గా నమోదు అయ్యింది. ఈమేరకు 2౦15-2౦21 నాటికి ఈ గణాంకాలు 19 % గాను 11% గాను చేరింది.హై పర్ టెన్క్షణ్ కు సిస్టోలిక్ <14౦ ఎం ఎం డియా స్టోలిక్ <9౦ నియంత్రణకు వాడుతున్నారు.దక్షిణ తూర్పు ఆశియా ప్రాంతాలలో లాన్సేట్ నిర్వహించిన పరిశోదన లో కేరళ రాష్ట్ర్రానికి చెందిన పరిశోధకులు చేరడం తో బిపి నివారణకు 2౦౦1-2౦ 2 2 లో మద్ష్య భారత్ లో ప్రభుత్వ కృషి అవగాహన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు ఉన్నప్పటికీ హై బి పి వ56% నుండి 25 % పెరిగింది భారత్ లో 4 గురు పెద్ద వాళ్ళలో ఒకరికి హై బిపి నియంత్రణ సాధ్యం కావడం లేదని కార్డియో సమస్యలు మరణాలకు కారణమని 1/౩ వంతు మరణాలు సి వి డి అంటే కార్డియో వాస్క్యులర్ డిసీజ్ హై బి పి మరణాలు సంభవిస్తున్నాయని తిరువనంత పురం ప్రభుత్వ వైద్య కళాశాల కు చెందిన డాక్టర్ ఆల్తాఫ్ అలీ పరిశోదనలో వెల్లడించారు.ఈ పరిశోదన ౩4- 51 రకాల అంశాల పై పరిశోదనలు నిర్వహించడం గమనార్హం. 21  పరిశోదనలలో బప్ ని నియంత్రించడం లో పురుషులకంటే స్త్రీలు 41% గా అంచనా వేసారు.గ్రామీణ ప్రాంతాలలో మహిళలు 12%గా ఉన్నారని, 2౦21-2౦ నాటికి స్త్రీపురుషులలో 18% మాత్రమే నియంత్రణ సాధ్య మయ్యిందని.జీవనశిలి ఇతర సమస్యల వల్ల బి పి నియంత్రణ సాధ్యం కాలేదని పరిశోధకులు గుర్తించారు.బిపి నియంత్రించక పోవడం వల్ల మిలియన్ల ప్రజలు రానున్న యువతరం ప్రాణాలు కాపాడుకోవచ్చు. బిపి నియంత్రణ అవగాహన అభివృద్ధి మదింపు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు పరిశోదనలో వెల్లడించారు.  

వాతావరణంలో ఉష్ణోగ్రతలో మార్పులు వైరస్ వ్యాప్తికి సహకరిస్తుందా ?

వాతవరణం లో ఊహించని విధంగా ఉష్ణోగ్రతలలో వస్తున్న హెచ్చు తగ్గుల వల్ల వైరస్ లు పెరుగుతున్నాయని అదీ ఎక్కువగా దాదాపు పక్షం రోజుల పాటు ఉంటుందని డాక్టర్లు అంచనా వేస్తున్నారు.కొందరు ఈ వైరస్ ను కోవిడ్ అనుకుని పరీక్షించగా అది కోవిడ్ కాదని తేలడం తో ఊపిరి పీల్చుకున్నారు.ఇది సాధారణ వైరస్ మాత్రమే అని సహజంగా ప్రతి సంవత్చరం వస్తుందని నిపుణులు తెలిపారు.రాయ పూర్ కలకత్తా  వాసులను చుట్టుముట్టాయని అయితే ఈ వైరస్ కోవిడ్ లక్షణాలకు సగ్గర దగ్గరగా ఉంటుందని పేర్కొన్నారు.జ్వరం,దగ్గు, ఒళ్ళు నొప్పులు డయేరియా ఊపిరి తిత్తులలో ఇన్ఫెక్షన్ వంటి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వాతావరానం లో అనూహ్యంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వారం రోగులుగా గమనిస్తున్నట్లు ఈ వైరస్ వారం రోజుల పాటు చాలా యాక్టివ్ గా ఉంటుందని ఇది సహజమైన వైరస్ గా పేర్కొన్నారు. ఈ వైరస్ వల్ల దగ్గు వస్తుందని అందుకోసం యాంటి బాయిటిక్స్ వాడాలని సూచిస్తున్నారు.