డేంజర్ బెల్స్ కొట్టే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్!

మూత్రపిండాల నుండి విసర్జింపబడే మూత్రము మూత్రనాళము, మూత్రాశయం ద్వారా మాత్రమే బయటకు విసర్జింపబడుతుంది. ఈ మూత్ర అవయవాలు చాలా తరచుగా ఇన్ఫెక్షన్ గురవుతుంటాయి. కొన్నిసార్లు మూత్ర అవయవాల్లో రాళ్ళు, లేదా పోస్ట్రేట్ గ్రంథి వాపు వలన మూత్రనాళాల దారి సంకోచించి ఇన్ ఫెక్షన్ వస్తుంటుంది. అలాంటపుడు ఆ సమస్యను పరిష్కరించవలసి వుంటుంది. మూత్రనాళాలు ఇన్ఫెక్షన్కు గురికాకుండా మూత్రము ఆమ్ల లక్షణాన్ని కలిగి వుంటుంది. దేహరక్షణ వ్యవస్థ పటిష్టంగా వున్నంతకాలం ఏ ఇన్ఫెక్షన్ సోకదని గుర్తుంచుకోవాలి.  ఇన్ఫెక్షన్లో అక్యూట్ మరియు క్రానిక్ అని రెండు రకాలు. అక్యూట్ రకంలో ఇన్ఫెక్షన్ అకస్మాత్తుగా వచ్చి కొన్ని రోజులు బాధ పెట్టి, పూర్తిగా నయమవుతుంది. కొన్ని యాంటీ బాక్టీరియల్ మందులతో వ్యాధి ఆగుతుంది. కొన్నిసార్లు అదే ఇన్ఫెక్షన్ అశ్రద్ధ చేసినట్లయితే క్రానిక్ అవుతుంది.  యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ లో లక్షణాలు:-  మూత్రం పోసే టప్పుడు మంట రావటం, మూత్రం సాఫీగా రాక కొద్ది కొద్దిగా రావటం, నొప్పి కడుపు వరకు పాకినట్టవటం జరుగుతుంది. మూత్రం కొద్దిగా పసుపు పచ్చగా లేదా ఎరుపు రంగుగా రావచ్చు. ఇన్ఫెక్షన్ మోతాదు మించినట్టయితే పెద్ద పెట్టున, చలిజ్వరం రావటం, వణకటం వుంటాయి. వ్యాధి లక్షణాలు సేకరించి, మందును ఎంపిక చేసి వాడినట్టయితే అక్యూట్ యురినరీ ఇన్ఫెక్షన్ పూర్తిగా నయమవుతుంది. నీరు అధికంగా తీసుకోవాలి. క్రానిక్ ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గించటానికి కొంత సమయం పడుతుది. ఇది ముఖ్యంగా 'గోనోకోకల్ ఇన్ఫెక్షన్' వల్ల వస్తుంది. ఇన్ ఫెక్షన్ క్రానిక్ అయినపుడు మూత్రనాళంలో స్ట్రిక్చర్స్ ఏర్పడుతాయి. మూత్రనాళంలోని జిగురు పొర కలసిపోయి మూత్రనాళం లోపలి పరిమాణం తగ్గుతుంది. మూత్రం పోసే దారి సన్నగా మారి మూత్రం పోసేటప్పుడు రోగి కడుపు కండరాలతో వత్తిడి చేయవలసి వుంటుంది. కొన్నిసార్లు మూత్రం ధార చీలినట్టుగా వస్తుంది. స్ట్రక్చర్ పెద్దదయినట్టయితే మూత్రనాళం పూర్తిగా మూసుకుపోయి మూత్ర విసర్జన ఆగిపోతుంది. మూత్రాశయం ఉబ్బుతుంది. ఆ పరిస్థితుల్లో శస్త్ర చికిత్సచేసి మూత్రాశయ ద్వారం తీయవలసి వుంటుంది. ఇన్ఫెక్షన్ ప్రారంభ దశలో వున్నప్పుడే మందులు వాడినట్టయితే ఇన్ఫెక్షన్ పూర్తిగా నివారించుకోవచ్చు. స్ట్రక్చర్లు ఏర్పడితే కూడా దీర్ఘకాలిక మందులను ఎంపిక చేసి వాడినట్టయితే శస్త్ర చికిత్స అవసరం లేకుండా నయం చేసుకోవచ్చు. క్రానిక్ ఇన్ఫెక్షన్  పూర్తిగా నయం చేయటంలో కొంత సమయం పడుతుంది. ప్రోస్ట్రేట్ గ్రంథి ఇన్ఫెక్షన్ కు గురవటం వలన, లేదా వాపు వలన కూడా మూత్రం ఆగిపోవటం, ఇన్ఫెక్షన్ రావటం జరుగుతుంది. ముఖ్యంగా 60 ఏళ్ళు పైబడినవారిలో ప్రోస్ట్రేట్ గ్రంథి వాపు రావటం జరుగుతుంది. దీనికి కాథటరైజేషన్ చేస్తుంటారు. తాత్కాలికంగా నయమనిపించినా మళ్ళీ మూత్రనాళం సంకోచిస్తుంది. ప్రోస్ట్రేట్ గ్రంథిలో ఒక్కొక్కసారి క్యాన్సర్ కూడా వస్తుంది. తగిన పరీక్షలు చేయించుకుని క్యాన్సర్ కణాలు వున్నాయో లేదో నిర్ణయించవలసి వుంటుంది. ఇన్ని ప్రమాదాలు ఉంటాయి కాబట్టే.. ఇన్ఫెక్షన్ల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి.                                   ◆నిశ్శబ్ద

ఆకలి కావడం లేదా?? అయితే ఇదిగో పరిష్కారాలు..

మనిషిని నిత్యం వేధించే సమస్య ఆకలి. ఇది పూట పూటకు పుడుతుంది. దాన్ని తృప్తి పరచకపోతే మనిషి శరీరాన్ని బాధకు గురిచేస్తుంది. అయితే కొందరిలో ఈ ఆకలి అధికంగా ఉంటుంది. ఎంత తిన్నా కొద్దిసేపటికే ఆకలి మొదలవుతుంది. దీనివల్ల అధికబరువు, మధుమేహం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. ఇకపోతే ఆకలి లేకపోవడం అనేది మనుషుల్ని హింసించే సమస్య. ఇలా ఆకలి లేకపోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి, పోషకాలు, అవసరమైన విటమిన్లు మొదలైనవి లభించక పోషకాహార లోపంతోను, బలహీనత తోనూ ఇబ్బంది పడతారు.  ఆకలి తగ్గిపోవడం అనే సమస్య రావడానికి అనేక కారణాలతో ఉంటాయి. ఫ్యాట్స్ ఎక్కువగా వున్న ఆహారపదార్ధాలను అతిగా తినడం, ప్యాక్ చేసిన పదార్థాలు,  రెడి టూ ఈట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ మొదలైనవి తీసుకోవడం వల్ల ఆకలి తగ్గిపోతుంది. అలాగే  కొన్ని జీర్ణాశయ, జీర్ణవాహికల వ్యాధులలోనూ ఆకలి లేక పోవచ్చును. కాబట్టి "ఆకలిలేదు!” అని అనుకొనేవారు. ముందుగా అన్ని వైద్యపరీక్షలు చేయించుకోవాలి. ఏదైనా వ్యాధి ఉన్నట్టు నిర్ధారణ అయితే వైద్యుల సూచనల ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవాలి. అదే ఎలాంటి వ్యాధి లేదని నిర్ధారణ అయితే ఆహారం తీసుకోవడం, లైఫ్ స్టైల్ వంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  భోజనానికి అరగంట ముందుగా కొద్దిగా అల్లం రసం తాగితే బాగుంటుంది, ఒకవేళ అల్లం అందుబాటులో లేకపోతే వాము కొద్దిగా  నమలి తిన్నా మంచి ప్రయోజనమే. ఇవి రెండూ ఆకలిని పెంచుతాయి. అలాగే జీర్ణాశయాన్ని శుద్ధి చేస్తాయి. చాలమందికి టీ.. కాఫీ.. లాంటివి గంటకు ఒకసారి, పూటకు ఒకసారి తీసుకోవడం బాగా అలవాటు. అలాంటి అలవాటు ఉన్నవారు దాన్ని తగ్గించుకోవాలి. అదేవిధంగా తీపి పదార్థాలు తినడం అంటే కొందరికి చెప్పలేనంత ఇష్టం. వాటిని కూడా తగ్గించుకోవాలి. ఇవి ఆకలి మీద చాలా దారుణమైన ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే జీర్ణాశయ గోడలను బలహీనం చేస్తాయి. ఏ అనారోగ్యం వచ్చినా, ఏ డాక్టర్ దగ్గరకు వెళ్లినా, మన పెద్దలు అయినా చెప్పేది ఒకే మాట. సమయానికి తినాలి అని. ఆకలి లేదు అని వంకతో ఆహారం తీసుకోవడం అస్తవ్యస్తం అయితే అది అలాగే అలవాటుగా మారిపోయి జీర్ణశయాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. అలాగే ఆకలి లేకపోయినా.. సమయాన్ని చూసుకుని అధికంగా పొట్టలోకి వేయకూడదు. మితంగా ఆహారం తీసుకుంటూ ఉంటే ఆకలికి అదే ఒక మంచి ఔషధంగా మారుతుంది.  ఆహారంలో అన్నం ఎక్కువ ఉండకూడదు. అన్నం తక్కువ, పెరుగు, ఆకుకూరలు, కాయగూరలు,  పీచుఎక్కువగావున్న పదార్థాలను అధికముగా తీసుకొంటూ ఉండాలి. ఇలా చేస్తే జీర్ణక్రియ బాగా జరుగుతుంది, ఆకలి కూడా సమయనికి తగ్గట్టు అవుతుంది.  వేపుడులు, మసాలా పదార్థాలు, ఫ్యాట్ ఎక్కువగా ఉన్నవి, నూనె అధికంగా ఉన్నవి తీసుకోకూడదు. అవి జీర్ణాశయనికి చేటు చేస్తాయి.  పై జాగ్రత్తలతో పాటుగా.... అవసరమైతే వైద్య సల హాల ప్రకారము జీర్ణశక్తికి ఉపకరించే కొన్ని “టానిక్స్” వాడవచ్చు. ఆకలి దగ్గర మాత్రం నిర్లక్ష్యం చేయకండి.                                      ◆నిశ్శబ్ద.  

బరువు చెప్పే బండెడు నిజాలు!

ఈకాలంలో అధికశాతం మందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. మనలో చాలామంది కేజీల కొద్ది బరువు పెరగడం చాలా సులభం. కానీ అదే బరువును తగ్గించుకోవాలంటే చాలా శ్రమపడతారు. పైనున్న తాతలు దిగిరావాలి ఈ బరువు తగ్గాలంటే.. అన్నంత కష్టతరంగా ఫీలవుతారు. అయితే  బరువుకు ఆహారానికి పెద్ద సంబంధమే ఉంది. మనం రోజుకు ఎంత తింటున్నాం?? రోజుకి మనకెన్ని కేలరీలు అవసరమవుతాయి??  ఈ ప్రశ్నకు జవాబు కోసం చాలామంది ఎంతో వెతుకుతూ ఉంటారు. అయితే దీనికి సమాధానం మనం రోజూ చేసే పని ఎటువంటిది??  మన  వయస్సు ఎంత, మన శరీర వ్యవస్థ ఎలాంటిది వంటి  అనేక విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే తీసుకునే ఆహారం ఎప్పుడూ చేసే పని, శరీర వ్యవస్థను బట్టి ఉండాలి.  కాయకష్టం చేసే వడ్రంగికి రోజుకి 5,000 కేలరీల అవసరం కావచ్చు. పని సవ్యంగా నడవటానికి అతడు పుష్టిగా తినాలి. మరోవంక చూస్తే, రోజంతా ఓ టేబుల్ ముందు కూర్చుని పని చేసే ఉద్యోగికి రోజుకు 2,200 కేలరీలే కావలసి వుంటుంది. అలాగే రోజంతా ఇంటి చాకిరితో సతమతమయ్యే అతని భార్యకు 2,500 కేలరీల అవసరమై వుంటుంది. అదే ఒక ఆఫీస్ పక్కకు కదలకుండా పనిచేసే ఉద్యోగికి  రోజూ 1,800 కేలరీలు అయినా సరిపోతాయి.   ఈ కేలరీల కథ అంతా, మనం ఎంత చురుకుగా వున్నామనే దాన్ని బట్టి వుంటుంది. పాతికేళ్ళ వయసులో సామాన్యంగా ఎటువంటి ఇబ్బందీ లేకుండానే మనం కేలరీలను సులభంగా కరిగించెయ్యగలుగుతాము. కానీ ముప్పై ఐదేళ్ళప్పుడు పరిస్థితిలో మార్పు ప్రారంభమవుతుంది. అప్పుడు మనలో చురుకుపదనం తక్కువ. ఎక్కువ సేపు కూర్చుంటాం. వీలయినంత వరకూ ఒళ్లు అలసటకు గురికాకుండా వుండేందుకు అనువుగా శ్రమలేని జీవితాన్ని గడపడానికి, రోజులో పనులు సులభతరం చేసే  పరికరాలను వుపయోగిస్తూ వుంటాము. అందుకు తగినట్టుగా మన పనికి అవసరమైన తిండి ఎంత సరిపోతుంది అని మనమే చూసుకోవాలి. అంతేకానీ, ఇతరులు అలా ఉంటున్నారు, అది ఫాలో అవుతున్నారు అని వాటిని పట్టుకుని వేలాడకూడదు.. ఒక వ్యక్తి బరువులో మార్పు కలిగించే పరిస్థితులు ఇంకా ఏమైనా వున్నాయా అని ఆలోచిస్తే..  నిశ్చయంగా వున్నాయని మనకు స్పష్టమవుతోంది. చర్మం క్రింద వున్న ధాతువులలో నీరు చేరడం వల్ల బరువు ఎక్కువ కావచ్చు. ఉదాహరణకు - గుండె పనితీరు తప్పినప్పుడు దానికి గురుతుగా కాళ్లూ, ఇతర అవయవాలూ వాపు కనిపించవచ్చు. ఇలానే కొన్ని రకాల మూత్ర పిండపు వ్యాధులు కూడా. ఈ లోపాలున్న వ్యక్తులు ఉప్పు అధికంగా వాడకూడదు. అయితే, సామాన్యంగా చాలామంది బరువెక్కడానికి కారణం ఇదికాదు. అసలు విషయం, ఎక్కువగా తినడమే. తామేమీ ఎక్కువ తినడం లేదని అంటుంటారు. కానీ చేస్తున్న పనికి మించి ఎక్కువ తింటేనే బరువు పెరుగుతారు.   ఏది ఏమైనా సరే.. మీ బరువు ఎక్కువగా  వున్నట్టయితే మీకొక హెచ్చరిక చెయ్యాలిప్పుడు.  ఇరవై సంవత్సరాలకు పైగా అధిక క్రొవ్వును ఇలా మోసుకు తిరుగుతూ వుంటే, తరువాత జీవిత దశలో, ఈ శ్రమాధ్యికం వల్ల గుండె, మూత్రపిండాలు పని చెయ్యకపోవచ్చు. వాటికి సంబంధించిన జబ్బులు సులువుగా రావచ్చు.  కాబట్టి అధిక బరువు అత్యంత ప్రమాదకరం అన్నమాట ఎన్నటికీ మరువకూడదు. ఇప్పటికైనా బరువు చెప్పే నీతులు కాస్త వినండి.                                    ◆నిశ్శబ్ద.

