English | Telugu

ఈ సంక్రాంతికి ప్రదీప్ - సుధీర్ పెళ్లిళ్ల మీద పందేలు!


ఇంకొన్ని రోజుల్లో సంక్రాంతి పండగ రాబోతోంది. బుల్లితెరలో సందడి మొదలయ్యింది. రకరకాల షోస్ ని పండగ సందర్భంగా ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతోంది. ఇక జీ తెలుగులో సంక్రాంతి అల్లుళ్ళు పండగకు వస్తున్నారు" పేరుతో ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఒక షో ప్రసారం కాబోతోంది. దీనికి జడ్జెస్ గా ప్రదీప్-సుధీర్ ఉన్నారు. "ప్రదీప్ ని సంక్రాంతికి అల్లుడిని చేసే బాధ్యత నాది" అంటూ హీరోయిన్ రోజా చెప్పింది. "సుధీర్ ని సంక్రాంతికి అల్లుడిని చేసే బాధ్యత నాది" అంటూ శేఖర్ మాష్టర్ చెప్పాడు. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ అనుకున్నారు. ఇక పెళ్లి కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ప్రదీప్ - సుధీర్ ఇద్దరూ వచ్చి "పందేలేదో కోళ్ల మీద వేసుకోవాలి కానీ మా పెళ్లిళ్ల మీద వేసుకుంటారేమిటి" అంటూ ఇద్దరూ అడిగేసారు.

ఇక ఈ ఈవెంట్ కి కూడా జీ లిటిల్ చాంప్స్ షోలో సెంట్రాఫ్ అట్రాక్షన్ గా ఉండే లిటిల్ సింగర్ వరుణవి కూడా వచ్చేసింది. దాంతో సుధీర్ వచ్చి "పండగ ఈవెంట్ లో కూడా అడుగు పెట్టేశావా" అని అన్నాడు. వెంటనే ఆ చిన్నారి "మనం అడుగు పెట్టాకే కదా పండగ మొదలయ్యేది" అంటూ కౌంటర్ ఇచ్చింది. ఇక ఈ షోకి మాస్ మహారాజ రవితేజ, కామెడీ డైరెక్టర్ అనిల్ రావిపూడితో పాటు బుల్లితెర మీద కనిపించేవాళ్లంతా ఈ ఈవెంట్ కి వచ్చారు. "అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలుపెట్టి" అంటూ రవితేజ గురించి ఇంట్రడక్షన్ ని సుధీర్ ఇస్తూండేసరికి "మళ్ళీ మొదలు పెట్టాడురా బాబోయ్" అంటూ రవితేజ కామెడీగా అసహనం వ్యక్తం చేశారు. ఇక నెటిజన్స్ ఐతే సుధీర్ - ప్రదీప్ కాంబో చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు. బెస్ట్ ఎంటర్టైనర్స్ అంతా కలిసి వచ్చారు. అబ్బా సూపర్ సుధీర్ ఉంటే చాలు. ఇంకా తోడుగా ప్రదీప్ రచ్చ రచ్చే..బొమ్మ అదుర్స్ కదు..టిఆర్పి పగిలిపోద్ది" అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.