నీటితో వైద్యం నమ్మలేని ఫలితం!!

చలికాలంలో నీటికి దూరంగా ఉంటారు చాలామంది. నీరు తాగాలన్నా బద్ధకమే. చాలామంది వేడిగా కాఫీలు, టీలు తాగుతూ గడిపేస్తారు. కానీ శరీరానికి తగినంత నీరు కచ్చితంగా అవసరం.  ఆరోగ్యంగా ఉండటానికి నీటి అవసరం చాలావుంది. అయితే నీటి అవసరాన్ని, ఉపయోగాన్ని గుర్తించక చాలామంది నిర్లక్ష్యంతో అనారోగ్యానికి గురి అవుతున్నారు. శరీర నిర్మాణంలో 60 నుండి 70 శాతం నీటితో కూడి వుంది. కండరాలలో కూడా 70 శాతం నీరు వుంటుంది. గట్టిగా ధృడంగా ఉండే ఎముకలలో కూడా మూడవవంతు నీరు ఉంటుంది. రక్తంలో కూడా ఎక్కువశాతం నీరు  వుంటుంది. ముఖ్యంగా మెదడు కణాలలో 70 శాతం వరకూ నీరు ఉంటుంది. మానవ శరీరానికి మన ఊహకు మించిన ప్రాధాన్యత నీటికి ఉంది. సరిపడినంత నీరు  ఉండకుండా లోపిస్తే శరీరంలో అనేక మార్పులు కలుగుతాయి. ఏ వైద్యుని సలహా అడిగిన నీరు బాగా త్రాగటం చాలా అవసరమనే విషయాన్ని చెప్తారు. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే రెండు గ్లాసులు వెచ్చటి నీరు త్రాగడం అలవాటు చేసుకుంటే మలవిసర్జనకు ఎంతగానో దోహదం చేస్తుంది. ఎన్నో మందులకన్నా ఈ పద్ధతి చాలా చక్కగా పని చేస్తుంది. వెచ్చటి నీరు అలవాటులేనివారు, క్రమబద్ధంగా రోజుకు కొంచెము కొంచెముగా అలవాటు చేసుకుంటూ రెండు గ్లాసులు త్రాగ గలిగేంతవరకూ అలవాటు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. రాత్రి అలాగే ఉంచిన  నీరు రెండు గ్లాసులు ఉదయాన్నే త్రాగితే వాత, పిత్త, కఫరోగములు నశిస్తాయి. రాత్రి పడుకునేముందు రెండు గ్లాసులు నీరు త్రాగితే ఉదర రోగములు, ఆర్మమొలలు, వాపులు, నేత్ర వ్యాధులు తగ్గిపోతాయి. .  ప్రతిఒక్కరూ నీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అవసరము. అవి ఏంటంటే…  ప్రతి ఉదయం నిద్ర లేవగానే రెండు గ్లాసులు నీరు త్రాగడం మంచిది. ఉదయం అల్పాహారానికి, మధ్యాహ్నం భోజనానికి మధ్యలో రెండు గ్లాసులు త్రాగాలి. భోజనం చేస్తున్న సమయంలో మధ్యలో ఎక్కువగా నీరు త్రాగకూడదు. మధ్యాహ్న భోజనానికి, రాత్రి భోజనానికి మధ్య సమయంలో రెండు గ్లాసుల నీరు త్రాగడం అవసరం. నిద్రపోయేముందు మళ్ళీ రెండు గ్లాసుల నీరు త్రాగడం మంచిది. ఇలా ప్రతిరోజు 8 గ్లాసుల నీరు తీసుకోవడంవల్ల శరీర క్రమంలో మార్పులు కలుగకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నీటి ద్వారా సామాన్య వ్యాధుల నివారణ ఎలా సాధ్యమంటే…  జలుబు, దగ్గు, ఉబ్బసం వ్యాధులకు కాచిన నీరు ఎక్కువగా త్రాగడం, ఆవిరిపీల్చడం వలన రిలీఫ్ చేకూరుతుంది. బెణుకులు, వాపులకు, వేడినీటి కాపడం పెట్టడం వలన తగ్గుతాయి. ముక్కులు బిగిసినప్పుడు ఉప్పునీటిని ముక్కుతో పీల్చాలి. గొంతు నొప్పికి, వేడినీటిలో ఉప్పుకలిపి గొంతులో పోసుకుని పుక్కిలించడం వలన బాధ తగ్గుతుంది. మలబద్ధకంతో బాధపడేవారు పడుకునే ముందు, ఉదయం లేవగానే నీరు తాగితే సమస్య తగ్గుతుంది. దురదలు, మంటలు ఏర్పడినప్పుడు చన్నీటి కాపడం పెడితే ఉపశమనం కలుగుతుంది. కాచిన నీరు తాగుతూ, శరీర అవయవాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా  అంటువ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు. జ్వర తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చల్లని నీటిలో శుభ్రమైన గుడ్డను తడిపి నుదుటిమీద వుంచితే తీవ్రత తగ్గుతుంది. ఇలా  నీటితో లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి నీటికి దూరం  ఉండకండి.                                       ◆నిశ్శబ్ద.

బాబోయ్.. మధుమేహం వల్ల కంటి చూపు పోయే ప్రమాదముందా?

ఆధునిక విజ్ఞానం, మనిషికి ఎంతో సుఖవంతమైన జీవితాన్ని ప్రసాదించింది. యంత్రాల హవా పెరిగిన తరువాత  శారీరక శ్రమ తగ్గి యంత్రాలతో పని చేయించడం ఎక్కువయ్యింది. దీనివల్ల మనం తినే ఆహారానికి, చేసే శ్రమకు మధ్య చాలా వ్యత్యాసం ఏర్పడింది. దానితో ఆహార పదార్థాల నిల్వలు అవసరాన్ని మించి, శరీరంలో పేరుకుపోతున్నాయి. రక్తంలో వుండే, గ్లూకోజ్, మాంసకృత్తులు, కొవ్వులు, లవణాలు, హార్మోనులు నిర్ణీతమైన స్థాయిలోనే వుండాలి. ఆహారం ఎక్కువగా తీసుకున్నా, తక్కువగా తీసుకున్నా, వీటిస్థాయి మాత్రం నిలకడగా వుండేలా శరీరం జాగ్రత్త తీసుకుంటుంది.  అవసరాన్ని బట్టి ఆహారపదార్ధాలు వినియోగించబడతాయి. అవసరాలకు మించిన నిల్వలను దాచి పెట్టడం లేక విసర్జించడం జరుగుతుంది. ఈ విధంగా అదుపు చేయడానికి ఇన్సులిన్ అనే హార్మోను కృషి చేస్తుంది. రక్తంలో వుండే చక్కెర పదార్థాలు అదుపులేకుండ పేరుకోవడాన్ని మధుమేహం అంటారు. ఇది రక్తానికి సంబందించిన వ్యాధి కాబట్టి, శరీరంలో అన్ని అవయవాలకు వ్యాపిస్తుంది. మధుమేహం శరీరానికి ఇతర వ్యాధులు రావటానికి అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తుంది. అంతేకాక దీని కారణంగా శరీరానికి  నెమ్మదిగా ఏర్పడే వ్యాదులు వేగంగా ఏర్పడతాయి. దృష్టిలోపం తొందరగా మొదలౌతుంది. మధుమేహం ఉన్నవారు కంటి అద్దాలు త్వరత్వరగా మార్చుకోవలసి వస్తుంది. రక్తంలో చక్కెర మార్పులను బట్టి, ఒకే అద్దాలు, వివిధ సమయాలలో, వేరువేరుగ కనినిస్తాయి. కంటిలో శుక్లము: మధుమేహము ప్రత్యేకంగా కంటిలో శుక్లం కలిగించడం అరుదు. అయినప్పటికి కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగిన మధుమేహం కంటిలో శుక్లానికి కారణం అవుతుంది. మధుమేహం ద్వారా ఏర్పడే శుక్లాన్ని మంచుపొడి (స్నోఫ్లేక్) శుక్లము అంటారు. ఇవి కటకపు సంచి సమీపంలో హెచ్చుగా ఏర్పడతాయి. రెండు కళ్ళలోనూ ఒకే రీతిగా వుంటాయి. మంచి వైద్యసదుపాయాలు అందుబాటవ్వడంతో మధుమేహపు రోగుల జీవన ప్రమాణం పెరిగింది. ఇలా జరగడం వలన మరొకరకం సమస్య ఉత్పన్నమయ్యింది. రక్తప్రసరణంలో వచ్చిన మార్పులవలన "రెటినోపతి" అనే వ్యాధి అధికమయ్యింది. దీంట్లో నాడీకణాలు మరణిస్తాయి. నాడులలో కొవ్వు పేరుకుంటుంది. రక్త సరఫరా అధికం చేద్దామని కొత్త రక్త నాళాలు పుడుతుంటాయి, పుడితే ప్రమాదం లేదు కాని ఇందులో నుండి రక్తం లీకవుతుంటుంది. లీకయిన రక్తం యొక్క పరిమాణాన్ని బట్టి వివిధ పొరల్లో పేరుకొంటుంది. ఇలా పేరుకొన్న రక్తం, కాంతి కిరణాలకు ఆటంకంగా తయారయ్యి దృష్టి మాంద్యం ఏర్పడుతుంది. శరీర భాగాలలో ఎక్కడైన రక్తం పేరుకొంటే, దాని పరిమాణం, దాని ప్రదేశము బట్టి ఫలితం వుంటుంది. కంటి సాసలో రక్తం చిమ్మితే, ఆరక్తం త్వరగా పీల్చుకోబడదు. కనీసం మూడునెలల పాటు అలాగే వుండిపోతుంది. చిమ్మిన రక్తం, కాంతి కిరణాలను రెటీనాపై కేంద్రీకరించకుండా అడ్డుకొని అంధత్వం కలిగిస్తుంది. నాడిపొరల్లో ఏర్పడ్డ కొత్త రక్త నాళాలు ఇందుకు కారణం. కొన్నాళ్లకు కరిగిపోయినా, మరలా మరలా అలా రక్తం చిమ్ముతూనే వుంటుంది. చివరకు అంధత్వంతో ఇది ఆగిపోతుంది.  రెనల్ డిటాచ్మెంట్ :  నాడి పొరలకే పరిమితమైన కొత్త రక్తనాళాలు పేరుకొన్న ఈ రక్తం వెంబడి కంటి సొనలోనికి ప్రవేశిస్తాయి. ఇవి ఎలాస్టిక్ ధర్మం కలిగి వుండటం వలన మధ్యలో పొరను లాగుతుంటుంది. నాడిపొర అసలే వదులుగ అతుక్కొని వుంటుంది కాబట్టి సులువుగా విడిపోతుంది. . దీనిని రెటినల్ డిటాచ్మెంట్ అంటారు. మధుమేహం ఉంటే ఇలా ఇన్నిరకాల కంటి సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు ఎప్పటికప్పుడు కళ్ళు చెకప్ చేయించుకుంటూ ఉండాలి. లేకపోతే ఊహించని విధంగా దృష్టిలోపం సమస్య పెరిగే అవకాశం ఉంటుంది.                                   ◆నిశ్శబ్ద. 

యూత్ మెంటల్ ఎమెర్జెన్సి  హెల్త్ ...

రేపటి తరానికి ప్రతినిధి యువతే వారిఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిది. ఈనేపధ్యంలో  అమెరిక దేశంలోని  యువత తీవ్ర మానసిక అనారోగ్యం బారిన పడుతున్నట్లు పలు పరిశోదనలు వెల్లడిస్తున్నాయి. ప్యాండ మిక్ తరువాత  యువత తీవ్ర మానసిక సమాస్యలను ఎదుర్కుంటోంది. ఈనేపధ్యం లో ఒమైక్రాన్ ను  ఎదుర్కోవాలంటే బూస్టర్ రక్షణ కల్పిస్తుందా అన్నదే సందేహం. ప్యాండమిక్ ప్రజలకు సహాయం చేసిందా? హానిచేసిందా ? మానసిక సంబంధమైన అనారోగ్య  సమస్యను ఎదుర్కుంటున్నారు. ఇక తాగిన వారు తాము త్గాగినా బండి నడపగలం అని నమ్ముతారు. ప్యాండమిక్ వచ్చినట్లుగా భ్రమ పడుతూ ఉంటారు.ముఖ్యంగా  ఆరోగ్యకార్యకర్తలు ఎక్షగ రేషన్ ఎదుర్కుంటున్నారు. అమెరిక లోని యుక్త వయస్సులో ఉన్న యువత మానసిక అనారోగ్యం తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అని సర్జన్లు హెచ్చరించారు. అత్యవససమయంలో యుక్తవయస్సులో ఉన్న ఆడపిల్లలు ఆత్మహాత్యలు చేసుకోవడం గమనించవచ్చు. 2౦19 -2౦21 మధ్యకాలం లో 51% అంటే 4% పెరిగిందని అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా యుక్త వయస్సులో ఉన్నవారిలో యాంగ్ జై  టి,డిప్రషన్ శాతం రెండింతలు  పెరిగింది. యు ఎస్ లో  ఇంకా మానసిక అనారోగ్య సమస్యలు పెరుగుతూనే ఉన్నాయని అంటున్నారు నిపుణులు. డిప్రషన్ మూలంగా ఇ ఆర్ విజిట్లు పెరిగాయని యాంగ్ జైటీ  లాంటి లక్షణాలు 2౦11 -2౦15  నాటికి 28% పెరిగాయి.  యుక్తవయస్సులో ఉన్న యువత మనసిక అనారోగ్యం బారిన పడడానికి కారణాలు... ముఖ్యంగా యుక్తవయస్సులో ఉన్నవారు పూర్తిగా పరిణతి చెందక పోవడం.వేగంగా పెరుతున్న మీడియా ముఖ్యంగా సోషల్ మీడియా వ్యవస్థ, కుటుంబ  వ్యవస్థలో లోపాలు చుట్టూ ఉన్న స్నేహితులు, యువత పై పడుతున్న మెసేజ్ బాంబులు,కురుస్తున్నాయి. మెసేజ్ లు,కొన్ని కొన్ని సందర్భాలలో వ్యక్తి గతంగా ఆలోచన నసించి పోతుంది. సన్నగా చూడడానికి బాగుంటే చాలు, పెద్దగా వారు ప్రాచుర్యంలో లేక పోయినా అంటే పాపులర్  కాక పోయినా పరవాలేదు. కొంత తెలివిగా స్మార్ట్ గా ఉంటె చాలు, కొంచం ఆర్ధికంగా బలం గా  ఉంటె చాలు, తన చుట్టూ ఉండే వాతావరణం సరిగా లేకపోవడం, ఆదాయంలో వ్యత్యాసాలు, సామాజిక వివక్ష, సామాజిక న్యాయం,లేకపోవడం, గన్ వైలెన్స్  వంటి సమస్యలు ఎదుర్కుంటున్నారు. బోని నాగేల్  పిడియాట్రిక్ న్యూరో సైకాలజిస్ట్ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి చెందిన  వైద్యులు యుక్త వయస్సులో ఉన్న వారికి చికిత్స చేసారు. ఇలాంటి వారికి ఆన్ లైన్ లో చికిత్స సాధ్యం కాదని నూతన పరిశోదనలో వారి సాహోద్యోగులు  ఒంటరిగా ఉండాలనే భావన వారిని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుంది.  కోవిడ్ నేపధ్యంలో వారు  ఇతరులతో మాట్లాడక పోవడం, సానాజికంగా ఎటైనా వెళితే వారికి కోరోనా వస్తుందేమో అని భావించడం. అందరితో కలిసి ఉండక పోవడం,బంధం,బంధుత్వం అన్న పదాలకు వీరి డిక్షనరీలో ఆపదాలకు చోటు లేదు. వారు ఇతరులతో మాట్లాడే ఉదానం, లో ఒక అసంతృప్త భావన అయినా వారితో అయినా సరే వేరెవరి తోనో మాట్లాడుతున్నా మన్న భావన వారిలో చోటుచేసుకుంటుంది. యుక్త వయస్సులో ఉండే వారి ఆరోగ్యం అంటే మనాసిక అనారోగ్యం పై దృష్టి పెట్టాలి. అమెరికన్ అకాడమి ఆఫ్ పిడియాట్రిక్స్ అమెరికన్ అకాడమి ఆఫ్  చైల్డ్ అడాలసెంట్ సైక్రియాట్రి పిల్లల ఆసుపత్రి  నేషనల్ ఎమర్జన్సీ యూత్ మెంటల్  హెల్త్.ప్రకటించాలని సూచించారు. 