తలనొప్పికి ఇన్ని కారణాలు ఉన్నాయా!

చాలామంది సహజంగా చిరాకు, అసహనంతో ఉన్నప్పుడు ఏమైంది అని అడిగితే తలనొప్పి అనే మాటను ఎక్కువశాతం చెబుతుంటారు. అయితే వస్తున్న తలనొప్పి ఏమైనదీ తేలక తికమక పడటం కూడా అంతే సహజం.   తలనొప్పికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయి.  1. మానసిక కారణాలు 2. మెదడులోపల కంతులు ఏర్పడటం 3. యరీమియా, డయబిటిస్ వంటి కారణాలు 4. మైగ్రేన్, టెన్షన్ తలనొప్పులు, ఇతర శారీరక బాధలవల్ల కలిగే తలనొప్పులు. మానసికంగా తలనొప్పి ఉందని బాధపడే వ్యక్తి రోజులు, వారాల తరబడి తలనొప్పితో బాధపడతాడు. పెద్దగుడ్డ తీసుకుని తలచుటూ గట్టిగా బిగించి కట్టుకుంటాడు. ఇలా కట్టుకోవడానికి నొప్పికంటే ప్రెషర్ (ఒత్తిడి)కారణం. డిప్రషన్, ఆందోళన, ఆవేశం వల్ల వచ్చే తలనొప్పులు మామూలుగా వాడే తలనొప్పి టాబ్లెట్స్ తో తగ్గవు. ప్రతీ తలనొప్పి ప్రమాదకరమైంది కాదు మెదడులో ప్రెషర్, కంతివల్ల కొందరిలో తలనొప్పి రావడం వుంటే మరికొందరిలో జ్వరంవల్ల, అతిగా మద్యం సేవించడం వల్ల తలనొప్పి కలుగుతుంది. ముఖ్యంగా మద్యం మైకం వదిలే సమయంలో (హాంగ్ ఓవర్ ) తలనొప్పి అనిపిస్తుంది. తలకి దెబ్బ తగలడం, వడదెబ్బ తగలడం, మెదడుకి రక్తం సరఫరా తగ్గడం వంటి పరిస్థితుల్లో కూడా తలనొప్పి తీవ్రంగా ఉంటుంది.  మైగ్రేన్ తలనొప్పిని తెలుసుకోవడమెలా?  మైగ్రేన్ తలనొప్పి సాధారణంగా వంశ పారం పర్యంగా వస్తుంది. తలకి ఒకవైపే నొప్పి అనిపిస్తుంది. ఎండ చూసినకొద్దీ నొప్పి ఎక్కువ అవుతుంది. తలనొప్పి వచ్చే ముందు కంటిముందు రింగులు రింగులు లాగానో, మరోలాగానో కనబడతాయి. తలనొప్పి రావడానికి 10-15 నిమిషాలు ఇటువంటి చికాకు పరిస్థితి ఉండవచ్చు. ఆ తరువాత ఒక చెంపన నొప్పి మొదలవుతుంది. నిదానంగా రెండవ వైపుకి కూడా నొప్పి అనిపించవచ్చు. ఈ నొప్పి చాలా తీవ్రంగా వుంటుంది నొప్పి ఎక్కువైన తరువాత వాంతి అవవచ్చు. కొందరు ఈ నొప్పికి తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోతారు. మైగ్రేన్ తలనొప్పి 4 నుంచి 43 గంటల పాటు వుంటుంది.  కళ్ళజోడుతో తలనొప్పి పోవచ్చు!  కొందరికి కళ్ళకి సంబంధించిన దోషం ఉండి తలనొప్పి వస్తుంది. వీరికి కళ్ళు పరీక్ష చేసి కళ్ళజోడు పెడితే తలనొప్పి తగ్గిపోతుంది. గ్లాకోనూ అనే కళ్ళవ్యాధి వల్ల కూడా తలనొప్పి వస్తుంది. మెడ దగ్గర కండరాలు, లిగమెంట్లు బిగదీసుకోవడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. సైనసైటిస్ వల్ల కూడా. తలనొప్పి వస్తుంది. తలనొప్పిలో తేడాలు  తలనొప్పి రావడానికి ఎన్నో కారణాలు, మానసిక ఆందోళన, ఒత్తిడి, మానసిక వ్యాధుల వల్ల తలనొప్పి రావడం ఉంటే, మెదడు వ్యాధులు, మెదడులో కంతులవల్ల తలనొప్పి వస్తుంది. రక్తనాళాల వ్యాకోచ సంకోచాలవల్ల తలనొప్పి వస్తే, విషజ్వరాలు, యబియా, డయబిటిస్ వంటి పరిస్థితుల్లో తలనొప్పి వస్తుంది. ఏ తలనొప్పో తేల్చుకోవడమెలా? తలనొప్పి ఎలా ప్రారంభమవుతున్నదీ, ఎంతసేపు ఉంటున్నదీ, నొప్పి ఏ రకంగా వున్నదీ, ఏ చోట ఎక్కువ అనిపిస్తున్నదీ, వదలకుండా వుంటున్నదా, వచ్చీ పోతూ ఉందా తలనొప్పి ఎప్పుడు ఎలా ఎక్కువ అవుతున్నదీ, వంశంలో ఇంకెవ్వరికైనా ఈ సమస్య ఉందా అనే అంశాలని దృష్టిలో ఉంచుకుని పరిశీలించడం అవసరం. తలనొప్పి సంగతి అంతుపట్టనప్పుడు తక్కిన సాధారణ పరీక్షలతోపాటు సి. టి స్కానింగ్, యం. ఆర్. ఐ. పరీక్షలు, రక్త పరీక్షలు జరపాలి. తలనొప్పే కదా అని తేలిగ్గా తీసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.                                  ◆నిశ్శబ్ద.

పొట్టలో నీరు వల్ల ఇన్ని రోగాల రిస్క్ ఉందా?

ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య పొట్ట పెరగడం. దీన్నే అందరూ పొట్ట పడింది అంటూ ఉంటారు. కొందరికి పొట్టలో నీరు చేరుతుంది. పొట్టలో 12 లీటర్ల నీరు చేరితే తప్ప నీరు చేరినట్లు స్పష్టంగా కనబడదు. పొట్టలో నీరు చేరడాన్ని 'ఎసైటిస్' అంటారు. జీర్ణకోశం నుంచి లివర్ కి వెళ్ళే రక్తనాళాలకి ఏదైనా అడ్డంకి ఏర్పడితే పొట్టకి నీరు చేరడం అతి సహజం. ముఖ్యంగా లివర్ కుదించుకు పోయినప్పుడు (సిర్రోసిస్ లివర్) పొట్టకి నీరు చేరుతుంది. గుండె పెరిగినప్పుడు, మూత్ర పిండాలు దెబ్బతిన్నప్పుడు పొట్టకి నీరు వస్తుంది. కడుపులో క్షయవ్యాధి, క్యాన్సర్, ఇతర వ్యాధులు వచ్చినప్పుడు కడుపుకి నీరు చేరడం సహజం. లివర్, పాన్ క్రియాస్, జీర్ణకోశం, గర్భకోశం, అండాశయాలకి టి. బి కేన్సర్ వచ్చినప్పుడు సాధారణంగా పొట్టకి నీరు చేరు తుంది. కొందరికి పొట్టకి నీరు చేరడంతోపాటు కాళ్ళకి, ముఖానికి, శరీరం అంతటికీ కొద్దో గొప్పో వీరు వస్తుంది ఈ పరిస్థితిని'నెఫ్రొటెక్' సిండ్రోమ్' అనుకోవచ్చు.  ముందుగా కాళ్ళకి వీరు కనిపించి, ఆ తరువాత పొట్టకి నీరు చేరడం అంటే గుండె పెరగడంవల్ల అని అనుమానించవచ్చు. పొట్ట బానలాగా తయారై పొట్టకి విజరీతంగా నీరు మరి కొద్దిపాటి నీరు కాళ్ళకి వుంటే 'సిర్రోసిస్ లివర్' అనుకోవచ్చు. పొట్టకి నీరు చేరడమే కాకుండా పచ్చకామెర్లు (జాండిస్) కూడా వుంటే పోర్టల్ వెయిన్ ఆల్ స్ట్రక్షన్ అను కోవచ్చు. పోర్టర్ వెయిన్ అల్సక్షన్లో రక్తంలో ప్రోటీను శాతం బాగా తక్కువగా వుంటుంది. ఏ సమస్య ఎలా ఉంటుంది?? సిర్రోసిస్ :- సిర్రోసిస్ లివర్ (లివర్డి స్యూ పూర్తిగా పాడై కుదించుకుపోవడం) ఉన్న వ్యక్తి అంతకు ముందు మధ్యం అతిగా సేవించడం జరిగి ఉండవచ్చు లేదా అంతకు ముందు ఏదైనా ఇన్ ఫెక్షను వచ్చి కాలేయం బాగా  దెబ్బతిని ఉంటుంది. కొందరిలో అంతకు ముందు రక్తం వాంతి అవడం, విరోచనంలో నల్లగా రక్తం పోవడం, కామెర్లు రావడం ఉంటాయి. కోసిస్ పరిస్థితి ఉన్న వారి బుగ్గలు ఎరుపుగా వుంటాయి. బొడ్డు దగ్గర రక్తనాళాలు ఉబ్బి స్పష్టంగా కనబడతాయి. వికారం, ఆకలి లేకపోవడం వుంటాయి. కొందరిలో మొదట్లో లివర్ స్క్రీన్ పెరిగి కనబడటుంది. సిర్రోసిస్ లివర్ లో కొందరికి పచ్చ కామెర్లు ఉంటాయి. మూత్రపిండాల వ్యాధి : మూత్రపిండాల వ్యాధి వల్ల పొట్టకి నీరు చేరటమేకాకుండా, ముఖానికి, కాళ్ళకి . నీరు చేరుతుంది. మూత్రంలో ఆల్బుమిన్ కనబడుతుంది. మైక్రోస్కోప్ పరీక్ష చేస్తే ఎపిథీలియల్ కాస్ట్స్ ఉంటాయి. గుండెజబ్బు:  గుండె పెరిగినప్పుడు సిరలన్నీ ఉబ్బుతాయి. మెడదగ్గర రక్తనాళాలు ఉబ్బి కనబడతాయి. కాలేయం ఉబ్బుతుంది. గుండె పెరిగినప్పుడు ముందు కాళ్ళకి, ఒంటికి నీరు కనబడి ఆ తరువాత పొట్టకి నీరు కనబడుతుంది. గుండె పెరగగా పొట్టకి నీరు చేరిన పరిస్థితిలో వ్యక్తి ఆయాసపడటం వుంటుంది. 'థాలస్ ఎసైటిస్' లో పొట్టలో చేరిన నీరు పాల లాగా కనబడుతుంది. నీరు పాలలాగా కనబడటానికి కడుపులో వున్న ప్రధాన ఎంఫాటిక్ నాళానికి అడ్డంకి ఏర్పడటం లేదా క్యాన్సర్ కణాలు చేరడం కారణం. బోదకాలు వున్న వారిలో కూడా బోద వ్యాధివల్ల పొట్టలో ఖైల్ చేరి నీరు పాలలా కనబడుతుంది. ఇన్ని రకాల సమస్యలను మీరే డిసైడ్ చేసుకోకుండా వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.                                  ◆నిశ్శబ్ద

ప‌న‌స పండు త‌ర‌చూ తింటే..!

కోరోనా తరువాత శరీరం లో రోగనిరోదక శక్తి తగ్గింది కాబట్టి.మీరు డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలని డాక్టర్స్ సూచించారు. గరీబోడికి బాదం, పిస్తా, కర్జూరం కొనాలంటే కాస్త ఇబ్బందే అందుకే అతి తక్కువ ఖర్చుతో కూడిన గరీబోడి బాదాం ఏది అని కదా మీ ప్రశ్న అదే పనస పండు. పనస పండు పై భాగం లో ముళ్ళు ముళ్ళు గా ఉన్నప్పటికీ లోపల ఉండే పనస తొనల సువాసన తొనలను తిన్నకొద్దీ తినాలని అనిపిస్తుంది.పనసపండు చూసేందుకు అందం గానూ ఉండే తోన అందులో ఉండే గింజలో అద్భుతమైన పోషక విలువలు ఉన్నాయంటే ఎవరూ నమ్మరు. పనస పండులో విటమిన్ బి,లేదా రక్తహీనత ఉన్నవాళ్ళకి పనసపండు శ్రేష్టం.మీ చర్మం అందంగాను జుట్టు ద్రుడంగాను ఉండాలంటే పనసపండు కు మించినది లేదని న్యుట్రీషియనిస్ట్ లు అంటున్నారు. న్యుట్రీషియనిస్ట్ లు చేసిన పరిశోధనలలో పనస గింజలలో అద్భుతమైన గుణాలు ఉన్నా యని పేర్కొన్నారు. పనస గింజల ను తినే పద్ధతి ని  పనస గింజలలో  ఉండే లాభాల ను గురించి వివరించారు. వేసవి కాలం లో మాత్రమే లభించే పనసపండు పనసతోన కేవలం సువాసన నే కాదు ఆరోగ్య పరంగా మరిన్ని పోషకాలు లభ్యమౌతాయి.ప్రత్యేకంగా పనసగింజలు ఆరోగ్య ఖజానాను అందిస్తుందని పేర్కొన్నారు. పనస తొనలు,గింజలు తీసుకోవడం వల్ల మంచిఫలితాలు ఇస్తాయని గింజలను సరైన పద్దతిలో తినడం వల్ల  ఆరోగ్య ఫలితాలు ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు. పనస గింజలు అద్భుత ఫలితాలు... పనస గింజలలో కొన్ని రకాల పోషక తత్వాలు సంపూర్ణంగా లభిస్తాయి. పనస గింజలలో విటమిన్ బి గుణాలు సంపూర్ణం గా లభిస్తాయి. విటమిన్ సి,విటమిన్ఏ  తయామిన్, రేబాఫ్లోబిన్, జింక్,నియాసిన్, లాంటి చాలా రకాల తత్వాలు ఇందులో ఉంటాయి. పనస గింజలు తినడం వల్ల శరీరం లో హిమాగ్లోబిన్ శాతం పెరుగుతుంది. మీరు ప్రోటీన్ కోసం వెతుకు తున్నారా ప్రత్యామ్నాయం గా పనస గింజలు ఎంచుకోవచ్చు. పనస గింజలు శరీరం లోపల నుండి బలోపేతం చేస్తుంది.అనారోగ్య తీవ్రతను నియంత్రిస్తుంది. పనస గింజలను ఎలా ఉడికించాలి... పనస గింజలు తినే ముందు శుభ్రంగా కడిగి శుభ్రంగా ఒలిచి గింజలు ఒకదగ్గర చేర్చి శుభ్రంగా నిపౌలమీద కాల్చినా, లేదా పెనం పై రోస్ట్ చేసి తిన్న ఆరుచి వేరు అంటారు పనస ప్రియులు. బాగా మరిగించిన నీటిలో వేసిన గింజలు వేసి కొంచం ఉప్పు జోడించండి చాలా రుచిగా ఉంటుందని అంటారు. ముఖ్యంగా తెలుగు ప్రజలు పనస పొట్టు తో కూర అద్భుతంగా చేస్తారు పనస కూర తో చేసే బిరియాని చాలా రుచిగా ఉంటుంది. సో ఏని  వే గరీబోడి బాదం పనస గింజల తో అద్భుత ఫలితాలు  ఉన్నాయన్నది వాస్తవం.                                         

క్యాన్సర్ అంటే ఏమిటి ? 

