మూత్రంలో నురుగు ఎక్కువ  కనిపిస్తోందా? ఈ నిజాలు తెలుసుకోండి..!

అనారోగ్యాలను నిర్థారించడానికి మూత్ర పరీక్షలు కూడా చేస్తారు. కొందరికి మూత్రం చాలా పసుపు రంగులో వస్తుంది. మరికొందరికి లేత పసుపు రంగులో ఉంటుంది. ఇంకొందరికి కేవలం నీరు ఎలా ఉంటుందో అలా మూత్రం వస్తుంది.  అయితే కొందరు మూత్రంలో నురుగు గమనిస్తూ ఉంటారు. మూత్ర విసర్జన చేసేటప్పుడు నురుగు కనిపించడం.. మూత్ర విసర్జన చేసిన కొన్ని సెకెన్లలోపు ఆ నురుగు క్లియర్ అయిపోతే అది ఆరోగ్యానికి ఏం చేయదు. కానీ మూత్ర విసర్జన చేసిన తర్వాత మూత్రం లో నురుగు  అలాగే ఉంటున్నట్టేతే దాన్ని లైట్ తీసుకోకూడదని అంటున్నారు వైద్యులు. ఇంతకూ మూత్రంలో నురగ కనిపిస్తే కలిగే ప్రమాదం ఏంటి?  తెలుసుకుంటే.. మూత్రపిండాల వైఫల్యం.. నురుగుతో కూడిన మూత్రం   మూత్రపిండాల వైఫల్యాన్ని సూచిస్తుందని చెప్పలేం. కానీ ఇది ఖచ్చితంగా హెచ్చరిక లాంటిదేనని అంటున్నారు. కొన్నిసార్లు శరీరంలో తేమ తక్కువ ఉండి శరీరం డీహేడ్రేషన్ కు లోనవ్వడం లేదా అధిక ప్రోటీన్ ఆహారం కారణంగా మూత్రం  బలంగా ప్రవాహించడం వల్ల  తాత్కాలికంగా నురుగుగా మారుతుంది. అయితే ఈ సమస్య చాలా కాలం పాటు కొనసాగితే, దానిని సీరియస్ గా  పరిగణించాలి.  నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎక్కువకాలం నురుగుతో కూడిన మూత్రం మూత్రపిండాల వడపోత సామర్థ్యం బలహీనపడటానికి సంకేతం కావచ్చని అంటున్నారు. కిడ్నీ ఫెయిల్యూర్ ప్రారంభ లక్షణాలు.. కిడ్నీలు ఫెయిల్ కావడానికి ముందే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. చేతులు, కాళ్ళు,  ముఖం వాపు, అలసట,  బలహీనత, ఆకలి లేకపోవడం, ముదురు రంగులో మూత్రం ఉండటం  లేదా దుర్వాసనతో కూడిన మూత్రం విసర్జించడం.  శ్వాస ఆడకపోవడం, చర్మం దురద, వాంతులు లేదా వికారం వంటి లక్షణాలు ఉంటాయి. మూత్రంలో నురుగు ఉంటే ఈ వ్యాధులు కూడా ఉండవచ్చు.. నురుగు మూత్రం తరచుగా మూత్రపిండాల సమస్యలే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలను కూడా సూచిస్తుంది.  అధిక నురుగు మధుమేహం,  అధిక రక్తపోటును  సూచిస్తుంది. గుండె సమస్యలు, గర్భం, ఒత్తిడి,  మూత్ర ఇన్ఫెక్షన్లు కూడా అధిక నురుగు మూత్రానికి కారణమవుతాయి. తీవ్రమైన అనారోగ్యానికి మొదటి సంకేతం మూత్రంలోనే తెలుస్తుందని వైద్యులు చెబుతున్నారు. నురుగు మూత్రం, మూత్రం రంగు ముదురు పసుపు లేదా గోధుమ రంగులోకి మారడం, బలమైన వాసన,  మంట లేదా మూత్రంలో రక్తం వంటి లక్షణాలను గమనించినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

రాత్రి భోజనం తర్వాత గ్రీన్ టీ తాగడం మంచిదేనా?

గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది.  చాలామంది గ్రీన్ టీని ఉదయం సమయంలో తాగుతారు,  లేదా సాయంత్రం సమయంలో తాగుతారు. కానీ గ్రీన్ టీని రాత్రి ఆహారం తీసుకున్న తర్వాత తాగినా చాలామంచి ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు కొందరు.  అసలు గ్రీన్ టీ ని రాత్రి సమయంలో తాగవచ్చా?  రాత్రి సమయంలో తాగాలి అనుకుంటే ఎన్ని గంటలకు తాగాలి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు ఏంటి? తెలుసుకుంటే.. రాత్రి సమయంలో గ్రీన్ టీ.. రాత్రి సమయంలో గ్రీన్ టీ తాగడం గురించి ఒక సమాచారం చాలా వైరల్ అవుతోంది. రాత్రి భోజనం చేసిన తర్వాత కూడా కొంతమంది మళ్లీ ఏదైనా తినాలని అనుకుంటూ ఉంటారు.  ఏవో ఒక స్నాక్స్ లేదా పానీయాలు తాగడానికి ఇష్టపడుతుంటారు. కానీ రాత్రి సమయంలో బోజనం తర్వాత గ్రీన్ టీ తాగితే పెద్ద పెద్ద ఆరోగ్య మార్పులు చేయకపోయినా.. చిన్న చిన్న మార్పుల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుతుందని అంటున్నారు. స్వీట్ క్రేవింగ్స్.. రాత్రి సమయంలో బోజనం తర్వాత కొందరికి స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి. డిన్నర్ చేసిన తర్వాత  తీపిగా ఉన్న పదార్థాలు ఏమైనా తినాలని అనుకుంటారు. ఇందుకోసం ఇంట్లో చిరుతిళ్లు,  ఐస్ క్రీమ్ లాంటివి కూడా స్టాక్ పెట్టుకుని ఉంటారు. కానీ రాత్రి భోజనం తర్వాత గ్రీన్ టీ తాగితే ఈ స్వీట్ క్రేవింగ్స్ కు చెక్ పెడుతుంది.  భోజనం తర్వాత గ్రీన్ టీ తాగితే ఆ తరువాత మళ్లీ స్వీట్స్ ఏమీ తినాలని అనిపించకపోవడమే దీనికి కారణం. రిలాక్స్.. భోజనం తర్వాత గ్రీన్ టీ తాగడం మానసికంగా రిలాక్స్ గా ఉంచుతుందట. ఇది పదే పదే ఫోన్ చూడటం లేదా స్క్రీన్ టైమ్ ను తగ్గించుకోవడానికి సహాయపడుతుందట. నిద్ర సమయానికి మానసికంగా రిలాక్సేషన్ ఇస్తుందని అంటున్నారు. తక్కువ భోజనం.. రాత్రి సమయంలో డిన్నర్ తర్వాత గ్రీన్ టీ తాగే అలవాటు భోజనం తక్కువ తీసుకోవడానికి సహాయపడుతుందట. రాత్రి తేలిక పాటి బోజనం ఆరోగ్యానికి చాలా మంచిది. భోజనం తర్వాత గ్రీన్ టీ తాగాలనే కారణంతో భోజనం తక్కువ తీసుకోవడం జరుగుతుందట. రాత్రి గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి.. రాత్రి సమయంలో గ్రీన్ టీని రాత్రి భోజనం చేసిన  అరగంట తర్వాత తీసుకోవచ్చు. రాత్రి గ్రీన్ టీ తాగితే నష్టం.. రాత్రి సమయంలో గ్రీన్ టీ తాగడం వల్ల కొందరికి నిద్ర పట్టడంలో సమస్యలు ఏర్పడతాయి. అయితే ఇది రాత్రి భోజనం చేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది. రాత్రి సమయంలో 7 నుండి 8 గంటల మధ్య భోజనం ముగిస్తే 8నుండి 8.30 లోపు గ్రీన్ టీ తాగవచ్చు.  రాత్రి 10గంటలకు చక్కగా నిద్రపోవచ్చు. అలా కాకుండా రాత్రి బోజనం ఆలస్యంగా 10 గంటలకు లేదా అంతకంటే ఎక్కువ సమయంలో చేసి ఆ తర్వాత గ్రీన్ టీ తాగితే అది నిద్రకు ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది.                                       *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

రక్తం క్లీన్ గా ఉంటే రోగాలన్నీ దూరమే.. రక్తాన్ని ఇలా శుద్ది చేసుకోండి..!

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయడం చాలా ముఖ్యం. ప్రతి అవయవానికి తగినంత మొత్తంలో స్వచ్ఛమైన రక్తం అందితేనే ఇది జరుగుతుంది. రక్త స్వచ్ఛత అంటే అది విష పదార్థాలు లేకుండా ఉండాలని అర్థం. ఆహారం విషయంలో చేసే తప్పులు  కాలక్రమేణా రక్తంలో అనేక విష పదార్థాలు పేరుకుపోవడానికి కారణమవుతాయి. దీని వలన అనేక అవయవాలు విషపూరితంగా మారుతాయి. సాధారణంగా జీర్ణవ్యవస్థ,  మూత్రపిండాలు,  కాలేయం వంటి అవయవాలు సహజంగా రక్తాన్ని నిరంతరం ఫిల్టర్ చేస్తాయి. అయితే రక్తంలో ఎక్కువ టాక్సిన్లు ఉంటే ఈ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది.  ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రక్తంలో టాక్సిన్లు తొలగించే పానీయాలు తీసుకోవడం ద్వారా రక్తాన్ని క్లీన్ గా ఉంచుకోవచ్చు. అవేంటో తెలుసుకుంటే.. రక్తం క్లీన్ గా లేకపోతే... రక్త నాణ్యత సరిగా లేకపోవడం వల్ల కాలేయం సరిగా పనిచేయదు. ఇది జీర్ణ సమస్యలను పెంచుతుంది. ఇది మాత్రమే కాకుండా చర్మ ఇన్ఫెక్షన్లు, ఎప్పుడూ  మొటిమలు, దద్దుర్లు,  చికాకు, తరచుగా అలసట,  ముఖంపై మెరుపు లేకపోవడం మొదలైనవన్నీ  రక్తం శుభ్రంగా లేదని సంకేతాలు ఇస్తాయి. రక్తం శుద్ది చేసుకోవాలంటే.. ఎక్కువ నీరు త్రాగే అలవాటు శరీరాన్ని డిటాక్స్  చేయడంలో,  రక్తంలోని మలినాలను తగ్గించడంలో సహాయపడుతుంది. నీరు ఎక్కువగా తాగడం వల్ల కాలేయం,  మూత్రపిండాల పనితీరు కూడా సక్రమంగా ఉంటుంది. ఈ అవయవాలు రక్తాన్ని శుద్ధి చేయడం,  రక్తంలో మలినాలను తొలగించడం వంటి పనులు చేయడంలో సహాయపడతాయి. నేషనల్ కిడ్నీ అసోసియేషన్ ప్రకారం  ప్రతిరోజూ 6 కప్పుల మూత్రాన్ని ఉత్పత్తి చేయడానికి తగినంత నీరు త్రాగాలి. నిమ్మరసం.. నిమ్మరసం  రక్తాన్ని,  జీర్ణవ్యవస్థను  రెండింటినీ శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఇది సహజంగా ఆమ్లంగా ఉంటుంది, ఇది pH స్థాయిలను తగ్గించడానికి,  రక్తం నుండి విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. శరీరం నుండి మలినాలను బయటకు పంపడానికి, ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో  తాజా నిమ్మరసం కలిపి  త్రాగాలి. ఇది  రక్తాన్ని శుభ్రంగా ఉంచడానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పసుపు.. పసుపు దాని శోథ నిరోధక లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది  రక్తాన్ని శుద్ధి చేయడంలో,  వైద్యం ప్రక్రియను వేగవంతం చేయడంలో కూడా సహాయపడుతుంది. పసుపులో లభించే కర్కుమిన్ అనే సమ్మేళనం వాపు,  ఇన్ఫెక్షన్ ప్రమాదాల నుండి రక్షించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం, ఒక కప్పు వేడి పాలలో అర టీస్పూన్ పసుపు పొడి కలిపి త్రాగాలి. ఇది కాలేయ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.  శరీరం నుండి విషాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.                                *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