మెదడుకు, కంటికి లింక్ ఇదే!

Face in the index of the Mind అన్నట్టుగా Eye is the mirror of the Brain అంటారు. మెదడు పనిచేసే తీరు తెన్నులు తెలుసుకోవడానికి కన్ను అనేక వివరాలు అందజేస్తుంది. కొన్ని అవయవాలు, అవిచేసే పనులు, వాటిలో వుత్పన్నమయ్యే లోపాలు, సమస్యలు పరోక్షంగ తెలుసుకోగలమే తప్ప తలుపుతీసి గదిలో ప్రవేశించి గదిలోని వస్తువులను పరిశీలించినట్లు చేయడానికి అవకాశం లేదు. అలాంటి వాటిలో మెదడు ఒకటి. మెదడుకు సంబంధించిన సమాచారము పరోక్షంగా ఇతర అవయవాలనుండి తెలుసుకోవడమేతప్ప మెదడు కోసి చూడలేము. మెదడు బలిష్టమైన ఎముకల గదిలో వుంటుంది. అందుచేత మెదడును పరీక్షించాలంటే సామాన్య పద్దతులలో వీలుపడదు. మెదడు నుండి సరాసరి విడుదలయ్యే నాడులు 12 జతలు. ఈ 12 జతలు శరీరంలోని కన్ను, ముక్కు, చెవి, గొంతు, నాలుక, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, ప్రేవులకు సంబందించి ఇవి వివిధ కర్తవ్యాలు నిర్వహిస్తుంటాయి. ఇందులో 6 జతల నాడులు కంటికి సరఫరా అవుతాయి. దృష్టి నాడి, దృష్టి క్షేత్రం వర్ణదృష్టి, కంటి చలనము, కన్నుమూసుకోవడం తెరుచుకోవడం, కంటి స్పర్శ, కంటినొప్పి మొదలైనవి, మెదడులోని కొన్ని కేంద్రాలనుండి కంటిలో వివిధ భాగాలతో ముడివేస్తాయి. వీటిలో వచ్చే మార్పులను బట్టి దెబ్బతిన్న భాగాన్ని అందుకు సంభంధించిన కారణాలను తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.  మెదడుకు, కంటికీ రక్తం సరఫరా అవుతుంది. ఈ రెండూ ఒకేచోట పుట్టి చీలిక మెదడంతా వ్యాపిస్తుంది. మెదడులో నుండే కొన్ని కంటికి చేరతాయి. అందుచేత కంటిలోని రక్తనాళాల తీరుతెన్నులు, మెదడులోని రక్తనాళాలు ఒకేలా వుంటాయి. రక్తనాళాలు రక్తాన్ని సరిగ పంపిణీచేయగల స్థితిలో వున్నవా లేక నాళాలు సన్నబడి రక్త ప్రసరణకి ఆటంకం ఏర్పడుతుందా? రక్తనాళాలలో కొవ్వు పేరుకొందా? రక్తం గడ్డకట్టి ప్రవాహం అంతరాయం ఏర్పడిందా? కొత్త నాళాలు పుడుతున్నాయా? నాళాలనుండి రక్తం లీకవుతోందా? మొదలైన సమాచారం కంటిలోని రెటినాల్ నాళాలను పరిశీలించి తెలుసుకోవచ్చును. మెదడులో కంతులు ఏర్పడితే కంతి యొక్క స్వరూపము, ఏ భాగములో ఏర్పడ్డదో తెలుసుకోవడానికి కంటి పరీక్షలు ఎనలేని అవకాశం కల్పిస్తుంది. కంటికి సరఫరా చేసే 6 నాడులలో ఒకటి గాని, అంతకంటే ఎక్కువగాని, పాక్షికంగ గాని, పూర్తిగా కాని దెబ్బతినడం కనిపెట్టవచ్చును. కొన్ని సమయాలలో దృష్టి క్షేత్రంలో మార్పులు ఏర్పడవచ్చును. మెల్ల ఏర్పడ వచ్చును. కంటినాడి వుబ్బవచ్చును. వీటిని తెలుసుకోవడం ద్వారా వ్యాధి లక్షణాలు, వ్యాధిస్థితి, చికిత్స యొక్క ఫలితము మొదలైన విషయాలను అంచనా కట్ట వచ్చును. నాడి పొరలోనుండి బయలుదేరిన నాడులు, పోగులు పోగులుగ చేరి చివరకు కంటినుండి ఆప్టిక్ నాడి ద్వారా మెదడుకు చేరుతాయి. మెదడుకు బయలు దేరేముందు రెటీనాలో కనిపించే భాగాన్ని, నాడీ నాభి (ఆప్టిక్ డిస్క్) అంటారు. ఈ భాగాన్ని పరిశీలిస్తే, మెదడుకు సంబందించిన అతి ముఖ్యమైన సమాచారం తెలుస్తుంది. మెదడుకు వాపు వచ్చినప్పుడు, మెదడులో కంతి, చీము మొదలైనవి  చేరినపుడు ఆ వాపు దృష్టి నాడి ద్వారా నాడీ నాభి వరకు ఎగబాకుతుంది. కంటినాడి వుబ్బుతుంది. దానిని మనం ఆప్తాల్మాస్కోపు అనే పరికరం ద్వారా తెలుసుకోవచ్చును. అంతేకాదు, వ్యాధి యొక్క తీవ్రత, వ్యాది వైద్యానికి లొంగుతుందా లేదా అనేది కూడ తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల మెదడులో సంభవించే అనేక పరిణామాలను తెలుసుకోడానికి కంటి పరీక్షలమీద ఆధారపడవలసి వస్తుంది.                                     ◆నిశ్శబ్ద.

గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే ఏంటి?? ఎందుకు వస్తుంది??

ఈమధ్య కాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య గ్యాస్ట్రిక్ ట్రబుల్. అయితే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఎందుకొస్తుంది?? అసలు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే ఏంటి?? తెలుసుకుంటే..  మనం ఆహారంతో పాటు గాలిని మింగుతుంటాం. ఈ అలవాటున్నా కార్బొనేటెడ్ పదార్థాల్ని ఎక్కువగా తీసుకుంటున్నా, చూయింగ్ గమ్ తినే అలవాటున్నా, ధూమపానం చేస్తున్నా త్రేన్పులు ఎక్కువగా వస్తుంటాయి.  ఇలాంటి వారిలో కడుపులోపల బాగా ఉబ్బరించినట్లుంటుంది. కడుపులో ఉత్పత్తి అయ్యే ఆ వాయువు కారణం చేతనే గుండె మండుతున్నట్లుంటుంది. జఠరాశయంలోని ఈ గాలి చిన్న ప్రేగులలోకి వెళ్తుంది. ఇక్కడ ఇది చిన్నప్రేగుల గోడలద్వారా పీల్చిబడుతుంది. లేకపోతే గ్యాస్ రూపంలో  బయటికి నెట్టివేయబడుతుంది. కడుపుబ్బరించే గాస్ తో బాధపడుతున్నా మనిపించినప్పుడు ఏ పదార్థాలు గ్యాస్ ని ఉత్పత్తి చేయడానికి కారణం అవుతున్నాయో వాటిని తినడం మానేయాలి. అలాగే గ్యాస్ ఉత్పత్తికి కారణమైన అలవాట్లని మానుకోవాలి. చాలా మంది త్రేన్పులు వస్తుంటే లోపలి గాలి బయటకు వెళ్ళి పోతోందని అనుకుంటారు. కాని వాస్తవానికి ఈ త్రేన్పుల వల్ల లోపలి పరిస్థితి మరింతగా దెబ్బతింటుంది. ఒక్కోసారి జీర్ణాశయంలో ఆహారం జీర్ణమయ్యేప్పుడు కూడా రకరకాల రసాయనిక మార్పులు కారణంగా కూడా గ్యాస్ ఉత్పత్తి కావచ్చు. జఠరాశయం, పెద్ద, చిన్న ప్రేగులు గాలితో నిండి ఇబ్బందిగా అనిపిస్తుండవచ్చు. త్రేన్పుల ద్వారా వెళ్ళే గాలిలో నైట్రోజన్, ఆక్సిజన్ వుంటాయి. అదే గ్యాస్ రూపంలో వెళ్ళే గాలిలో నైట్రోజన్, ఆక్సిజన్ లతోపాటు హైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్ మిధేన్ కూడా వుంటాయి. పిండి పదార్థాలు సరిగ్గా జీర్ణం కానప్పుడు ఆ పదార్థాలు చిన్నపేగులలో పేరుకు పోయినప్పుడు బాక్టీరియా అనే సూక్ష్మజీవులు అక్కడ చేరతాయి. ఈ బాక్టీరియా వున్నప్పుడు హైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్ మిథెన్ గ్యాస్ లు ఉత్పత్తి అవుతాయి. ఈ కుళ్ళిన పదార్థాల దగ్గరే చెడ్డ వాసన పుడుతుందన్నమాట! ఇలా గ్యాస్ సమస్యతో ఇబ్బందికి గురువుతున్నప్పుడు ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. వాటిని ఒక్కసారిగా తాగేయకూడదు.  కొద్దికొద్దిగా చప్పరిస్తూ త్రాగాలి. ఆహారాన్ని పెదాలు మూసుకుని బాగా నమిలి తినాలి. మనస్సు ఆందోళనగా వున్నప్పుడు కాక ప్రశాంతంగా వున్నప్పుడు తినాలి. కొద్ది కొద్దిగా తినాలి. ఎక్కువెక్కువ తినకూడదు. గుండె ప్రాంతంలో మంట ఈ గ్యాస్ ఉత్పత్తి కారణానో, యాసిడ్ ఉత్పత్తి కారణానో వస్తుంటుంది. ఈ మంట లోపలి మార్పులను సూచించే ఒకానొక సిస్టమే కానీ జబ్బుకాదు. ఈ మంట లోపల ఆహారం పులియడం వల్లగాని, నోటిలో కొంత జీర్ణమైన ఆహార పదార్థాలు ఉండడంవల్ల కూడా కలగవచ్చు. ఆహారం జీర్ణమవడానికి జఠరాశయంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్, పెప్సిన్ ఎంజైమ్స్ కలుస్తాయి. ఈ కారణంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వొస్తుంది.                                       ◆నిశ్శబ్ద.

బెస్ట్ ప్రోటీన్ ఫుడ్స్ ఇవే!