కొన్ని అపోహలు,సందేహాలు.అవగాహన. క్యాన్సర్ గురించి అందరూ వినే ఉంటారు. కాని క్యాన్సర్ అంటే ఏమిటి ? అని అడిగితే మాత్రం చాలా మంది సమాధానాన్ని చెప్పలేరు. కొద్ది మంది మాత్రమే క్యాన్సర్ క్యాన్సర్ అంటే ఏమిటి అది ఎలా ఏర్పడుతుంది, ఎలా వృద్ధి చెందుతుంది అన్న విషయాలు తెలిసి ఉంటాయి. క్యాన్సర్ లో 1౦౦ కు పైగా రకాలు ఉన్నాయి. క్యాన్సర్ శరీరంలోని ఏ భాగానికైనా రావచ్చు ఆఖరికి కళ్ళు గుండె కు కూడా క్యాన్సర్ సోకే అవకాశం ఉందంటే ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. క్యాన్సర్ ప్రారంభం మొదట ఎదో ఒక శరీర భాగపు కణాల లో మొదలు అవుతుంది. సాధారణ శరీర కణాలు క్యాన్సర్ కణాలుగా ఎలా మారాయి అన్నది తెలుసుకుంటే క్యాన్సరు రూపు రేఖలు ఏమిటో తెలుస్తాయి. సాధారణ శరీర కణాలు...జీవిత చరిత్ర తెలియాలి.  మన శరీరం అనేక రకాల సజీవ కణాల తో కూడుకుని ఉంటుంది. శరీరంలోని ప్రతి అవయవము కణాల సముదాయమైన తిష్యుల తో నిర్మితమై ఉంటుంది. భావన నిర్మాణం లో ఇటుకలు ఎలాంటివో శరీరంలోని వివిధ విభాగాల నిర్మాణం లో టిష్యూ లు ఇటుకల లాంటివి. సాధారణ ఆరోగ్యకర శరీరంలో కణాలు పరిపక్వ స్థితికి రాగానే ఒకటికి మరిన్ని కణాలుగా విభాజ్యం చెందుతూ ఎప్పటి కప్పుడు కొత్త కణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఒక నిర్ణీత కాలం వచ్చే సరికి శరీరంలోని ప్రతి కణానికి వయస్సు చెల్లె సమయం ఆసన్న మౌతుంది.అప్పుడు అవి ఇక పని చేయని స్థితికి వస్తాయి. పని చేయని స్థితికి వచ్చిన కణాలు ఎప్పటి కప్పుడు నశించి పోతాయి. నశించిన కణాల స్థానం లో అంతకు ముందు విభాజ్యం చెందుతూ ఏర్పడిన కొత్తకణాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. మనిషికి జీవన ప్రారంభదశలో అంటే బాల్యంలో శరీర కణాలు వేగంగా విభాజ్యమౌతూ వృద్ది చెందుతాయి. ఆకాలం లో నశించి పోయే కణాలకంటే కొత్తగా ఏర్పడే కణాల సంఖ్య అధికంగా ఉంటుంది. దీనివల్ల శరీరాలు అభివృద్ధి చెందుతూ పిల్లలు ఎదగడానికి వీలు కలుగుతుంది. ఇది మనశారీర కణాల జీవిత చరిత్ర.  క్యాన్సర్ కణాలు ---కణితలు.  క్యాన్సరు ఎప్పుడూ ఎదో ఒక శరీర భాగపు కణం తో ప్రారంభ మౌతుంది. కణాలు విభాజ్యం చెందడం కొత్త కణాలు గా ఏర్పడుతూ వృధీ చెందడం . పాత గా అయిపోయిన కణాలుమరణించడం అనే సహజ సిద్దమైన క్రమబద్ద క్రియ లో ఒక్కోసారి ఎక్కడో తేడా వస్తుంది. ఆ తేడా కారణంగా శరీరంలోని ఒకానొక భాగం లో పనిచేయని వయస్సు చెల్లిన కణాలు నసిన్చిపోవడం అంతే కాక అవసరం లేక పోయినా ఆ భాగాన కొత్త కణాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అవసరం తీరి నశింపు చెందకుండా ఉన్న పాత కణాలు, అవసరం లేకపోయినా ఏర్పడిన కొత్త కణాలు ఆ మొత్తంలో అక్కడి భాగం ఒక ముద్దగా గడ్డలా తయారు అవుతుంది. అలా ఏర్పడిన గద్దలనే వైద్య పరి భాషలో ట్యూమర్స్ అంటారు. గడ్డలు శరీరంలో ఏ భాగంలో ఐనా ఏర్పడవచ్చు. వీటిలో ప్రామాడం లేని గడ్డలు ఉంటాయి. ప్రమాదాన్ని కలిగించే హానికారక గడ్డలు ఉంటాయి. ప్రమాదంలేని గడ్డలను మ్యాలిగ్నేంట్ ట్యూమర్స్ అంటారు.   ప్రమాదాన్ని కలిగించే గడ్డలను మ్యాలిగ్నేట్ ట్యూమర్ అంటారు క్యాన్సరు గద్దలంటే ఇవే.. ప్రమాదం లేని గడ్డలు- బినైన్ ట్యూమర్స్... * ఇవి క్యాన్సర్ ను కలిగించవు,ప్రాణాపాయం లేనివి. * వీటిని చిన్నపాటి శస్త్ర చికిత్స ద్వారా తొలగించ వచ్చు. సాధారణంగా ఇంకా మళ్ళీ పెరగవు. * ఈ గడ్డ లోని కణాలు చుట్టుపక్కల కణ జాలం లోకి ప్రవేసించ లేవు.  * అదే విధంగా మరో ప్రాంతపు శరీర భాగం లోకి వ్యాపించలేవు. హానికార గడ్డలు -మ్యాలి గ్నేట్ ట్యూమర్స్...  * ఇవి క్యాన్సర్ కు సంబందించిన ప్రాణాపాయ గడ్డలు.  * ఈ రకంగా ప్రాణాంతక హానికారక క్యాన్సర్ గడ్డలను శస్త్ర చికిత్స ద్వారా తొలగించ వచ్చుకాని మళ్ళీ పెరిగే అవకాసం ఉంది.  * క్యాన్సర్ కణాలు చుట్టుపక్కల కణజాలం లోకి ఇతర శరీర భాగాలలోకి ప్రవేసించ గలుగుతాయి. * ఈ గడ్డ లోని క్యాన్సరు కణాలు రక్త ప్రావాహం ద్వారా,లింఫ్ వ్యవస్థ ద్వారా దూరంగా ఉన్న అవయవాల లోకి ప్రవేశించి. ఆయా భాగాలాలో కొత్త గడ్డలను ఏర్పరచ గలుగు తాయి. ఇలా దూరంగా ఉన్న ఆవయవాలలోకి క్యాన్సర్ వ్యపించడాన్ని మెటా స్టే సిస్ అంటారు. క్యాన్సర్ లక్షణాలు ... క్యాన్సర్ లో అనేక రకాలు ఉన్నాయి.ఒక్కోరకమైన క్యాన్సరు లో ఒక్కోరకమైన లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని రకాల క్యాన్సార్ లలో అవి భాగా ముదిరిపోయే దాకా ఏ లక్షణాలు కనిపించవు. కూడా అందుకనే  డాక్టర్స్ క్యాన్సర్ కవాచ్చు ఏమో అన్న అనుమానం కలగ గానే ఆ వ్యక్తికి వివిధ టెస్టులు ,స్క్రీనింగ్ లు జరిపిస్తారు. క్యాన్సర్ లో కనిపించే కొన్ని సాధారణ లక్షణాలు, చిహ్నాలు ఈ విధంగా ఉంటాయి ... * చాతిలో లేక శరీరంలో మరెక్కడైనా కొత్తగా ఏదైనా గడ్డలు కనిపించడం.  * కొత్తగా నల్లటి మచ్చ ఏర్పడడం. లేదా అంతకు ముందే ఉన్న పులిపిరి లేక నల్ల మచ్చలో మార్పులు కనిపించడం గమనించవచ్చు.  * పుండు ఎంతకీ తగ్గక పోవడం.  * విడవకుండా దగ్గు, గొంతు బొంగురు పోవడం. * మల మూత్ర అలవాట్లలో మార్పులు కనిపించడం.  * నిరంతరం అజీర్ణం. * మింగటానికి ఇబ్బంది కలగడం. * ఏ కారణమూ లేకుండా బరువు తగ్గడం. * జననేంద్రియం నుంచి అసాధారణంగా రక్త స్రావం కావడం లేక విపరీతంగా తెల్లటి ద్రవం ఉత్పత్తి కావటం.  మొదలైన లక్షణాలు గమనించిన వెంటనే క్యాన్సరా కదా అని నిర్ధారించుకోవాలి.అయితే చెప్పినవన్నీ క్యాన్సర్ మూలంగానే వస్తాయని కాదు. ఏ ఇన్ఫెక్షన్ మూలంగానో కూడా రావచ్చు. అయినా సరే ఇలాంటి లక్షణాలు కనిపించి నప్పుడు డాక్టర్ ను సంప్రదించి పరీక్ష చేయించుకోవడం అవసరం. పైన చెప్పిన లక్షణాలే కాకుండా కింద పేర్కొన్న కొన్ని సాధారణ లక్షణాలు కూడా వివిధ క్యాన్సర్లకు చిహ్నాలు కావచ్చు.  పొత్తికడుపు నొప్పి పెల్విక్ పెయిన్... బొడ్డుకు దిగువ భాగంలో పొత్తికడుపులో విడవకుండా నొప్పి వస్తే అది నెలసరి కి సంబందించిన మూలంగానే కాకుండా ఎండో మెట్రియాల్ క్యాన్సర్ ఓవరియన్ క్యాన్సర్, లేదా సర్వికల్ క్యాన్సర్ లాంటి వాటి మూలంగా కూడా కవాచ్చు.  కడుపు ఉబ్బరం..తేన్పులు... వీటిని మనం అంతగా పట్టించుకోము కాని రెండూ విడవకుండా ఉండడం సాధారణంగా జీర్నకోస క్యాన్సర్ లక్షణం గా అని నిపుణులు అనుమానించే అవకాశం ఉంది. నడుము నొప్పి... కొందరు స్త్రీలు నడుము కింది భాగంలో తీవ్రనోప్పి వస్తోందంటూ వాపోతూ ఉంటారు. కొందరు స్త్రీలు అయితే ఆ నొప్పి ప్రసవ నొప్పులంత తీవ్రంగా ఉంటోందని అంటున్నారు. బహుశా అది అండాశయ క్యాన్సర్ వల్ల కావచ్చు.  ఎంతకీ తగ్గని జ్వరం ...  నెలరోజులుగా గడిచినా జ్వరం తగ్గక పోతే డాక్టర్ ను కలవడం మంచిది. ఒక్కోసారి అది క్యాన్సర్ లక్షణం కావచ్చు.  తీవ్రమైన అలసట నీరసం... క్యాన్సర్ లో కనిపించే సాధారణ లక్షణం. ఇది ప్రారంభ దసకంటే సాధారణంగా క్యాన్సరు ముదిరి పోయిన దశలో ఎక్కువగా కనిపిస్తుంది. మామూలు దిన చర్యలు కూడా చేసుకోలేనంతగా నీరసం. అలసట ఉంటె డాక్టర్ ను తప్పకుండా కలవాలి.  క్యాన్సర్ ఎవరికీ వస్తుంది ?...రిస్క్ ఫాక్టర్... క్యాన్సర్ ఎవరికీ వస్తుంది? ఎవరికీ రాదు? అన్న విషయాన్ని ఇది మిద్దం గా చెప్పడం కష్టం. కాకపోతే కొన్ని కారణాలు కొన్ని రిస్క్ ఫాక్టర్స్ క్యాన్సర్ రావడానికి మూలంగా ఉదావచ్చని పరిశోధకులు చెపుతున్నారు. స్థూలంగా చూసినప్పుడు అలాంటి అలాంటి కారణాలలో కొన్నిటిని చూద్దాం. వృద్దాప్యం. పొగ తాగే వాళ్ళు, సూర్యరస్మి, రేడియేషన్ కి గురికావడం,, విచల విడిగా,రాసాయన ఎరువులు వాడడం. వాతావరణ కాలుష్యం, ఆహార పదార్ధాలలో రంగుల వాడకం, కొన్ని రకాల వైరస్ లు, బ్యాక్టీరియా,కొన్ని హార్మోన్లు, కుటుంబ పరంగా, క్యాన్సర్ చరిత్ర ఉన్న వారికి, మద్యాన్ని సేవించేవారికి, పోషకాహార లోపం,స్థూలకాయం, పైన పేర్కొన్న రిస్క్ ఫ్యాక్టర్స్ లో కొన్ని నివారించు కోగాలిగినవి. కొన్ని మన చేతిలో ఉంటాయి.   

అలసటకు కారణాలు!