చలిగా ఉందని టీ తెగ తాగేస్తున్నారా? జర జాగ్రత్త..!

వేసవి కాలంలో చల్లని పదార్థాలు, చలి కాలంలో వెచ్చని ఆహారాలు తీసుకోవాలని అనుకోవడం చాలా సాధారణం. ముఖ్యంగా చలికాలంలో ఉదయాన్నే వేడివేడి టీ తాగందే చాలామందికి తెల్లవారదు కూడా.  లేవగానే ఒక కప్పుతో మొదలు పెట్టి,  పూటకు ఒకసారి టీ తాగడమే కాకుండా.. పని చురుగ్గా జరగడం కోసం శరీరానికి ఉత్సాహం తెచ్చుకోవడానికి పదే పదే టీ తాగుతూ ఉంటారు. అయితే ఏదైనా సరే.. తీసుకునే దాన్ని బట్టి ఔషధంగానూ పనిచేస్తుంది,  విషంగానూ పనిచేస్తుంది.   ప్రతి రోజూ ఎన్ని కప్పుల టీ తాగడం ఆరోగ్యానికి మంచిది.  ఎన్ని కప్పులు తాగడం హానికరంగా పరిగణించబడుతుంది. తెలుసుకుంటే.. శీతాకాలంలో ఒక కప్పు వేడి టీ శరీరం,  మనస్సు రెండింటినీ ప్రశాంతపరుస్తుంది. టీ  వెచ్చదనం చేతులకు ఉపశమనం కలిగిస్తే.. దాని నుండి వచ్చే ఆవిరి మొత్తం వాతావరణాన్ని హాయిగా చేస్తుంది. చలి రోజులలో చాలా మంది రోజంతా లెక్కపెట్టనట్టు టీ తాగడానికి ఇదే కారణం.  అది వారి రోజువారీ అలవాటుగా మారుతుంది. మితంగా  టీ తాగడం సాధారణంగా ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. కానీ ఎక్కువగా టీ తాగితే కొన్ని నష్టాలు కూడా  కలిగిస్తుంది. ఎక్కువ టీ తాగడం వల్ల కలిగే నష్టాలేంటి? టీ తాగితే కలిగే ప్రయోజనాలు,  నష్టాలేంటి? టీ ప్రయోజనాలు.. సరైన మొత్తంలో టీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కొన్ని పరిశోధనలు క్రమం తప్పకుండా టీ తాగడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్,  టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని సూచిస్తున్నాయి. అయితే ఇది టీ రకం,  తీసుకునే పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. టీలోని ఫ్లేవనాయిడ్లు, కాటెచిన్లు వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.  కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయని అంటున్నారు. టీలోని కెఫిన్,  ఎల్-థియనిన్ కాంబినేషన్ మనస్సును ప్రశాంతపరుస్తుంది,  దృష్టిని మెరుగుపరుస్తుంది, కాఫీ కలిగించే ఆందోళనను నివారిస్తుంది. అల్లం లేదా పుదీనా వంటి హెర్బల్ టీలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో,  శరీర సహజ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. జలుబు  ఫ్లూ సీజన్‌లో  రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తాయి. టీ తాగితే నష్టాలు.. అధికంగా టీ తాగడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా కెఫిన్ ఉన్న టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. టీలోని టానిన్లు ఐరన్ శోషణకు ఆటంకం కలిగిస్తాయి. ఇది రక్తహీనతతో బాధపడేవారికి లేదా శాఖాహార ఆహారం తీసుకునేవారికి చాలా సమస్యగా  ఉంటుంది. రోజుకు 400 mg కెఫిన్ మించితే నిద్ర సమస్యలు, విశ్రాంతి లేకపోవడం,  హృదయ స్పందన రేటు పెరుగుదలకు దారితీస్తుంది. ఖాళీ కడుపుతో స్ట్రాంగ్  టీ తాగడం వల్ల వికారం, ఆమ్లత్వం లేదా తలతిరుగడం వంటివి జరుగుతాయి.  ఎక్కువకాలం  టీని ఎక్కువగా తాగడం వల్ల దంతాలు మరకలు పడతాయి.  కెఫిన్ వ్యసనానికి దారితీస్తుంది. రోజుకు ఎంత తాగితే మేలు.. ఎన్ని కప్పుల టీ తాగడం హాని కలిగిస్తుంది అనే విషయంలో చాలా మంది గందరగోళ పడుతుంటారు.  సాధారణంగా రోజుకు 3 నుండి 4 కప్పుల టీ తాగడం చాలా మందికి సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది.  కెఫిన్‌కు ఎక్కువ సెన్సిటివ్ గా ఉండేవారు లేదా కొన్ని ఆరోగ్య పరిస్థితులతో బాధపడేవారు టీ తీసుకోవడం పరిమితం చేసుకోవాలి. గర్భిణీ స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.  రోజుకు 2 కప్పుల కంటే ఎక్కువ తాగకూడదు.                        *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

వామ్మో.. ఈ మూడు అలవాట్లు మానకపోతే చిత్తవైకల్యం తప్పదట..!

ఒకప్పుడు వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి కోల్పోవడం, శరీర వణుకు వంటి సమస్యలు వచ్చేవి. పెద్ద వయసులో ఇవి సాధారణం అని భావించేవారు. కానీ నేటి వేగవంతమైన జీవితాల్లో చిత్తవైకల్యం,  పార్కిన్సన్స్ వంటి వ్యాధులు ఊహించకుండా వచ్చేస్తున్నాయి.  అందులోనూ వయసుతో సంబందం లేకుండా చాలామంది ఈ సమస్యలు ఎదుర్కుంటున్నారు. ఈ రెండు వ్యాధులు  మెదడు పనితీరును ప్రభావితం చేస్తాయి. జన్యుశాస్త్రంతో పాటు,  జీవనశైలి కూడా ఈ వ్యాధులకు దోహదం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని వైద్యులు చెబుతున్నారు. మెదడు ఆరోగ్యంగా ఉండాలన్నా. చిత్త వైకల్యం,  పార్కిన్సన్స్ వంటి జబ్బులు రాకుండా ఉండాలన్నా మూడు అలవాట్లు  పొరపాటున కంటిన్యూ  చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుంటే.. నిద్ర.. శారీరక అలసటకు మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా నిద్ర చాలా అవసరం. మనం నిద్రపోతున్నప్పుడు మెదడు గ్లింఫాటిక్ వ్యవస్థ ద్వారా టాక్సిన్స్ తొలగిస్తుంది. వీటిలో అమిలాయిడ్-బీటా ప్రోటీన్ ఉంటుంది. ఇది అల్జీమర్స్,  చిత్తవైకల్యంతో నేరుగా కనెక్షన్ కలిగి ఉంటుంది. అందువల్ల క్రమం తప్పకుండా రోజుకు 6 గంటల కంటే తక్కువ నిద్రపోయే వ్యక్తుల మెదడులో హానికరమైన ప్రోటీన్లు పేరుకుపోతాయి. ఇవి మెదడు కణాలను నాశనం చేస్తాయి. రాత్రి నిద్ర ఆరోగ్యకరంగా ఉండాలంటే  ప్రతి రాత్రి ఒకే సమయంలో పడుకోవడం అలవాటు చేసుకోవాలి.   పడుకునే 1-2 గంటల ముందు  మొబైల్ ఫోన్ వాడటం మానేయాలి. అల్పాహారం.. అల్పాహారం మన మెదడుకు ఇంధనంగా పనిచేస్తుంది. రాత్రంతా ఆహారం లేకుండా శరీరం విశ్రాంతి స్థితిలో ఉంటుంది.  దీని  తర్వాత మెదడు సరిగ్గా పనిచేయడానికి గ్లూకోజ్ అవసరం. అందువల్ల, అల్పాహారం దాటవేసే వ్యక్తులకు పోషకాలు లోపిస్తాయి. ఇది మెదడు క్షీణత లేదా మెదడు కుంచించుకుపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది చిత్తవైకల్యం ప్రారంభానికి మూలం అయ్యే అవకాశం కలిగి ఉంటుంది. అందువల్ల అల్పాహారంలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, గింజలు,  తాజా పండ్లను చేర్చడం ముఖ్యం. ఇవి మెదడు కణాలను మరమ్మతు చేయడంలో సహాయపడతాయి. వ్యాయామం.. శరీరంలోని బద్ధకం మనస్సులో బద్ధకాన్ని కలిగిస్తుంది. వ్యాయామం శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది మెదడుకు తగినంత ఆక్సిజన్,  పోషకాలను అందిస్తుంది. అయితే వ్యాయామం లేకపోవడం వల్ల ఊబకాయం,  అధిక రక్తపోటు ప్రమాదం పెరుగుతుంది. ఇవి పార్కిన్సన్స్,  చిత్తవైకల్యానికి రెండు ప్రధాన ప్రమాద కారకాలు. శారీరకంగా చురుకుగా లేకపోవడం వల్ల మెదడులో డోపమైన్ స్థాయిలు తగ్గుతాయి. ఇది పార్కిన్సన్స్‌కు ప్రధాన కారణం. అందువల్ల ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు చురుకైన నడక, యోగా లేదా ఏదైనా ఇతర వ్యాయామం చేయాలి.                            *రూపశ్రీ.