శరీరానికి అవసరమైన మూడు స్థూల పోషకాలలో ప్రోటీన్ ఒకటి,  కణజాలాల పెరుగుదల మరియు నిర్వహణ కోసం మనకు అవసరమైన విధంగా సరిగ్గా పనిచేయడానికి మన శరీరానికి పెద్ద పరిమాణంలో ప్రోటీన్ అవసరమవుతుంది.  ప్రొటీన్లు వ్యాధులతో పోరాడటానికి అవసరమైన రోగనిరోధక శక్తిని అందిస్తాయి, ఇవి లేకపోతే మన శరీరం నిరంతరం అరిగిపోతుంది.   ప్రోటీన్ల యొక్క ప్రయోజనాల జాబితా అంతులేనిది, ఈ మాక్రోన్యూట్రియెంట్‌ను మన ఆహారంలో చేర్చుకోవాలి. అయితే ఈ ప్రోటీన్ పర్ఫెక్ట్  గా తీసుకోవడానికి పర్ఫెక్ట్ సమయం ఏదంటే  అల్పాహార సమయమే..  తద్వారా మన శరీరం రోజంతా శక్తివంతంగా ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ లో బెస్ట్ ప్రోటీన్ అందిందే కొన్ని ఆహార పదార్థాలు ఇవే.. నట్స్ - నట్స్ రుచికరమైన, అధిక ప్రోటీన్ కలిగిన అల్పాహారం అని చెప్పవచ్చు.  మొక్కల ఆధారిత ప్రోటీన్ యొక్క మంచి మోతాదును అందిస్తాయి. అంతే కాదు ఇవి బెస్ట్ రికమెండషన్ కూడా.  తినడానికి కూడా సులభమైనవి.  ప్రొటీన్లు ఎక్కువగా ఉండే గింజల్లో బాదం, వాల్‌నట్, పిస్తా, జీడిపప్పు, పైన్ నట్స్, వేరుశెనగ ఉన్నాయి.  నట్స్ తీసుకోవడం వల్ల మీకు అవసరమైన ప్రొటీన్‌ను పొందడంలో మీకు సహాయపడుతుంది, ఇది ఆరోగ్యకరమైన చర్మం, కండరాలు మరియు ఎముకలకు తోడ్పడుతుంది. ప్రోటీన్ ఎక్కువసేపు నిండుగా అనుభూతి చెందేలా చేస్తుంది. పచ్చి బఠానీలు - ప్రోటీన్ మరియు ఫైబర్ శరీరానికి అవసరమైన రెండు పోషకాలు, ఇవి బఠానీలలో పుష్కలంగా ఉంటాయి.  బఠానీలు ఆకలిని నియంత్రించగలుగుతాయి, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.  ఒక కప్పు బఠానీ తీసుకుంటే అందులో విటమిన్ సిలో సగానికి పైగా ఉంటుందని నిపుణులు తెలిపారు. రోజువారీ అల్పాహారంలో బఠానీలను చేర్చడం వల్ల శరీరానికి తగిన ప్రోటీన్లను అందించవచ్చు.  క్వినోవా - క్వినోవా ఉత్తమ అల్పాహారంగా చెప్పవచ్చు. ఎందుకంటే క్వినోవాను కంప్లీట్ ప్రోటీన్‌గా సూచిస్తారు.  శరీరం స్వయంగా ఉత్పత్తి చేయలేని తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలలో ప్రతి ఒక్కటి క్వినోవా కలిగి ఉండటం దీనికి కారణం.  ఇది చాలా ప్రోటీన్ మరియు ఫైబర్ కలిగి ఉంటుంది, అలాగే ఇది సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్ కాబట్టి ఇది మరింత నెమ్మదిగా జీర్ణమవుతుంది. సోయా మిల్క్ - సోయా మిల్క్‌లో ప్రొటీన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది.  సోయా పాలు ఆరోగ్యకరమైన, మొక్కల ఆధారిత ప్రోటీన్. ఇది బలమైన కండరాలు అవయవాలను నిర్వహించగలదు.  మీ శరీరం స్వంతంగా ఉత్పత్తి చేయలేని "మంచి" కొవ్వులు అయిన ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సోయా పాలలో పుష్కలంగా ఉన్నాయి.   ఓట్స్ - ఓట్స్ తక్కువ-ధర, పోషకాలు ఎక్కువగా ఉండే ప్రోటీన్‌ల మూలం.   ఓట్స్ లో 11-15% అధిక ప్రోటీన్ కలిగి ఉంటాయి.  పీనట్ బటర్, చియా గింజలు, అవిసె గింజలు, ఒక స్కూప్ ప్రోటీన్ పౌడర్ వంటి మొక్కల ఆధారిత ప్రోటీన్ లను ఓట్స్ కు జోడించవచ్చు.  సమర్థవంతమైన ప్రోటీన్ ఫుడ్ కు వోట్స్ సరైన మార్గం.  చియా విత్తనాలు - చియా గింజలు ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కలిగిన అధిక-నాణ్యత గల ప్రోటీన్. అలాగే అవసరమైన ఖనిజాలు యాంటీఆక్సిడెంట్‌లలో సమృద్ధిగా ఉంటాయి.  ఈ విత్తనాలను  సలాడ్లతో తీసుకోవచ్చు. లేదంటే  పెరుగుతోనూ తీసుకోవచ్చు. చాలా రకాల పుడ్డింగ్‌ లలో వీటిని వాడతారు.   ఇలా సాధారణ వ్యక్తులు కూడా తమ అల్పాహారంలో జోడించుకోగల ప్రోటీన్ ను తీసుకుని ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు.                                    ◆నిశ్శబ్ద.  

ఈ 7 రకాల నొప్పులను నిర్లక్షం చేస్తే అంతే సంగతులు!

ప్రతిఒక్కరు ఎదో ఒక నొప్పితో బాధ పడుతూ ఉంటారు. అసలు ఆ నొప్పులు ఎలా ఉంటాయి అంటే కొంచం గుచ్చుకున్నట్లుగా ఉంటె తీవ్రంగా  ఉంటుంది.సహజంగా సందర్బోచితంగా శరీరంలో నొప్పులు వస్తూనే ఉంటాయి.లేదా అంచెలు అంచెలుగా నొప్పులు వస్తూనే ఉంటాయి.అయితే కొన్నిరకాల్ నొప్పులు వచ్చినప్పుడు పరీక్షలు చేయించుకోండి. ఈ నొప్పులు మీలోపల ఉన్న వాస్తవ పరిస్థితిని తెలియచేస్తుంది. క్యాన్సర్, ఆర్ధరైటిస్, ఇంఫ్లామేషణ్, వంటి వాటిని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా జీవితం ప్రమాదంలో ఉన్నట్లే అనిగమనించాలి. 7 రకాల నొప్పులను మీరు ఏమాత్రం నిర్లక్ష్యం  చేయకండి.ప్రత్యేకంగా చాలా తీవ్రంగా ఉన్న లేదా దీర్ఘకాలం పాటు నొప్పులు కొనసాగినా సమస్యలే అన్నవిషయం గ్రహించాలి. 1 )పొట్టలో తీవ్రమైన నొప్పి.. పొట్టలో నొప్పి లేదా పొత్తికడుపులో నొప్పి రావడం సహజం.మీరు తీసుకున్న ఆహారం కావచ్చు.లేదా గ్యాస్ వల్ల కావచ్చు ఒకవేళ తీవ్రమైన నొప్పి కిన్దిభాగం లో ఎడమవైపు వస్తే అదితీవ్రంగా ఉంటె తక్షణం పరీక్షించాల్సిందే.ఆనోప్పి అపెండిసైటిస్ కావచ్చు. అపెన్ డిక్స్ లో ఇంఫ్లా మేషన్ కావచ్చు. ఇంఫ్లామేషన్ ను తొలగించేందుకు సర్జరీ చేయాల్సి రావచ్చు. ఇంఫ్లామేషన్ వచ్చిఅది బరస్ట్  కాక ముందే అభాగాన్ని తొలగించడం అనివార్యం.అలా కాక నిర్లక్ష్యం చేస్తే మరణించే అవకాసం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే పొట్ట మధ్యలో లేదా పైభాగం లో అది లేదావెనుక వైపు పై భాగం లో అసహనంగా గాబరా పడడం. లేదా ఊపిరి తీసుకోవడం ఇబ్బంది పడడం ప్యాంక్రియాస్ కారణం కావచ్చు. అందులో గాల్ బ్లాడర్ లో రాళ్లు ఉండవచ్చు.వాటిని సర్జరీ ద్వారా తొలగించాల్సి ఉంటుంది. 2) వ్యాయామం అనంతరం అసహజంగా వచ్చే నొప్పి...  మీరు వ్యాయామం చేసే సమయంలో బరువులు ఎత్తడం మీరు ఇబ్బందులు పడతారు.ఒకవేళ మీకు నొప్పి తీవ్రంగా ఉంటె పాదం అరికాలు నొప్పితో బాధపడితే డాక్టర్ ను సంప్రదించాలి. ముఖ్యంగా వర్క్ అవుట్ తరువాత నొప్పి వారం రోజులపాటు అలాగే కొనసాగితే కాస్త అలోచించాల్సిందే.అక్కడ అరగడం లేదా విరగడం లేదాటీర్ కావడం అయ్యిఉండవచ్చు.అది మీనోప్పికి  కారణంగా చెప్పవచ్చు. ౩ )నొప్పితో పాటు వాపు... ఏదైనా   వాపుతోపాటు నొప్పి వస్తే సంకేతం ఏమిటి అంటే అది ఇన్ఫెక్షన్ కావచ్చు.కొన్ని గంటల తరువాత వాపు నొప్పి తగ్గనట్లయితే అది మరింత తీవ్రంగా మారితే డాక్టర్ ను తప్పనిసరిగా సప్రదించాలి.  4)తీవ్రమైన తలనిప్పి... తలనొప్పి తీవ్రంగా ఉంటె అది మైగ్రైన్ కావచ్చు.లేదా బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు చికిత్చలో భాగంగా ఉపసమనం కొసం వైద్యసహాయం తీసుకోవాలి  లేదా నొప్పినివారించే మండువడాలి. లక్షణాలు మరింత తీవ్రంగా ఉంటె ఎప్పుడు అనుభవించని నొప్పి మిమ్మల్ని బాధిస్తుంటే.ఏదైనా ఒకవ్యాది వచ్చి ఉండవచ్చు.అదిఎదొ తెలుసుకోవాలంటే పరీక్షలు నిర్వహించాలి.కార్బన్ మోనాక్సైడ్ విషతుల్య పదార్ధాలు ఉండవచ్చు.దీనివల్ల బ్రెయిన్ స్ట్రోక్ లేదా బ్రెయిన్ ట్యూమర్ కణి తలు ఏర్పడి ఉండవచ్చు.మీ జీవితం లో ఎప్పుడూ ఎవరూ ఎదుర్కిని తీవ్రమైన తలనొప్పి తప్పనిసరిగా అత్యవసర చికిత్చ అవసరం కావచ్చు. 5)చాతి నొప్పి... అన్నిరకాల చాతినోప్పులు గుండె పోటు కాదు అన్న విషయం తెలుసుకోవాలి.అయితే చాతిలో నొప్పి అన్నది హార్ట్ ఎటాక్ గుండేనోప్పి లక్షణంగా చెప్పవచ్చు.మీచాతిపై ఎదో బరువుపెట్టినట్ట్లుగా ఉంటె మీరే కారు నడపడం మంచిది కాదు. చాతి లో నొప్పి వచ్చినప్పుడు అంబులెన్స్ ను పిలిపించుకుని ఆసుపత్రికి వెళ్ళండి.మీసమస్యను వివరించండి తగిన సమయంలో చికిత్చ అందించడం ద్వారా గుండెపోటుతో మరణం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ముఖ్యంగా ఇటీవలి కాలం లో ఉదయం వేళ లో మాత్రమే వ్యాయామం అనంతరం  గుండెపోటుతో మరనిస్తున్నఘటనలు  చూస్తున్నాం. కాబట్టి చాతి పై బరువుగా ఉన్న ఊపిరి పీల్చుకోడం కష్టంగా ఉన్న వెంటనే డాక్టర్ ను సంప్రదించడం అవసరం అని నిపుణులు పేర్కొన్నారు. 6)పెద్ద పాదం లో నొప్పి...   మీపాదం లో నొప్పి వస్తే అది గౌట్ కావచ్చు దీనిని వైద్య పరిభాష లో గౌట్ ఆర్తరైటిస్ అంటారు. ఇది ఆర్తరైటిస్ నుండి వస్తుంది.చాలా నొప్పిగా ఉంటుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం కారణంగా ఆహార పదార్ధాలు అరగక పోయినా ఆల్కాహాల్ ఎర్రమామ్సం సాఫ్ట్ డ్రింక్స్ ఇతర ఆహార పదార్ధాలు అయితే వీటినుండి ఉపసమనం పొందనికి పెయిన్ కిల్లర్స్ వాడవచ్చు.ఈసమస్యకు నిపుణుడైన ప్రత్యేక డాక్టర్ నుండి చికిత్చ తీసుకోవడం అవసరం. గౌట్ కు సరైన చికిత్చ చేయనట్లయితే ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి.కిడ్నీ ఫెయిల్యూర్ కు దారి తీయవచ్చు.  7)నెలసరి వచ్చే సమస్యలో క్రామ్ప్... నెలసరి సమస్యల కాలం లో స్త్రీలు తీవ్రమైన నొప్పులతో బాధపడుతూ ఉంటారు.ఈసమస్యను వైద్య పరిభాష లో మేన్స్టురియల్ క్రామ్స్ వల్ల కింది భాగం లో నొప్పి తీవ్రంగా ఉంటుంది.అయితే అది ప్రతినెలా స్త్రీలను వేదిస్తూ ఉంటుంది. అది చాలా సహజమైన నొప్పిగానే స్త్రీలు భావిస్తారు.అయితే నొప్పి తీవ్రత అధికంగా ఉంటె మీరు గైన కాలజిస్ట్ ను కలిసి డాక్టర్ సూచనల మేరకు పరీక్షలు నిర్వహించాలని లేదా తీవ్ర ద్సమస్యలు తప్పవు. అది ఒవేరియన్ క్యాన్సర్ ఎస్ టి డి క్యాన్సర్ కాని కణితలు కావచ్చు.అదనంగా వచ్చే నొప్పి ఏందో మెట్రిసెస్ కావచ్చు.అది త్వరితగతిన పరీక్షించాలి అలాగే ఉత్తమ చికిత్చ తీసుకోవాలి. ఏండో మెట్రిసెస్ వల్ల సంతనలేమి సమస్యలు వస్తాయి.కొన్ని సందర్భాలలో డాక్టర్స్ సర్జరీకి సిఫార్స్ చేయవచ్చు.సర్జరీ ద్వారా టిష్యు ను తొలగిస్తారు దీనివల్ల పిల్లలు కలిగే అవకాసం ఉందని  నిపుణులు తేల్చి చెప్పారు. నెప్పి ఎలాంటిదే అయినా ప్రాధమిక స్థాయిలో తక్షణం గుర్తించి అందుకు తగిన చికిత్చ తీసుకోవాలని సూచించారు. 