ఈ శరీరం అలిసిపోయింది వంట్లో శక్తి లేదు ఏదో బతుకు బండిని భారంగా ఈడుస్తున్నాను అని చాలామంది అంటూ ఉంటారు.ఇది కేవలం వృద్ధాప్యం లో ఉన్నవారి మాటలలో మాత్రమే ఒకప్పుడు వినిపించేది అయితే ఈ పరిస్థితి పోస్ట్ కోవిడ్ తరువాత అన్ని వర్గాలలో వినిపిస్తోంది. ఈ పరిస్థితి నుంచి బయటికి వచ్చి మళ్ళీ శక్తి ఉత్సాహాలాను పుంజుకోవాలని అనుకుంటున్నారు కోవిడ్ భారిన పడ్డ బాధితులు. అలసట తో అలిసిపోతున్నామని అంటున్నారు. అలసట ఇది మనందరికీ తెలిసిన పదమే అప్పుడప్పుడూ చిన్న చిన్న జ్వరాలు వచ్చి పోయినప్పుడు మనల్ని హలో అని పలకరిస్తుంది.ఒక్కోసారి వయసు మీద పడి తీవ్ర అనారోగ్యానికి గురి అయిన వారిలో,శస్త్ర చికిత్స జరిగి కోలుకుంటున్న కొందరిలో త్వరగా అలిసిపోవడం  మాములుగా పైకి కనిపిస్తున్నా తీవ్రమైన అలసట ఎక్కువగా ఉండడం సహజంగా కనిపిస్తుందని బాధితులు పేర్కొంటున్నారు. ఇంకొందరిలో  నడవలేకపోవడం మెట్లు ఎక్కలేకపోవడం ఆయాసం వంటి సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయాని రోగులు తమ తోటి వారితో వాపోయిన ఘటనలు ఈ మధ్యకాలం లో తరచుగా వింటూనే ఉన్నాము. దీనినే వైద్య పరిభాష లో క్రానిక్ ఫ్యాటిగ్ సిండ్రోమ్ సి ఎఫ్ ఎస్ ను కనుగొనేందుకు గల కారాణాలు ఏమిటి అని కనుగొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక వైద్య శాస్త్రం లో పరిశోదనలు జరుతున్నాయని  నిపుణులు వెల్లడించారు.ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే సి.ఎస్. ఎఫ్.  వల్ల బాధపడుతున్న వారి సంఖ్య ఎప్పటికప్పుడు గణనీయంగా పెరిగిపోవడం గమనించవచ్చు. సి ఎస్. ఎఫ్ వల్ల సంపాదన పనుల వల్ల కుటుంబాలు దేశాలు అసాధారణ స్థాయిలో ఆదాయాన్ని ఉత్పాదకతను కోల్పోతున్నాయి దశాబ్దాల పాటు ఆరోగ్య భీమా రంగాలలో దీనిని పట్టించుకొని పశ్చిమ దేశాలు ఇటీవల సి.ఎస్. ఎఫ్. ను వ్యాధిగా గుర్తించి చికిత్సను భీమా పరధిలోకి తీసుకు వచ్చినట్లు గ్రంధ రచయిత పరిశోధన సారాన్ని మనకు అందించిన రచయిత రామ్మోహన్ అప్పరసు స్పష్టం చేసారు.అసలు సి.ఎస్. ఎఫ్. వ్యాధికి కారణాలను కనుగొనే పరిశోదన ద్వారా చికిత్చా విధానం వరకూ సి .ఎస్. ఎఫ్ వల్ల జరిగే నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. మీరు అలిసిపోతున్నారంటే అది సాధారణమైనదే అయిన సి.ఎఫ్.ఎస్ ప్రస్తుతం చేయగలిగింది దానిని అర్ధం చేసుకోవడం ఎదుర్కోవడమే. మీరు ఒక పద్ధతి ప్రకారం వ్యూహాత్మకంగా చేసే ప్రయత్నం వల్ల ఆశక్తులను చేసే నీరసం అలసట చక్రబంధం నుంచి బయట పడగలుగుతారు. వాస్తవానికి అలసట పై చేసే పోరాటం అంత కష్టతరమైంది ఏమి కాదు అని అంటున్నారు నిపుణులు. మనం నిత్యజీవితంలో ఎలాంటి సందర్భాలలో అలిసిపోతారు అన్న విషయం తెలుసుకుందాం... రోజంతా వృత్తి,ఉద్యోగాలలో ఉన్నవారు,తీవ్రంగా క్రీడలలో పాల్గొన్నవారు అలిసిపోవడం సహజమే అని నిపుణులు అంటున్నారు.ముఖ్యంగా ఎవరైనా కుటుంబాలతో దూర ప్రాంతాలు,విహార యాత్రలు వందలకిలోమీటర్లు కలిసి ప్రయాణం చేయడం.వల్ల అసలు శరీరంలో శక్తి లేనంతగా అలసట ఉంటుంది. ఇలాంటి సమయంలో  కొద్ది గంటలో,లేదా  కొన్ని రోజుల్లో విశ్రాంతి తీసుకుంటాం. మళ్ళీ రెట్టించిన ఉత్సాహం తో తిరిగి రోజువారి కార్యక్రమాలతో మళ్ళీ బిజీ అయిపోతాం. అయితే కొన్ని సందర్భాలలో అలసట ఒక పట్టాన తీరదు. ఒకరెండు సంవత్సారాల క్రితం జరిగిన అధ్యయనంలో రోజూ ఏదు గంటల పాటు నిద్రపోయిన వారు సైతం వారిలో 45%  మంది అలసటతో గడుపుతున్నట్లు నిపుణులు గమనించారు. నేటి కాలమాన పరిస్థితులలో వివిధ రంగాలలో అంటే ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగులు,వృత్తి నిపుణులు, పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న జనాభ మాత్రమే దీని బారిన పడుతున్నారని,ఇందులో పురుషులు మాత్రమే ఎక్కువగా ఉండడాన్ని గమనించినట్లు తెలిపారు. ఈ పరిస్థితి అంటే ఫాటిగ్ యు సింగ్ ద్రోహం నుండి బయట పది శక్తి ఉత్సాహాలను తిరిగి పొందేందుకు ప్రపంచ వ్యాప్తంగా వైద్యులు మానసిక నిపుణులు చేస్తున్న ప్రయత్నం అలసట మన కండరాలను మజిల్ ఫ్యాటీ యు నాడీ వ్యవస్థను సెంట్రల్ ఫ్యామిలీ యును తీవ్రంగా ప్రాభావితం చేస్తోంది అని నిపుణులు నిర్ధారించారు.అసలు అలసటకు కారణాలు ఏమిటో అత్యధికంగా నిస్సాత్తువ నిస్తేజం మనలను ఎందుకు ఆవరిస్తోందో మీకు తెలిపే ప్రయాత్నం చేస్తున్నారు రామ్మోహన్ అర అప్పరసు గారు మీరు ఒంటరి కాదని చెప్పేందుకే ఈ ప్రయత్నమని పరిష్కారం అందించే దిశగా ప్రయాత్నాలు చేస్తున్నారని ఫలితం వస్తుందని ఆశిద్దాం.

నెయ్యి వాడితే వచ్చే పరిణామాలు ఇవే

భోజన ప్రియులకి నెయ్యి లేదా అంటూ ఉంటారు. నెయ్యి లేనిదే ముద్ద దిగదు.నెయ్యి తో పోపు పెట్టిన ఆహారం,నెయ్యితో కాల్చిన చపాతి నెయ్యితో కాల్చిన పెసరట్టు తప్ప మరేది వద్దు అంటూ ఉంటారు.ఇక కొంతమంది అయితే ముఖ్యంగా స్వీట్స్ లో నెయ్యి కారుతూ ఉండాలి. ముఖ్యంగా బొబ్బట్లు, బూరెలు  కూడా నెయ్యి తో చేసినవే బాగుంటాయి అంటారు భోజన ప్రియులు నెయ్యితో చేసిన పదార్ధాలు ఆస్వాదిస్తూ తిన్నప్పుడే వాటి మజా ఉంటుందని నిపుణులు అభిప్రాయ పడ్డారు. ముఖ్యంగా దక్షణాది రాష్ట్రాలలో కుటుంబంలో పెళ్ళి ళ్ళు శుభకార్యాలలో సంబంధాలు కోసం వెళ్ళినప్పుడు మా నానమ్మ నెయ్యి వెన్నతో పెట్టింది.మీరేం పెడతారు చెప్పండి అంటు అడగడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే మీరు ఇలాగే గనక నెయ్యి తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తెలిస్తే ఇకమీరు నెయ్యి జోలికే వెళ్ళరు. నెయ్యి ఆరోగ్యానికి ఎలా దోహదం చేస్తుందో మీకు బాగా తెలుసు.వినిఉండచ్చు. ఇది కేవలం యాంటి ఏజింగ్ మాత్రమే కాదు మనసు మెదడు ఆరోగ్యంగా ఉండడానికి లాభం కలిగించే అంశం అయితే నెయ్యి ప్రతి ఒక్కరికి సరిపడదు. అని అంటున్నారు నిపుణులు. భారత దేశం లో నెయ్యి చాలా ప్రాచుర్యం లో ఉంది.నెయ్యి కొంతమంది ప్రతిరోజూ తమ భోజనం లో చేరుస్తారు. నెయ్యి వాడడం కూడా చాలా కష్టం నేతిని బ్రెడ్ లో లేదా చపాతీలో పప్పు కూరలో నెయ్యిని ఎక్కువగా వినియోగిస్తారు. నెయ్యిని ఆయుర్వేదం లో ఎక్కువగా వాడడం గమనించవచ్చు.నెయ్యి ఆరోగ్య పరంగా మంచి ఉపయోగాలు ఉన్నాయి. గుండె సంబందిత ఆరోగ్యానికి లాభదాయకంగా ఉంటుంది.ఖాళీ పొట్టతో నెయ్యి తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. శరీరంలో ఉన్న పంచెంద్రియాలలో శుభ్ర పరిచి ఉపసమనం ఇస్తుంది. నెయ్యిలో యాంటి ఏజింగ్ మరియు గుండె ను ఆరోగ్యంగా ఉంచే గుణాలు ఉంటాయి. కంటి ఆరోగ్యానికి నెయ్యి చాలా మంచిది దీనితో పాటు నెయ్యి మెదడు,జ్ఞాపక శక్తిని పెంచి పంచేంద్రియాలు చురుకుగా పని చేసేందుకు దోహదం చేస్తుంది.

కొవ్వు చెప్పే కథ వింటే ఆశ్చర్యపోతారు!

నీకు కొవ్వు బాగా పట్టిందిరా.. అంటుంటారు చాలా మంది ఎవరైనా నిర్లక్ష్యంగా, పొగరుగా ప్రవర్తిస్తున్నపుడు. అయితే కొవ్వు అనేది శరీరానికి ఎంత అవసరమో అది హద్దు మించి పెరిగితే ఆరోగ్యానికి అంత చేటు చేస్తుంది. మనిషి ప్రవర్తన కూడా పరిధి మించితే అలాంటి నష్టాన్ని కలిగిస్తుందని దాని ఉద్దేశం. ఇకపోతే మన రక్తంలో కొవ్వు కలిగివుండడం ప్రమాదకరమని అందరికీ స్పష్టంగా తెలుసు. కీళ్ళ నొప్పులు, రక్తపోటు, డయబెటీస్ పరోక్షంగా కారణమని కూడా తెలుసు. అయితే కొవ్వును అయిదు రకాలుగా చెబుతారు. ఈ కొవ్వులకు విరుగుడు, చికిత్స తగ్గించడానికి ఏం చేయాలో మాత్రం వైద్యశాస్త్రంలో సమాధానం దొరకలేదు. మొదటి రకం కొవ్వు: కిలో మైక్రాన్స్ అనే కొవ్వు చర్మంలో నిలవవుంటుంది. దీనిని క్యాంధమన్ అంటారు. గుండెపోటు ఇతర బాధలుండవు, కాని శరీరభాగాలు ఉబ్బెత్తుగా అక్కడక్కడ కనిపిస్తుంది. కండకాదు కొవ్వు అని తెలిసినా మనం చేయగలిగిందేమీలేదు. వ్యాయామం శ్రమ తప్ప. రెండవ రకం కొవ్వు: రెండవ రకం కొవ్వును లిప్రొటిన్స్ అని పిలుస్తారు. ప్రోటీనులలో కొలెస్ట్రాతో కలిసిన కొవ్వు తక్కువ బరువు (తేలికగా) వుంటుంది. గుండెపోట్లకు కారణం ఇదే.  మూడవ రకం కొవ్వు: ట్రిగ్లి సిరిడిన్ అంటారు. బరువు ఎక్కువ కలిగిన లిపోప్రొటీన్సు కొలెస్ట్రాల్లో గుండెపోటులకు కారణం.  నాలుగవ రకం కొవ్వు : తేలికగా వుంటుంది. డయాబెటీస్ వల్ల ఎక్కువ బరువు ఉన్నవారిలో ఇది ఉంటుంది.  అయిదవ రకం కొవ్వు: కిలో మెక్రాన్స్ చిన్న చిన్న లిపోప్రోటిన్స్ కలిసినది. తాగుడు అలవాటుపడ్డ వాళ్ళలో ఇది వుంటుంది. 1,4,5 కొవ్వులు ఆహార నియమం వలన తగ్గించే అవకాశాలు ఉన్నాయి. 2, 3 కొవ్వుల విషయంలో కొలెస్ట్రాల్ తక్కువ ట్రిగ్లిసిరైడ్స్ తక్కువ వుండేలా జాగ్రత్తపడాలి. ఈ కొవ్వులను తగ్గించుకోవడం సమస్య అయితే దీనివలన వచ్చే జబ్బులు సమస్యలు మరింత బాధాకరంగా వుంటుంది. అసలు ఈ కొవ్వు ఎలా నిలవ అయిందనేది సమస్య. కారణాలు చాలా ఉంటాయి. ఆహారంలో కొవ్వు తగ్గించుకోవాలి అని చెప్పడం, కొలెస్ట్రాల్ తగ్గించడం వలన కొవ్వు బెడద తగ్గించుకోవచ్చునని అనుకోవడం తేలిక. అయితే అది ఎంతవరకు వాస్తవము, ఆచరణ యోగ్యం అనేది ఆలోచించాలి. మూడు వందలమందికి కొవ్వు తగ్గించి కొవ్వు లేకుండా ఆహారమిచ్చి మూడు సంవత్సరాలపాటు పరీక్షలో వుంచారు. రెండు వర్గాలలో జబ్బు తీవ్రత మరణాలు కూడా సంభవించాయి. అయితే ఒక విషయం స్పష్టంగా తేలిపోయింది. కొవ్వును అదుపులో పెడితే జబ్బును అదుపులో పెట్టవచ్చు. కొవ్వు తగ్గించుకుంటే గుండెపోటు ఇతర బాధలుండవు. డాక్టర్ కోహెన్ పరిశోధనలో యెమెన్ లో వున్న జ్యూలు చాలా లావుగా వుంటారు. ఎక్కువ కొవ్వు కలిగిన పదార్ధాలు, ఆహారం తింటారు. ఎంత కొవ్వు పదార్థాలు తిన్నా,  ఎంత లావున్నా ఏ జబ్బూ రాలేదు. బలంగా కూడా వున్నారు. అంతే కాదు మరొక విషయం కూడా తేలింది. ఆధునిక ఆహారం బిస్కట్లు, కేకులు, పుడింగులు, బ్రాంది నాగరిక ఆహారం తిని లావెక్కిన వారిలోనే ఈ జబ్బు కనిపిస్తున్నాయి. కానీ పూర్వం తినే ఆహారం తిని లావెక్కిన వాళ్ళలో ఏ జబ్బులూ లేవు. అంచేత మనపూర్వులు ఆదేశించిన ఆహారం సక్రమమైనది బలవర్ధకమైనది అని స్పష్టమవుతుంది.                                   ◆నిశ్శబ్ద.