40ఏళ్ల లోపే మనుషుల్ని క్యాన్సర్ రోగులుగా మార్చే అలవాట్లు ఇవి.. మీకు ఉన్నాయేమో చెక్ చేస్కోండి..!

క్యాన్సర్ ప్రపంచాన్ని కబళిస్తున్న జబ్బు. పూర్తీగా చెయ్యి దాటిన దశలో బయటపడటం అనే కారణం వల్ల క్యాన్సర్ అంటే ఇక మరణమే అనే అభిప్రాయం ఏర్పడింది.  క్యాన్సర్ కు వైద్యం ఉన్నా అది చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో చాలా నరకం అనుభవించాల్సి వస్తుంది.  సింపుల్ గా చెప్పాలంటే.. క్యాన్సర్ ఒక మనిషి  శరీరాన్ని లోపలే విచ్చిన్నం చేయడమే కాకుండా.. ఒక కుటుంబాన్ని ఆర్థికంగా కూడా చితికిపోయేలా చేస్తుంది. నేటికాలంలో క్యాన్సర్ నిపుణులు కొన్ని ఆందోళనకరమైన మార్పులు గమనిస్తున్నారు. క్యాన్సర్ అంటే పెద్దవారిలో బయటపడేది అనుకునేవారు. కానీ నేటికాలంలో యువతలో కూడా క్యాన్సర్ బయటపడటం ఆందోళనగా మారుతోంది. కొంతమంది 20 లేదా 30 ఏళ్ల లోపు క్యాన్సర్ రోగులుగా మారుతున్నారు. రొమ్ము క్యాన్సర్ నుండి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వరకు అన్ని రకాల క్యాన్సర్‌లలో ఈ మార్పు కనిపిస్తోంది. శరీరాన్ని చాలా సైలెంట్ గా క్యాన్సర్ బారిన పడేలా చేసే 7 అలవాట్లు ఉన్నాయి. ఈ 7లో కూడా 3 పనులు చేసిన తర్వాత ప్రజలు చాలా గ్రేట్ గా ఫీలవుతూ ఉంటారు. అవేంటో అవి శరీరాన్ని క్యాన్సర్ బారిన పడేలా ఎందుకు చేస్తాయో.. తెలుసుకుంటే..   ప్రజలు మూడు పనుల విషయంలో చాలా గ్రేట్ ఫీలవుతారు.  పైగా వాటిని మార్చుకోవాలని కూడా అనుకోరు.  కానీ క్రమంగా అవి కణాలను,  హార్మోన్ల పనితీరును దెబ్బతీస్తాయి. ఉదాహరణకు.. గంటల తరబడి కూర్చోవడం వల్ల  తాము చాలా పని చేస్తున్నామని, చాలా భాద్యతగా ఉంటున్నామని అనుకుంటారు. ఇది విజయానికి  మంచిదే కానీ ఇది ఆరోగ్యపరంగా చాలా నష్టాలు కలిగిస్తుందని అంటున్నారు. అదేవిధంగా.. నిద్రించడానికి తగినంత సమయం లేకపోవడం వల్ల  తగినంత నిద్రపోని వారు అనేకమంది ఉన్నారు. కొంతమంది ఎక్కువగా మద్యం సేవించిన తర్వాత తమ సామర్థ్యం బాగా పెరిగిందని తమను తాము గొప్పగా చెప్పుకుంటారు. ఆహారం.. నేటికాలంలో ఆహారపు అలవాట్లు చాలా అనారోగ్యకరంగా తయారయ్యాయి. ప్యాక్ చేసిన స్నాక్స్, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు,  తక్కువ ఫైబర్ భోజనం ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇది ప్రేగులలోని బ్యాక్టీరియా సంఖ్యను ప్రభావితం చేస్తుంది. ఇది పెద్దప్రేగు,  గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌కు దారితీస్తుంది. యాంటీబయాటిక్ ఎక్కువ వాడటం కూడా ఈ ప్రమాదాన్ని పెంచుతుంది. పొల్యూషన్.. పర్యావరణ,  కాలుష్య కారకాలు క్యాన్సర్‌కు ప్రధాన కారణం. చుట్టూ ఉన్న కలుషితమైన గాలి,  ఇంటి లోపల,  వెలుపల గాలిని ప్రమాదకరంగా మారుస్తోంది. PM2.5,  వాయు కాలుష్యం నుండి వచ్చే టాక్సిన్స్ శరీరంలోకి ప్రవేశించి వాపుకు కారణమవుతాయి. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి.  DNA ను దెబ్బతీస్తాయి. ఇది ధూమపానం చేయని వారిలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమవుతుంది. జన్యువులు.. చిన్న వయసులోనే క్యాన్సర్ వచ్చే వ్యక్తులు జన్యు కారణాల వల్ల ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉండటం వలన BRCA వంటి  సమస్యలు  సంభవించవచ్చు. అనారోగ్యకరమైన వాతావరణంలో జీవించడం దీని ప్రమాదం పెరుగుతుంది. పరీక్షలు.. యువతలో చాలామంది తమకు ఎదురయ్యే  ఆరోగ్య సమస్యలను లైట్ తీసుకుంటారు. మాది చిన్న వయసు మాకేం జబ్బులు వస్తాయి అని అనుకుంటారు. ఈ వయసులో క్యాన్సర్ ఎలా వస్తుందనే ఆలోచన యువతలో ఉంటుంది. దీనివల్ల ఈ ప్రాణాంతక వ్యాధిని గుర్తించడం ఆలస్యం అవుతుంది.  చికిత్స కష్టమవుతుంది.  దీర్ఘకాలిక నొప్పి, ఆకస్మికంగా బరువు తగ్గడం, మలద్వారం నుండి రక్తస్రావం, ఎప్పుడూ  దగ్గు రావడం,  రొమ్ములో ముద్దగా ఉండటం,  మూత్ర విసర్జన అలవాట్లలో మార్పు లేదా నోటిలో పూతలు ఎక్కువ కాలం ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.                         *రూపశ్రీ.

బ్రాడీకార్డియా.. ఈ వ్యాధి గురించి తెలుసా?

నేటి కాలంలో మనుషుల ఆరోగ్యాన్ని దెబ్బతీయడానికి పెద్ద శత్రువులుగా మారినవి జబ్బులే.  కొత్త కొత్త ఆరోగ్య సమస్యలన్నీ బయటపడుతూ ఉంటాయి.  మనిషి ప్రాణాన్ని ప్రమాదంలో పడేసే లిస్ట్ లో బ్రాడీకార్డియా కూడా ఒకటి. ఇది గుండెకు సంబంధించిన జబ్బు. ఈ సమస్య తెలుసుకున్నప్పుడు దీన్ని సులువుగానే పరిష్కరించుకోవచ్చు. కానీ దీన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు అంటున్నారు. అసలు బ్రాడీకార్డియా అంటే ఏంటి? దీన్ని లక్షణాలు, కారణాలు ఏంటి? తెలుసుకుంటే.. బ్రాడీకార్డియా.. హృదయ స్పందన మందగించినప్పుడు దానిని బ్రాడీకార్డియా అంటారు. ఈ పరిస్థితి చాలా తీవ్రమైనది,  ప్రాణాంతకమైనదిగా కూడా మారే అవకాశం ఉంటుంది. అందుకే దీన్ని నిర్గక్ష్యం చేయకూడదు. నెమ్మదిగా హృదయ స్పందనను గమనించాలి.  ఒక నిమిషం వ్యవధిలో  హృదయ స్పందనలను లెక్కించాలి. బ్రాడీకార్డియా ఎలా నిర్ణయిస్తారు.. గుండె సాధారణంగా నిమిషానికి 60 నుండి 100 సార్లు కొట్టుకుంటుంది. కానీ  గుండె నిమిషానికి 60 సార్లు కంటే తక్కువ కొట్టుకుంటే బ్రాడీకార్డియా ఉండవచ్చని వైద్యులు అంటున్నారు. బ్రాడీకార్డియా ఉంటే ఏం జరుగుతుంది.. SA నోడ్ అనేది గుండెకు ఉండే  సహజ పేస్‌మేకర్, ఇది గుండె కొట్టుకునేలా క్రమం తప్పకుండా విద్యుత్ సంకేతాలను పంపుతుంది. బ్రాడీకార్డియాలో ఈ సంకేతాలు బలహీనంగా లేదా ఆలస్యంగా ఉంటాయి. దీనివల్ల గుండె నెమ్మదిగా కొట్టుకుంటుంది . ఇది రక్త ప్రవాహాన్ని నెమ్మదిస్తుంది, శరీరానికి,  ఇతర అవయవాలకు తగినంత ఆక్సిజన్ డెలివరీని నిరోధిస్తుంది. హృదయ స్పందన నెమ్మదిగా ఉంటే ఏం  జరుగుతుందంటే..  హృదయ స్పందన నెమ్మదిగా ఉండటం వల్ల  శరీరం,  మెదడుకు తగినంత రక్తం,  ఆక్సిజన్ చేరకుండా ఆటంకం కలుగుతుంది. ఇది అలసట, తలతిరగడం, తలతిరగడం, శ్వాస ఆడకపోవడం, గందరగోళం,  మూర్ఛపోవడానికి కూడా కారణమవుతుంది. చాలా ఫిట్‌గా ఉన్న వ్యక్తులలో కూడా హదయ స్పందన నెమ్మదిగా ఉండే అవకాశం ఉంటుంది. హృదయ స్పందన నెమ్మదిగా ఉండటంతో పాటు ఇతర  కారణాలు  బ్రాడీకార్డియాను నిర్ధారిస్తాయి. ఇతర కారణాలు.. వృద్ధాప్యం దీర్ఘకాలిక గుండె జబ్బులు గుండె  విద్యుత్ వ్యవస్థకు నష్టం వాటిల్లడం కొన్ని మందులు తీసుకోవడం డయాబెటిస్, అధిక రక్తపోటు,  ఎలక్ట్రోలైట్ అసమతుల్యత నిర్ధారణ,  చికిత్స.. బ్రాడీకార్డియాను సాధారణంగా ECG ద్వారా నిర్ధారణ చేస్తారు.  కొన్నిసార్లు హోల్టర్ మానిటర్‌ను సాధారణ హృదయ స్పందనను రికార్డ్ చేయడానికి ఉపయోగిస్తారు. చికిత్స పరిస్థితి  తీవ్రత,  కారణాన్ని బట్టి ఉంటుంది. తేలికపాటి కేసులకు మందులు,  జీవనశైలి మార్పులతో చికిత్స చేయవచ్చు. అయితే తీవ్రమైన కేసులకు పేస్‌మేకర్ అవసరం కావచ్చు. లీడ్ లెస్ పేస్ మేకర్లు.. సాంప్రదాయ పేస్‌మేకర్లు  ప్రభావవంతంగా ఉండేవి, కానీ వాటి వైర్లు సమస్యల ప్రమాదాన్ని పెంచేవి.. ఆ కారణంగా ఆధునిక లీడ్‌లెస్ పేస్‌మేకర్లు కనుగొన్నారు. ఇవి తక్కువ ఇన్వాసివ్,  వేగంగా కోలుకోవడానికి వీలు కల్పిస్తాయి. పేస్‌మేకర్ ఇంప్లాంటేషన్ తర్వాత చాలా మంది పూర్తిగా సాధారణ జీవితాన్ని గడుపుతారు.                      *రూపశ్రీ.