దంత సంరక్షణ ఎంత ముఖ్యం?

ఉదయం లేవగానే అందరూ చేసే పని పండ్లు తోముకోవడం. చాలామంది ఉదయం లేవగానే పండ్లు తోముకోకుండా కాఫీ తాగడం చేస్తారు. మరికొందరేమో నైట్ డ్యూటీ లు గట్రా చేస్తూ నోరు సరిగ్గా శుభ్రం చేసుకోకుండా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల దగ్గర క్యూ కడతారు. అయితే ఉదయం లేవగానే పండ్లు తోముకోవడం అనే అలవాటు చాలా మంచిది. పండ్లు తోముకోవడం కూడా ఓ కళ అంటారు దంత వైద్య నిపుణులు. మన పండ్లను సరైన రీతిలో బ్రష్ చేసుకోవాలి. బ్రష్ ను గట్టిగా ముందుకు, వెనుకకు తోమకూడదు. అలా తోమటం వల్ల చిగుళ్ళు దెబ్బతింటాయి. ముందుగా పండ్లు తోముకోవడానికి ఉపయోగించే బ్రష్ చాలా మెత్తగా ఉండాలి. అలా ఉంటే పండ్ల చిగుళ్లు దెబ్బతినవు. ఇక పండ్లు తోముకునేటప్పుడు బ్రష్ తో పైకి, కిందికి మెల్లగా తోముకోవాలి. అలా చేయటం వల్ల చిగుళ్ళకు నష్టం వుండదు. మన పండ్లను బ్రష్ తో తోముకున్న తర్వాత చేతి వ్రేళ్ళతో చిగుళ్ళను తోముకోవాలి. అందువల్ల చిగుళ్ళు దృఢంగా తయారవుతాయి. కొంతమంది ఇటుకపొడి, బొగ్గు మొదలైన గరుకు పదార్థాలతో పండ్లను తోముతారు, కాని అలా తోమకూడదు. ఎందుకంటే అవి పండ్లపై ఉన్న ఎనామిల్ ను తొలగించి నష్టపరుస్తాయి. ఒకవేళ అవి ఉపయోగించేలా అయితే మెత్తగా పొడిని జల్లించుకోవాలి.  లేదంటే పండ్లకు మంచి టూత్ పేస్ట్ వాడటం చాలా అవసరం. ఎందుకంటే ఫ్లోరైడ్ కల్గిన టూత్ పేస్ట్ లు వాడటం వల్ల దంతక్షయం అరికట్టబడుతుంది. చిగుళ్ళు గట్టిగా, దృఢంగా ఆరోగ్యవంతంగా ఉంటాయి.  ఎవరైనా సరే చాక్లెట్లు, పిప్పరమెంట్లు, మిఠాయిలు ఎక్కువగా తినకూడదు. తీపి పదార్థాలు పండ్ల సందులలో చిక్కుకొని సూక్ష్మక్రిములు చేరుకుంటాయి. తద్వారా పండ్లు పుచ్చిపోతాయి. ప్రతీరోజూ ఉదయం బ్రష్ చేసేటప్పుడు నాలుక గీసుకొని శుభ్రపరచుకోవాలి. నాలుక పైన రాత్రిపూట ఒక తెల్లని పూత ఏర్పడుతుంది...! నాలుకపైన పేరుకున్న ఈ తెల్లని పూతను అప్ఆర్ఇంచుకుని సుక్మాజీవుల పెరుగుతాయి. ఈ పూతను ఎప్పటికప్పుడు తొలగించకపోతే సూక్ష్మక్రిములు పెరిగిపోయి దుర్వాసన కల్గుతుంది… మనం తీసుకునే ఆహరంతో పాటు ఈ సూక్ష్మ క్రిములు శరీరంలో ప్రవేశించి చాలా రకాల  వ్యాధులు కల్గుతాయి. భోజనం చేసిన తర్వాత నీటిని పుక్కిలించి నోటిని శుభ్రపరచుకోవాలి. నోటిలో చిక్కుకున్న ఆహారపు అణువులు తొలగించటానికి ప్రతిసారి భోజనము తర్వాత నీటిని పుక్కిలించి ఉమ్మివేయాలి. అప్పుడు నోరు శుభ్రంగా, వాసన లేకుండా ఉంటుంది. సంవత్సరానికి కనీసం ఒకసారి దంతవైద్యుడిని సంప్రదించాలి. పండ్లు అందంగా ఆకర్షవంతంగా, ఆరోగ్యంగా ఉంచుకోవటానికి సంవత్సరానికి కనీసం ఒకసారి దంత వైద్యునితో పండ్లను పరీక్ష చేయించుకోవాలి. దంత వైద్యులు చెప్పిన విషయాలను జాగ్రత్తగా పాటించాలి. సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉండవచ్చు.                                           ◆నిశ్శబ్ద.

గుప్పెడంత గుండెకు కొండంత భరోసా ఇలా సాధ్యం!

చలి పంజాకు ఈ సంవత్సరం చాలా గట్టిగానే దెబ్బ తిన్నారు ప్రజలు. ఈ చలి ప్రభావం వల్ల ఎంతో మంది శ్వాశ సంబంధ సమస్యలతో ఇబ్బంది పడ్డారు. మరికొందరు మరణించారు కూడా. చలి ముఖ్యంగా శ్వాస నాళం మీద ప్రభావం చూపినప్పటికీ శరీరంలో కీలకమైన ఊపిరితిత్తులు, గుండె ఈ చలి ప్రభావానికి ఎక్కువగా గురవుతాయి. ప్రస్తుతం శివరాత్రి గడిచిపోయిన తరువాత చలి ప్రభావం క్రమంగా తగ్గుతూ వస్తోంది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. చలి తగ్గిపోయి మెల్లగా వేసవి వైపు అడుగులు పడుతున్నాయి. చాలామందికి ఈ సమయం ఎంతో విలువైనది. ముఖ్యంగా బరువు తగ్గాలని అనుకునేవారికి, వ్యాయామం చక్కగా చేసి ఫ్యాట్ బర్న్ చెయ్యాలని అనుకునేవారికి ఇది బెస్ట్ సీజన్. అయితే ఈ మూమెంట్ లో గుండె ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించాలండోయ్.. జిమ్ లలోనూ.. ఆరు బయట, రోడ్ల మీద నడక నుండి విభిన్న రకాల వ్యాయామాలు చేస్తూ చేస్తూనే గుండె ఆగిపోయి ప్రాణాలు వదిలేస్తున్న వారు ఉన్నారు ఇప్పట్లో. అందుకే ఈ సీజన్ లో గుండె ఆరోగ్యం ఇలా.. పదిలం చేసుకోండి. గుండె పర్ఫెక్ట్ ఉండాలంటే.. అందరూ గుర్తుంచుకోవలసిన అయిదు విషయాలు.. హైడ్రేటెడ్ గా ఉండాలి గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తగిన మోతాదులో నీరు తాగడం చాలా అవసరం.  నీరు శరీరం నుండి టాక్సిన్స్ బయటకు పంపుతుంది. గుండెను సరైన రీతిలో పని చేయడానికి సహకరిస్తుంది.  రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలని గుర్తుపెట్టుకోవాలి.  వ్యాయామం ఇలా..   రెగ్యులర్ గా చేసే వ్యాయామం గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.  ఇది  హృదయాన్ని బలంగా ఉంచడంలో సహాయపడుతుంది మరియు మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.  మీరు ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేస్తే ఎంతో గణనీయమైన మార్పు కనిపిస్తుంది.  గుడ్ ఫుడ్.. శరీర ఆరోగ్యానికి ఆహారమే గొప్ప ఔషధం. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా అవసరం.  యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి.  ప్రాసెస్ చేసిన ఆహారాలలో షుగర్, కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. అలాగే గుండెకు చేటు చేసే కొవ్వులు వాటిలో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చెయ్యడం మంచిది.  ఒత్తిడి మీద మంత్రం.. ఒత్తిడి  గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.  ఈ ఒత్తిడి కారణంగానే చాలా వరకు అనారోగ్య సమస్యలు, హైపర్ టెన్షన్ వంటి పరిస్థితులు ఏర్పడతాయి. యోగా లేదా ధ్యానం వంటి  విశ్రాంతినిచ్చే మార్గాలను ఎంచుకోవడం, వాటిలో పాల్గొనడం ద్వారా  ఒత్తిడి స్థాయిలను తగ్గించుకోవడానికి ప్రయత్నించవచ్చు.  బ్యాడ్ హాబిట్స్ కు బై బై..  గుండె జబ్బులకు ప్రధాన కారణాలలో ధూమపానం ఒకటి. అలాగే ఊపిరితిత్తుల వినాశనానికి కూడా ఇదే కారణం.   ధూమపానం మానేయడం వల్ల మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ప్రత్యక్ష పరోక్ష ధూమపానం వల్ల అందరి ఆరోగ్యాలు పాడవుతాయి. అదే ధూమపానం మానేస్తే మీ ఆరోగ్యంతో పాటు అందరి ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి గుండె పదిలంగా, ఆరోగ్యం అద్భుతంగా ఉండాలంటే ఈరోజే ఈ చెడు అలవాటుకు చెక్ పెట్టేయండి.  పైన చెప్పుకున్న అయిదు విషయాలు చాలా సింపుల్ గా పాటించేవి. కానీ వాటి వల్ల కలిగే బెనిఫిట్ మాత్రం మీ జీవిత కాలాన్ని పొడిగిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం గుప్పెడంత గుండెకు కొండంత భరోసా ఇచ్చేయండి.                                   ◆నిశ్శబ్ద.

మీ ఫిట్నెస్ బాగుండాలా?? అయితే ఈ తప్పు చేయొద్దు!

క్రీడాకారులు అంత ఆక్టివ్ గా, ఫిట్ గా ఉండటానికి ముఖ్యమైన కారణం ఏమిటో తెలుసా?? చాలామంది వారి ఆహారం అని, వారు చేసే వ్యాయామమని అంటారు. కానీ ఇది శుద్ధ తప్పు. అవన్నీ ఎంత పక్కాగా పాటించినా నిద్ర అనేది సరిగ్గా లేనప్పుడు ఎవరూ ఫిట్ గా ఉండలేరు. దీన్ని బట్టి చూస్తే నిద్ర ప్రతి ఒక్కరి జీవితంలో ఎంత గొప్ప పాత్ర పోషిస్తుందో అర్థమవుతుంది. నిద్ర ఒక గొప్ప ఔషధం అని ఊరికే అనలేదు. ప్రపంచంలో ఉన్న చాలా గొప్ప క్రీడాకారులు తమ ఒత్తిడిని చక్కగా అధిగమిస్తున్నారన్నా, రోజును బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారన్నా దానికి వారి నిద్రా విధానాలే మూల కారణం. మానవ జీవక్రియకు, కణజాలాల పెరుగుదలకు శరీరంలో కండరాల మరమ్మత్తులో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా జ్ఞాపకశక్తి బాగుండాలన్నా, చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్న చక్కని నిద్ర ద్వారానే సాధ్యమవుతుంది. సరిగ్గా గమనిస్తే నిద్ర చక్కగా ఉన్నవారు, నిద్రలేమి సమస్య, నిద్రకు సరైన సమయం కేటాయించని వారిని కంపెర్ చేస్తే తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే మనిషి ఫిట్నెస్ లో నిద్ర కీ పాయింట్ అని అంటున్నారు. ఏరోబిక్ ఫిట్నెస్ ఏరోబిక్ వ్యాయామాలు శరీరానికి చాలా చక్కని ఫలితాలను ఇస్తాయి. ఈ వ్యాయామాలలో భాగంగా శరీరాన్ని వేగంగా కదిలించడం వల్ల ఆక్సిజన్ సరఫరా మెరుగవుతుంది. శరీరం చాలా రిలాక్స్ అవుతుంది. కండరాల పెరుగుదల కోసం.. శరీర కంధర సామర్థ్యం చక్కగా ఉండాలంటే కండరాలను కష్టపెట్టడమే మార్గం కాదు. ఆ కండరాలు రిలాక్స్ అవ్వడానికి తగిన సమయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. నిద్ర దానికి చక్కని మార్గం. కండర వ్యవస్థ నిద్రలో బలోపేతం అవుతుంది. అలాగే కండరాలకు తగినంత ప్రోటీన్లు కూడా అందితే కండరాలు దృఢంగా మారతాయి.  హార్మోన్ల గుట్టు టెస్టోస్టెరాన్, గ్రోత్ హార్మోన్ అనేవి అనాబాలిక్ హార్మోన్లుగా పిలవబడతాయి. ఈ రెండూ నిద్రలోనే విడుదల అవుతాయి. ఇవి శరీరంలో ఎన్నో రకాల కార్యకలాపాలలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కాబట్టి నిద్ర చక్కగా ఉంటే ఈ హార్మోన్ల విడుదల సక్రమంగా జరిగి ఫిట్నెస్ బావుంటుంది. పైన చెప్పుకున్నవి మాత్రమే కాకుండా మంచి నిద్ర వల్ల మెదడుకు విశ్రాంతి బాగా లభిస్తుంది. శారీరక శ్రమ లేకుండా కేవలం మెదడు మీద భారం పడుతూ ఒత్తిడుల మధ్య ఉద్యోగాలు చేస్తున్న ఈ కాలంలో నిద్ర చక్కని ఔషధం. కాబట్టి నిద్ర చక్కగా ఉంటే ఫిట్నెస్ కి మొదటి అడుగు పర్ఫెక్ట్ గా పడినట్టే..                                    ◆నిశ్శబ్ద.

వ్యాయామం ఒకే సమయానికి చెయ్యాలంటారు ఇందుకే!

