English | Telugu

 నీతో మాట్లాడుతుంటే కిక్ వస్తుంది.  వరుణవిని ఎత్తుకున్న మాస్ మహారాజ 


జీ తెలుగులో "సంక్రాంతి అల్లుళ్ళు పండగకి వస్తున్నారు" పేరుతో సంక్రాంతి స్పెషల్ ప్రోగ్రాం టెలికాస్ట్ కాబోతోంది. ఈ షోకి స్పెషల్ గెస్ట్ గా మాస్ మహారాజ రవితేజ ఎంట్రీ ఇచ్చారు. ఇక వరుణవి అటు ప్రదీప్ ని ఇటు సుధీర్ ని పంచ్ డైలాగ్స్ తో ఆడేసుకుంది. "నీకు నేను తెలుసా ప్రదీప్ ని" అన్నాడు. " ఒక పక్కన పెన్షన్ తీసుకుంటూ ఇంకో పక్క పెళ్లి కాలేదు అని టెన్షన్ పడుతున్న యాంకర్ నువ్వే కదా" అనేసింది. ఇక సుధీర్ స్పందిస్తూ "ప్రదీప్ అన్న చాలా మంచోడు అన్న మీద పంచులు వేయకూడదు" అంటూ చెప్పాడు.

"అతనొక గొప్ప సిద్ధాంతి నువ్వొక పెద్ద వేదాంతి" అంటూ ఇద్దరినీ కలిపి అనేసింది. "అందరినీ ఎంటర్టైన్ చేద్దామని వచ్చాను కాబట్టే గొడవలొద్దు అనుకుంటున్నా" అన్నాడు సుధీర్. "ఒరేయ్ లగెత్తరోయ్" అంటూ చెప్పిన డైలాగ్ కి హీరో రవితేజ నవ్వేశారు. తర్వాత రవితేజ నటించిన ఖడ్గం మూవీలో సాంగ్ ని ప్యారెడీ చేసి "నన్ను కూడా ఆర్టిస్ట్ చెయ్యి లేకపోతే హీరోయిన్ చెయ్యి" అంటూ పాట పాడి అందరినీ మెప్పింది. దాంతో రవితేజ లేచి స్టేజి మీదకు వచ్చి వరుణవిని ఎత్తుకున్నారు. "నీతో మాట్లాడుతుంటే నాకు కిక్కోస్తుంది" అంది "నాకు కిక్కోచ్చేసింది" అంటూ గట్టిగ చెప్పారు రవితేజ.


Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.