వారెవ్వా మందారం టీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!

మందారం పువ్వులు ప్రతి ఇంటి పెరట్లో  ఖచ్చితంగా ఉంటాయి.  ఎర్రగా ముద్దొచ్చే మందారాలలో బోలెడు ఔషద గుణాలు కూడా ఉంటాయి.  మందారాలను ఎక్కువగా పూజలలోనూ,  హెయిర్ కేర్ లోనూ ఉపయోగిస్తుంటారు. అయితే కేవలం జుట్టులో పెట్టుకోవడానికో లేదా జుట్టు సంరక్షణ కోసం మందారం నూనె లేదా హెయిర్ ప్యాక్ లోనో మాత్రమే కాదు.. మందరాన్ని మంచి హెల్త్ కోసం కూడా వాడవచ్చు.  విదేశాలలో పువ్వులతో టీ తయారు చేసుకుని తాగుతారు.  అలాంటి లిస్ట్ లో మందారం కూడా ఉంది.  అసలు మందారం టీలో ఉండే ఔషద గుణాలేంటి? మందారం టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? తెలుసుకుంటే.. మందారం టీ.. మందారం టీ చూడటానికి చాలా కలర్ పుల్ గా ఉంటుంది. ఇది రుచిలో పుల్లగా, క్రాన్బెర్రీ లాంటి రుచిని కలిగి ఉంటుంది.  ఈ టీలో కెఫిన్ ఉండదు. కాబట్టి ఆరోగ్యం కోసం ఎలాంటి సంకోచం లేకుండా దీన్ని తాగవచ్చు. మందారం టీ బెనిఫిట్స్.. మందారం టీ తాగడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుందట.  అధిక రక్తపోటు నియంత్రించడానికి మందారం టీ గొప్ప ఔషదంగా పనిచేస్తుంది. ఇది నరాలను సడలించి గుండెపై ఒత్తిడి తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు.. మందారం టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ప్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. బరువు తగ్గడంలో.. మందారం టీ శరీరంలో అమైలేస్ అనే ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.  ఇది కార్బోహేడ్రేట్లు, స్టార్చ్ ల శోషణను నెమ్మదిస్తుంది.  ఈ ప్రక్రియ జరగడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాలేయం.. మందారం టీ తాగడం వల్ల కాలేయం శుద్ది అవుతుంది. కాలేయంలో  పేరుకున్న కొవ్వును తగ్గించడంలో మందారం టీ  చాలా బాగా సహాయపడుతుంది.                         మందారం టీ తయారు విధానం.. మందారం టీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు.. మందారం రెక్కలు.. గుప్పెడు నిమ్మకాయ..  సగం చెక్క తేనె.. స్పూన్ నీరు.. ఒక గ్లాస్ తయారీ విధానం.. ఒక పాత్రలో ఒక గ్లాసు నీరు పోయాలి. అందులో శుభ్రం చేసుకున్న గుప్పెడు మందారం రెక్కలను వేయాలి. ఐదు నిమిషాల పాటు బాగా మరిగిన తరువాత స్టౌ ఆప్ చేయాలి.  కొంచెం వేడి తగ్గిన తర్వాత వడగట్టి అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని తాగాలి.  తేనె, నిమ్మరసం రుచి కోసం మాత్రమే.  అవి లేకుండా కూడా తాగవచ్చు.                                      *రూపశ్రీ.

రేగు పళ్లు అతిగా తింటున్నారా? ఈ నిజాలు తెలుసుకోండి..!

సీజన్ ను బట్టి లభించే పండ్లు చాలా ఉంటాయి.  అలాంటి వాటిలో రేగు పళ్లు చాలా ముఖ్యమైనవి.  అయితే రేగు పళ్లను  ఎవరు తిన్నా ఏం పర్వాలేదు అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. కొందరు వ్యక్తులు  రేగు పళ్లను తినకూడదట.  అసలు రేగు పళ్లను ఎవరు తినకూడదు? దీనికి గల కారణాలు ఏంటి? రేగు పళ్లను తినడం వల్ల ఎవరికి సమస్యలు ఉంటాయి? వివరంగా తెలుసుకుంటే.. సీజన్ ను బట్టి వివిధ రకాల పండ్లు అందుబాటులోకి వస్తుంటాయి.  ఆరోగ్యం బాగుండాటంటే సీజన్ లో దొరికే పండ్లు తీసుకోవడం మంచిదని అంటుంటారు వైద్యులు, పెద్దలు. శీతాకాలంలో లభించేవి రేగు పళ్లు. చాలామంది రేగుపళ్లను చాలా ఉత్సాహంగా తింటారు.  ఇవన్నీ చిన్నతనంతో ముడిపడిన ఆనందాలు. కొంతమందికి మాత్రం రేగు పళ్లు తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉంది. ఎవరు తినకూడదంటే.. మధుమేహం ఉన్నవారు రేగు పండ్లకు దూరంగా ఉండాలి. బాగా పండిన రేగు పండ్లలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర శాతాన్ని పెంచుతాయి. కేవలం చక్కెర స్థాయులు ఎక్కువగా ఉండటమే కాకుండా వాటిలో కార్బోహేడ్రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి.  ఈ కారణంగా రేగు పండ్లు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. రేగు పండ్లలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది.  అప్పటికే గ్యాస్,  ఎసిడిటీ,  అజీర్తి మొదలైన సమస్యలు ఉన్నవారు రేగు పండ్లను తింటే సమస్య మరింత పెరుగుతుంది. గర్బిణీ స్త్రీలు రేగు పండ్లకు దూరంగా ఉండాలి.   రేగు పండ్లు తినడం వల్ల వారికి కడుపులో సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.  అలాగే మలబద్దకం లాంటి సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. కొంతమందికి రేగు పండ్లు తింటే అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది.  దద్దుర్లు,  దురద వంటి సమస్యలు వస్తాయి.  అలర్జీ సమస్యలు ఉన్నవారు రేగు పండ్లకు దూరంగా ఉండటం మంచిది.                                   *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...    

నువ్వులు,  బెల్లం, వేరుశనగలను సూపర్ ఫుడ్స్ అంటారు ఇందుకే..!

భారతీయుల ఆహారంలో నువ్వులు,  పల్లీలు, బెల్లం చాలా ప్రముఖమైనవి.  ఇవి లేని బారతీయ ఆహారాన్ని అస్సలు ఊహించలేరు కూడా.  అయితే నువ్వులు, పల్లీలు,బెల్లాన్ని సూపర్ ఫుడ్స్ అని కూడా అంటారు.  పోషకాహార నిపుణులు ఈ ఆహారాలను తప్పనిసరిగా తీసుకోమని తమ పేషెంట్లకు సిఫారసు చేస్తారు కూడా. ప్రాంతాలను బట్టి వీటిని విభిన్న రకాలుగా ఆహారం తయారీలో వాడుతుంటారు. సాంప్రదాయ వంటకాలు ఇవి లేకుండా అసంపూర్ణంగా ఉంటాయి.  అయితే వీటిని సూపర్ ఫుడ్స్ అని ఎందుకు పిలుస్తారు? ఇలా పిలవడం వెనుక ఉన్న కారణం ఏంటి? తెలుసుకుంటే.. నువ్వులు,  వేరుశెనగల్లో ప్రోటీన్, విటమిన్లు,  ఒమేగా 6 వంటి పోషకాలు ఉంటాయి.ఇక బెల్లం ఐరన్, మెగ్నీషియం,  కాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజాలను కలిగి ఉంటుంది. ఈ మూడు సూపర్‌ఫుడ్‌లు వేడెక్కించే ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అందుకే వీటిని శీతాకాలపు సూపర్‌ఫుడ్‌లు అని కూడా పిలుస్తారు. వాటి పోషక విలువలు వాటిని మరింత ప్రత్యేకంగా చేస్తాయి. బెల్లంలో పోషక విలువలు.. బెల్లంలో సుక్రోజ్,  ఫ్రక్టోజ్ రూపంలో చక్కెరలు ఉంటాయి. అందువల్ల ఇది తీపి రుచిని కలిగి ఉంటుంది, తక్షణ శక్తిని అందిస్తుంది. బెల్లంలో ముఖ్యమైన విటమిన్లు A, C,  E ఉంటాయి. ఇందులో ఐరన్ తో  సహా అనేక ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉన్నాయి. బెల్లం తింటే కలిగే ప్రయోజనాలు.. జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది, కాలేయం,  రక్తం శుద్ది జరుగుతుంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు తొలగిపోతాయి. మలబద్ధకం సమస్య తగ్గుతుంది.  మానసిక, శారీరక ఒత్తిడి తగ్గుతుంది. ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. రక్తహీనత ప్రమాదం తగ్గుతుంది.  చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.  శరీరానికి మంచి ఎనర్జీ లభిస్తుంది. నువ్వుల పోషక విలువలు.. నువ్వులలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్,  పొటాషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. వాటిలో విటమిన్ B6 కూడా ఉంటుంది. నువ్వులు తింటే కలిగే ప్రయోజనాలు.. ఎముకలు దృఢంగా మారుతాయి, వాపు తగ్గుతుంది.  ఆర్థరైటిస్ నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణ ఆరోగ్యం బాగుంటుంది.  మెనోపాజ్ సమయంలో హార్మోన్లను బాలెన్స్డ్ గా ఉంచడంలో సహాయపడుతుంది. థైరాయిడ్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రక్తహీనత ప్రమాదం తగ్గుతుంది,  రక్తపోటు అదుపులో ఉంటుంది.  రక్తంలో చక్కెర స్థాయిలు  నియంత్రణలో ఉంటాయి.  కొలెస్ట్రాల్,  ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి. వేరుశనగ పోషక విలువలు.. వేరుశెనగల్లో ప్రోటీన్,  కొవ్వుతో సహా అనేక ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. వాటిలో అనేక ముఖ్యమైన విటమిన్లు,  ఖనిజాలు కూడా ఉంటాయి. వేరుశనగ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వాపు తగ్గుతుంది. డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.  క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది,  కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది,  పిత్తాశయంలో రాళ్ల ప్రమాదం తగ్గుతుంది. వేరుశనగ రెగ్యులర్ గా తింటే  జీవితకాలం పెరుగుతుంది.  మెదడు పనితీరు మెరుగుపడుతుంది.  కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ కారణాల వల్లనే ఈ మూడు ఆహారాలను సూపర్ ఫుడ్స్ అని అంటారు. మరీ ముఖ్యంగా శీతాకాలం సూపర్ ఫుడ్స్ అని అంటారు.      *రూపశ్రీ.     గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...                          