వ్యాయామం ప్రతి ఒక్కరి జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సాధారణంగా రోజు వ్యాయామం చేసేవారికంటే.. వ్యాయామం జోలికి వెళ్ళని వారి శరీరం  విభిన్నంగా ఉంటుంది. వ్యాయామం మనిషిని చురుగ్గానూ, ఆరోగ్యంగానూ ఉంచేందుకు దోహపడే గొప్ప మార్గం. ఇందులో అనే రకాలు కూడా ఉన్నాయి. రన్నింగ్, జాగింగ్, యోగా, ఆసనాలు, జిమ్ ఇలా బోలెడు ఉన్నాయి. అయితే వ్యాయామం గురించి నిపుణులు ఒకమాట చెబుతున్నారు. అదేంటంటే.. వ్యాయామం అనేది ఒక సమయానికి ఒక ప్రణాళికతో చేసేది. దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?? తెలుసుకుంటే.. వ్యాయామం  నిర్ణీత సమయానికి ఎందుకు చేయాలో కూడా అర్థమవుతుంది.  మానవ శరీరంలో జీవ ప్రక్రియలు కణాల సిర్కాడియన్ కలయికలపై ఆధారపడి ఉన్నందున రోజులో వేర్వేరు సమయాల్లో శారీరక శ్రమ శరీరాన్ని వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తుంది.  వ్యాయామం చేసే రోజు సమయం కొవ్వును కరిగించడానికి కొన్ని ఎలా ప్రభావితం చేస్తుందో కొన్ని అధ్యయనాలు కూడా ప్రయోగపూర్వకంగా తెలిపాయి.  వ్యాయామం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏమంటే.. ఆహారం తీసుకునే విషయంలో ఫ్రీడమ్ వస్తుంది.   వ్యాయామం మొదలు పెట్టినప్పుడు శారీరక శ్రమ వల్ల  కొవ్వు కణజాలంలో  థర్మోజెనిసిస్ (వేడి ఉత్పత్తి) మరియు మైటోకాండ్రియా విచ్ఛిన్నానికి సంబంధించిన జన్యువుల వ్యక్తీకరణను పెంచుతుంది. ఇది అధిక జీవక్రియ రేటును సూచిస్తుంది.  ఈ ప్రభావాల వల్ల ఒకే సమయానికి వ్యాయామం చేయడం అనేది ఎంత ముఖ్యమో అర్థమవుతుంది.  జీవక్రియను పెంచడం మరియు కొవ్వును కరిగించడం వంటి అంశాలలో సాయంత్రం వ్యాయామం కంటే మార్నింగ్ వ్యాయామం మరింత ప్రభావవంతంగా ఉంటుంది.  దీని వల్ల తీసుకునే ఆహారం విషయంలో ఛాయిస్ మనదే అవుతుంది. వ్యాయామంతో  ఆరోగ్యాన్ని  మెరుగుపరుచుకోవచ్చు.  శరీరం బ్యాలెన్స్డ్ గా అంటే శరీర ఆరోగ్యం మరింత మెరుగవుతుంది. ఆహారం, ఔషధాలు, లైఫ్ స్టైల్ ఎంత బాగున్నా వ్యాయామం వల్ల మెరుగయ్యే స్థాయి చాలా బాగుంటుంది. అలాగే వ్యాయామం వల్ల శారీరక ఆరోగ్య సమస్యలు ఉంటే మెల్లగా అవే తగ్గుముఖం పడతాయి. దీనికి కారణం, నిర్ణీత సమయంలో నిర్ణీత వ్యాయామం, ఈ వ్యాయామం కారణంగా నిర్ణీత వేళకు ఆహారం తీసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఆరోగ్యం అనేది వ్యాయామం, ఆహారం రెండింటి సమతుల్యత వల్ల మనకు అందే గొప్ప బహుమానం.                                      ◆నిశ్శబ్ద.

నాడీ వైద్యంలో వందకు పైగా చికిత్చలు

కొస్మెటిక్ ఆక్యుపంక్చర్... ఈ చికిత్చలో ఒక సూదిని వినియోగిస్తారు. వ్యాధి లక్ష్నాలను బట్టి శరీరంలో ఎంపిక చేసిన ప్రత్యేక పాయింట్స్ లో ముఖ్యంగా ముఖం పై ఇది పూర్తిగా సహజమైన చికిత్చ ఈ చికిత్చ వల్ల రక్త ప్రసారం ముఖం పై సజావుగా ఉంటుంది . మీముఖం లో లో అందమైన గ్లో వస్తుంది మీముఖంలో అవయవ నిర్మాణం లేదా ముడతలు కాంతికింద నలుపు ముడతలు లేకుండా ముఖం అందంగా ఉంటుంది .శరీరంలో ఏర్పడే హార్మోన్ల మార్పులు వాతావరణం లో వచ్చే సమస్యలు వయస్సు రీత్యా వచ్చే మార్పులు ముఖంలో శరీర ఆకృతి లో మార్పులు చోటుచేసుకుంటాయి. లేదా మీముఖం వచ్చే గ్లో తేజస్సు తరిగిపోతుంది. నేడు చాలా మంది యువతులు తమ ముఖం అందంగా కనపడడానికి కొన్ని రకాల కొస్మెటిక్స్ వాడడం వల్ల కొన్నిరకాల సైడ్ ఎఫ్ఫెక్ట్స్ వస్తున్నాయి. మేరు మీ ముఖం కాంతి వంతం గా చేసేందుకు వినియోగించిన రసాయానాలవల్ల  మీ ముఖం పై వచ్చిన సైడ్ ఎఫ్ఫెక్ట్స్ వంటి వాటిని నాడీ పతి ద్వారా అక్యు పంక్చర్ కొస్మెటిక్ థెరఫీ సహజమైన థెరఫీ గా పేర్కొన్నారు నిపుణులు .చాలా మంది స్త్రీలు అవాంఛిత రోమాలు పెరగడం పై  శరీరంలో చోటు చేసుకోడానికి  శరీరంలో ఏర్పడే హార్మోన్ మార్పు కారణం  గా నిపుణులు పేర్కొన్నారు .నాడీ పతి ద్వారా అలాంటి సమస్యలకు సహజమైన థెరఫీ ద్వారా హార్మోన్ లలో వచ్చే మార్పులు మీముఖం  పై ఆయిల్ ఫేస్ .లేదా ద్రై స్కిన్ , ముఖం పై మొటిమలు కంటి కింద మచ్చలు ముడతలు తగ్గించడానికి మందులు లేకుండానే చికిత్చ చేయవచ్చని తెలిపారు. మ్యాగ్నెట్ థెరఫీ... ఒక శాస్త్రజ్ఞుడు ఆల్బర్ట్ రాయ్ డేవిస్ చేసిన పరిశోదనలో కొన్ని ఫలితాలు పొజిటివ్ గాను కొన్ని నెగెటివ్ గాను మేగ్నెట్ లో మార్పులు చేశారు. దీని వల్ల వివిధరకాల ప్రభావాలు మనావ జీవితం లో వచ్చే బయో లాజికల్ పద్దతులు ఉన్నాయాని పేర్కొన్నారు.  వాస్తవానికి భూమి ని ఒక మ్యాగ్నెటిక్ గా భావించారు.  ఒక ఇస్ కాంతం లో శక్తి ఉంది . చాలా మందికి ఐస్  కాంతం పై అవగాహన లేనాందువల్లే మానవ శరీరంలో  వివిదారకాల అనారోగ్యాలకి కారణం గా చెప్పవచ్చు.చర్మ సమస్యలు, ఆర్థరైటిస్ మహిళ ల లో వచ్చే నెలసరి సమస్యలు ,రక్త హీనాథ ,ఒళ్ళు నొప్పులు కంటి సమస్యలు, సైనస్, తల నొప్పులు తగ్గాలంటే ఆయా ప్రాంతాల లో నొప్పుల కు వీపు భాగం లో బలామ్ శక్తి నిచ్చేందుకు ఐస్ కాంతానికి తగ్గిచే శక్తి ఉందని నిపుణులు నిరూపించ గలిగామని నిపుణులు స్పష్టం చేశారు. ఇస్ కాంత చికిత్చ ఉపయోగాలు... ఆర్థరైటిస్ .తల నొప్పులు, మైగ్రైన్, నొప్పులు ఒత్తిడి, ఎముకలు విరిగినసరికేయడం , రక్త ప్రసారం మెరుగుపడడం. మీశరీరంలో ఉన్న అరుగుదల వ్యాధులు క్యాన్సర్ నివారణ, నిద్రలేమి, జలుబు,సర్వైకల్, వంటి సమస్యకు ఐస్ కాంతం తో అద్భుతాలు చేస్తున్నామని ఇతర వ్యాధుల నివారణకు ఇతర థెరఫీ లతో పాటు రోగులకు చికిత్స చేస్తున్నారు. ఇందులో సుజోక్ మినీ మ్యాగ్నెట్స్ అంటే చిన్న ఐస్ కాంతం అతికిస్తామని తాత్కాలికంగా శరీరం పై ఆత్మపై పెడతామని.ఇవి అంధికశక్తిని ఇస్తాయని ఈకారణంగానే తీవ్రంగా నోపులు ఉన్నపటికీ తగ్గించగలిగామని ఆదేరకమైన మ్యాగ్నెట్స్ ను మేరీడియన్స్ పై శక్తి నిచ్చి నొప్పిని నివారిస్తుంది.

చల్లటి నీరు ఆరోగ్యానికి మంచిదేనా?

వేసవికాలం లో ఎండా వేడిమి తట్టుకోడానికి కాస్త ఏదైనా చల్లగా తాగాలని అందరూ అనుకుంటారు. అప్పుడే దాహం తగ్గుతుందని అనుకుంటారు.ఇంకొందరికి చల్లటి మంచినీళ్ళు అన్ని కాలాలలో తాగడం అలవాటు. చల్లటి నీళ్ళు అంటే కుండలో నీళ్ళు తాగడం కాదు,లేదా కొందరు ఐస్ ముక్కలు నీళ్ళలో వేసుకుని తాగితేనే తృప్తి అయితే ఎర్రటి ఎండలో కూల్ వాటర్ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా యుక్తవయస్సులో దాని ప్రభావం పెద్దగా ఉండదు కాని వయస్సు పెరిగే కొద్ది ఖచ్చితంగా దీని ప్రభావం లివర్ మీద ఉంటుందని అలాగే చల్లటి కూల్ డ్రింక్స్,కూలింగ్ లో ఉన్న ఆహార పదార్ధాలు తీసుకుంటే హార్ట్ ఎట్టాక్ కి దారి తీస్తుందని జపాన్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు జపాన్ శాస్త్రజ్ఞులు చేసిన పరిశోదనలో ఈ అంశాన్ని వెల్లడించారు. ఎండాకాలం లో చల్ల చల్లగా కూల్ డ్రింక్స్,బీర్లు,ఐస్ క్రీంలు,కూల్ కాఫీ,ఇవి చాలా ప్రమాదకర కరమైనవి అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చల్లని నీరు తాగడం వల్ల ఒచ్చే అనర్ద్గాలు... మన శరీర ఉష్ణోగ్రతకు సరిపడా సమాన మైన నీటిని మాత్రమే తాగాలి. గోరు వెచ్చటి నీటిని౩7 డిగ్రీల నీరు తాగాలి అలాకాకుండా కూల్ వాటర్ అంటే ఫ్రిడ్జ్ లో నీళ్ళు తాగడం వల్ల అది పొట్టలోకి చేరి పొట్టలో ఉన్న జతరాగ్నిని చల్ల బరుస్తుంది.జతరాగ్ని చల్ల బడిందో మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాదు ఈకారణం గానే పొట్టలో సమస్యలు వస్తాయి ఒక ఉదాహరణగా చెప్పాలంటే బాగా మండుతున్న పొయ్యిమీద అన్నం ఉడుకుతుంటే మధ్యలో అనిప్పులమీద నీళ్ళు పోస్తే ఏమౌతుంది పొయ్యి ఆరిపోతుంది అన్నం సరిగా ఉదాకడు జతరాగ్నిమీద చల్లటి కూల్ కూల్ ఐస్ వాటర్ పోస్తే జతరాగ్ని చల్లబడడమే కాదు తీసుకున్న ఆహారం అరగక పోగా శరీరం లోని అన్ని అవయవాలు పొట్టతో అనుసంధానించా బడి ఉంటాయి కాబట్టి శరీరము చల్లబదిపోతుంది అయితే సహజంగా శరీరంలో వాతావరణానికి అనుగుణంగా ఏ వేడిమి కి అయినా అడ్జెస్ట్ చేసుకుంటూ ఎదుర్కునే వ్యవస్థ ఉంది శరీరం చల్ల బడి పోకూడదు ఒక్కో సారి శరీరం చల్లబడిందా మల్లె వేడిని పుట్టించాలి. కృత్రిమంగా మళ్ళీ వేడి పుట్టించాలి. చల్లటి నీళ్ళు త్గాగడం వల్ల శరీరం లో శరీరంలో మార్పులు ఏవిధంగా ఉంటాయి అంటే చల్లటి నీరు తాగిన తరువాత కడుపు చల్లని నీటి వేడి చేయాలంటే ప్రయత్నం చేస్తుంది దీనికోసం అదనపు శక్తి కావాలి.అదనపు శక్తి దానికి రక్తం నుండి లభించాలి.అంటే శరీరం లోని మిగతా అవయవాల లోని రక్తం అంత పొట్టమీద కేంద్రీకరించ బడుతుంది అంటే కొద్ది సేపు ఆయా భాగాలలో రక్త సరఫరా తగ్గుతుంది.గుండె యొక్క రక్తం పొట్టను చేరితే అప్పుడు గుండె పరిస్థితి ఏమిటి?రక్త ప్రసారం మెదడుకు రక్తం అందక పోతే ఆక్సిజన్ అందక సమస్య తీవ్రత మరింత పెరుగుతుంది. ముఖ్యంగా చల్లటి నీళ్ళు కూల్ డ్రింక్స్ తాగితే విరేచనం కాకపోగా మలబద్దకం వంటి సమస్యకు దారి తీస్తుంది.ఆతరువాత మల ద్వారం పూర్తిగా కుంచించుకు పోతుంది.అంతే కాక గ్యాస్టిక్, డయాబెటిస్, లివర్ సమస్యలు కూడా వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి బయట పడాలంటే చల్లటి కూల్ వాటర్తాగక పోవడం ఐస్ ముక్కలు నీళ్ళలో వేసుకుని తాగడం ఐస్ క్రీం తినవద్దని అలాచేస్తే శరీరం సర్వనాశనం కావడం గ్యారంటీ.మీరు మీ ఆరోగ్యాన్ని కప్పడుకోవాలంటే చల్లటి నీరు ఐస్ క్రీమ్ల జోలికి వెళ్ళకండి తీసుకునే ముందు దాని ప్రభావం ఏమిటో ఒక్కసారి గమనించండి.బీ హ్యాపీ బీ హేల్తీ.                                

