English | Telugu

నేను త్వరలో మీ హీరో కాబోతున్నా ... సందీప్ రెడ్డి వంగాకి మెసేజ్ పెట్టిన పృథ్వి


బుల్లితెర మీద పృథ్వి శెట్టి - విష్ణు ప్రియా జోడీ చేసిన అల్లరి అందరికీ తెలుసు. బిగ్ బాస్ నుంచి వీళ్ళు ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో కూడా ఆడియన్స్ కి తెలుసు. ఐతే తాము మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకున్నారు. ఇక రీసెంట్ గా పృథ్వి శెట్టి ఒక ఇంటర్వ్యూకి వచ్చాడు. "మీరు చూసిన ఒక మూవీలో ఈ క్యారెక్టర్ నేను చేసి ఉంటే ఎంత బాగుండో నేనైతే ఇరగదీసేవాడిని" అని ఎప్పుడైనా అనిపించిందా అని హోస్ట్ అడిగిడిని. "ఇరగదీసేవాడిని అని అనిపించలేదు నేను చేస్తే ఇది బాగుంటుంది అనిపించింది. యానిమల్, దురంధర్, కేజిఎఫ్ అనిపించింది" అని చెప్పాడు. అంటే కటౌట్ కి తగ్గితే మూవీస్ కూడా అనిపించాయి అంది హోస్ట్. "సందీప్ రెడ్డి వంగ అంటే ఇష్టం. నేను ఆయనకు మెసేజ్ పెట్టాను.

నేను త్వరలో మీ హీరో కాబోతున్నా" అని కానీ ఆయన ఆ మెసేజ్ ని చూడలేదు." అని చెప్పాడు. "జీవితం నాన్న పోయినప్పుడు చాలా బాధపడ్డాను. ఆయన నా ముందుకు వస్తే నేను ఆయనని హగ్ చేసుకుంటాను. నేను ఏ ఫామిలీ పెళ్ళికి వెళ్లడం లేదు. వీడు యాక్టింగ్ యాక్టింగ్ అంటాడు ఇక్కడే ఉన్నాడు. మా అమ్మను అడిగేవాళ్ళు మా అబ్బాయి ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు మీ అబ్బాయి ఎం చేస్తున్నాడు అనేవాళ్ళు. నేను ప్రస్తుతం ఉన్న పొజిషన్ లో హ్యాపీగా లేను." అంటూ చెప్పుకొచ్చాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.