డయాబెటిస్, అసిడిటీ మందులు వాడుతున్నారా? ఈ నిజాలు తెలుసా?

ఏ జబ్బు వచ్చినా దాన్ని నయం చేయడానికి మందులు చాలా అవసరం. మందులను సరైన సమయంలో తీసుకోవాలి.  అలాగే వైద్యుల సలహా లేకుండా మందులు వాడటం అస్సలు మంచిది కాదు.  అయితే  కొన్ని మందులను డాక్టర్ల సలహా లేకుండా ఎలాంటి సంకోచం లేకుండా ఎక్కువ కాలం పాటు సమస్య అనిపించినప్పుడల్లా వాడుతూనే ఉంటారు. మరీ ముఖ్యంగా ఎక్కువకాలం పాటు మధుమేహం,  గ్యాస్ సమస్యలకు మందులు వాడుతూనే ఉంటారు. ఈ మందుల వాడకం వల్ల విటమిన్ లోపాలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అందులోనూ విటమిన్-బి12 చాలా అరుదుగా లభించే విటమిన్.  ఈ విటమిన్-12 విటమిన్ డయాబెటిస్,  అసిడిటి మందుల వాడకం వల్ల తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. డాక్టర్ దగ్గరకు వెళ్లి వైద్యుల వద్ద రెగ్యులర్ గా చెకప్ చేయించుకునే అలవాటు భారతదేశంలో చాలా తక్కువ. మరీ ముఖ్యంగా గ్యాస్ సంబంధిత సమస్యలు,  డయాబెటిస్ వంటి   సమస్యలకు ఎక్కువ సార్లు వైద్యులను కలవాల్సిన అవసరం లేదని అనుకుంటారు.  ఈ సమస్యలు ఉన్నప్పుడు ఒకసారి వైద్యులను కలిస్తే వారు రాసిచ్చిన మందులను అలా జీవితాంతం అయినా మింగుతూ సమస్యను నిద్రపుచ్చే ఆలోచనలో ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. ఈ మందులను డాక్టర్ ను కలిసిన ప్రతి సారి డోస్ తగ్గించడం, ఎక్కించడం జరుగుతుంది.  ఇది తెలియకుండా ఒకే డోస్ ను దీర్ఘకాలం వాడటం విటమిన్ స్థాయిల మీద ప్రమాదం చూపిస్తుంది.  గ్యాస్, డయాబెటిస్ కు సంబంధించిన మందులను సంవత్సరాల తరబడి డాక్టర్ సలహా లేకుండా రెగ్యులర్ గా వాడుతూ ఉంటే అది శరీరంలో విటమిన్-బి12 లోపానికి కారణం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. లక్షణాలు ఇవే.. అలసట,  తలతిరుగుడు,  తిమ్మిరి, చేతులు కాళ్లలో జలదరింపు వంటి సమస్యలు విటమిన్-బి12 లోపిస్తే వస్తాయి. మెట్లు ఎక్కడం కష్టంగా అనిపించడం,  మతిమరుపు వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. విటమిన్-బి12 ఎంత ఉండాలి.. నేషనవ్ ఇన్స్టిట్యూట్ ఆప్ హెల్త్ ప్రకారం సీరం,  ప్లాస్మా లో విటమిన్-బి12 స్థాయిలు 200 లేదా 250pg/ml కంటే తక్కువగా ఉంటే ల్యాబ్ రిపోర్ట్ లలో అది చాలా తక్కువగా ఉన్నట్టు.  ఇది విటమిన్-బి12 లోపాన్ని సూచిస్తుంది. గ్యాస్, డయాబెటిస్ మందులను ఎక్కవ కాలం వాడటం వల్ల పేగులలో  విటమిన్-12 శోషణ దెబ్బతింటుంది. అలాగే కడుపు ఆమ్లాన్ని కూడా తగ్గిస్తుంది. దీని వల్ల   ఆహారం నుండి ప్రోటీన్ విడుదల జరగదు.  అందుకే గ్యాస్, డయాబెటిస్ మందులను ఎక్కువ కాలం డాక్టర్ సలహా లేకుండా వాడటం మంచిది కాదని అంటున్నారు.                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే 5 అలవాట్లు..!

  ఈ రోజుల్లో చెడు జీవనశైలి,  తప్పుడు ఆహారపు అలవాట్లు  గుండె ఆరోగ్యంపై  చాలా చెడ్డ  ప్రభావాన్ని చూపుతాయి. అంతేకాకుండా మన చిన్న చిన్న రోజువారీ అలవాట్లు గుండెకు హాని కలిగిస్తాయి.  ఇవి క్రమంగా  గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. దీనితో పాటు నేటికాలంలో అన్ని సమస్యలకు మందులు వాడటం,  ఖరీదైన చికిత్సలు తీసుకోవడం  కూడా కొన్నిసార్లు  శరీరానికి హాని కలిగిస్తాయి.  అధిక వ్యాయామం కూడా గుండెపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.  ఇలా నేటి కాలంలో చాలా కారణాలుగా గుండె జబ్బుల ప్రమాదం క్రమేపీ పెరుగుతోంది.  గుండె ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే.. కొన్ని సులభమైన,  ఆరోగ్యకరమైన పద్ధతులను పాటించడం చాలా ముఖ్యం. ఇది శరీరానికి ఎటువంటి హాని లేకుండా  చేస్తుంది. అటువంటి 5 సులభమైన అలవాట్ల గురించి తెలుసుకుంటే.. భోజనం తర్వాత నడక.. భోజనం తర్వాత 10 నిమిషాల నడక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి భోజనం చేసిన వెంటనే కూర్చునే అలవాటును మార్చుకోవాలి.  ప్రతి భోజనం తర్వాత 10 నిమిషాల తేలికపాటి నడక చేయాలి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది,  బరువు పెరగకుండా నిరోధిస్తుంది. ఒమేగా-3 ఫ్యాట్స్.. రోజువారీ ఆహారంలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉండేలా చూసుకోవాలి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె,  మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఇది గుండె, మెదడు,  వాపును నియంత్రించడంలో సహాయపడుతుంది. సాల్మన్, చేపలు, అవిసె గింజలు,  వాల్‌నట్‌ల వంటి వాటి నుండి  ఒమేగా-3ని పుష్కలంగా పొందవచ్చు. నిద్ర.. మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ 7-9 గంటలు మంచి నిద్ర పొందడం ముఖ్యం. ఈ రోజుల్లో చాలా మందికి రాత్రిపూట ఫోన్ వాడటం,  టీవీ చూడటం అలవాటు కారణంగా నిద్ర సైకిల్ దారుణంగా దెబ్బతింటోంది. తక్కువ నిద్రపోవడం వల్ల ఊబకాయం, వ్యాధులు,  అలసట వంటి సమస్యలు వస్తాయి. ప్లాస్టిక్ నిషేధం.. మంచి గుండె ఆరోగ్యానికి ప్లాస్టిక్ వస్తువులను నివారించడం,  గాజు లేదా స్టీల్ కంటైనర్లు ఉపయోగించడం ముఖ్యం. ప్లాస్టిక్‌లో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి.  ఇవి హార్మోన్లకు,  శరీరానికి హాని కలిగిస్తాయి. ప్లాస్టిక్ రసాయనాలు నెమ్మదిగా శరీరంలో విషాన్ని వ్యాపింపజేస్తాయి. ఇది క్యాన్సర్,  ఇతర వ్యాధులకు కారణమవుతుంది. అందువల్ల ఆహారాన్ని నిల్వ చేయడానికి గాజు లేదా స్టీల్  పాత్రలు మంచివి. ఇవి  గుండె ఆరోగ్యానికి అలాగే మొత్తం ఆరోగ్యానికి సురక్షితమైనవి. బరువు.. మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి  బరువు,  BMI ని చూస్తే సరిపోదు. రక్త పరీక్షలపై కూడా శ్రద్ధ వహించాలి.  బరువు లేదా BMI కంటే రక్త పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం. LDL, CRP,  ఫాస్టింగ్ ఇన్సులిన్ వంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. తద్వారా గుండె ఆరోగ్యాన్ని పర్యవేక్షించవచ్చు. గుండె జబ్బులను నివారించడానికి ఇది ఉత్తమ మార్గం. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం వల్ల సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. ఆహారం.. గుండె ఆరోగ్యాన్ని బాగా ఉంచుకోవాలంటే  ఆహారంలో పండ్లు,  ఆకుపచ్చ కూరగాయలను చేర్చుకోవాలి. వాటిలో  గుండెను బలంగా,  ఆరోగ్యంగా ఉంచే పోషకాలు ఉంటాయి.  వాటిని సరిగ్గా తినకపోతే, అది గుండెకు హాని కలిగిస్తుంది. ఈ రోజుల్లో, చాలా మంది ఏదో ఒక విషయం గురించి ఒత్తిడి తీసుకోవడం చాలా సహజం అయిపోయింది. ఇది గుండెపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.                                        *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..

చదువుకీ గుండెపోటుకీ సంబంధం ఉంది!