యోగాతో థైరాయిడ్‌కు అడ్డు కట్ట

థైరాయిడ్ ఎలాంటి వ్యాధి అంటే నేడు ప్రపంచంలో నేడు ప్రతి ఐదు గురిలో థైరాయిడ్ బాధితులు ఉన్నారన్నది వాస్తవం. నేటి పరిస్థితులలో పురుషులకంటే మహిళల లోనే ఈ సమస్య ఎక్కువ చూడవచ్చని ఆరోగ్యనిపుణులు భావిస్తున్నారు. థైరాయిడ్ హార్మోన్ మన శరీరం పనిచేయడం లో కీలకంగా ఉంటుంది.శరీరంలో థైరాయిడ్ హార్మోన్ ఎక్కువైనా తక్కువ అయినా ఆరోగ్యం పై తీవ్రప్రభావం చూపిస్తుంది. థైరాయిడ్ వల్ల వస్తున్న మార్పులు స్పష్టం గా కనిపిస్తాయి. థైరాయిడ్ హార్మోన్ ఇచ్చే సంకేతాలు కొన్ని ఉపచారాలఅవసరం అలా థైరాయిడ్ ను నియంత్రించడం లో యోగా సహకరిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. థైరాయిడ్ లో రకాలు... హైపర్ థైరాయిడ్ -- ఇందులో థైరాయిడ్ చాలా ఎ క్కువ సంఖ్యలో తయారు అవుతుంది.ఈ కారణంగా శరీరంలో బరువు చాలా త్వరగా త్గగ్గిపోతుంది. హైపో థైరాయిడ్ --- ఇందులో థైరాయిడ్ చాలా తక్కువగా సంఖ్యలో తయారు అవుతుంది.దీనికి తోడు పంచేంద్రియాలలో  సమస్యలు ప్రారంభ మౌతాయి. ఊబకాయం,సంతాన లేమి సమస్యలు వేదిస్తాయి. థైరాయిడ్ లక్షణాలు /హార్మోన్ సమస్యలు... థైరాయిడ్ హార్మొన్ నియంత్రణలో లేకపోవడం వల్ల మీ జుట్టు ఊడిపోవడం,మీ కనుబొమ్మలు తగ్గిపోతాయి.రాత్రి అంతా నిద్ర పోయినప్పటికీ పగలు అంతా తీవ్రమైన అలసట అనిపిస్తుంది.బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తుంది. లక్షణాలలో భాగంగా.. --కారణం లేకుండానే చింతించడం-ఒత్తిడికి గురికావడం-- --థైరాయిడ్ హార్మోన్ నియంత్రణ లేనికారణం గా ఊబకాయం పెరుగుతుంది.లేదా ఒక్కోసారి బరువు తగ్గిపోతారు. ---మహిళలలో థైరాయిడ్ హార్మోన్ తగ్గడం వల్ల స్త్రీలలో నెలసరి సమస్యలు వస్తాయి. --థైరాయిడ్ కారణం గానే ఎప్పుడూ వేడిగా ఉన్నట్లు అనిపిస్తుంది.చాలా వేడిగా ఉన్నట్లు అనిపిస్తుంది. --థైరాయిడ్ గ్రంధిలో వాపు దీనివల్ల స్వరంలో మార్పు ఉంటుంది. --పైన పేర్కొన్న అంశాలాలో ఏ లక్షణం మీకు కనిపించినా అలస్యం డాక్టర్ ను సంప్రదించండి.డాక్టర్ సూచనలు పాటించండి థైరాయిడ్ నియంత్రణ  చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి. ఖర్చులేకుండా సహజ పద్దతుల ద్వారా థైరాయిడ్ నియంత్రించ వచ్చు.దీనిప్రభావం చాలా త్వరగా ఉంటుంది. థైరాయిడ్ సమస్యకు చికిత్స లేదన్నది వాస్తవం కాదు.సమయాను గుణంగా నియంత్రించడం ద్వారా అన్ని సమస్యల మాదిరిగాదీనిని నియంత్రించ వచ్చు ఇతర చికిత్స లో ఖర్చులేకుండా యోగ సాధన ద్వారా థైరాయిడ్ ను నియంత్రించవచ్చు. మన శరీరంలో ఎన్నో రకాల గ్రంధులు ఉంటాయి.శరీరంలో ఒక్కో భాగం ఒక్కొరకం గా పని చేస్తాయి.అందుకోసం అత్యవసరమైన హార్మోన్లు ఉత్పత్తి  చేస్తుంది.థైరాయిడ్ గ్రంధి ఒక చిలక బటర్ ఫ్లై రూపంలో ఉంటుంది.అక్కడ నుంచి థైరాయిడ్ హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది.అది మన శరీరానికి అవసరం ఒక్క సారి థైరాయిడ్ ఉత్పత్తి ఎక్కువగా తక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది.దీనివల్ల శరీరంలో పనితీరు పై తీవ్ర ప్రభావం చూపుతుంది.దీనిని నియంత్రించేందుకు కొంత సేపు యోగా చేయడం ద్వారా ప్రభావం చూపవచ్చని నిపుణుల విశ్లేషణ అసలు ఎలాంటి ఆసనాలు వేయాలి వాటివల్ల ప్రయోజనం ఏమిటో చూద్దాం. సర్వాంగ ఆసనం... సర్వాంగ ఆసనం థైరాయిడ్ ని నియంత్రించడం లో చాలా ప్రభావ వంత మైన అసనంగా పేర్కొన్నారు.దీనివల్ల పైన పేర్కొన్న అంశాలలో రక్త ప్రసారం సరైన పద్దతిలో జరుగుతుంది.ఈ ఆసనం సాధన చేయడం ద్వారా థైరాయిడ్ గ్లాండ్ యాక్టివ్ అవుతుంది.దానిపని తీరు మెరుగు పడుతుంది. హలాసనం... హలాసనం ద్వారా థైరాయిడ్ పిట్యుటరీ గ్రంధుల పనితీరు మెరుగు పడుతుంది.ఆసనం వల్ల మన శరీరం లో ముఖ్యంగా వెన్నుపూసలోని మెరుగు పాడేందుకు ఉపయోగ పడుతుంది.దీనితోపాటు పొట్ట పెరగడాన్ని చాలా ఫలప్రదంగా ఉపయోగ పడుతుంది.ఈ ఆసనం సాధన చేయడం ద్వారా మాంసం కండరాలు పై ఒత్తిడి తగ్గుతుంది. మస్చ్య ఆసన... వెనుక వైపుకు ఒంగే ఈ ఆసనం గొంతు,చాతి,భుజాలు,పొట్ట ను పెంచుతుంది.లేదా తెరుస్తుంది.యోగాలో వేసే ఈముద్ర పొట్ట శరీరం పై భాగాలను యాక్టివ్ చేస్తుంది. అవిసక్రమంగా తమ పని చేసుకుపోతాయి.' విపరీత కారిణీ... ఈ ఆసనం వల్ల లాభాలు ఏమిటి అంటే సర్వాంగ ఆసనం లాగానే ఉంటుంది.ఇందులో కూడా పొట్ట పైకి తల క్రిందికి ఉంటుంది.ఆసనం సాధన చేస్తున్నప్పుడు మనం వీపుతో పాటు గొంతు ఒత్తిడి పెరుగుతుంది.ఆసనం వేస్తున్నప్పుడు మనం వీపుతోపాటు గొంతు పై ఒత్తిడి పెరుగు తుంది.దీనివల్ల థైరాయిడ్ గ్రంధి యాక్టివ్ గా ఉంటుంది. ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం సందర్భంగా థైరాయిడ్ ను నిర్లక్ష్యం చేయవద్దని సరైన వైద్యం తో పాటు సాంప్రదాయ యోగాసధనాల ద్వారా థైరాయిడ్ కు అడ్డకట్ట వేయవచ్చని నిపుణులు 

కోడి నిద్ర ప్రమాదం సుమా!

రాత్రి వేళ సరైన నిద్ర అంటే 6 గంటలు నిద్రసరిపోతుంది. వర్తమాన కాల మాన పరిస్థితులలో ఇప్పుడు కనీసం 5 ఘంటలు నిద్రపోవడం గగనంగా మారింది నేటి ఆధునిక జీవన విధానం పనిఒత్థిడి వ్యక్తి జీవితాన్ని మార్చేస్తోంది. మీరు కనీసం 5 గంటలు నిద్రపోకుంటే దీర్ఘకాలిక వ్యాధుల ప్రామాదం పొంచిఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.4౦% ప్రజలలో రెండు లేదా మూడు దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లు గుర్తించారు.అదే 25 సంవత్చరాల పై బడ్డ వారే వీరు ఇతరులతో పోలిస్తే 7 గంటలు నిద్రపోయిన వాళ్ళే. 5గంటల కన్నా తక్కువ అంటే మాధ్య రాత్రి నిద్రపోవడం లేదా మాధ్యరాత్రి నిద్రమేల్కోవడం వంటి సమస్యల వల్ల పూర్తిగా ఆరు గంటలు నిద్రపోలేక పోతున్నారా.దీనివల్ల ఖచ్చితంగా రెండు రకాల దీర్ఘకాలిక వ్యాదులబారిన పడక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.యునివర్సిటి కాలేజ్ అఫ్ లండన్ లోజరిగిన పరిశోదనలో చాలామంది 5 గంటలకన్నా తక్కువగంటలు నిద్ర పోతున్న వారిలో 5౦%నుండి 2౦ %ప్రజలలో దీర్ఘకాల వ్యాధులబారిన పడుతున్నట్లు నిపుణులు గుర్తించారు.4౦% మంది లో రెండు రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారని 25 సంవత్చారాలు పై బడిన వారితో పోలిస్తే 7 గంటలు నిద్రపోతున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. పరిశోదన వివరాలను పి ఎల్ ఒన్ మెడిసిన్ లో ప్రచురించారు. 5౦-6౦-7౦  సంవత్చరాల వయస్సులో ఉన్నవారు  ౩౦ % నుండి 4౦ % దీర్ఘకాలిక సమస్యలు ఎదుర్కుంటున్నారని.7 గంటల కన్నా ఎక్కువ నిద్ర పోయే వారితే పోలిస్తే అనారోగ్య సమస్యలు మల్టి మార్బిడిటేస్ ను గుర్తించారు.రెండు లేదా చాలా దీర్ఘకాలిక వ్యాధులు అధిక ఆదాయం ఉన్న దేశాలలో మల్టి మార్బిడిటిస్ మధ్య వయస్కులలో రెండు రకాల అనారోగ్య సమస్యలు ప్రజా ఆరోగ్యానికి ఇది పెద్ద సవాలే అని నిపుణులు అంటున్నారు.మల్టి మమార్బి డిటీస్ ఉన్నవారు ఉన్నత ప్రమాణాలు గల వైద్య సేవలు వినియోగించాల్సి ఉంటుంది. ఒక్కోసారి మల్టి మార్బిదిటిస్ ఉండేవారిని అత్యవసరంగా ఆసుపత్రిలో చేర్చాల్సి రావచ్చుఅని డాక్టర్ పరిశోదన శాస్త్రవేత్త డాక్టర్ సబియా వెల్లడించారు. .5౦ సంవత్చారాల లోపు వారు 5 గంటలు నిద్రలేకుంటే 25% మరణానికి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.వయస్సు పెరుగుతున్న కొద్ది వారు నిద్ర పోయే అలవాట్లు నిద్ర పోయే పద్దతులలో మార్పులు వస్తాయి.అంటే దాదాపు 7 గం--8 గం --రాత్రి నిద్రపోవాలి 5 గం తక్కువ ఉన్నవారు లేదా 5 గం కన్నా తక్కువ నిద్ర పోయినా అంతకన్నా ఆ తరువాత నిద్రపోయిన వారిలో దీర్ఘ కాలిక వ్యాధులు వస్తాయని డాక్టర్ సబియా వరించారు. పరిశోధకులు సహజంగా ఇద్దరూ ఎంత సేపు నిద్రపోయారు. మల్టి మార్బిదిటిస్ ఉంటె మరణాల శాతం గుండెజబ్బులు క్యాన్సర్ డయాబెటిస్ వంటి సమస్యలు 25 సంవత్చరాలు పై బడిన వారిలో వస్తాయి అని నిపుణులు పరిశోదన వివరాలలో పేర్కొన్నారు.చేసిన పరిశోదన ఎంతసేపు ప్రభావవంతంగా నిద్రపోగలుగుతున్నారు. పరిశోదన 7,౦౦౦ మంది పురుషులు 5౦--6౦ --7౦ సంవత్చరాలు ఉన్నవారి మధ్య పరిశోదన 1985 నుండి 1988 సంవత్చారాల మధ్యలో 14,౩౦8 మంది ప్రజల ప్రజల ప్రభుత్వ సేవలు చేసేవారిలో ౩5 నుండి --55 సం --మధ్యవయసులో ఉన్నవారిలో ౩/2%పురుషులు కాగా 1/౩% మంది స్త్రీలు ఉన్నారని పరిశోధకులు వెల్లడించారు.కొందరు అదే పనిగా నిద్రపోతే ఇంకొందరు అసలు నిద్ర పోరు. అసలు రాత్రి కనీసం ఒక్క ఐదు గంటలు అయినా నిద్ర పోనివాళ్ళు చాలామందే ఉంటారు. ఇంకొందరు షార్ట్ స్లీప్ కొద్ది సేపు కోడి నిద్ర పోయినట్లు పొతూ ఉంటారు. అలా ప్రతిరోజూ నిద్రభంగానికి గురిఅవుతూ ఉంటారో వారు మల్టి మార్బిడిటీ ఉన్నవారు రాత్రి సంపూర్ణంగా నిద్రపోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర తప్పనిసరి నిద్రపోయే ప్రదేశం ప్రశాంతంగా ఉండాలి.  చీకటి లేకుండా ప్రకాశ వంతంగా ఉండాలి. నిద్రపోయేముందు కాస్త వేడిగా ఉండాలి.ఎలాక్త్రానికి డివైస్ ను తొలగించాలి. నిద్రపోయే ముందు ఎక్కువ ఆహారం తీసుకోకూడదు. శరీరానికి వ్యాయామం రాత్రి పగలు వెలుతురు ఉండాలి లేదా లైట్ ఉండే విధంగా ఉండాలని మీరు నిద్రపోవాలంటే ఇవి తప్పనిసరి సుదీర్ఘ నిద్ర పోవాలని అంటే 9 గంటలు నిద్రపోయే వారు ఆరోగ్యంగా ఉన్నట్లు గుర్తించారు. దీర్ఘకాలం నిద్రపోఎవల్లలో మల్టి మార్బిడిటీ 5౦ సంవత్చరాలు పై బడిన  వారిలో లేదు.నిద్ర మన ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుందని వాస్తవానికి 4,౦౦౦ మందిపై నిర్వహించిన ఎలెక్ట్రోనిక్ మేజర్ మెంట్ ద్వారా నిర్ధారించినట్లు పరిశోధకులు వెల్లడించారు.ఉద్యోగులు వారు ఆరోగ్యంగా ఉండచ్చు ఇతరులకన్న ఆరోగ్యంగా ఉండచ్చు అని నిర్ధారించారు.               