వైరస్ లలో రైనో వైరస్,హ్యూమన్ మెటా నీమో వైరస్, ఎడినో వైరస్, ఇంఫ్లూఎంజా వైరస్ లు కీలక మైనవని డాక్టర్లు అంటున్నారు.అయితే వైరస్ ను గుర్తించడం కష్టంపరీక్షలు చేస్తే తప్ప వైరస్ గుర్తించడం సాధ్యం కాదు అవి చాలా తక్కువే ఉంటాయని నిపుణులు అంటున్నారు.కొన్ని సందర్భాలలో కోవిడ్ పోజిటివ్ అయి ఉండవచ్చని సందేహం ఉంటె పరీక్షించుకోడం అవసరం.కోవిడ్ లక్షణాలకు దగ్గరగా ఉన్నప్పటికీ ఎవరికీ పోజిటివ్ రాలేదు. గత 15 రోజుల్లో కొంత మంది పిల్లలో ఎడినో వైరస్ ఉన్నట్లు గుర్తించారు.కోవిడ్ లక్షణాలు దగ్గర దగ్గర గా ఉండచ్చు అది ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. అది తీవ్ర తరం కవాచ్చు చాలామంది రైనో వైరస్ వేరియంట్లు ఇంఫ్లూఎంజా కారణంగా జ్వరం 4 నుండి 5 రోజుల పాటు ఉంటుంది అని కిమ్స్ ఆసుపత్రికి చెందిన జనరల్ మెడిసిన్ వైద్య నిపుణులు, డాక్టర్ పాపారావు పీర్లేస్ ఆసుపత్రికి చెందిన మైక్రో బయాలజిస్ట్ భాస్కర్ నారాయణ చౌదరి అన్నారు. ఈ వైరస్ ప్రభావం వల్ల సవాల్ప జ్వరం తీవ్రమైన దగ్గు దీని సహజమైన లక్షణం గా డాక్టర్ ఆర్ ఎన్ టాగూర్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ కార్డియోక్ సైన్స్ దర్వెన్ పంజా మాట్లాడుతూ అప్పర్ రేస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రైనో వైరస్ వల్ల వస్తుంది అని ఇంఫ్లూ ఎంజా వైరస్ తరచూ గా వస్తూ ఉంటుందని వారం రోజులకు పైగానే ఈ సమస్య ఉంటుందని టాగూర్ విశ్లేషించారు.వాతావరణం లో ని ఉష్నోగ్రతలలో వచ్చే హెచ్చు తగ్గులు  మార్పులు వల్ల వైరస్ వృద్ధి చెందుతుంది అతిగా గనక యాంటి బాయిటిక్స్ వాడితే విరేచనాలు అవుతాయాని అంటున్నారు నిపుణులు. సహజమైన వైరస్ ల వల్ల ఇలాంటి లక్షణాలు మీకు 5 రోజులు ఉంటుంది.65 సంవత్స్చారాలు పై బడిన 12 సంవత్చారాల లోపు వారిలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంది.ఇన్ఫెక్షన్ అత్యంత ప్రమాదకరమైనది సత్వరం గుర్తించి యాంటి బాయిటిక్స్ చికిత్చ చేయడం ద్వారా ఆసుపత్రిలో చేరకుండా నివారించవచ్చు.ఒక్కోసారి యాంటి బాయిక్స్ వికటించే అవకాశం ఉంది అత్యవసర చికిత్చకూడా అవసరం కావచ్చు అని పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శాంతనూ రాయ్ అన్నారు.ప్రాధమిక స్థాయిలో గుర్తించి తక్షణం చికిత్చ అందించడం ద్వారా ప్రాణాపాయం నుండి కాపాడ వచ్చు. లేదా చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రామాదానికి దారితీయవచ్చు.

యువకులలో కార్డియాక్ అరెస్ట్ లు ఎందుకు పెరుగుతున్నాయి!