  బాగా చదువుకోరా మంచి ఉద్యోగం వస్తుంది! అని చెబుతుంటారు తల్లిదండ్రులు. మంచిగా చదువుకుంటే నలుగురూ గౌరవిస్తారు అని హెచ్చరిస్తుంటారు శ్రేయోభిలాషులు. చదువుకుంటే విచక్షణ, విజ్ఞానం అలవడతాయి అని ఊరిస్తుంటారు పెద్దలు. కానీ బాగా చదువుకోండి నాయనా, మీకు గుండెపోటు రాకుండా ఉంటుంది అని చెబుతున్నారు పరిశోధకులు.   భారీ పరిశోధన ఆస్ట్రేలియా అభివృద్ధి చెందిన దేశమే కావచ్చు. కానీ అక్కడ గుండెపోటుతో చనిపోతున్నవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోందట. అక్కడ ప్రతి 27 నిమిషాలకీ ఒకరు గుండెపోటుతో మరణిస్తున్నారు. పరిస్థితి ఇలా అదుపు తప్పిపోవడంతో, గుండె ఆరోగ్యానికి సంబంధించి అక్కడ ఓ భారీ పరిశోధన మొదలైంది. ఇందులో భాగంగా 2,67,153 మంది ఆరోగ్యాలను పరిశోధకులు గమనించారు. వీరంతా కూడా 45 నుంచి 64 ఏళ్ల వయసువారే!   డిగ్రీ - గుండెపోటు డిగ్రీ చదివినవారితో పోలిస్తే, హైస్కూలుతో చదువుని ఆపేసినవారు గుండెపోటుకి లోనయ్యే ప్రమాదం ఎక్కువని పరిశోధనలో తేలింది. వీరు గుండెపోటుకి లోనయ్యే అవకాశం, ఏకంగా 150 శాతం ఎక్కువగా ఉన్నట్లు బయటపడింది. ఇక ఇంటర్మీడియట్‌ చదువుని ముగించినవారేమో దాదాపు 70 శాతం ఎక్కువగా గుండెపోటుకి లోనవుతున్నట్లు గమనించారు.   ఇవీ విశ్లేషణలు చదువుకీ, గుండెపోటుకీ మధ్య ఉన్న సంబంధం స్పష్టంగా తేలిపోవడంతో... అందుకు కారణం ఏమిటన్న విశ్లేషణలు మొదలయ్యాయి. ఉన్నత చదువుతో మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంటుంది. అలా ఆర్థికంగా మంచి స్థితిలో ఉండటంతో పోషకాహారాన్ని, మెరుగైన వైద్యాన్ని స్వీకరించే అవకాశం ఉంది. ఇక చదువు వల్ల ఆరోగ్యపు అలవాట్ల మీద, రకరకాల వ్యాధుల మీదా ఓ అవగాహన ఏర్పడే సౌలభ్యం ఎలాగూ ఉంటుంది.   ప్రయోగం వల్ల ఉపయోగం ఈ పరిశోధన ద్వారా చిన్నిపిల్లలకైతే  ‘బాగా చదువుకోండిరా బాబూ! మీ ఆరోగ్యాలు కూడా బాగుంటాయట’ అని చెప్పగలం. కానీ ఓ నలభై ఏళ్లు దాటినవారికి ఏం చెప్పాలి. అందుకనే ఈ పరిశోధన లక్ష్యం చదువు ఆవశ్యకత గురించి చెప్పడమే కాదు. చదువుకోనివారిలో అనారోగ్య సమస్యలు ఎక్కువని తేలితే... వారిలో తగిన అవగాహననీ, వైద్య సదుపాయాలనీ కల్పించే ప్రయత్నం చేయడం.     - నిర్జర.

చలికాలంలో నువ్వులు, అవిసె గింజలు తింటున్నారా? ఈ నిజాలు తెలుసుకోకుంటే నష్టపోతారు..!

మన శరీర ఉష్ణోగ్రత ప్రతి సీజన్‌లో నార్మల్ గా ఉంటుంది.  దాదాపు 37-38 డిగ్రీల సెల్సియస్  వరకు శరీర ఉష్టోగ్రత ఉంటుంది. అయితే చలికాలంలో బయటి ఉష్ణోగ్రత 5, 10, 15, లేదా 18 డిగ్రీల సెల్సియస్‌ గా నమోదు అవుతూ ఉంటుంది. ఇలాంటి  పరిస్థితిలో  శరీరం వెచ్చగా ఉండటానికి చాలా కష్టపడుతుంది. సరైన ఆహారం,  ఆరోగ్యకరమైన జీవనశైలి లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.చాలామంది చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి నువ్వులు, అవిసె గింజలు తినడానికి ఆసక్తి చూపుతారు. చాలామంది వీటిని లడ్డులుగా చేసుకుని తింటుంటారు.  ఇవి ఆరోగ్యానికి ఆరోగ్యం,  పోషకాలతో మెరుగ్గా ఉంటాయి.  ఆరోగ్యకరమైన ఆహారాలుగా కూడా పరిగణింపబడతాయి. అయితే ఈ లడ్డులను తయారు చేసుకుని తినేవారు ఖచ్చితంగా కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలని అంటున్నారు ఆహార నిపుణులు.  నువ్వులు, అవిసె గింజలు లాంటి పదార్థాలను తీసుకునే ముందు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి.  లేకపోతే చాలా నష్టం చూడాల్సి ఉంటుంది. ఇంతకీ ఆ విషయాలు ఏంటో తెలుసుకుంటే.. శీతాకాలంలో ఆరోగ్యకరమైన లడ్డులు తినడం ఒక ట్రెండ్. కానీ చాలామంది మొదట రుచికి, తరువాత ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. అందుకే లడ్డులు తయారుచేసినప్పుడల్లా రుచి  కంటే  ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం కోసమే వాటిని తింటున్నామని గుర్తుంచుకోవాలి. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. చలికాలంలో నువ్వులు,  అవిసె గిండలతో  చేసిన లడ్డులు రోజుకు ఒక చిన్న లడ్డూ సరిపోతుంది. దీని కంటే ఎక్కువ అవసరం లేదు. ఉదయం అల్పాహారం తర్వాత లేదా మధ్యాహ్నం సమయంలో  తినడం మంచిది.  సాయంత్రం స్నాక్‌గా కూడా ఆస్వాదించవచ్చు. రాత్రిపూట వీటిని తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రాత్రిపూట వాటిని తినకుండా ఉండటం మంచిది. ఒకే రకమైన లడ్డూ తినడం కంటే.. 3-4 రకాల లడ్డూలను తయారు చేసి, ఒక్కొక్క సారి ఒక్కొక్కటి తినడం మంచిది.   ఇవి ఆరోగ్యకరమైనవి. చాలామంది అన్ని రకాల  విత్తనాలు కలిపి లడ్డులు చేస్తుంటారు. ఇది మంచిది కాదు. ఈ లడ్డులను  తీసుకునేటప్పుడు పాలు తాగాల్సిన అవసరం లేదు. లడ్డులు  సులభంగా జీర్ణమైతేనే తీసుకోవాలి. వాటిని తిన్నప్పుడు జీర్ణసంబంధ సమస్యలు వచ్చినా,  గ్యాస్, ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలు వచ్చినా వాటిని తీసుకోకపోవడం మేలు. పిల్లలు,  వృద్ధులు నువ్వులు, అవిసె గింజలతో చేసిన  లడ్డులను తినకూడదు. ఎందుకంటే వారిలో   జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు ఈ రకమైన లడ్డులు   తినకూడదు. ఈ తప్పులు చేయకూడదు.. లడ్డులను కట్టడానికి పెద్ద మొత్తంలో నెయ్యిని ఉపయోగిస్తారు. దీని వల్ల వాటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. చక్కెరకు బదులుగా బెల్లం వాడటం వల్ల లడ్డు ఆరోగ్యంగా మారుతుంది, కాబట్టి మధుమేహం ఉన్నవారు కూడా దీనిని తినవచ్చనుకుంటారు. కానీ  చక్కెర స్థాయి అదుపులో లేనప్పుడు ఈ లడ్డులను తినడం మంచిది కాదు. తీవ్రమైన కాలేయం,  మూత్రపిండాల రోగులు ఈ లడ్డులను  వైద్యులు  లేదా డైటీషియన్‌ను సంప్రదించకుండానే తీసుకోకూడదు. ఈ లడ్డులను స్నాక్స్ గా చిరుతిండిగా తీసుకుంటారు. కానీ వీటిని స్నాక్స్ పేరుతో ఎక్కువ తినడం కంటే ఇవి శరీరానికి ఒక మంచి మెడిసిన్ అనుకుని తీసుకుంటే మంచిది. లడ్డులను ఇంట్లోనే తయారు చేసుకుని తినడం మంచిది. బయటి లడ్డుల తయారీలో కల్తీ పదార్ధాలు వాడే అవకాశం ఎక్కువ. ఇంట్లో ఈ లడ్డులు తయారు చేసేటప్పుడు పాలను కలపడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. కాబట్టి పాలను వాడకపోవడం మంచిది.                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  

సమయానికి తినకపోతే ఈ సమస్య రావడం పక్కా..!