గుండె మీద గుదిబండ హైపర్ టెన్షన్!

మనిషిలో ఆందోళన, గందరగోళం, కంగారు ఎక్కువైనప్పుడు చోటు చేసుకునే పరిస్థితి హైపర్ టెన్షన్. హైపర్ టెన్షన్ అనేది  జబ్బు కాకపోవచ్చు కానీ ఇది చాలా జబ్బులకు దారి తీస్తుంది. మరీ ముఖ్యంగా ఇది  గుండె జబ్బులకు కారణం అవుతుంది! ఈ మధ్య కాలంలో గుండెపోటు వచ్చిందనే విషయం మనం చాలా ఎక్కువగా వింటుంన్నాం. ఇంతకూ గుండెపోటు ఎందుకు వస్తుంది?? ఎలా వస్తుంది?? అన్ని అవయవాలకు రక్తం సరఫరా చేయడానికి రక్తనాళాలు ఉన్నట్లే గుండెకి రక్తం సరఫరా చేయడానికి 'కరోనరి ఆర్టెరీ' అనే ధమని వుంటుంది. దీంట్లో అడ్డం ఏర్పడితే గుండెకి రక్తం సరఫరా సరిగ్గా జరగదు. దాంతో ఆ భాగం ఆహారం అందక నశిస్తుంది. గుండె, మెదడు కండరాలలోని కణాలు ఒకసారి మరణిస్తే వాటి స్థానంలో మిగతా అవయవాలలోలా క్రొత్తవి ఉత్పత్తి కావు. అందుకని ఒకసారి నష్టం జరిగితే అది శాశ్వత నష్టమే! గుండె కండరాలు దెబ్బతినే సరికి గుండె కొట్టుకోవడం హఠాత్తుగా ఆగిపోతుంది. ఇదే గుండెపోటు రావడం గుండె ఆగితే ఇక ప్రాణం పోయినట్లే.. రక్తప్రసరణ మెదడులోని భాగాలకి సరిగ్గా జరగకపోవడం వల్ల ఆ భాగాలు దెబ్బతిని క్రమంగా మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది. లేకపోతే అధిక రక్తపోటువల్ల మెదడులోని అతి సన్నని రక్తనాళాల చివర్లు చిట్లి సెరబ్రల్ హెమరేజ్ కలగవచ్చు. ఈ రక్తపోటు వయసు, జాతిల మీద కూడా ఆధారపడి వుంటుంది. మగవాళ్ళలోను, వృద్ధులలోను ఈ అధిక రక్తపోటు ఎక్కువగా కనిపిస్తుంటుంది. కాబట్టి 40 సంవత్సరాల వయస్సు వచ్చినప్పటినుంచి రక్తపోటు పరీక్షించి, తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. రక్తపోటు పెరగడం వల్ల మూత్రపిండాలు కూడా దెబ్బ తింటాయి. ఒక్కోసారి మూత్రపిండాలకు సరిగా రక్తం అందనప్పుడు, అవి రక్తపోటు పెరగడానికి రెవిన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేసి రక్తంలో కలుపుతాయి. కాబట్టి మూత్ర పిండాలలోపం వల్ల రక్తపోటు పెరుగుతుంది. శరీరబరువు పెరగకుండా జాగ్రత్తపడుతుండాలి. ముఖ్యంగా నలభై ఏళ్ళ తర్వాత! ప్రతి కిలో బరువు పెరుగుదలకి గుండె రోజుకి 300 కి.మీ. దూరం ఎక్కువగా రక్తనాళాల ద్వారా రక్తాన్ని ప్రసరింపజేయాల్సి వుంటుంది. అంటే పెరిగే బరువునిబట్టి గుండెమీద భారం పెరుగుతుందన్నమాట! కాబట్టి బరువు తగ్గడం అవసరం!! ఉప్పు, కారం తగ్గించాలి. పొగ త్రాగడం మానాలి. పొగ త్రాగడం వల్ల కూడా రక్తపోటు పెరుగుతుంది. పొగ త్రాగడం వల్ల 80 నుంచి 120 మి.గ్రా. నికోటిన్ ప్రతిరోజు రక్తంలో చేరుతుంది. ఇది ఆర్టెరీస్ ముఖ్యంగా కాళ్ళలో, చేతుల్లో మూసుకుపోయేటట్లు చేస్తుంది. అలాగే గుండె కొట్టుకోవడాన్ని నిముషానికి 72 సార్లు నుంచి 80 సార్లకి పెరిగేలా చేస్తుంది. ఇలా గుండెమీద భారం పెరుగుతుంది!  కేవలం పొగ త్రాగడం వల్ల మాత్రమే కాదు, మద్యం సేవించడం వల్ల కూడా గుండెకు ముప్పు పొంచి ఉంటుంది.  పైన చెప్పుకున్నవన్నీ మొదట రక్తపోటుకు కారణం అయ్యి అది కాస్తా హైపర్ టెన్షన్ కు దారితీసి గుండె పనితీరు మీద దెబ్బ కొడుతుంది. అందుకే గుండె పనితీరు చక్కగా ఉండాలంటే హైపర్ తేనైన్ కు, రక్త పోటుకు దూరంగా ఉండాలి.                                      ◆నిశ్శబ్ద.

నిలబడి నీళ్ళు తాగితే ప్రమాదమా ?

మన పెద్దవాళ్ళు ఒక సామెత చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది. అదే పరుగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగడం మంచిది అని అనేవాళ్ళు.ఇప్పుడు నిలబడి నీళ్ళు తాగితే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.నిలబడి నీళ్ళు గడగడా తాగడం మంచిది కాదని నాలుగు రకాల అనర్ధాలు వస్తాయని అంటున్నారు నిపుణులు.నీళ్ళు మన జీవితానికి ఎంత అవసరమో మనందరికీ తెలుసు. నిలబడి నీళ్ళు ఎలాతగాలో చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు.అంటే నిలబడి నీళ్ళు తాగడం వల్ల వచ్చే అనర్ధాలు అందరికీ తెలియదు. మరి నీళ్ళు తాగే సరైన పద్ధతి ఏమిటి. అసలు నీరు తాగడం కూడా అంతే ప్రాధాన్యత ఉంది.అసలు విషయానికి వస్తే నీళ్ళు తాగే టప్పుడు నిలబడి తాగడం ఒక అలవాటుగా మారిందిఅసలు నిలబడి నీళ్ళు తాగితే ఎలాహాని కలుగుతుంది సమస్యలు వస్తాయి వాటి గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. నిలబడి నీళ్ళు తాగడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్... ఊపిరి తిత్తులకు నష్టం కలిగిస్తుంది... మీరు నిలబడి నీళ్ళు తాగినప్పుడు అత్యవసరమైన పోషక తత్వాలు విటమిన్లు లివర్ పంచేంద్రియాలను చేరవు జారుగా ఉండే పదార్ధాలు అతి త్వరగా కరిగిపోతాయి అది మీ ఊపిరి తిత్తులు గుండెకు తీవ్ర నష్టం సంభవిస్తుంది ఆక్సిజన్ స్థాయిలో సమస్యలు వస్తాయి. జీర్ణ సమస్యలు.. మీరు తీసుకున్న ఆహారం ఒక్కోసారి అరుగుదల లేకపోవడం మీఆహారాం పోట్టలోనే చెడి పోవడమే అవకాశం ఉంటుంది.నిలబడి నీళ్ళు తాగడం వల్ల పంచేంద్రియాలకు తీవ్ర నష్టం జరుగుతుంది. మనం నీళ్ళు తాగేటప్పుడు త్వరిత గతిన అన్నవాహిక గుండా పోట్ట కింది భాగం లో కి చేరుతుంది. ఇది మీ కు తీవ్ర హాని కలిగిస్తుంది నిలబడి గటగటా నీల్లుతాగడం వల్ల నరాలు ఒత్తిడికి గురి కావడం మృదువైన మెత్తటి పదార్దాలు లేదా శరీరంలోని సున్నితమైన భాగాలు పట్టుకోల్పోతాయి.టాక్సిన్స్ చేరి అరుగుదలలో సమస్యలు మార్పులు వస్తాయి. కిడ్నీకి సంబందించిన సమస్యలు... మనం నిలబడి నీళ్ళు తాగినప్పుడు మనకిడ్నీ ఆసమయం లో ఒక పద్ధతి ప్రకారం ఫిల్టర్ చేస్తుంది. మనం కూర్చుని నీళ్ళు తాగినప్పుడు,నిలబడి నీళ్ళు తాగినప్పుడు మెత్తటి పదార్ధాలు ఒక్కోసారి ఫిల్టర్ కాకుండానే పోట్టకింది భాగం లోకి చేరుతుంది. నీటిలో ఉన్న మలినాలు మూత్రాశయం లోకి చేరి మూత్రపిండాలు కిడ్నీ చేసే పని పై ప్రభావం చూపుతుంది. యురినరీ ట్రాక్ కు సంబంధించి అనారోగ్య సమస్యలు వస్తాయి. గట్టి పడే ప్రమాదం ఉంటుంది... మీరు నిలబడి నీళ్ళు గడగడా తాగేస్తే మీ ముక్కు నాసికా రంద్రాలలో ఒక్కోసారి నీరు చేరి శ్వాస నాళం లేదా ఇతర భాగాల్ పైన ఒత్తిడి పెరిగి మెత్తటి పదార్ధాలు ఒక్కోసారి శరీరం లోని మెత్తటి భాగాలు గట్టిగా మారడం మెత్తటి పదార్ధాలు పట్టుకోల్పోతాయి శరీరంలో టాక్సికేంట్స్ జీర్ణ వ్యవస్తలోమర్పులు వస్తాయి చెడు పదార్ధం లేదా విష పదార్ధం పేరుకు పోతుంది. మన జాయింట్స్ లో ఉండే మెత్తటి పదార్ధాలు చేరుతాయి  ఈ కారణంగా గట్టిగా మారిపోతుంది దీనివల్ల ఒక్కోసారి ఎముకలకు నష్టం కలుగుతుంది. మరి నీళ్ళు తాగే సరైన పద్దతులు ఏమిటి ?... నిపుణుల సూచనల ప్రకారం నీళ్ళు ఎలా తాగాలి కూర్చుని తాగాలి. కుర్చీపై కూర్చుని మీవీపును నిటారుగా ఉంచి నీళ్ళు తాగాలి దీనివల్ల పోషక పదార్ధాలు మెదడును చేరుతాయి మెదడు పనితీరులో క్రమబద్దీ క రిమ్పబడతాయి అంతే కాదు పంచేంద్రియాల పనితీరు మెరుగు పడుతుంది పొట్టలో వాపు పోట్టపెరగడం వంటి సమస్యలు రావు.  .   

తీపి కూడా ఓ వ్యసనమే!