ఈ లక్షణాలు ఉంటే మీ కిడ్నీ డేంజర్ లో ఉనట్టే!

మీ కిడ్నీ సరిగా పనిచేయనప్పుడు సరైన తోక్సిన్స్ పెరుగు తాయి. అది మీ రోజువారి జీవితం పై తీవ్ర ప్రభావం చూపుతుంది.అది మీకు ఆస్చార్యాన్ని కలిగించ వచ్చు. కిడ్నీలో సమస్యల లో వచ్చాయిఅనడానికి ఈ పదిలక్షణాలు గమనించండి. 1)మీరు తరచుగా అలిసిపోవడం... మీ శరీరంలో కిడ్నీ ద్వారా రక్తం శుద్ధి చేసున తరువాత వచ్చే వేస్టేజ్ ను బయటికి పంపుతుంది. మీకిడ్నీ సరిగా పనిచేయనట్లయితే టాక్సిన్స్ పెరుగుతాయి.దీనికి సంకేతంగా త్వరగా అలిసిపోవడం అలసట వారం రోజులకు పైగా ఉండవచ్చు. కిడ్నీలు మీ శరీరంలో హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. అలాగే శరీరంలో  ఎర్ర,తెల్ల రక్తకణాలు ఉత్పత్తి చేస్తాయి. మీ కిడ్నీలో సమస్య ఉంటె రక్తం ద్వారా  మెదడుకు కండరాలకు అవసరమైన ఆక్సిజన్ అందక పోవచ్చు. 2 )నిద్రలేమి! మీ నిద్రలేమికి కిడ్నీ వ్యాధికి సంబంధం ఉండచ్చు. అది మీశారీరంలోని ఇతర అవయవాలను నాశనం చేస్తుంది. తద్వారా కిడ్నీ ఫెయిల్యూర్ కు దారితీయవచ్చు. మీ శరీరానికి సరిపడా నిద్ర లేకుంటే కిడ్నీ సమస్యలు ఉన్నట్లే. కిడ్నీ లో సమస్యకారణం గానే ఆక్సిజన్ సరఫరా లోపిస్తుంది.ఒక్కోసారి కిడ్నీ సమస్య వల్ల గొంతులో నాళాలు కుంచించుకు పోతాయి. టాక్సిన్స్ పెరిగి అనేకసమస్యలకు దారితీస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ౩ ) చర్మం పై దురద! మీ శరీరం లోని టాక్సిన్స్ కిడ్నీ ద్వారా బయటకు రాకుంటే రక్తంలో టాక్సిన్స్ పెరిగినట్లే. ఈ కారణం గా దద్దుర్లు రావడం దురదకు దారితీస్తుంది.మీకిద్నీ కొంత కాలానికి మినరల్స్ ను న్యుట్రీషియన్స్ సమతుల్యం గా ఉంచలేదు. మినరల్స్ సరిగా అందకుంటే ఎముకలకు సంబందించిన సమస్యలు వచ్చి మీ చర్మం ఎండిపొయినట్లు గా దురదగా ఏర్పడుతుంది. 4 )ముఖం -కాళ్ళు వాయడం! మీకిడ్నీకి అవసరమైన సోడియం అందకుంటే శరీరంలో ఫ్లూయిడ్స్ ఏర్పడి చేతులు కాళ్ళు,పాదాలు లేదా ముఖం వాచినట్లుగా ఉంటుంది. ప్రత్యేకంగా కాళ్ళ లో,కాలిమడమల లో వచ్చేవాపులు గమనిస్తే లేదా మూత్రంలో ప్రోటీన్ కోల్పోతారు కాళ్ళు వాచినట్లు కనిపిస్తుంది. 5 )కండరాలు పట్టేయడం! కాలినరాలు పట్టేయడం అంటే మీ కిడ్నీ పనితీరు సరిగాలేదని అర్ధం. సోడియం,కాల్షియం,పొటాషియం, సమానంగా లేకపోవడం ఎలక్ట్రోలైట్స్ పరీక్షలు కొంతమేరకు ఇబ్బంది కలిగిస్తాయి. దీని ఆధారంగానే నాడీ వ్యవస్థ కండరాల వ్యవస్థ పనిచేస్తాయి. సమస్య తలెత్తితే కిడ్నీ ఎలాఉంది అన్నది మొదటి ప్రశ్న. 6 )ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది! మీరు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నప్పుడు ఎరిత్రో ప్రోటీన్ హార్మోన్ ను ఉత్పత్తి చేయదు. హార్మోన్ సిగ్నల్ వల్లే ఎర్రరక్త కణాలు తయారు అవుతాయి. అలా జరగ నట్లయితే పూర్తిగా రక్త హీనత ఏర్పడుతుంది. అప్పుడే మీకు ఊపిరి అందడం కష్టంగా ఉంటుంది. అది ఒక్కో సారి తీవ్రసమస్యాగా మారితే కళ్ళు తిరగడం లేదా ఇతర అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చు. 7)మెదడు మొద్దుబారినట్లుగాఉండడం! తల పై ఎదో కమ్మినట్లు మబ్బుగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. శరీరంలో మీ కిడ్నీ సరిగా ఫిల్టర్ చేయనట్లయితే టాక్సిన్స్ మీ మెదడుపై ప్రభావం చూపుతాయి.ఒక్కొసారి మెదడు చీకట్లు కమ్ముకుంటాయి. దీనుకి కారణం శరీరానికి ఆక్సిజన్ అందాకపోవడం. అప్పుడే కళ్ళు తిరిగినట్లు ఏకాగ్రత కోల్పోవడం జ్ఞాపక శక్తి చిన్న చిన్న సమస్యలు సైతం కష్టంగా కనిపిస్తాయి. 8)ఏపటై టిస్ తగ్గడం! కిడ్ని సమస్య ఉంటె మీఅహారం అరగక పోవడం. శరీరం అసహనంగా ఉండడం. దీర్ఘంగా అలసట గాఉండడం. ఈ కారణంగానే వాంతి వచ్చినట్లుగా ఉండడం. లేదా పొట్టలో సమస్యలు అరగక పోవడం లేదా విరేచనాలు. ఆకలి మండగిబ్చడం లేదా ఆహారం తీసుకోవాలని అనిపించక పోవడం వంటిలక్షణాలు ఉంటె త్వరగా మీరు బరువు కోల్పోతారు. 9)నోటి దుర్వాసన! మీకిడ్నీ లో సమస్య వచ్చి ఫిల్టర్ జరగకుంటే శరీరంలోని వేస్టేజ్ బయటికి పోవడం వల్ల యురీమియా సమస్య వస్తుంది. ఈ కారణంగా నే మీ శ్వాస ఊపిరిలో దుర్వాసన వస్తుంది.శరీర రక్త కణాలలో టాక్సిన్ చేరి మెటాలిక్ గా మారి రుచిని కోల్పోతారు. 1౦)మూత్రం లో నురగా లేదా రక్తం పడడం లేదా రక్త స్రావం.లేదా మీ మూత్రం బ్రౌన్ రంగులోకి మారడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. మీశరీరంలో అధికంగా ప్రోటీన్ చేరినా దీనిని ఆల్బుమిన్ ఉంటె అది కిడ్నీ సమస్యకు దారితీయవచ్చు. మూత్రం తెల్లగా లేదా బ్రౌన్ రంగులో కి మారడం ంటే కిడ్నీ లో లోపం ఉన్నట్లే అంటే కిడ్నీ సమస్య ఉన్నట్లే అని నిపుణులు భావిస్తున్నారు. మూత్ర నాళం ద్వారా రక్త శ్రావం కిడ్నీలో రాళ్ళు, ఇతర ట్యూమర్లు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైన పేర్కొన్న లక్షణాలు గమనించిన వెంటనే మీరు దగ్గరలోని డాక్టర్ ను సంప్రదించడం అవసరం తద్వారా కిడ్నీ మార్పిడికి పోకుండా కిడ్నీ లో వచ్చే తీవ్ర సమస్యను ముందుగానే గమనించి విలువైన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. లేదా కిడ్నీని రక్షించుకోవచ్చు.                      

గుండెపోటు ఉన్నవారు సెక్స్ లైఫ్ కు దూరం ఉండాలా?

ప్రస్తుత కాలంలో చాలా చిన్న వయసు వారికే గుండె సంబంధ సమస్యలు వస్తున్నాయి. గత మూడు సంవత్సరాల కాలం గురించి ఆలోచిస్తే కరోనా ప్రభావానికి తీవ్రంగా గురైనవారిలో గుండె సంబంధ సమస్యలు ఎక్కువగా ఉన్నట్టు పలునివేదికలు తెలుపుతున్నాయి. సమస్యకు బయటకు కనిపించని వారి గురించి వదిలేస్తే, గుండె నొప్పి, గుండె బలహీనపడటం వంటి సమస్యలు బయటపడినవారు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా గుండె నొప్పి వచ్చినవారు చిన్నవయసు వారైతే వారిలో చాలా పెద్ద సంఘర్షణ నెలకొని ఉంది. అదే సెక్స్ లైఫ్. మాట్లాడుకోవడానికి, చెప్పుకోవడానికి సంకోచించే ఈ అంశం గురించి తమలో తాము మధనపడే భార్యాభర్తలు ఎందరో ఉంటారు. గుండెపోటు వచ్చినవారు సెక్స్ లైఫ్ కు దూరంగా ఉండాలనేది చాలమంది చెప్పే విషయం, ముఖ్యంగా అందరూ అనుకునే విషయం. కానీ అది చాలా తప్పని అంటున్నారు వైద్యులు. గుండె పోటు వచ్చిన తరువాత డాక్టర్ ల దగ్గర తమ సందేహాలు అడిగి నివృత్తి చేసుకోకుండా సెక్స్ లైఫ్ కు దూరంగా ఉండాలని తమకు తాము డిసైడ్ అవ్వడం అందరూ చేసే తప్పు.  ఒక వేళ డాక్టరు ఏదైనా చెప్పబోయినా “బ్రతికి బయటపడ్డాను అదే పదివేలు. ఇక అది లేకపోయినా ఫరవా లేదు. ఇక దాని గురించి ఆలోచించను కూడా” అంటూ వినడానికి నిరాకరించేవారు ఎందరో ఉంటారు. కాని తరువాత కొంతకాలానికి దాని అవసరం తెలిసి వస్తుంది. కొందరు భార్యలకు సహజంగానే చిన్నవాటికె భయపడుతూ భర్తలు అలాంటి ప్రస్తావన తెచ్చిన దూరం జరిగిపోతారు.  గుండెపోటు వచ్చిన వారిలో సెక్స్ స్పందనలు ఎలా?? గుండెపోటు వచ్చిన వారిలో కొందరికి సెక్స్ సామర్ధ్యం తగ్గిపోతే, మరికొందరిలో సెక్స్ కోరిక సామర్ధ్యం ఎక్కువైనట్లు కనబడతాయి. దీనికి ప్రధానంగా వారు వాడే మందులే కారణం. కొందరికి రక్తపోటువల్ల గుండెపోటు వస్తుంది. రక్తపోటు తగ్గడానికి వాడే కొన్ని మందులవల్ల సెక్స్ సామర్థ్యం తగ్గుతుంది. మరి కొందరిలో అంతకుముందు లేని ఉషారు, కోరిక ఎక్కువ అవుతాయి. దీనికి కారణం గుండెపోటు వచ్చిందని కృంగి పోకుండా ఉండేందుకు డాక్టర్లు ఇచ్చే మందులతో మనస్సు ప్రశాంతంగా ఉండటం, సహజమైన వాంఛలతో మనస్సు ఉరకలు వేయడమే.  దూరమా?? దగ్గరా?? గుండెపోటు వచ్చిన వ్యక్తి రెండు మూడు నెలల తరువాత సెక్స్ లైఫ్ ను మునుపటిలా ఆస్వాదించవచ్చు. అయితే భార్యాభర్తలు ఒకరికి ఒకరు సహకరించుకోవడంలో ఒత్తిడి అనే అంశాన్ని సులువుగా అధిగమించవచ్చు.  భయం అపోహనేనా?? సెక్స్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా సంభవించిన మరణాలని పరిశీలిస్తే అది తక్కువ శాతమే. ఎలాంటి టెన్షన్ లు లేకుండా, అక్రమ సంబంధాలలో ఉండకుండా భార్యాభర్తలు ఇద్దరూ హాయిగా గడిపితే ఏ గుండె నొప్పి రాదని, వైఫల సూచించిన సలహాలే శ్రీరామ రక్ష అని అంటున్నారు. సమయానికి తగు నిద్ర, సమయానికి తగు ఆహారం, ఆరోగ్యకరమైన అలవాట్లు ఉంటే సెక్స్ లైఫ్ అనేది ఏవిధంగానూ గుండెపోటుకు కారణం కాదని అది ఇంకా ఒత్తిడి తగ్గించే ఔషదంలా మారుతుందని అంటున్నారు.  Note:- పై విషయాలు అన్నీ పలు సందర్భాలలో వైద్యులు వెల్లడించిన అంశాలు. గుండె సంబంధ సమస్యలు ఉన్నవారు వైద్యుని సలహా తీసుకుని సెక్స్ లైఫ్ ను నిరభ్యంతరంగా ఆస్వాదించవచ్చు.                                     ◆నిశ్శబ్ద.

జబ్బులు ఎందుకొస్తాయంటే...

