Read more!

English | Telugu

మావారు మాస్టారు.. అతి త్వరలో!

 


జీ తెలుగులో‌ ప్రసారమవుతున్న సీరియల్స్ ఎంత పాపులరో అందరికి తెలిసిన విషయమే.. 'మావారు మాస్టారు' అనే సరికొత్త ధారావాహిక త్వరలో వస్తున్నట్లుగా మేకర్స్ ప్రోమో ని రిలీజ్ చేసారు. అతి త్వరలో ప్రసారం కాబోతున్న ఈ 'మావారు మాస్టారు' సీరియల్ ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. అయితే ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ వారు పసుపు కుంకుమ, ముద్ద మందారం, పున్నాగ, గీతాంజలి లాంటి గొప్ప సీరియల్స్ ని నిర్మించారు. అయితే ఈ సీరియల్ లో హీరోయిన్ గా సంగీత కళ్యాణ్, హీరోగా పృథ్వీరాజ్ నటిస్తున్నారు.‌ మొగలి రేకులు సీరియల్ ఫేమ్ సెల్వరాజ్ ఇందులో హీరోయిన్ కి నాన్నగా చేస్తున్నాడు. ముద్దమందారం ఫేమ్ భవానిరెడ్డి ఇందులో ముఖ్యపాత్రని పోషిస్తుంది.

ఒక బ్లాక్ బోర్డ్ పై 'సరికొత్త ధారావాహిక అతి త్వరలో' అని రాసి ఉంది. అయితే ఇదే 'మావారు మాస్టారు' సీరియల్ అని తెలుస్తుంది. తెలుగులో పృథ్వీరాజ్ కి ఇదే తొలి సీరియల్ కావడం విశేషం. ఈ సీరియల్ లో ప్రముఖ బుల్లితెర నటుడు శ్రీకృష్ణ కౌశిక్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సీరియల్ తమిళంలో 'అత్తా కోడళ్ళ' పేర్లతో రిలీజ్ అయింది. అయితే ఈ సీరియల్ ని ఇప్పుడు తెలుగులో మావారు మాస్టారు పేరుతో రిలీజ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. తమిళంలో రిలీజ్ అయిన ఈ సీరియల్ లో తల్లికి పెద్ద కొడుకుగా హీరో ఉంటాడు.

అతను ఒక గవర్నమెంట్ స్కూల్ లో క్లర్క్ గా పని చేస్తుంటాడు. అయితే ఇంట్లోవాళ్ళకి మాత్రం తనొక టీచర్ అని చెప్తాడు‌. దీంతో నా కొడుకు నా కళని నెరవేర్చాడనే ఊహల్లో ఉంటుంది.  మరోవైపు హీరోయిన్ వాళ్ళ కుటుంబంలో తండ్రి చనిపోవడంతో ఇంటిభారం తనపై పడుతుంది. ఇలాంటి పరిస్థితులలో హీరోయిన్ కి హీరో మాస్టర్ అని తెలిసి పెళ్ళికి ఒప్పుకుంటుంది. అయితే హీరో స్కూల్ లో టీచర్ కాదని తెలిస్తే వాళ్ళంతా ఎలా ఉంటారనేది ఈ 'మావారు మాస్టరు' సీరియల్ లో చూడాల్సిందే. 

ఇప్పటికే జీ తెలుగు టీవి సీరియల్స్ లిస్ట్ లో..  ప్రైమ్ టైం సీరియల్ స్లాట్ లో ముద్ద మందారం,  వైదేహీ పరిణయం, రాధమ్మ కూతరు ప్రసారమవుతుండగా అతి త్వరలో ప్రసారం  కాబోయే ఈ 'మావారు మాస్టరు' సీరియల్ ఈవినింగ్ ప్రైమ్ టైమ్ స్లాట్ లో రిలీజ్ చేస్తారా లేక మధ్యాహ్నం స్లాట్ లో ప్రసారం చేస్తారా తెలియాల్సి ఉంది.