యువకులలో నానాటికి కార్డియాక్ అరెస్ట్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీనుండి ఎలా బయట పడాలి అన్నదే సదేహంగా మారుతోంది.ఒక ఆశ్చర్య కరమైన ఘటన లలో ప్రాణాలు కోల్పోతున్న అంశాలను నిసితం గా  పరిశీలించినప్పుడు.కొన్ని విషయాలు ఇలా జరిగాయి.ఇటీవలే యు పి లో తన మిత్రులతో కలిసి రోడ్డు పై నడుస్తూ నడుస్తూ కుప్ప కూలి పోయిన ఘటన నేడు చర్చనీయ అంశంగా మారింది.ఆశ్చర్యం కలిగించే మరో అంశం విస్మయం కలిగిస్తోంది. వధువు వరుడుకీ వరమాల వేస్తూ అక్కడే కుప్ప కూలిపోయింది.చనిపోయింది.ఈ ఘటన లక్నో లో ని మలిహాబాద్ కేంద్రం లో వధూ వరులు స్టేజి పై ఒకరి కొకరు ఎదురుగా నిలబడ్డారు వరుడు వశువు శివానికి వరమాల వేసాడు వరుడు. ఇక శివాని వంతు వచ్చింది ఆమె వరుడికి వరమాల వేస్తూ ఉండగానే స్టేజి పై కుప్పకూలిపోయింది.వధువును వెంటనే ఆసుపత్రికి తరలించిన అక్కడ ఆమె మరణించి నట్లు ప్రకటించారు. ఆమెకు కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించిందని ఇంత తక్కువ వయసులో కార్డియాక్ అరెస్ట్ కు గురైందని తెలిపారు. కార్డియాక్ అరెస్ట్ ఇది మొదటిది మాత్రం కాదు పెళ్ళిలో స్నేహితుడి పెళ్ళిలో నృత్యం చేస్తూ ఒక యువకుడు కుప్ప కూలిన సంఘటన మరో యువకుడిని బలితీసుకుంది. ఇలాంటి ఘటనలు ఎన్నోజరిగాయి అతి పిన్న వయస్సులో మిత్రుదుని కోల్పోయిన వాళ్ళు. తమ సహోదరిని సహచరులను కోల్పోయిన వారి ఘటనలు కోకొల్లలు.యువకులలో కార్డియాక్ అరెస్ట్ వంటి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. అమెరికాకు చెందిన సి డి సి అంచనా ప్రకారం 25 సం వత్చరాల లోపు ఉన్న యువకుకులు 25,౦౦౦ మంది కార్డియాక్ అరెస్ట్ తోనే మరణించారని నివేదిక లో పేర్కొన్నారు.అసలు కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి దాని నుండి ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి  కార్డియాక్ అరెస్ట్... కార్డియాక్ అరెస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే గుండెకు అవసరమైన రక్తం సరఫరా అందనప్పుడు. అప్పుడు గుండె చప్పుడు ఆగిపోతుంది.అది మనకు ఏమాత్రం సంకేతం అందదు. కార్డియాక్ అరెస్ట్ వెంటనే వ్యక్తి ఉన్న చోటే కుప్పకూలిపోతాడు గుండేనొప్పి, ఊపిరి తిత్తులలో ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండడం కుటుంబం లో ఎవరికైనా కార్డియాక్ అరెస్ట్ చరిత్ర ఇలాంటి లక్షణాలు ఉంటె వాటిపై దృష్టి పెట్టాలి.లేదంటే కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి సకాలంలో గుర్తించి దీనికి చికిత్చ చేయించాలి. కార్డియాక్ అరెస్టుకు కారణాలు ఏమిటి ? కార్డియాక్ అరెస్టుకు కారణం ఒక వ్యక్తి వయస్సుపై ఆధారపడి ఉంటుంది ౩5 సం వయస్సు పై బడిన వారిలో సహజంగా కార్డియాక్ అరెస్ట్ కరోనరీ ఆర్ట్ట్రీ డిసీజ్ కి కారణం గా చెబుతున్నారు యువకులలో కార్డియాక్ అరెస్ట్ కు కారణాలు చాలానే ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు.అసహజమైన జీవన శైలి,నేటి ఆధునిక సమాజం లో ఒత్తిడి, ఆహార విహారం శరీరానికి వ్యాయామం లేకపోవడం వంటి సమస్యలు ధూమపానం మధుమేహం,ఊబకాయం  ఇతర అనారోగ్య సమస్యలు ఉండడం మరో కారణం గా  నిపుణులు పేర్కొన్నారు. హైపెర్ కార్డియాక్ మయోపతి... ఇది గుండె సంబంధిత సమస్యలలో అత్యంత క్లిష్టమైనది గుండెలోని కండరాలు రక్త నాళాలలో వాపులు వస్తాయి. కరోనరీ ఆర్టరీ అబ్నా నార్మాల్టీ స్... చాలా మందిలో కోరో నరీ ఆర్టరీ లో అసమాన్యం గా కలిసి ఉండడం గమనించవచ్చు గుండెలోని కండరాలు రక్త ప్రసారం పూర్తిగా తగ్గిపోతుంది ఈ రకంగా కార్డియాక్ అరెస్ట్ వస్తుంది కార్డియాక్ అరెస్ట్ కు ప్రధాన కారణంగా పేర్కొన్నారు. లాంగ్ క్యుటి సిండ్రోం... ఈ రకమైన గుండె ఆర్టరీ జనరిక్ అని అంటారు అనుకోకుండా గుండె చప్పుడు పెరిగిపోతుంది. బుగుడా సిండ్రోం... వంశ పారం పర్యంగా సాధారణంగా వచ్చే లయను బాదిస్తుంది. గుండె అసామాన్యంగా గుండె కండరాలు వాపులు వంటివి యువకులలో అనుకోకుండా కార్డియాక్ అరెస్ట్ నుండి రక్షించవచ్చు. కుటుంబ చరిత్ర... ఒకవేళ మీ కుటుంబం లో అనుకోకుండా కార్డియాక్ అరెస్ట్ వచ్చిన చరిత్ర ఉంటె మీ డాక్టర్ వద్దకు వెళ్లి స్క్రీనింగ్ చేయించుకోవడం మరి కార్డియాక్ అరెస్ట్ కు ప్రాత్యామ్నాయం ఏమిటి ?అన్నది తెలుసుకోవాలి అనుకోకుండా వచ్చే మృత్యువునుండి రక్షింప బడతారు. డిఫ్రీ బ్రీటర్ లేదా సి డి ఆశ... దీఫ్రి బ్రీ లెటర్ నేడు అన్ని చోట్లా అందుబాటులో ఉంది అనుకోకుండా వచ్చే కార్డియాక్ అరెస్ట్ తో ప్రాణం రక్షించడం లో పనికి వస్తుంది.కార్డియాక్ అరెస్ట్ అయిన వెంటనే ఒక డిఫ్రీబ్రిలేతర్ సాధారణ గుండె చప్పుడు తెలుసుకునేందుకు అనుకోకుండా రక్త ప్రసారం కరెంట్ షాక్ కొట్టినట్లు పనిచేస్తుంది. దీనికి  తోడు స్చూళ్ళు కళాశాలలు ఆఫీసులో సి పి అర్ ఇచ్చే విధంగా శిక్షణ అందరికీ ఇవ్వాలి. అప్రమత్తం చేసే సంకేతం... కార్డియాక్ అరెస్ట్ నుండి ప్రాణం రక్షించేందుకు అప్రమత్తంగా ఉండడం అవసరం దీనిని అర్ధం చేసుకోవడం సత్వరం వైద్య సహాయం తీసుకోవడం అవసరం.దీనివల్ల ప్రాణం రక్షింప బడాలి యువకులలో అనుకోకుండా వాచ్చే కార్డియాక్ అరెస్ట్ మరణాలకు పెద్ద కారణంగా చెప్ప వచ్చు.అందులోనూ ఒత్తిడి పెంచే క్రీడలు కార్డియాక్ అరెస్ట్ ప్రమాదం మరింత పెంచుతుంది. దీని కోసం మీరు మీ డాక్టర్ ను సంప్రదించండి. మీరు పడుకున్నప్పుడు కార్డియాక్ అరెస్ట్ రావచ్చు.కార్డియాక్ అరెస్ట్ లో ప్రమాదం ఎక్కువ డాక్టర్ సలహా అవసరం మిమ్మల్ని మీరు రక్షించు కునే పద్దతులను తప్పనిసరిగా డాక్టర్ తో మాట్లాడాలి. జీవన శైలి లో మార్పులు... మీరు ఎంచుకునే జీవనశైలి ని ఎంపిక చేసుకోవడం ద్వారా మీ గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉండే విధంగా ఉండద్తం సమయానికి చకప్ చేయించుకోవడం గుండె సంబందిత స్క్రీనింగ్ చేయించడం ద్వారా అనుకోకుండా వచ్చే కార్డియాక్ అరెస్ట్ నుండి రక్షించ వచ్చు.మీ అప్రమాత్తతే మీ గుండెకు శ్రీరామ రక్ష. 