అనారోగ్యం రావడానికి కారణం ఏంటి?? ఆలోచిస్తే.. సరియైన ఆహారము, క్రమబద్ధమైన జీవన విధానము లేనివారికి అనారోగ్యం రావడం జరుగుతుందనే విషయం తెలుస్తుంది. ఆ సమయాల్లో చాలామంది చేసే తప్పు ఒకటి ఉంటుంది. మనకు వచ్చినవన్నీ చిన్న రోగాలే అనే అపోహతో కొందరు, పెద్ద జబ్బు సూచనలు కనిపించినా ఇది చిన్నదే అనే అపోహతో మరికొందరు ఏ మెడికల్ స్టోర్ కో వెళ్లి మందులు తెచ్చుకుని సొంత వైద్యం చేసుకుంటారు. అది చాలా పెద్ద తప్పు.  కొన్ని జబ్బుల లక్షణాలు ఒకే విధంగా ఉన్నా ఆ జబ్బు మాత్రం వేరేగా ఉంటుంది. ఇలాంటి సమస్యను దృవీకరించాల్సింది వైద్యులు తప్ప మనం కాదు కదా.. కానీ చాలామంది ఇదిగో ఇదే నాకు వచ్చిన సమస్య అని డిసైడ్ చేసేస్తూ ఉంటారు.  ఏ వ్యాధి అనే విషయం తెలుసుకోకుండా పైన కనుపించే లక్షణాలను బట్టి మందులు వాడుకోవటం వల్ల వ్యాధి తగ్గకపోగా కొన్ని సమయాలలో వాడబడిన మందులవల్ల శరీరంలో అనేక దుష్పరిణామాలు సంభవించే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని పరిస్థితులల్లో ఇలాంటి దుష్పరిణామాలను నివారించటం వైద్యులకు కూడా సాధ్యం కాకపోవచ్చు. అందువల్ల మందులనేవి స్వయంగా వాడుకోవటం చాలా చెడ్డ అలవాటు. ప్రస్తుతకాలంలో అందరూ ఓ అలవాటుగా సేవించే కాఫీ,టీ, లాంటివి కూడా శరీరానికి అనారోగ్యం కలిగించేవే..  వీటిని తీసుకున్నందువల్ల తాత్కాలికంగా శరీరానికి ఉత్తేజము, ఉత్సాహము కలుగవచ్చు కానీ వాటి ప్రభావం శరీరానికి ఏమంత లాభకరమైందికాదు. అధికంగా కాఫీలు, టీలు తీసుకునేవారికి కొంతకాలమైన తరువాత  అవి తీసుకోకపోతే నిస్సత్తువ, చిరాకు, పనులమీద ఏకాగ్రత కుదరకపోవడం వంటివి ఏర్పడతాయి. ఇలాంటి వాటికి అలవాటు పడటం వల్ల నాడీ బలహీనత సమస్య ఎదురై, నిత్యం తలనొప్పితో బాధ పడటం జరుగుతుంది. ఈ ప్రభావం జీర్ణకోశంపై కూడా పడి కడుపు ఉబ్బరం, గ్యాస్ లాంటి వ్యాదులకు లోనయ్యే ప్రమాదముంది. గుండెవ్యాధులు, కాన్సర్ లాంటి భయంకర వ్యాధులు రావడానికి ధూమపానం వాడకాలు ముఖ్యమని చెప్పాలి. సిగరేట్, చుట్ట, బీడీ లాంటివి త్రాగటంవల్ల ఆ పొగను కొంత బైటికి వదలటం వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. పొగాకు పొగత్రాగే వారికెంత హానికరమో, బైటగాలిలో వదలిన పొగను వారికి తెలియకుండా పీల్చే వారికి కూడా అంతే హానికరంగా పరిణమిస్తుంది. పొగాకు నమలటం, జరదా కిళ్ళీలు వేయటం వల్ల కూడా హృద్రోగాలు, కాన్సర్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ప్రధానంగా ధూమపానం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిని దాని కారణంగా కాన్సర్, హార్ట్ ఎటాక్ లాంటివి సంభవిస్తుంటాయి. పొగాకు నమిలేవారికి నోరు, పళ్ళు, గొంతు, స్వరపేటికలకు సంబంధించిన తీవ్రవ్యాధులు సంక్రమించే ప్రమాదం ఎక్కువ. మన శరీరానికి జబ్బు తెచ్చిపెట్టే కొన్ని అలవాట్లు గమనిస్తే… ప్రతిరోజు స్నానం చెయ్యకుండా ఉండటం మొదటి అలవాటు. శరీర శుభ్రత లేకపోతే జబ్బులు రావడానికి మొదటి మార్గం మనమే ఇచ్చినట్టు. క్రమబద్దము లేని భోజనము చేయడం. రోజుకొక వేళలో భోజనం చేయడం వల్ల శరీరం ఏ సమయానికి శక్తిని తయారు చేసుకోవాలో నిర్ణయించుకోలేదు.   అధికంగా ఉపవాసములు చేయడం పెద్ద సమస్యలకు కారణం అవుతుంది. నిజానికి ఉపవాసం అనేది కూడా ఆరోగ్య ప్రయోజనం కోసం ఏర్పాటు చేసిందే అయినా దాన్ని అతిగా పాటిస్తే శరీరానికి నష్టం చేకూరుతుంది.  బయట తయారుచేసిన పదార్థాలు తినడం వల్ల కలిగే నష్టం అందరికీ తెలిసిందే. అలాగే శీతల పానీయాలు, చల్లని పదార్థాలు తినడం కూడా నష్టమే.   ప్యాకేజ్డ్ ఫుడ్స్ లో ఫుడ్ చెడిపోకుండా వాయువులు నింపుతారు కాబట్టి వాటిని తిన్నా అనారోగ్యం వెంట వస్తున్నట్టే.. చాలామంది శారీరక సమస్యల విషయంలో సంకోచం చెందుతారు. కానీ అతిగా శృంగారంలో పాల్గొనడం ఎంత చేటు చేస్తుందో.. అసలు శృంగారం జోలికి పోకుండా సన్యాసిలా బ్రతకడం ఈకాలంలో అంతే చేటు చేస్తుంది.   ఆహారం, ద్రవ పదార్థాలు తీసుకునేటప్పుడు నోరు శుభ్రంగా లేకపోతే జబ్బులు వస్తాయి.  సౌకర్యవంతమైన దుస్తులు కాకుండా ఫ్యాషన్ పేరుతో బిగుతుగా ఉన్నవి ధరించడం. శరీరంలో అవయవాల ఒత్తిడికి కారణమై తద్వారా వాటి క్రమబద్ధత తప్పేలా చేస్తుంది. ఆకుకూరలు–పౌష్టికాహారములు వాడకుండా ఉండటం కూడా అనారోగ్యానికి మూలకారణమే. మన శరీరానికి అనారోగ్యం దాపురించడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి చూడండి.                                     ◆నిశ్శబ్ద.  

మూత్రపిండాల క్యాన్సర్ మీకూ ఉందేమో చూసుకోండి!

మానవశరీరంలో అవశ్యకమైన అవయవాలలో గుండె, మెదడు తో పాటు మూత్రపిండాలు ముఖ్యమైనవి.  మెదడు శరీరంలో అవయవాలకు, శరీర వ్యవస్థకు సమాచారాలు అందిస్తుంది.  గుండె రక్తాన్ని  శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు సరఫరా అయ్యేలా చేస్తుంది. మూత్రపిండాలు శరీరంలో రక్తాన్ని వడపోసి అందులో ఉన్న మలినాలను, వ్యర్థాలను, వేరుచేసి మూత్రంలా దారి మళ్లిస్తుంది.  ఈ మూడింటిలో ఏది సమర్థవంతంగా లేకపోయినా మనిషి శరీరం స్వాధీనం కోల్పోతుంది.  ముఖ్యంగా మూత్రపిండాల గురించి చెప్పుకుంటే చిన్నప్పుడు సైన్స్ పుస్తకాల్లో చదువుకున్నట్టు చిక్కుడుగింజ ఆకారంలో ఉండే అవయవం మూత్రపిండం. మనిషి శరీరంలో రెండు మూత్రపిండాలు ఉంటాయి. ఇవి నిరంతరం రక్తాన్ని వడపోస్తూనే ఉంటాయి. సుమారు రోజుకు 200 లీటర్ల రక్తాన్ని ఇవి వడపోస్తాయి. ఈ మూత్రపిండాలు డ్యామేజ్ అవడం, ఏదైనా సమస్యకు లోను కావడం జరిగితే రక్తం వడపోతకు అడ్డంకులు ఏర్పడతాయి, రక్తం శుద్ధి కాకపోతే శరీరంలో చెప్పలేని సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా శరీరంలో అధికంగా ఉండే లవణాలు, రక్తంలో వ్యర్థాలు వెళ్లిపోవాల్సిన మార్గమైన మూత్రవిసర్జనకు సమస్య అవుతుంది. మూత్రపిండాలకు పొంచి ఉండే మరొక ప్రమాదం మూత్రపిండ క్యాన్సర్. ఈ క్యాన్సర్ తో బాధపడుతున్న రోగులలో 60%మందికి మూత్రంలో రక్తం పడటమనే ప్రమాదకరమైన సమస్య ఎదురవుతోంది. అయితే ప్రారంభంలో ఇది నొప్పి లేకుండా ఇతర లక్షణాలు ఏవీ బయటపడకుండా ఉండటం వల్ల ఈ మూత్రపిండాల క్యాన్సర్ ను గుర్తించడం కష్టమవుతుంది. 60% మందిలో 50% మందికి అసలు లక్షణాలు ద్వారా నిర్ధారణ జరగలేదనేది విస్తుపోయే అంశం. ఈ కారణాల వల్ల మూత్రపిండాల క్యాన్సర్ గురించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సాధారణంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేటప్పుడు అందులో భాగంగా మూత్రపిండాల సమస్యలు, వాటి తీవ్రత బయటపడుతుంటాయి. అంటే ప్రారంభంలో ఈ మూత్రపిండాల క్యాన్సర్ ఎటువంటి లక్షణాలను కలిగిఉండదు. మూత్రపిండాల క్యాన్సర్ కొంచెం ముదిరిన తరువాత దాన్ని గుర్తించే అతిముఖ్యమైన అంశం మూత్రంలో రక్తం పడటమే. ఈ లక్షణం ఎవరిలో అయినా కనిపిస్తే వెంటనే మూత్ర పరీక్షలు, రక్త పరీక్షలు చేయించుకోవాలి. మూత్రంలో రక్తం పడటంతో పాటు బరువు తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం కూడా గమనించినట్టైతే వైద్యులను సంప్రదించాలి. మూత్రపిండాల క్యాన్సర్ ను గుర్తించి నిర్ధారణ చేయడానికి CT స్కాన్( కంప్యుటేడ్ టోమోగ్రఫీ), MRI స్కాన్(మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ )  లేదా అల్ట్రాసౌండ్ స్కాన్ వంటి పరీక్షలు ఉన్నాయి. ఇవి ఖర్చుతో కూడుకున్నవి అయినా ఖచ్చితమైన నిర్ధారణను అందిస్తాయి. శరీరంలో ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేయడానికి మూత్రపిండాలు మధ్యవర్తిగా వ్యవహరిస్తాయి. అయితే మూత్రపిండాల క్యాన్సర్ వల్ల ఈ పనికి ఆటంకం కలిగి రక్తహీనత ఏర్పడుతుంది.  మూత్రపిండాలు పూర్తిగా పాడైపోతే వాటిని తొలగించడం తప్ప ప్రత్యామ్నాయం ఉండదు. ఎవరైనా కిడ్నీ దానం చేస్తే అవి కూడా సరిపోయినప్పుడు మాత్రమే ప్రాణాలు నిలబడతాయి.  కేవలం ఒక కిడ్నీతో అయినా జీవితాన్ని నెట్టుకొస్తున్నవారు ఉన్నారు. కానీ మద్యపానం, ధూమపానం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, బయటి తిండి వీటివల్ల మూత్రపిండాలు చాలా తొందరగా ప్రమాదంలో పడతాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. ఈ శరీరాన్ని నిలబెట్టుకోవాలంటే మూత్రపిండాలని కాపాడుకోవాలి.                                                ◆నిశ్శబ్ద.  

సైలెంట్ గా ఆరు వ్యాధులు మనిషిని చంపేస్తాయి...

