English | Telugu

Illu illalu pillalu : భాగ్యం, ఆనందరావు డ్రామా.. అమూల్య పెళ్ళిచూపులు జరుగుతాయా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -361 లో..... తిరుపతి ఫోన్ లో తన అతిలోక సుందరితో మాట్లాడుతుంటే సాగర్, ధీరజ్,చందు వచ్చి వింటారు. నువ్వు ఒకసారి తనని కలుస్తానని అడుగు మావ అని ధీరజ్ అనగానే ఈ రోజు నిన్ను కలుస్తానని అంటాడు. తను ఈ రోజు సాయంత్రం కలవమని అడ్రెస్ చెప్తుంది. అ తర్వాత ధీరజ్ ఫోన్ చూస్తుంటే తనని డిస్టబ్ చెయ్యాలని ప్రేమ చాలా ట్రై చేస్తుంది.

అ తర్వాత మావయ్య ధీరజ్ నాపై కోప్పడుతున్నాడు. పెళ్లివాళ్లకు కావలసిన స్వీట్ తీసుకొని వద్దామంటే వద్దని ధీరజ్ అంటున్నాడని కావాలనే రామరాజుకి చెప్తుంది ప్రేమ. ఒరేయ్ అమ్మాయిని తీసుకొని వెళ్ళు.. ఎందుకు వినడం లేదు అమ్మాయితో వెళ్లి స్వీట్ తీసుకొని రా అని రామరాజు అనగానే ఇక తప్పక ధీరజ్ వెళ్తాడు. మధ్యలో పెట్రోల్ అయిపోతే ప్రేమని దిగమని కోప్పడతాడు. దాంతో ప్రేమతో చెప్పమని అంటుంది ప్రేమ. ఇక ధీరజ్ కోపంగా తను బైక్ మీద ఉండగానే తోసుకొని వెళ్తాడు. పెట్రోల్ కొట్టిస్తాడు. ధీరజ్ కి తెలియకుండా తన జేబులో పర్సు తీస్తుంది ప్రేమ. తీరా పెట్రోల్ కి డబ్బులు ఇద్దమంటే పర్సు ప్రేమ చేతిలో ఉంటుంది. ఇక ధీరజ్ కి కోపం వచ్చి బైక్ అక్కడే వదిలేసి వెళ్తుంటే ప్రేమ అతనికి డబ్బు ఇచ్చి బైక్ వేసుకొని ధీరజ్ వెనకాల వెళ్తుంది. మావయ్య ధీరజ్ నాతో గోడవపడ్డాడని ఫోన్ లో చెప్పినట్లు ప్రేమ యాక్టింగ్ చెయ్యగానే ధీరజ్ వస్తాడు. ఏం చెయ్యలేక ప్రేమ బైక్ డ్రైవ్ చేస్తుంటే వెనకాల కూర్చుంటాడు ధీరజ్.

మరొకవైపు అముల్యని చూడడానికి వచ్చేవాళ్ళకి ఎదురుగా మారువేషంలో భాగ్యం, ఆనందరావు వెళ్తారు. మీరు చూడాలని అనుకుంటున్న అమ్మాయి వేరొకరితో లవ్ లో ఉందని చెప్తారు. అ తర్వాత రామరాజు ఇంట్లో పెళ్లిచూపులకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తారు. వాళ్ళు రారుగా అని శ్రీవల్లి అనుకుంటుంది. అంతలోనే పెళ్లిచూపులకి వచ్చే వాళ్ళు కార్ లో ఎంట్రీ ఇస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.