కొన్ని దశాబ్దాల క్రితం పరిస్థితులతో పోల్చుకుంటే ఇప్పటి జీవనవిధానం మారింది. శారీరిక శ్రమ తగ్గిపోయింది, ఎక్కడికక్కడ పని సులువుగా జరిగిపోతోంది. కానీ అందుకు విరుద్ధంగా ఆహారపు అలవాట్లు మాత్రం దిగజారిపోయాయి. ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో తెలియని పరిస్థితి. అందుకనే ఇప్పుడు కొత్త కొత్త సమస్యలు మొదలవుతున్నాయి. కొత్త కొత్త పదాలు వినిపిస్తున్నాయి. వాటిలో ఒకటే ‘కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్‌’.   ఏమిటీ కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్‌!     మన ఆహారంలో పిండిపదార్థలు ఓ ముఖ్య పాత్రని వహిస్తాయని తెలిసిందే! అయితే ఈ పిండి పదార్థాలను ఎడాపెడా తీసుకోవడం వల్ల వాటిలోని అధిక చక్కెర మన శరీరాన్ని నిర్వీర్యం చేసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా బేకరీ పదార్థాలు, శీతల పానీయాలు, స్వీట్లు, తియ్యటి తేనీరు, చాక్లెట్లు, ఐస్ క్రీములు... ఇలా చెప్పుకుంటో పోవాలే కానీ చక్కెర అధికంగా ఉండే పదార్థాల జాబితా చాంతాడుని మించిపోతుంది. కొంతమంది ఈ పదార్థాలను వదిలి లేకపోవడమే కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్.   ఏం జరుగుతుంది కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్‌ ఉన్నవారు చక్కెర అధికరంగా ఉండే పదార్థాలను తినేందుకు ఉబలాడపడిపోతుంటారు. ఒకటి రెండు రోజుల పాటు ఇలాంటి పదార్థాల దొరక్కపోతే వీరికి చాలా చిరాగ్గా ఉంటుంది. పిల్లలైతే ఆ పదార్థాన్ని తీసుకునేదాకా పేచీ పెడుతూనే ఉంటారు. వీరి శరీరం చక్కెరకు అలవాటు పడటం వల్ల, చక్కెర తీసుకున్న వెంటనే వారి ఒంట్లో ‘డోపమైన్‌’ అనే రసాయనం ఉత్పత్తి అవుతుంది. ఈ డోపమైన్‌ మనసు సంతోషంగా ఉన్న ఒక భావనని కలిగిస్తుంది. మద్యం వంటి వ్యసనాలలో కూడా ఈ డోపమైన్‌దే ముఖ్య పాత్ర. తరచూ ఏదో ఒక చక్కెర పదార్థాన్ని తినాలని నాలుక లాగుతూ ఉంటడం, ఎదురుగుండా ఎంత తీపి పదార్థం ఉంటే... అంతా తినేయడం, ఊబకాయం వస్తున్నా కూడా ఆహారాన్ని నియంత్రించుకోకపోవడం... ఇవన్నీ కూడా కార్బొహైడ్రేట్‌ ఎడిక్షన్‌ లక్షణాలే!   ప్రమాదం కార్బొహైడ్రేట్ ఎడిక్షన్‌ అనేది ఆషామాషీగా తీసుకోవల్సిన లక్షణం కాదని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. చిన్నవయసులో ఊబకాయం బారిన పడేవారిలో 75 శాతం మందిలో ఈ లక్షణం కనిపిస్తోందట. కార్బొహైడ్రేట్‌ ఎడిక్షన్ ఉన్న వారిలో ఇన్సులిన్‌ చాలా అధికంగా ఉత్పత్తి అవుతుంది. అది కొన్నాళ్లకి అస్తవ్యస్తంగా మారిపోయి, చక్కెర వ్యాధికి దారితీస్తుంది. ఇక ఒంట్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల వచ్చే గుండెజబ్బుల వంటి ఇతరత్రా సమస్యల గురించి చెప్పనే అక్కర్లేదు. పైగా చక్కెర అధికంగా ఉండే చాలా పదార్థాలలో విటమిన్లు, ఖనిజాలు తదితర పోషక పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి శరీరం ఆరోగ్యంగా కనిపిస్తుందే కానీ, కూర్చుంటే లేవలేనంత నిస్సత్తువ ఉంటుంది.   మరేం చేయడం! - ముందుగా తీపి పదార్థాలలోనే కాస్త ఆరోగ్యకరమైనవి ఎంచుకోండి. ఉదాహరణకు పండ్ల రసాలకు బదులుగా పండ్లు, ఐస్‌క్రీంకు బదులుగా పెరుగు... ఇలాగన్నమాట.   - ఇంట్లో అదేపనిగా చిరుతిళ్లను నిలువ చేసుకోవడం అపేయండి. మీ ఇంట్లో చిరుతిండి డబ్బాలను ఖాళీ చేయండి.   - ఆకలి వేయకపోయినా కూడా ఏదో ఒకటి తినాలని నోరు పీకేస్తుంటే బాదం పప్పులు, టమోటాలు, ఆమ్లెట్లు, మొలకలు... ఇలా తక్కువ పిండి పదార్థాలు ఉండే చిరుతిళ్లని తీసుకోండి.   - నీరు తాగడం వల్ల ఆకలి తాత్కాలికంగా ఉపశమిస్తుంది. కడుపు నిండిన భావనా కలుగుతుంది. ఒంట్లోని చెడంతా బయటకి పోవడమూ ఉంటుంది. కాబట్టి కార్బొహైడ్రేట్‌ ఎడిక్షన్‌ నుంచి బయటపడే వరకూ కాస్త మంచినీరుని ఆరారగా తీసుకుంటూ ఉండండి.   - వ్యాయామం వంటి శారీరిక శ్రమను అలవాటు చేసుకోండి. దీని వల్ల కొవ్వు కరగడమే కాదు, శరీరంలో ‘నిజమైన’ ఆకలి మొదలవుతుంది. అది తీపి పదార్థాల మీద కాకుండా పోషక పదార్థాలను తీసుకోవాలని కోరుకుంటుంది.   - మీ పిల్లల్లో కనుక కార్బొహైడ్రేట్‌ ఎడిక్షన్ ఉందని గమనిస్తే, వారిని కూర్చోపెట్టి అందులోని లాభనష్టాల గురించి వివరించండి. - నిర్జర.

యువత మీ హృదయం కాస్త  జాగ్రత్త...

యువతరానికి గుండెపోట ఇదేమిటి అప్పుడే గుండెపోటు ఏమంత వయసు అయ్యిందని యువత గుండెపోటుకు గురిఅవుతున్నారు అన్నది అందరినీ సందిగ్ధం లో పడేసింది. ఇక్కడ దీనికి సంబంధించి ఒక వాస్తవ సంఘటన గుర్తుకు వస్తుంది. అప్పట్లో కేంద్ర మాజీ మంత్రి ఎం పి బండారు దత్తా త్రేయ కుమారునికి 21 సంవస్త్సరాలు యువకుని పేరు వైష్ణవ్ గుండెపోటు తో మరణించినట్లు సమాచారం. అందరూ ఒక్క సారిగా దిగ్బ్రాంతికి గురియారు.పైగా వైష్ణవ్ ఒక వైద్య విద్యార్ధి కావడం గమనార్హం. చిన్నవయస్సులో గుండెపోటు కు గురికావడం పట్ల సర్వత్రా ఉలిక్కి పడ్డారు అప్పుడే మొదలయ్యింది చిన్నవయస్సులో గుండెపోటు ఏమిటి? ఎందుకు వస్తుంది? అన్న ప్రశ్నలకు సమాధానం రాకుండా నివారించాలేమా? అసలు అంత చిన్న వయస్సులో గుండెపోటు ఎందుకు వస్తోంది అన్న అంశాల పై దృష్టి సారించారు నిపుణులు.మనదేశం లో అత్యధిక మరణాలు గుండెజబ్బుల మూలంగానే అని అనడం లో అతిశయోక్తి లేదు.ఒకవైపు ఆధునికత, మరోవైపు పోటీ తత్వం వృత్తి పరంగా,విద్య లో పోటీ పెరగడం తో విపరీతమైన   ఒత్తిడి పెరగడం తో శరీరం లో ని ప్రతి అవయవమూ ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది. అని అంటున్నారు నిపుణులు ఒత్తిడి కారణంగానే రకరకల రోగాల్ బారిన పడడం గమనించవచ్చు.అవే వారి పాలిట మృత్యు ఘంటి కలుగా మారుతున్నాయి. వాటిలో ప్రధాన మైనది క్రానిక్ కరోనరీ ఆర్టరీ డిసీజ్... క్రానిక్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ లో గుండె పంపింగ్ సామర్ధ్యం తగ్గిపోతుంది.శరీర అవసరాలకు తగినంత రక్తాన్ని గుండె సరఫరా చేయలేకపోవడం వైద్యులు అంటూ ఉంటారు. ఫలితంగా నీరసం,ఆయాసం, శరీరం లో ని పదాలు చీలమండలాలలో నీరు చేరడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాగే కొంతకాలం కొనసాగితే గుండె కండరం బలహీన పడడం లేదా బిగుతుగా మారడం వల్ల గుండె కొట్టుకునే సామర్ధ్యం తగ్గి రక్త ప్రసరణ లో వేగం తగ్గుతుంది. కొంత కాలానికి అది ప్రనాన్తకంగా మారుతుంది. ఆర్టరీ డిసీజ్ కు కారణాలు... గతంలో గుందేసమస్యలు కేవలం 5౦ సంవత్సరాలు వచ్చిన వారిలోమాత్రమే కనిపించేది.కనీ ఇప్పుడు25 సంవత్సరాల నుండి 4౦ సంవత్సరాల వయస్సు ఉన్న వారిని సైతం గుండెపోటు కు గురికావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఆందోళనకు గురి చేస్తోంది.ప్రాణాలను హరిస్తోంది.గుండె సమస్య ఏదైనా సరే కారణాలు చాలానే ఉంటాయి. చిన్న వయస్సులో గుండెపోటు రావడానికి కారణాలలో ముఖ్యమైనది సరైన జీవన శైలి లేకపోవడమే,లేదా చెడు అలవాట్లు, ముఖ్యంగా పొగ తాగడం, ఒత్తిడికి గురికావడం, కీలక పరిణామం గా వైద్యులు పేర్కొంటున్నారు.గతంలో ఎన్నడూ లేనివిధం గా యువత లో ఒత్తిడికి గురి అవుతున్నారని ఒత్తిడి ఉన్న కనిపించకుండా ఉండేవారని. ఇప్పుడు సహజంగానే జీవితం లో వస్తున్న మార్పులు జీవితం లో కావాల్సిన అవసరాలు పెరగడం ఆశలు పెరగడం తగిన విధంగా పని చేయాల్సి రావడం తో తీవ్ర ఒత్తిడికి కాక తప్పడం లేదు.పిల్లలలో వారి స్థాయికి మించి ఆశించడం వల్ల బాల్యంనుండే పిల్లలు ఒత్తిడికి గురిఅవుతున్నారు.అలా వయస్సు పెరిగే కొద్దీ మరింత బాధ్యతలు పెరిగి ఒత్తిడిని ఎదుర్కోవడం వల్లే ఒకవైపు గుండె సమస్యలు లేదా ఆత్మహాత్యలకు పాల్పడడం మనం చూస్తున్నాము. జీవన శైలి లో మార్పులు కరనమేనా ... ఏ వృత్తిలో ఉన్నవారైనా శారీరక శ్రమ తగినంత ఉండడం లేదు. తగిన వ్యాయామం చేయడానికి తగిన సమయం దొరకడం లేదు. వీరు తీసుకునే ఆహారం కూడాసమతులంగా ఉండకపోవడం చాలా మందిలో అధిక బరువు స్థూలకాయం సాధారణం గా కనిపిస్తుంది. శరీర బరువు కూడా ఒకకారణ మైతే ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణా లకు ప్రాధాన కారణం ఊబకాయామే అని నిపుణులు అభిప్రాయ పడ్డారు.ఇప్పుడు చాలా మంది యువకులలో చాలా మంది రాత్రి పూట మేలుకునే ఉద్యోగాలాలో ఉంటున్నారు. ఇలాంటి వారిలో స్లీప్ ప్యాత్రాన్ సరిగా లేకపోవడం రకరకాల అనారోగ్యాలకు పరోక్షంగా గుండె కిడ్నీ వంటి ముఖ్యమైన అన్ని అవయవాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. అని నిపుణులు పేర్కొన్నారు.ఒత్తిడి ని తగ్గించే క్రమం లో రక రకాల అలవాట్లకు యువత పాల్పడుతోంది.తాత్కాలిక ఉపసమనం కోసం చేసుకునే అలవాట్లు ప్రతిరోజూ అలవాటుగా మారి దీర్ఘకాలం లో శరీరానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలవాట్లు వ్యసనాల కారణంగా బిపి రక్త నాళాల పైన తీవ్రమైన ఒత్తిడి నష్టం చేస్తుంది.ఈ కారణంగానే కార్డియో వ్యాస్క్యులర్ సమస్యలు,హార్ట్ ఎట్టాక్ వచ్చే అవకాశాలు ఉన్న్నాయి. హార్ట్ ఎట్టాక్ వచ్చిన వారిలో గుండె కండరం దెబ్బతినడం,లేదా హార్ట్ ఫైల్యూర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.పుట్టుకతో వచ్చే అనారోగ్య సమస్యలు కూడా హార్ట్ ఎట్టాక్ కు కారణమౌతాయి. నివారణ సాధ్యమేనా?... గుండె జబ్బులు వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరికైనా రావచ్చు అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి లక్షణాలు కనపడ్డ వెంటనే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. ప్రాణాలకు ప్రమాదం కాకుండా జాగ్రత్త పడడం అత్యవసరం. దీనికోసం చిన్నపాటి జాగ్రతలు పాటించడం అవసరం... వీలైనంత మేరకు ఒత్తిడికి గురి కాకుండా ఉండడా నికి దూరంగా ఉండే ప్రయాత్నం చేయాలి. ఇందుకోసం యోగా ధ్యానం చేయడం ఉత్తమం... ప్రతిరోజూ అరగంట పాటు వ్యాయామం తప్పని సరిగా చేయడం అలవాటు చేసుకోవాలి... సమతుల పోషక ఆహారం పాలు,కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు,ఆహారం లో భాగం చేసుకోవాలి... కుటుంబ సభ్యులతో కాస్త గడపడం వల్ల ఒత్తిడి ని అధిగమించ వచ్చు.ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలే ప్రాణాపాయ స్థితి నుండి మిమ్మల్ని కాపాడ తాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న దేశానికీ అవసరం, మీ ప్రాణం అత్యంత విలువైనది. అని గ్రహించండి. మీ ఆరోగ్యం మీగుందే మీచేతుల్లోనే ఉందని గుర్తించండి.  ప్రధాన కారణం ఊబకయమే అని నిపుణులు అభిప్రాయ పడ్డారు.