గుజరాత్ లో xbb కోవిడ్ వేరియంట్!

గుజరాత్ బయో టెక్నాలజీ రీసెర్చ్ జీనోమ్ సీక్వెన్స్ ను పరిశీలించిన పరీక్షించింది ఎనాలసిస్ చేసిన తరువాత 1౦౦ సీక్వెన్స్ ల లోనూ 45 కేసులలో x బి బి కేసులు ఉన్నాయని దీనిని అనుసరించి 2౦%బిఏ .2 1౦ 19%బి ఏ .2. 75, 16 %ఇతర వైరస్ లు ఉన్నట్లు గుర్తించారు.బిఏ 2. 75 ఒమైక్రాన్ సబ్ వేరియంట్ కోవిడ్ కేసులలో మరో కొత్త వేరియంట్ వెలుగు చూసింది. అంటే xbb బి ఏ 2.1౦ మరియు బిఏ2.7 నేడు కనీసం లో కనీసం కేసులు తక్కువగానే నమోదు అవుతున్నాయి.రాష్ట్రం లో తక్కువ స్థాయిలో నమోదు కావడాన్ని దృష్టిలో ఉంచుకుని వేరియంట్ తనరూపాం మర్చుకోదాన్ని గమనించారు. ఆరు నెలలుగా 198 తక్కువ కేసులు నమోదు కావడాన్ని గమనించ వచ్చు.రాష్ట్రం లో ౩౩ జిల్లాలలో 14 జిల్లాలలో ౦%14 %నుండి 1౦ %కన్నా తక్కువ కేసులు నమోదు అవుతునాయి.బి ఎన్1 ,బి ఎం 1.1 ,బి ఎల్1 , 1౦౦ సీక్వెన్స్ ఎనాలసిస్ లో 45 %కేసులు xbb బిఏ 2.1౦ 22 %,బి ఏ 2.1౦19% బి ఏ 2.75 16 %ఇతర వేరియంట్లు ఉన్నట్లు గుర్తించారు x bb సబ్వేరియంట్ భారత్లో అక్టోబర్ వచ్చిందని చాలా రాష్ట్రాలలో నమోదు అవుతున్నాయని కొన్ని క్రేసులు వైరల్ ఇన్ఫెక్షన్ ఆసుపత్రిలో చేరుతూ ఉన్న వారిసంఖ్య తక్కువే అని డాక్టర్లు  అంటున్నారు.                 

కిడ్నీ క్యాన్సర్ కు ఫ్రీజింగ్ పద్ధతి ఉత్తమం!

కిడ్నీ క్యాన్సర్ తరచుగా వస్తూ ఉంటె దీనిని రినాల్ సెల్ కార్సి నోమా గా పిలుస్తారు.. కిడ్నీ సైజ్ 4 సెం గా ఉంటుంది. ఇందుకోసం హీటింగ్ లేదా ఫ్రీజింగ్ పద్దతిద్వారా ట్యూమర్ కు సాధారణంగా తెరఫీ మాత్రమే ప్రత్యామ్నాయం.తెరఫీ క్యాన్సర్ ను నాశనం చేస్తుంది. దీనిని ఎబ్లేషణ్ గా అందరికీ తెలుసు. దీనివల్ల చాలామంది జీవితాలు కాపాడ వచ్చు.అని నిపుణులు అభిప్రాయ పడ్డారు.క్లినికల్ స్టేజి లోనే టి వి ఏ అవసరం లేకుండా కిడ్నీ సర్జరీ చేయవచ్చు.పెన్సిల్వేనియా లో నిర్వహించిన ప్రాధమిక పరిశోదనలో యురాలజీఅసోసియేషన్  అమెరిక అధికారిక జర్నల్ లో ప్రాధమిక స్థాయిలో ఉన్న రినాల్ కార్సినోమా ను గుర్తించారు.ఆర్ సి సి ద్వారా ౩ నుండి 4 సెమి క్రియో అబ్ లేషన్ క్యాన్సర్ ను నాశనం చేస్తుంది. ఫ్రీజింగ్ పద్ధతి ద్వారా క్యాన్సర్ కణాలు పెరుగుదలను నివారిస్తుంది.