ఆరు రకాల వ్యాధులు మిమ్మల్ని సైలెంట్ గా ప్రాణాలు తీసేస్థాయి అన్న విషయం మీకు తెలుసా .మంచి ఆహారం తీసుకుంటూ  మీ జీవన శైలిని మార్చుకుని నిత్యం మీరు ఆరోగ్యంగా ఉండడం కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు.అయినప్పటికీ దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. ఒక్కో సారి అనుకోకుండా ముప్పు ముంచుకొస్తుంది. కాగా కొన్ని వ్యాధుల పై ప్రత్యేక శ్రద్ధ అవసరం వాటినే సైలెంట్ కీల్లర్స్ గా  డాక్టర్స్ చెపుతున్నారు. హై బి పి... హై బీపీ  హై బ్లడ్ ప్రెషర్ హై పర్ టెన్షన్ చాలా ప్రమాద కరం. ఒక్క సారి హై బీపీ వచ్చిందంటే ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం 1.28 బిలియన్ల ప్రజలు దాదాపు 30 -79  సంవత్సరాల వారిలో హై బీపీ అత్యంత ప్రమాదకారి. అయితే బీపీ అమాంతం ఎందుకు పెరుగు తుందో కని పెట్టడం కష్టం లేదా ఒక్కోసారి లో బీపీ కూడా ప్రనాలు తీసేస్తుంది.హై బీపీ నిద్రలోనే వస్తే హార్ట్ స్ట్రోక్, బ్రైన్ స్ట్రోక్, వస్తుంది.  మాసివ్ హార్ట్ స్ట్రోక్ వచ్చిందో హై బీపీ ప్రాణమే తీసేతుంది. అందుకే బీపీ ని నియంత్రించుకోవాలి. లేదా మీ ప్రాణాలకు ముప్పు తప్పదు అని హెచ్చరిస్తున్నారు.వైద్యులు.  కరో నరీ  ఆర్ట్రీ  డీసీజ్... చాలా రకాల వ్యాధులు జీవితానికి ప్రమాదకరంగా మార తాయి.  అందులో కరోనా ఆర్ట్రీ డీసీజ్ ఒకటి.కరో నరీ ద్వారా ఆక్సిజన్ తో పాటు రక్త ప్రసారం జరుగుతుంది.గుండెలో దమనులు కుంచించుకు పోవడం వల్ల గుండె నొప్పి ,గుండె పోటు మొదటి లక్షణం గా చెప్పవచ్చు. డయా బెటిస్.... రక్తంలో హై గ్లూకోజ్ శాతం రెండు రకాలు టైప్ 1,టైప్ 2 డయా బెటిస్ వస్తుంది. శరీరంలో ఉండే ప్యాంక్రియాస్ లో ఉత్పత్తి అయ్యే ఇన్సూలిన్ అందకుంటే టైప్ 2 టిప్1 డయాబెటిస్ మరింత పెరిగే అవకాశం ఉంది. హైపర్ గ్లైసీమీయ తీవ్రంగా వస్తే  తీవ్ర మూత్ర విసర్జన కు వెళ్ళడం.యూరిన్ లో ప్రోటీన్ పోతూ ఉంటుంది. దీనివల్ల కిడ్నీ పాడై పోవడం,డయా బెటిక్ నేఫ్రో పతి,డయాబెటిక్ న్యూరో పతి, డయాబెటిస్ వల్ల కళ్ళు పోయేప్రమాదం ఉంది.హై పర్ టెన్షన్ ,హై షుగర్ ఉంటే గుండెపోటు రావచ్చు.హై షుగర్ వల్ల బ్రైన్ స్ట్రోక్,ఫిట్స్,వంటివి వస్తాయి మీకు తెలియకుండానే నిద్రలో మరణానికి దారితీసుకు పోతుంది.  ఆస్త్రియో ప్రోరోసిస్... ఆస్త్రియో  ప్రోరోసిస్ ఒక ఎముకల వ్యాధి.శరీరంలో ఎముకలలో కాల్షియం తక్కువ గా ఉండడం వల్ల శరీరంలోని ఎముకలలో రాలిపోవడం బలహీన పడిపోతాయి.ముఖ్యంగా ఆస్టియో ప్రోరోసిస్ ముఖ్యంగా స్త్రీలలో ఎకువగా వస్తుంది. ఆస్టియో ప్రోరోసిస్ ఉన్నవాళ్ళు ఒక్కోసారి ఉన్నట్లు ఉండి ఉన్నచోట కుప్పకూలిపోతారు.వ్యక్తి గతంగా  ఆరోగుల  పరిస్తితి ఎలా ఉంటుందో తెలియదు.ఒకోసారి ఎముకలు విరిగి పోతాయి.ఉన్నచోటే ఉండి కుప్పకూలిపోతారు.దీనినినుండి బయట పడడానికి కాల్షియం విటమిన్ డి,తప్పనిసరి ఎలాంటి ఎముకల సమస్య నుండైన వారు వ్యాయామం,నడక,జాగింగ్, మెట్లు ఎక్కడం ప్రతి రోజూ పరీక్షించుకోవడం ముఖ్యం. నిద్ర లేమి... నిద్ర లేమి తీవ్ర అనారోగ్య సమస్య,పెద్దగా గాలిపీలుస్తూ ఉంటారు.ఈ కరణంగా గురక కు దారి తీస్తుంది. నిద్రలేమి వల్ల అలసట చాలామంది నిద్రలేమి సమస్యను ఎదుర్కుంటారు.నిద్రలేమి వల్ల సహజంగా మరణిస్తారు.నిద్రలోనే గుండె పోటు, వస్తుంది.అందుకే ఈ అనారోగ్యాన్ని సైలెంట్ కిల్లర్ గాపేర్కొన్నారు. అప్సెస్సివ్  స్లీప్ అప్నియా వాళ్లమీరు గాలిపీల్చుకునే మార్గాలు మూసుకుపోవచ్చు. ఫ్యాటీ లివర్... ప్రాణాలు తీసెసే సైలెంట్ కీల్ల ర్స్ లో ఫ్యాటి లివర్ అని డాక్టర్స్ చెప్పారు. ఫ్యాటి లివర్ వ్యాధిని గుర్తించడం కష్టం.అతిగా తాగడం వల్ల ఫ్యాతి లివర్ వస్తుంది.లివర్ వాపు,లేదా నల్లని చార వస్తుంది.లివర్ శిరోసిస్ వల్ల పూర్తిగా లివర్ పైపోతుంది ఒక్కోసారి లివర్ డోనార్ దొరికితే లివర్ ట్రాన్స్ ప్లాంట్ చేయాల్సి రావచ్చు.లివర్ నాళాలలో ఇబ్బంది మొదలై.అది ముదిరితే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.ప్రాణాలు తీసెసే ఆరు రకాల వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు జాగ్రతగా పరీక్షలు చేయించుకోవాలి.                    

నిమ్మకాయ గురించి షాకింగ్ నిజాలు!

డ్రింక్స్ దగ్గర నుండి ఆహార పదార్థాల తయారీలో ఉపయోగించడం వరకు నిమ్మకాయ చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా నిమ్మకాయంతో పులిహోర, పచ్చడి, నిమ్మకాయ జ్యుస్ వంటివి రోజులో రొటీన్ గా మారిపోతాయి చాలామందికి. ఎండపొద్దున కాసింత నిమ్మకాయ జ్యుస్ తగిస్తే మధ్యతరగతి, దిగువ తరగతి కుటుంబాల వారికి చెప్పలేనంత కిక్. వారి ఆర్థిక పరిస్థితికి అదే గొప్ప కూల్ డ్రింక్. కానీ ఎన్ని డబ్బులు పెట్టి కొన్న కూల్ డ్రింక్ అయినా ఈ నిమ్మ జ్యుస్ ముందు దిగదుడుపే.  నిమ్మకాయ మనకు నిత్యజీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యాన్ని కలిగించే పోషక విలువలతోబాటు, రోగ నిరోధకశక్తి అధికంగా కలిగి ఉంది. దీనిని అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. షర్బత్లలోను, ఊరగాయగాను వాడటం కామన్. అయితే నిమ్మకాయను  నిత్యం ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. పండిన నిమ్మ కాయ తోలునుంచి తీసె నిమ్మనూనె, నిమ్మరసం బాగా ఉపయోగపడతాయి. శరీరానికి పుష్టి కలిగించే విటమిను 'ఎ' విటమిను 'బి', విటమిను 'సి'లు నిమ్మకాయలో పుష్కలంగా లభిస్తాయి. ఇంకా ఐరన్. కాల్షియం భాస్వరము పొటాషియం మొదలగు పోషక పదార్థాలు లభిస్తాయి.  దీనిలో వేడిని కలిగించే గుణం వుంది. పౌష్టికాహారమే కాకుండా దీనిని ఇతర ఆహార పదార్థాలలో పిండినప్పుడు కొత్త రుచిని కలిగిస్తుంది. ఇందులో విటమిను 'సి' ఎక్కువగా ఉన్నందువల్ల ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. డిప్తీరియా, టెటానస్ వంటి వ్యాధులను కలిగించే విషక్రిములను నశింపచేస్తుంది. అన్నిరకాల వైరస్ల నుంచి కాపాడుతుంది. ప్రతిరోజు భోజనానికి అరగంటముందు నిమ్మరసం త్రాగితే జీర్ణశక్తి పెరుగుతుంది. మసూచి, పొంగు, ఆటలమ్మ వంటి వ్యాధులతో మిక్కిలి దప్పికతో బాధపడేవారికి 15 నుండి 25 గ్రాముల నిమ్మరసం ఇస్తూ ఉంటే.. దప్పిక తగ్గుతుంది. వాంతులయ్యే వారికి, అజీర్తితో బాధపడేవారికి ఇది ఎంతగానో మేలు చూకూరుస్తుంది. నిమ్మరసం రెండు పూటలా సేవిస్తే చిగుళ్ళ వ్యాధి సోకదు. రక్తవిరేచనముల నివారణకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిని రోజూ వాడితే ముఖవర్చస్సు, శరీరకాంతి పెరుగుతుంది. ఒకప్పుడు చాలా ఇళ్లలో నిమ్మ చెట్లు కనిపించేవి. ఇప్పుడు అదంతా కనుమరుగయ్యింది.  ప్రతివారు తమ ఇంట్లో నిమ్మచెట్టు ఉంచుకోవటం మంచిది. అందువల్ల ఆరోగ్యం సులభంగా మనకు అందుబాటులో వున్నట్లే, నిమ్మరసం, వెల్లుల్లి రసం కలిపి సేవిస్తే కీళ్ళవాతం నయమవుతుంది. నిమ్మరసం న్యూయోనియా వ్యాధిని నివారిస్తుంది. జలుబును దూరం చేస్తుంది. మొటిమల నుంచి కాపాడుతుంది. నిమ్మరసంతో మర్థనచేస్తే చర్మవ్యాధులు దగ్గరకే రావు. 450 గ్రాముల పాలలో తగినంత నిమ్మరసం కలిపి త్రాగితే మూలశంఖ రోగుల ఆసనం నుంచి రక్తం కారడం ఆగుతుంది. వికారాన్ని పోగొడుతుంది. దంత వ్యాధులను నిరోధిస్తుంది. ఇది మానవులపాలిటి ఆరోగ్యాన్ని ప్రసాదించే “కల్పవృక్షం” వంటిది. కాబట్టి నిమ్మకాయను మరీ అంత తీసి పడేయకండి. సాధారణ వ్యక్తులకు కూడా సులువుగా లభించే నిమ్మను వాడటం మరచిపోకండి.                                          ◆నిశ్శబ్ద.

ఉత్తమమైన ఆహారం ఇదే!

ఆహారాన్ని రెండు రకాలుగా విభజించవచ్చు.    1. శాకాహారము 2. మాంసాహారము.  ఈ రెండింటిలో ఏది ఉత్తమ ఆహరం అంటే శాఖాహారమే.. మాంసాహారము మాత్రమే నిత్యమూ తీసుకునే వారు చాలా తక్కువ. మిశ్రమ ఆహారం తీసుకునే వారినే మాంసాహారులుగా అనటం జరుగుతుంది. అయితే మాంసాహారం తినడం వల్ల ఎటువంటి నష్టము జరుగదు. కానీ మాంసాహారంవల్ల కలిగే ఉపయోగములను, శాకాహారము తీసుకోవడం ద్వారా కూడా పొందవచ్చును. కాని శాకాహార ద్వారా పొందే లాభాలను, మాంసాహారం ద్వారా పొందలేము. ఇదే అందరూ తెలుసుకోవలసిన విషయం. ఆహారమనేది ఆరోగ్యంగా జీవించటానికి తీసుకుంటాము. కాబట్టి మనకు ఆరోగ్యప్రదమైన దానినే ఉత్తమ ఆహారంగా నిర్ణయించుకోవాలి. మాంసాహారము కొలెస్ట్రాల్ ఎక్కువగా కలిగి ఉంటుంది. జంతు సంబంధమైన ఆహారంవల్ల వాటి యొక్క వ్యాధులు మనకు సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మాంసాహారం శాకాహారంలాగా సులువుగా జీర్ణంకాదు. జీర్ణక్రియకు తోడ్పడే పీచు, నారవంటి పదార్థములు ఇందులో లభించవు. శాకాహారంవల్ల మాంసాహారములో వుండే పోషక విలువలు పొందవచ్చు. వేరుశనగ, బఠాణి, చిక్కుళ్ళు, పప్పుధాన్యాలు మొదలగు వాటిలో మాంసకృత్తులు సమృద్ధిగా లభిస్తాయి. మాంసకృత్తులు కణనిర్మాణానికి తోడ్పడతాయి. జీవక్రియలో కలిగే ప్రతిచర్యలను క్రమపరచడానికి పనికివస్తాయి. కొంతవరకు శక్తిజనకాలుగా పనిచేస్తాయి. ఇకపోతే దేహానికి కావలసిన సంపూర్ణశక్తిని పిండిపదార్థాల ద్వారా పొందవచ్చు. బియ్యం, బంగాళదుంపలు, జొన్నలు, కాయధాన్యములు ద్వారా పిండిపదార్థములు కొంతవరకు మాంసకృత్తులు లభిస్తాయి. మాంసం, చేపలు, కోడిగ్రుడ్లు, పాలు ద్వారా లభించేవి సంపూర్ణ మాంసకృత్తులు, బియ్యం, జొన్నలు, కాయధాన్యాలు, చిక్కుళ్ళు మొదలగు వాటిద్వారా లభించేవి అసంపూర్ణ మాంసకృత్తులు, అయితే శాకాహారములో లోపించిన పోషకములను మరొక పదార్థముద్వారా పూరించుకోవచ్చు. అన్నంతోపాటు చిక్కుళ్ళు కలిపి తీసుకుంటే మాంసం, చేప, కోడిగ్రుడ్లులలో లభించినంత మాంసకృత్తులు లభిస్తాయి. మాంసకృత్తులతోపాటు, ఇతర పోషకములు కూడా లభిస్తాయి. కాబట్టి సమతులాహారంగా పనిచేస్తుంది. కాబట్టి మాంసాహారంలో లభించే మాంసకృత్తులకన్నా శాకాహారంలో లభించే మాంసకృత్తులే ఆరోగ్య కరమైనవి. నిత్యజీవితంలో మనిషికి అవసరమయ్యే మాంసకృత్తులు ఎంతంటే మనిషి కిలో బరువుకు 8గ్రాముల మాంసకృత్తులు అవసరం.  అంతకు కొంత తగ్గినా నష్టం ఏమిలేదు. ఎదిగే పిల్లలకు, గర్భిణీస్త్రీలకు మాత్రమే కొంచెం అధికంగా కావలసి వుంటుంది. మాంసకృత్తులు అధికంగా తీసుకోవటం శరీరానికి మంచిదికాదు. మాంసాహారం తీసుకునేవారి మూత్రపిండాలు శాకాహారం తీసుకునేవారికన్నా 1.5 రెట్లు పెద్దవిగా ఉంటాయట. మాంసాహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి కాలేయం మరింత కష్టపడి పనిచేయవలసి రావటంవల్ల పెద్దవిగా తయారవుతున్నట్లు భావిస్తున్నారు. శాకాహారం లో లభించే మాంసకృత్తుల వలన ఏ రకమైన ఇబ్బంది లేదు. మాంసకృత్తులు అధికంగా తీసుకున్నందువల్ల శరీరం ఉపయోగించుకోగా మిగిలిన మాంస కృత్తులు, క్రొవ్వుగా పేరుకుపోయి నిలవచేయబడతాయి. మాంసకృత్తులు అధికంగా వుండటంవలన జీర్ణక్రియలో అధిక శ్రమ ఏర్పడుతుంది. అందువల్ల ఎముకలలో గల కాల్షియంను ఈ జీర్ణక్రియ గ్రహించి, మూత్రంద్వారా విసర్జిస్తుంది. దానివలన మాంసకృత్తులు ఎక్కువగా తీసుకునే వారి ఎముకల్లో కాల్షియం లోపించి, ఎముకలు బలహీనమవుతాయి. మాంసాహారము తీసుకునే వారిలోకన్నా శాకాహారం తీసుకునే  వారిలోనే శక్తి అధికంగా ఉంటుంది. మాంసాహారులు కొంచెం శ్రమచేయగానే అలసటకు లోనవుతారు. శాకాహారులలో ఈ లక్షణం కనబడదు. కాబట్టి మాంసాహారంకన్న శాకాహారం ఉత్తమమైన ఆహారంగా చెప్పవచ్చు. మనకు నిజమైన ఆహారం, అనారోగ్యాన్ని కలిగించని పండ్లు, కూరగాయలు, ధాన్యములు మాత్రమే. నూనె పదార్థములు, తీపి, క్రొవ్వు పదార్థములను, మాంసాహారమును తగ్గించడం ఆరోగ్యానికి మంచిది.                                       ◆నిశ్శబ్ద.

