English | Telugu

Karthika Deepam2 : సుమిత్రకి బ్లడ్ క్యాన్సర్.. నిజం తెలిసి షాకైన శివన్నారాయణ!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -560 లో.. కార్తీక్, దీప ఇంటికి వస్తారు. వాళ్ళు రాగానే సుమిత్ర రిపోర్ట్స్ శివన్నారాయణ ఎదురుగా పెట్టి రిపోర్ట్స్ కార్ లో ఉన్నాయి.. కావాలనే అక్కడ పెట్టావ్ కదా. రిపోర్ట్స్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేశా.. డాక్టర్ హారిక అంట.. మీకు కార్తీక్ ఏం చెప్పలేదా తనని అడగండి అంటుంది. అసలు ఏమైంది ఎవరికి ప్రాబ్లమ్ అని కార్తీక్ ని శివన్నారాయణ నిలదీస్తాడు. మరొకవైపు జ్యోత్స్న చేసిన మోసాన్ని బయటపెట్టాలని శివన్నారాయణ దగ్గరికి శ్రీధర్ వస్తాడు.

ఆ తర్వాత కార్తీక్ మా దగ్గర ఏదో దాస్తున్నావని శివన్నారాయణ కోప్పడతాడు. అప్పుడే సుమిత్ర వస్తుంది. ఆ రిపోర్ట్స్ లో ఏముంది మా అయనకి ఏమైందని సుమిత్ర అడుగుతుంది. ఎవరు ఎంత అడిగినా చెప్పకపోయేసరికి శివన్నారాయణకి కోపం వచ్చి కార్తీక్ ని కొడుతాడు. అప్పుడే శ్రీధర్ వస్తాడు. అసలు ఏమైందంటు సుమిత్ర దగ్గుతూ కిందపడిపోతుంది. వెంటనే డాక్టర్ ని పిలుస్తాడు. లోపల సుమిత్రకి డాక్టర్ ట్రీట్ మెంట్ ఇస్తుంటే బయట ఇప్పుడు అయిన నిజం చెప్పారా అని కార్తీక్ కాలర్ పట్టుకుంటాడు దశరథ్. అప్పుడే డాక్టర్ వచ్చి కార్తీక్ నిజం చెప్పడు.. అతని కాలర్ వదలమని చెప్తుంది. సుమిత్ర గారికి బ్లడ్ క్యాన్సర్.. ట్రీట్ మెంట్ చేస్తే తగ్గే స్టేజిలోనే ఉందని డాక్టర్ చెప్పగానే అందరు షాక్ అవుతారు.
ఇంకొక విషయం ఏంటంటే బోన్ మ్యారో ట్రాన్సప్లాంటేషన్ చెయ్యాలి.. అలా చేస్తే సుమిత్ర గారు బతుకుతారు.

సుమిత్ర గారి కూతురు ఎవరైనా ఉన్నారా అని డాక్టర్ అడుగుతుంది. దీపని చూసి ఇమేని చూడగానే సుమిత్ర కూతురు అనుకున్నానని డాక్టర్ అనగానే తన పక్కనున్న జ్యోత్స్న, సుమిత్ర కూతురు అని శివన్నారాయణ అంటాడు. జ్యోత్స్ననే సుమిత్రని బ్రతికిస్తుందని డాక్టర్ చెప్తుంది. సర్జరీ చెయ్యాలంటే
సుమిత్ర గారి కూతురిది అయితేనే మ్యాచ్ అవుతుందని డాక్టర్ చెప్పగానే నేను కూతురిని కాదు కదా అని జ్యోత్స్న భయపడుతుంది. ఇక నిజం తెలిసిపోతుందని పారిజాతం భయపడుతుంది. ఆ తర్వాత సుమిత్రకి నిజం చెప్పే దైర్యం చెప్పండి అని డాక్టర్ వెళ్ళిపోతుంది. కార్తీక్ కి శివన్నారాయణ, దశరథ్ సారీ చెప్తారు. శ్రీధర్ ఫైల్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.