ఆహారం శరీరానికి ఎంతో అవసరం.  తీసుకునే ఆహారం వల్లనే శరీరానికి శక్తి వస్తుంది. ముఖ్యంగా ఆహారంలో ప్రోటీన్,  కాల్షియం,  ఫైబర్, ఖనిజాలు చాలా అవసరం.  ఇవన్నీ ఆహారంలో ఉండటం ఎంత ముఖ్యమూ. ఆహారం తీసుకునే సమయం కూడా అంతే ముఖ్యం.  అందుకే ఆరోగ్య నిపుణులు కూడా సమయానికి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని చెబుతారు. అలా చేయకపోతే జీవక్రియకు ఆటంకం కలుగుతుంది. కేవలం జీవక్రియ ప్రభావితం  కావడమే కాదు.. సమయానికి ఆహారం తీసుకోకపోతే అది చాలా తీవ్రమైన సమస్యలను కూడా కలిగిస్తుందట.  సమయానికి ఆహారం తీసుకోకపోతే జరిగేదేంటో తెలుసుకుంటే..  మైగ్రేన్.. ఆహారం సమయానికి తీసుకోకపోతే  అది తలనొప్పి సమస్యగా మారుతుందట.  మరీ ముఖ్యంగా ఈ తలనొప్పి కాస్తా మైగ్రేన్ గా మారే అవకాశం ఉంటుందట. మైగ్రేన్ చాలా తీవ్రమైన తలనొప్పికి కారణం అవుతుంది.  ఆహారం సమయానికి తీసుకోకపోతే ఇది వారంలో రెండు నుండి మూడు రోజులు మైగ్రేన్ కారణంగా బాధపడాల్సి ఉంటుందని ఆహార నిపుణులు, వైద్యులు అంటున్నారు. మైగ్రేన్ వల్ల జరిగేది ఇదే.. ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల వచ్చే మైగ్రేన్ నొప్పి ఒక రోజు మాత్రమే ఉంటుందట.  కానీ దానివల్ల ఏకాగ్రత లేకపోవడం, దృష్టి లేకపోవడం, అలసట,  బలహీనత  మైగ్రేన్ ప్రభావాన్ని మరింత పెంచుతాయి.  దీని కారణంగా మైగ్రేన్ తరువాత  రెండు మూడు రోజులు ఏ పనిని ఏకాగ్రతగా చేయలేరు.. . సమయానికి తినాలి.. జాగ్రత్తగా, సమయానికి  తినడం వల్ల తలనొప్పి, దాని వల్ల కలిగే  దుష్ప్రభావాలను నివారించవచ్చు. అందుకే ఎన్ని పనులున్నా సమయానికి ఆహారం తినడాన్ని విస్మరించకూడదు. పెద్దవారు ఉదయం ఆఫీసుకు వెళ్ళేముందు,  పనికి వెళ్ళేముందు తినడం తప్పనిసరి.. అలాగే పిల్లలకు కూడా తప్పనిసరిగా పాఠశాలకు వెళ్ళేముందు ఆహారం పెట్టాలి.  ఎక్కువ సేపు టీవి, ఫోన్, కంప్యూటర్ వంటివి చూడటం వల్ల పిల్లలలోనూ, పెద్దలలోనూ తలనొప్పి, మైగ్రేన్ ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఆహారం దగ్గర నిర్లక్ష్యం చేయకూడదు.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

ఎక్కువగా చలిగా అనిపిస్తూ ఉంటుందా.. ఇదే అసలు కారణం!

చలికాలంలో చలి సహజమే.. కానీ కొందరికి సాధారణం కంటే ఎక్కువ చలి పెడుతూ ఉంటుంది. ఇంత చలి పెడుతుంటే ఇతరులు ఎలా భరిస్తున్నారో ఏంటో అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది.  మందం పాటి దుస్తులు దరించినా,  స్వెట్టర్లు వేసుకున్నా కూడా కొందరికి లోపల వణుకు పుడుతూనే ఉంటుంది.  అయితే ఇది చలి కారణంగా వచ్చే చలి కాదని, దీని వెనుక వేరే కారణాలు ఉంటాయని అంటున్నారు  వైద్యులు.  అసలు కొందరిలో అధికంగా చలి ఎందుకు పెడుతుంది? శరీరంలో కలిగే మార్పులు ఏంటి? తెలుసుకుంటే.. మానవ శరీరంలో  అంతర్గత ఉష్ణోగ్రతను నిర్వహించడానికి సంక్లిష్టమైన థర్మోర్గ్యులేషన్ వ్యవస్థను ఉపయోగించబడుతుంది. ఇది ప్రతి శరీరం దానికదే నిర్వహించుకుంటుంది. దీనికి నిర్దిష్ట విటమిన్లు,  ఖనిజాలు అవసరం. శరీరంలో ఈ పోషకాలు లోపించినప్పుడు రక్త ప్రసరణ ప్రభావితమవుతుంది,  జీవక్రియ మందగిస్తుంది. దీని వలన శరీరం తగినంత వేడిని ఉత్పత్తి చేయకపోవడం జరిగవచ్చు.  ఇలా జరిగితే మనిషిలో  సాధారణం కంటే చల్లగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇది చాలా వరకు రక్తహీనత లేదా థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో ఎక్కువగా ఉంటుంది. అందుకే చలికాలంలో వేడిగా ఉండటానికి ఇంటి వాతావరణాన్ని వెచ్చగా ఉంచడం కంటే తినే ఆహారం విషయంలో మార్పులు చేసుకోవడం మంచిదని అంటున్నారు వైద్యులు. అంతేకాదు.. కొన్ని పోషకాలు కూడా చలి ఎక్కువ కలగడానికి కారణం అవుతాయట. ఐరన్,  విటమిన్-బి12 లోపం.. చాలా చల్లగా అనిపించడానికి అత్యంత సాధారణ కారణం ఐరన్  లోపమట. ఐరన్ బాగుంటేనే  హిమోగ్లోబిన్‌ మెరుగ్గా ఉంటుంది. ఇది కణాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళుతుంది. అదే ఐరన్ లోపిస్తే ఆక్సిజన్ సరఫరా లోపించి చలి పెరగడానికి దారి తీస్తుంది.   విటమిన్ బి12 లోపం నరాలను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల చేతులు,  కాళ్ళు తిమ్మిరిగా ఉండటం,  చల్లగా ఉండటం జరుగుతుంది. మెగ్నీషియం,  ఫోలేట్ కూడా కండరాల సంకోచం,  శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి అవసరమైన శక్తిని  ఉత్పత్తి చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. చలి ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలంటే.. అకస్మాత్తుగా చాలా చలిగా అనిపిస్తే కాస్త  వ్యాయామం చేయడం మంచిది.  లేదంటే శరీరాన్ని  సాగదీయడం కూడా మంచి ఫలితం ఇస్తుంది. శారీరక శ్రమ రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది శరీరాన్ని వెంటనే వేడి చేస్తుంది. అలాగే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు లేదా అల్లం టీ తాగవచ్చు. అయితే అల్లం టీ ఖాళీ కడుపుతో తాగకూడదు. ఆహారంలో మార్పులు.. శరీరం వెచ్చగా ఉండటానికి  ఆహారంలో బెల్లం, వేరుశనగ, ఖర్జూరం,  మిల్లెట్ వంటి వెచ్చని ఆహారాలను చేర్చుకోవాలి. వెల్లుల్లి,  అల్లం తీసుకోవడం పెంచాలి.  ఇవి రక్త నాళాలను విస్తరిస్తాయి,  రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి.  ఆహారం తీసుకున్నప్పటికీ సమస్య కొనసాగితే, వైద్యుడిని సంప్రదించి,  వైద్యుల సలహా మేరకు మందులు లేదా చికిత్స తీసుకోవడం మంచిది.                                   *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  

బ్రేక్ఫాస్ట్ విషయంలో ఈ మిస్టేక్స్ చేశారంటే మీ బాడీ డ్యామేజ్ ని ఎవరూ ఆపలేరు..!

అల్పాహారం ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉదయాన్నే తీసుకునే ఆహారం.  ప్రతి రోజూ ఉదయం 8 నుండి 9 గంటలలోపు అల్పాహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని, రోజంతా చురుగ్గా ఉండటానికి సహాయపడుతుందని వైద్యులు, ఆహార నిపుణులు చెబుతుంటారు.  అందుకే అల్పాహారం ఆరోగ్యకరంగా, పోషకాలతో నిండి ఉండాలని కూడా చెబుతారు.  అందరూ ఒకే విధమైన బ్రేక్పాస్ట్ తీసుకోరు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఆహారం బ్రేక్పాస్ట్ లో తీసుకోవడం అలవాటుగా ఉంటుంది.  అయితే బ్రేక్పాస్ట్ విషయంలో చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల టోటల్ గా బాడీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుందని ఆహార నిపుణులు అంటున్నారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని కూడా చెబుతున్నారు. ఇంతకీ బ్రేక్ పాస్ట్ విషయంలో అస్సలు చేయకూడని మిస్టేక్స్ ఏంటి? అసలు బ్రేక్పాస్ట్ చేయడం వల్ల జరిగే మేలు ఏంటి? తెలుసుకుంటే.. బ్రేక్పాస్ట్ ప్రయోజనం.. అల్పాహారం లేదా బ్రేక్పాస్ట్  రోజులో మొదటగా తీసుకునే ఆహారం.  ఇది రోజంతా శక్తివంతంగా చురుగ్గా ఉండేందుకు సహాయపడుతుంది. జీవక్తియ రోజంతా చురుగ్గా ఉండేందుకు సహాయపడుతుంది. ఈ కారణంగా ఉదయాన్నే సరైన బ్రేక్పాస్ట్ చేయడం కూడా చాలా ముఖ్యంగా పరిగణించబడుతుంది. బ్రేక్పాస్ట్ విషయంలో చేసే తప్పులు.. ఖాళీ కడుపుతో టీ.. ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉంటే ఇది చాలా పెద్ద మిస్టేక్ అంటున్నారు వైద్యులు.  ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఆమ్లత్వం పెరుగుతుంది కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయని, డీహైడ్రేషన్‌కు కారణమవుతుందని,  ఆకలి కూడా  తగ్గుతుందని వైద్యులు అంటున్నారు. చపాతీ, పరాటా.. మీరు ప్రతిరోజూ బ్రేక్పాస్ లో చపాతీలు లేదా  పరాటాలు  తింటే  ఉదయాన్నే ఎక్కువ  కార్బోహైడ్రేట్లను తీసుకోవడానికి కారణం అవుతుంది. ఇది ప్రోటీన్ లోపానికి కూడా దారితీస్తుంది. ఉదయాన్నే చపాతీలు లేదా పరాటాలు తినడం వల్ల  కడుపు నిండినట్టు అనిపిస్తుంది  కానీ ఇది ఇన్సులిన్ స్పైక్‌కు కారణమవుతుందట.  మధ్యాహ్నం  తీసుకునే ఆహారం వల్ల  మరింత హెవీగా  మారుతుందని ఇది శరీరాన్ని బరువుగా ,  పనుల మీద ఆసక్తి మరల్చేలా మారుస్తుందని చెబుతున్నారు. ఇన్స్టంట్ ఓట్స్..  అల్పాహారంలో చాలామంది  ఇన్‌స్టంట్ ఓట్స్ తింటుంటారు.  ఇది చాలా ఆరోగ్యకరమని కూడా అనుకుంటారు. ఇందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది చాలా మంచిదని కూడా అనుకుంటారు.  కానీ ఈ ఓట్స్  అధికంగా ప్రాసెస్ చేసి ఉంటారు. ఇది చక్కెర స్థాయిలను పెంచుతుంది. బరువు తగ్గడానికి దీనిని తినకూడదని వైద్యులు సలహా ఇస్తున్నారు. టీ తో బిస్కెట్,  జ్యూస్.. ఉదయాన్నే  టీతో పాటు బిస్కెట్లు లేదా జ్యూస్‌లు తీసుకోవడం చాలా మందికి అలవాటు.  దీన్నే బ్రేక్పాస్ట్ గా సరిపేట్టేస్తుంటారు కూడా. అయితే వీటిలో శుద్ధి చేసిన పిండి, చక్కెర,  ట్రాన్స్ ఫ్యాట్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్ స్పైక్‌లకు కారణమవుతాయి,  ఊబకాయాన్ని పెంచుతాయి. బ్రేక్పాస్ట్ స్కిప్ చేస్తే.. చాలామంది డైటింగ్ పేరుతో ఉదయాన్నే బ్రేక్పాస్ట్ స్కిప్ చేస్తుంటారు.  బరువు తగ్గాలనే తాపత్రయంతో బ్రేక్పాస్ట్ స్కిప్ చేసి నేరుగా  బోజనం చేస్తుంటారు.  కానీ ఇది సరైన పద్దతి కాదని వైద్యులు చెబుతున్నారు.  బ్రేక్పాస్ట్ స్కిప్ చేస్తే జీవక్రియ మందగిస్తుందట. ఉదయం బ్రేక్పాస్ట్ స్కిప్ చేసే చాలామంది ఉదయం సమయంలో బిస్కెట్లు, జంగ్ ఫుడ్స్, ఇన్స్టంట్ డ్రింక్స్, ఇన్స్టంట్ ఫుడ్స్ తింటుంటారు. పైగా అవి చాలా లైట్ ఫుడ్స్ అని కూడా అనుకుంటారు.  ఇది చాలా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.                                     *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