జలుబే కదా అని నిర్లక్ష్యం చేస్తే.. ఇంతకు దారితీస్తుందా??

సాధారణంగా వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలతో జలుబు మొదటి స్థానంలో ఉంటుంది. కాస్త చల్లని వాతావరణం ఏర్పడితే చాలు మెల్లగా జలుబు అటాక్ చేస్తుంది. మొదటి దశలోనే దీనికి సరయిన జాగ్రత్తలు తీసుకోకపోతే గొంతు నొప్పి, బ్రాంకైటిస్ మొదలైన శ్వాసనాళ వ్యాధులకి దారి తీయవచ్చు. జలుబు వల్ల ముక్కులోను, శ్వాసనాళంలోను ఇన్ఫ్లమేషన్ ఏర్పడుతుంది. వైరస్ కారణాన, అలర్జీ వల్ల జలుబు రావచ్చు. వైరస్ వల్ల కలిగే జలుబు ముక్కు, గొంతు, నోరు నుంచి బయటికి వెలువడే వాయువుల తుంపర్లు మొదలైన వాటి వల్ల ఒకళ్ళ నుంచి మరొకళ్ళకి వ్యాపిస్తుంది. అందుకని ఎక్కడపడితే అక్కడ చీదడం, ఉమ్మేయడం మంచిది కాదు. దగ్గు వచ్చినప్పుడు నోటికి అడ్డంగా కర్చీఫ్ పెట్టుకోవడం మంచిది. ఇది కనీస సభ్యత, అందరూ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం. ఒక్కోసారి దుమ్ము, పొగ, కొన్ని వాసనలు మొదలయినవి పడక అలర్జీ వల్ల జలుబు రావచ్చు. ఈ పరిస్థితులకు, పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది. ముక్కు వెంట కేవలం నీరు మాత్రమే వస్తే పెద్ద భయపడాల్సింది ఏమీ లేదు. ఆ జలుబు ఏ వైరస్ కారణానో వచ్చినట్లు! ఆలర్జీ కలిగినప్పుడు తుమ్ములు, నీళ్ళు కారడం కూడా ఆ పరిస్థితులకు దూరమైనప్పుడు తగ్గిపోతాయి. అలా కాకుండా ముక్కు నుంచి చీము వస్తూ గొంతు బొంగురుపోతే వెంటనే డాక్టర్ కు చూపించాలి. ఇలాంటి సమయంలో కొద్దిపాటి జ్వరము కూడా రావచ్చు. గుండె, శ్వాసకోశ వ్యాధులు ఉన్నప్పుడు జలుబు ప్రమాదకరంగా పరిణమించవచ్చు.  జలుబు జాగ్రత్తలు:- జలుబు రాగానే బాగా గాలివచ్చే ప్రదేశంలో ఉంటూ పిల్లలకు, వృద్ధులకు దూరంగా ఉండాలి. వైరస్ వల్ల కలిగే జలుబుకి మందులు వాడడం దండగ, దానంతటదే తగ్గుతుంది గాని, మందులవల్ల తగ్గదు. అవి మాత్రమే కాకుండా  మరికొన్ని శ్వాసనాళ, శ్వాసకోశ అనారోగ్యాలు కూడా ఎదురవుతాయి.  బ్రాంకైటిస్ తీవ్రమైన బ్రాంకైటిస్ తలనొప్పి, గుండెనొప్పి, కళ్ళె, దగ్గు, లేక పొడిదగ్గు వుంటాయి. దీర్ఘమైన బ్రాంకెటిస్ బాధాకరమైన దగ్గు, కళ్ళె కూడా పడుతుండవచ్చు. ఈ జబ్బు బ్రాంకో న్యుమోనియా వంటి వ్యాధులకూ దారి తీయవచ్చు. అందుకని ఈ పరిస్థితుల్లో డాక్టర్ కు చూపించడం ఎంతో అవసరం. దీనికి మందులు, యాంటీ బయోటిక్స్ డాక్టర్ సలహా మీదే వాడాలి. బ్రాంక ఎక్టసిస్ శ్వాసనాళాల విస్తరణని బ్రాంక ఎక్టసిస్ అంటారు. క్రిమిదోషాల వల్ల, శ్వాస నాళాంతర పీడన శక్త్యాధిక్యత వల్ల ఈ జబ్బు రావచ్చు. దగ్గు, దుర్గంధముతో కూడిన కళ్ళె పడడం, ఆయాసము, రక్తం వాంతి ఈ వ్యాధి లక్షణాలు, ఊపిరితిత్తులలో పేరుకుపోయిన కళ్ళె బయటకు పంపడం అవసరం. ఫెరింజైటిస్ గొంతు ఇన్ఫ్రేమ్ కావడం ఫెరింజైటిస్. జలుబుకి కారణాలే ఇందుకూ కారణం అవుతాయి. మింగడం కష్టమై గొంతు పాడి ఆరిపోవడం, గొంతులో దురద లక్షణాలు బాగా ఎక్కువైతే మ్రింగడం కూడా కష్టమైపోతుంది. నీరసం, జ్వరము వస్తాయి. తడిలో నాసడము. చలిగాలి, శ్వాసకోశమును ఇరిటేట్ చేసే పొగలు పీల్చడం, అతిగా మాట్లాడడం తగ్గించాలి. వెంటనే చికిత్స తీసుకోకపోతే ఈ ఇన్ఫెక్షన్ క్రమంగా శ్వాసకోశానికి వ్యాపించవచ్చు. బ్రేకియా అంటే శ్వాసనాళానికి ఇన్ఫ్లమేషన్ వస్తే 'ట్రాకియైటిస్' అంటారు. వీటన్నింటిలో ధూమపానము ఆపేయాలి. గొంతు నొప్పికి డిప్తీరియా కూడా కారణం కావచ్చు. అందుకని పిల్లలో గొంతు నొప్పి వస్తే వెంటనే డాక్టర్ కు చూపడం మంచిది.  ట్యూబర్క్యులోసిస్ (టి.బి) ఇది నెమ్మదిగా శ్వాసకోశాన్ని దెబ్బతీస్తుంది. మైకో బాక్టీరియమ్ ట్యుబర్క్యులోసిస్ అనే సూక్ష్మజీవులు గాలిలో నుంచి ఊపిరి తిత్తులలోకి ప్రవేశించడం వల్ల ఈ అనారోగ్యము కల్గుతుంది. లోపలికి వెళ్ళి ఈ సూక్ష్మజీవులు ఆల్వియోలైలని నాశనం చేస్తాయి. కణాలని చంపేస్తాయి. ముందు ఊపిరితిత్తుల పై భాగంలో ఈ వినాశనం చేస్తాయి. చనిపోయిన కణాల భాగాన్ని ట్యూబర్కిల్ అంటారు. ఈ ట్యూబర్కిల్స్ క్రమంగా పెరగడం వల్ల ఊపిరితిత్తుల లోపల ఖాళీలు ఏర్పడతాయి. శ్వాస కష్టమవుతుంది. మొదట్లో పొడిదగ్గు వస్తుంది. తర్వాత కళ్ళె, చివరికి రక్తం పడుతుంది. కొద్దిపాటి జ్వరం ఉంటుంది, ఆకలి వుండదు. బరువు తగ్గుతుంటుంది. ట్యూబర్క్యులోసిస్ వ్యాధిని ఎక్స్ రే, కళ్లె పరీక్షలు, బరువు తగ్గడంతో కనుక్కోవచ్చు. దీన్నే టి.బి అని కూడా అనడం వినే ఉంటాం. ఏడాదిన్నర లేక రెండేళ్లు వాడితే గాని ఈ వ్యాధి నయం కాదు. అనుమానం రాగానే ప్రారంభదశలోనే డాక్టర్ కి చూపించి, సరయిన చికిత్సని పొందడం ముఖ్యం. మెడలో బయటికి వాపు కనిపిస్తూ టి.బి లింఫాడెంటిస్ రావచ్చు. మెదడుకి క్షయ మెనింజైటిస్ రావచ్చు. ఎముకలకి ఆహార నాళానికి కూడా (ట్యూబర్క్యులోసిస్) క్షయ రావచ్చు.  కాబట్టి జలుబే కదా అని నిర్లక్ష్యం చేయకండి.                                   ◆నిశ్శబ్ద.

మైగ్రేయిన్ అవగాహన వారోత్సవాలు...

మై గ్రెయిన్ వచ్చిందంటే భరించలేని తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. తీవ్ర మైన నొప్పి తలతిరగడం తల పట్టేయడం ఒక్కసారి వదల గానే వాంతులు. రావడం తో నరకం చూస్తున్నామని వారు వాపోవడం గమనించవచ్చు.మై గ్రెయిన్ కు అలోపతిలో అందరికీ పనిచేయక పోవచ్చు. మై గ్రెయిన్ తో బాధ పడేవారు ఒక్కోసారి ఆత్మహాత్య చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. మైగ్రేయిన్ ఒక న్యూరో లాజికల్ సమస్యగా డాక్టర్స్ పేర్కొన్నారు. మైగ్రేయిన్ పై అవగాహనా వరాన్ని సెప్టెంబర్ నెలలో ప్రతియేటా నిర్వహిస్తారు. సెప్టెంబర్ 5 వ తేదినుండి 1 4 తేది వరకూ మైగ్రేయిన్ పై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మైగ్రేయిన్ వల్ల వచ్చే నొప్పి మామూలు సాధారణ మైన తలనొప్పి కాదు చాలా తీవ్రమైన తలనొప్పి తో పాటు తల నొప్పి తీవ్రమై నప్పుడు కళ్ళు చీకట్లు కమ్మడం వినికిడి సమస్య రావడం గమనించవచ్చు. మైగ్రెయిన్ వచ్చినప్పుడు ఇంటి చిట్కాలు వైద్యం చేయవచ్చు వీటివల్ల కొంతమేర మై గ్రెయిన్ తీవ్రత తగ్గి ఉపసమనం కల్పిస్తుంది. మైగ్రెయిన్ అట్టాక్ నుండి కొంత మేర ఉపసమనం కలిగించే 8 ఉపాయాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. లేవెండర్ ఆయిల్ తో లాభం... లేవెండర్ ఆయిల్ ను రాయడం ద్వారా మైగ్రేయిన్ వల్ల వచ్చే నొప్పి కొంతమేర ఉపశమనం ఉపశమనం కలుగుతుంది.  లేవెండర్ ఆయిల్ ను వేరే నూనెలో కలిపి రాయవచ్చు. లేవేండర్ నూనెను మీ మెదడుపై మృదువుగా వ్రాయవచ్చు. పెప్పర్ మెంట్ ఆయిల్... పెప్పర్ మెంట్ ఆయిల్ లో కనుగొన్న మెంతాల్  రసాయనం మైగ్రైయిన్ ను నిలువరించే నిరోదించేందుకు సహకరిస్తుంది ఈ విషయం పై పలు పరిశోదనలు నిర్వహించారు. అల్లం... కళ్ళు తిరగడం మైగ్రేయిన్ స్థితికి కారణం కావచ్చు. దీనినుండి బయట పాడేందుకు అల్లం కొంతమేర ఉపసమనం కలిగిస్తుంది. అల్లం వాడకం వల్ల మైగ్రేయిన్ కు కొంతమేర ఉపసననం తోపాటు లాభం చేకూర వచ్చు  యోగాతో మైగ్రేయిన్  కు అడ్డుకట్ట... మైగ్రేయిన్ నుండి ఉపసమనం పొందడానికి యోగ దోహదం చేస్తుంది. యోగాలో శ్వాస తీసుకునే పద్దతులు ధ్యానం సాధన చేయడం ద్వారా ఒత్తిడి తగ్గించవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు. 2౦ 15 లో జరిగిన పరిశోదనలో యోగాతో మై గ్రెయిన్  అటాక్ తీవ్రతను తగ్గించవచ్చని తేలింది. ఆహారం లో మెగ్నీషియం పెంచండి... శరీరంలో మెగ్నీషియం తగ్గడం వల్ల మైగ్రేయిన్ నొప్పి మరింత తీవ్రంగా ఉండవచ్చు. అసలు మెగ్నీషియం తలనొప్పికి సంబంధం ఉందని అంటున్నారు. అందుకే మీ ఆహారం లో బాదాం, అవిసగింజలు, ఆకు కూరలు,నట్స్,పీనట్ బట్టర్, ఓట్ మీల్, గుడ్లు,పాలు, ఎక్కువగా తీసుకోండి. ఒత్తిడి నియంత్రించే ప్రయత్నం చేయండి... అమెరికన్ మైగ్రెయిన్ ఫెడరేషన్ సమాచారం మేరకు మైగ్రేయిన్ తోబాద పడుతున్నవారు దాదాపు 8౦%మందిలో ఒత్తిడి కారణం గానే మైగ్రేయిన్ కు కారణంగా నిపుణులు పేర్కొన్నారు. మీరు ఒత్తిడిని అదుపులో ఉంచుకుంటేనే  మైగ్రేయిన్ అటాక్ తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు గుర్తించారు. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచండి... అమెరికన్ మైగ్రేయిన్ ఫౌండేషన్ సూచన ప్రకారం మైఇగ్రేయిన్ బారిన పడిన వారిసంఖ్య 1/౩ డీహైడ్రేషన్ వల్లే మైగ్రేయిన్ వస్తుందని డీ హైద్రెషన్ నుండి రక్షింప బడాలంటే నీరు తీసుకోవాలి ప్రత్యేకంగా వ్యాయామం చేయాలి ఎండాకాలం లో నీరు మరింత ఎక్కువ తాగాలి. రాత్రి నిద్రపోఎందుకు ప్రయత్నం చేయాలి... నిద్ర మరియు డీ హైడ్రేషన్ కు ఏమైనా సంబంధం ఉందా? అన్న విష్యం తెలియరాలేదు అయితే 2౦16 లో వచ్చిన రిపోర్ట్  ఆధారం గా మైగ్రేయిన్ అట్టాక్ మళ్ళీ మళ్ళీ వస్థూ ఉంటె నిద్రలేకుంటే దీనికి సంబంధం ఉందని తేల్చారు. అందుకే రాత్రి సంపూర్ణంగా నిద్రపోయే ప్రాయాత్నం చ్ఘేయాలంటే నిద్రాపోఎముండు కాఫీ, లేదా టీ తీసుకుంటే నిద్రారాడు దీనివల్ల మరింత సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు.మైగ్రేయిన్ పై ఉన్న భిన్నమైన అఫాలు అనుమబాలకు సందేహాలకు సెప్టెంబర్ లో మైగ్రేయిన్ అవగాహన వరాన్ని నిర్వహించడం కొనసాగుతోంది.