కిడ్నీ క్యాన్సర్ సంబందిత మరణాలు తక్కువే అయిన అబ్లేషణ్ ప్రభావం తక్కువే అని హీట్ పద్ధతికన్న  ధర్మల్ ఎబిలేషణ్ పద్ధతి  ఎబిలేషణ్ ఉత్తమమని నిర్ధారించారు.రెండిటిని పోల్చినప్పుడు ౩ సెమి లు తక్కువ ఉన్నప్పుడు చల్లటి పద్దతిలో హీట్ పద్దతిలో తెరఫీ ద్వారా క్యాన్సర్ నివారించ వచ్చు.రచయిత గాబ్రియల్ ఐ ఆర్ సి సి ఎస్ ఎం డి సైంటిఫిక్ ఇన్స్టిట్యుట్ మిలాన్ చేసిన పరిశోదన లో ఎబిలేషణ్ ఎలా వినియోగించాలి.అన్న అంశాల పై రోగులకు చిన్న ఆర్ సి సి ఎస్ పద్ధతి పై మరిన్ని పరిశోదనలు చేయాల్సి ఉంది.హీటింగ్ కన్నా క్రియో ఎబిలేషన్ వల్ల ప్రభావం తక్కువే. కిడ్నీ క్యాన్సర్ ను రినాల్ కార్సినోమా గా ప్పిలుస్తారు.రోగులలో అర సి సి 4 సెమీ కన్నా తక్కువ ఉంటుంది. ఇందులో ఫ్ర్రీజింగ్ పడ్డతి హీటింగ్ విధానాల ద్వారా ట్యూమర్ ను సహజంగా ఇచ్చే థెరపీ లానే ఉంటుంది.ఇది క్యాన్సర్ ను నాశనం చేస్తుంది. దీనిని ఎబ్లేషణ్ అంటారు ఎబ్లేషణ్ కూడా క్యాన్సర్ స్టేజ్ ను బట్టి  ఇవాల్సి ఉంటుంది.కిడ్నీ సర్జర్రీ లేకుండా నే  ఎబ్లేషణ్ పద్దతి అమలు చేయవచ్చు.ఏది ఏమైనా ఎబ్లేషణ్ వల్ల తక్కువ లాభాలే వ్యక్తిగతంగా వివిధ స్తేజిలలో టి ఎల్ క్యు అర్ సి సి ఎస్ ట్యూమర్ లు ౩ నుండి 4 సెమీ కణి తలు ఉంటె యురోపియన్ గైడ్ లైన్స్ ప్రాకారం చికిత్చ ఫ్రీజింగ్ ఫ్రీజింగ్ వినియోగించవచ్చు. అంతార్జాతీయ పరిశోదనా సంస్థ బృందం వివిధ స్తేజిలలో ఉన్న వారిని పరీక్షించి ఆర్ సి సి ని ఫ్రీజింగ్ హీటింగ్ పద్దతిని 2౦౦ 4-2౦18 లో కేసులు సర్వ్ లెన్స్ ఎపిడ మాలజీ ద్వారా ఫలితం నషనల్  క్యాన్సర్ ఇన్స్టిట్యుట్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ట్యూమర్ లు ౩,4 సెమీ ఉంది రెండు మూడు గ్రూపు లతో సరిపోయాయి. ఇందులో 75 7 మందికి క్రియో బిలేషణ్ చికిత్చ చేయాగా ౩ 88 మందికి హీట్ ధర్మల్ ఎబ్లేషణ్ చికిత్చ్చ చేసినట్లు నిపుణులు పేర్కొన్నారు.72 సం వచ్చరాలు పై బడిన 4 22 మందికి హీట్ పద్ధతి ద్వారా 2౩8 మందికి ఫ్రీజింగ్ పద్ధతి ని అందించారు.కిడ్నీ క్యాన్సర్ కాక ఇతర అనారోగ్య సమస్యల వల్ల చనిపోయిన వారే ఎక్కువ.౩ నుండి 4 సెమీ ఉన్న వారికి క్రియోబిలేషణ్ 8.5 % క్రియో బిలేషణ్ ద్వారా 18.9 హీట్ పద్ధతి ద్వారా ఎబిలేషణ్ రెన్దొఇ కొన్ని కేసులలో వినియోగించినట్లు తెలిపారు.కిడ్నీ త్యుమర్లను నివారించేందుకు స్మాల్ ఎబిలేషణ్ చికిత్చ చేయవచ్చు అన్నది పరిశోదన సారాంశం.