రెడీ టూ యూజ్ ఫుడ్స్.. ఈ నిజం తెలిస్తే అస్సలు ముట్టరు..!

ఆహారం శరీరానికి ఎంతో అవసరం.  నేటి ఉరుకుల పరుగుల జీవితాలలో ఆహారం వండుకోవడానికి సమయం సరిపోక ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు.  ఇంట్లోనూ,  బయటా రెండు చోట్లా ఒత్తిడితో కూడుకున్న పనులు.  సమయాభావం కారణంగా చాలా సార్లు వండుకోవడం కష్టంగా మారుతుంది.  ఇలాంటి సందర్బాలలో బయట ఆహారం తినాలని  అనుకున్నా అవి ఖర్చుతో కూడుకుని ఉండటం తో వాటి వైపు వెళ్లాలన్నా కూడా భయపడతారు. ఇలాంటి వాళ్లను టార్గెట్ చేసుకుని వచ్చినవే ప్యాకేజ్డ్ ఫుడ్స్.. వీటిలో రెడీ టూ యూజ్  ఫుడ్స్ చాలా ఉంటున్నాయి.  సింపుల్ గా వేడి నీరు పోయడం లేదా వేడి చేయడం ద్వారా నిమిషాలలో ఆహారం రెడీ అవుతుంది.  పైగా మంచి మసాలాలతో రుచిగా ఉండటంతో రెడీ టూ యూజ్  పుడ్స్ కు మంచి డిమాండ్ కూడా ఉంది.  చిన్న పిల్లలు,  యువత ఎక్కువగా ఈ రెడీ టూ యూజ్ ఫుడ్స్ కు ప్రాధాన్యత ఇస్తుంటారు.  అయితే ఈ ఫుడ్స్ గురించి చాలామందికి తెలియని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అసలు రెడీ టు యూజ్ ఫుడ్స్ అంత రుచిగా ఎందుకుంటాయి? వీటిని తినడం వల్ల కలిగే ప్రమాదం ఏంటి? తెలుసుకుంటే.. రెడీ టూ యూజ్ ఫుడ్స్.. అల్యూమినియం సాల్ట్.. సాధారణంగా రెఢీ టూ యూజ్ ఫుడ్స్ అన్నీ ప్యాక్డ్ ఫుడ్స్ గానే ఉంటాయి. ఈ ప్యాక్స్ లోని ఆహారాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేలా వాటిలో హానికర రసాయనాలు కలుపుతారు. మరీ ముఖ్యంగా నిత్యం ఇంట్లో ఉపయోగించే కారం, పసుపు, మసాలలో అల్యూమినియం సాల్ట్స్ ను కలుపుతున్నారు. వీటివల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని,  వీటిని వాడటం వల్ల చిన్నపిల్లలు , వృద్దులు,  అప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రెడీ టు యూజ్ ఫుడ్స్ తో వచ్చే వ్యాధులు.. రెడీ టూ యూజ్ ఫుడ్స్ లో ఆలమ్ స్పైస్ కలుపుతారు.  ఇది కలిపిన మసాలాలు ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతిని నరాల బలహీనత, మతిమరుపు లాంటి సమస్యలు వస్తున్నాయి.  50ఏళ్లు దాటిన వారిలో మతిమరుపు రావడం ఈ ఆలమ్ స్పైస్ వాడటం వల్లే అని స్పష్టం చేస్తున్నారు. అసలేంటీ ఆలమ్ స్పైస్..   అల్యూమినియం సాల్ట్ నే ఆలమ్ స్పైస్ అని అంటారు. అల్యూమినియం పొటాషియం సల్పేట్ నే అల్యూమినియం సాల్ట్ అని అంటారు.  మసాలా దినుసులు పాడవకుండా దీన్ని కలుపుతుంటారు. దీని వల్ల మసాలా దినులు ఎక్కువ కాలం పాటూ రుచి,  స్వభావం,  రంగు  మారకుండా పురుగులు పట్టకుండా, అలాగే మసాలాలు ఉండలు కట్టకుండా సహాయపడుతుంది. ప్యాకింగ్ ఫుడ్స్ లో దీన్ని మోతాదుకు మించి వాడుతుండటం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి.  అందుకే వీలైనంత వరకు మసాలా పొడులను కూడా బయటి నుండి తెచ్చుకోవడం కంటే.. ఇంట్లోనే తయారు చేసుకుని వాడటం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

ఇనుప పాత్రలో  ఈ ఆహారాలను వండితే చాలా డేంజర్..!

ఇనుప పాత్రలలో వండిన పదార్థాలు   ఆరోగ్యానికి ఎంతో మంచివి. నాన్ స్టిక్,  అల్యూమినియం తో ఇనుప పాత్రలలో వండిన ఆహారం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.  ఇనుప పాత్రలలో వంట చేయడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, ఆహారంలో సహజంగా ఐరన్  ఉత్పన్నం అవుతుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి,  రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది. అయితే ఇనుప పాత్రలలో వండే ప్రతి ఆహారం  ఆరోగ్యానికి మంచి చేస్తుంది అనుకుంటే పొరపాటే. కొన్ని ఆహార పదార్థాలలో ఉండే  రసాయనాలు ఐరన్ తో  చర్య జరిపి, ఆహారం రుచి,  రంగును మార్చడమే కాకుండా, ఫుడ్ పాయిజనింగ్,  చర్మ వ్యాధుల వంటి తీవ్రమైన సమస్యలను కూడా కలిగిస్తుంది. అందువల్ల ఏ ఆహారాలను ఇనుప పాత్రలో వండకూడదు తెలుసుకోవడం ముఖ్యం. పుల్లని ఆహారాలు.. చింతపండు, టమోటా లేదా నిమ్మకాయ వంటి పుల్లని పదార్థాలు కలిగిన గ్రేవీలను ఎప్పుడూ ఇనుప పాత్రలో ఉడికించకూడదట. ఈ పదార్థాలలో సహజ ఆమ్లాలు ఉంటాయి. ఇవి ఇనుముతో వెంటనే రియాక్ట్ అవుతాయి. ఆహారానికి ఇనుము రుచిని ఇస్తాయి.  జీర్ణవ్యవస్థకు చికాకు కలిగిస్తాయి. పుల్లగా ఉండటం వల్ల ఇనుము ఆహారంలోకి ఎక్కువ మొత్తంలో లీచ్ అవుతుంది, ఇది శరీరంలో పాయిజన్ గా కూడా మారవచ్చు. పాలు, పెరుగుతో తయారు  చేసే పదార్థాలు.. పాలు, పెరుగు జోడించి తయారు చేసే ఆహారాలు,  పాయసం, కస్టర్డ్ వంటి వంటకాలను ఇనుప పాత్రలలో వండటం నిల్వ చేయడం మంచిది కాదు.    ఇనుప పాత్రలు చాలా వేడిని ఉత్పత్తి చేస్తాయి, దీని వలన పెరుగు లేదా పాలు విరుగుతాయి. ఇనుము పాత్ర  ఈ తెల్లగా కనిపించే వంటకాలను నల్లగా లేదా నిస్తేజంగా మారుస్తాయి. దీని వలన వాటి రుచి,  పోషక విలువలు రెండూ ప్రభావితం అవుతాయి. రాజ్మా,  శనగలు..  తరచుగా ఇనుప పాత్రలో రాజ్మా  బీన్స్, శనగపప్పు వండుతుంటారు. ఇనుప పాత్రలు అన్ని వైపులా సమానంగా వేడెక్కవు, ఈ భారీ ధాన్యాలు కొన్ని ప్రాంతాలలో ఉడికిపోతాయి,  మరికొన్ని  తక్కువగా ఉడుకుతాయి. సరిగా ఉడకని బీన్స్ లేదా శనగపప్పు తినడం వల్ల తీవ్రమైన ఉబ్బరం,  గ్యాస్ వస్తుంది. వాటిని ప్రెజర్ కుక్కర్ లేదా స్టెయిన్‌లెస్ స్టీల్ కుండలో ఉడికించడం ఉత్తమం. వెనిగర్ తో చైనీస్ ఫుడ్స్.. ఈ రోజుల్లో వెనిగర్‌ను చౌ మెయిన్,  పాస్తా వంటి వంటకాల్లో  విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. వెనిగర్ అనేది బలమైన ఆమ్లం.  ఇది నిమ్మకాయ, చింతపండు లాగా ఐరన్ తో చాలా తొందరగా రియాక్ట్  అవుతుంది.  ఇలా వండే ఆహారం సేఫ్ కాదు. వెనిగర్ ఉన్న ఏదైనా వంటలకు ఐరన్  కంటే నాన్-స్టిక్ లేదా స్టీల్ పాత్రలను ఎంచుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ముఖ్యంగా బయట చైనీస్ ఫుడ్స్ తినేటప్పుడు వెనిగర్ వాడుతున్నారా,  ఏ పాత్రలు వాడుతున్నారు  తెలుసుకోకుండా పొరపాటున కూడా తినకండి.                                *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...